Month: June 2018

విశ్వామిత్ర 2015 – నవల ( 23 వ భాగము )

ధారావాహికలు
విశ్వామిత్ర సరెండర్ అయిపోయాడు పోలీస్ స్టేషన్ లో. మీడియాకి ఆ విషయం ముందే తెలియడం వల్ల,మీడియా మొత్తం,నేషనల్ ఛానెల్స్ తో సహా పోలీస్ స్టేషన్ ముందు ఉంది. "నగరంలో జరిగిన బ్లాస్ట్ లకు మీకు సంబంధం ఉందా?" అని విశ్వామిత్రని అడిగినప్పుడు "ఉంది"అని విశ్వామిత్ర చెప్పినప్పుడు మీడియా మొత్తం స్టన్ అయింది. "ఎందుకు బ్లాస్ట్ చేశారు?" "నేరం కాదు కాబట్టి" "ఎందుకు నేరం కాదని మీరు అనుకుంటున్నారు?" "నేను బ్లాస్ట్ చేసిన ప్రోపర్టీస్ అన్నీ నా, నామిత్రుల ప్రోపర్టీలు." "కొన్ని హాస్పటల్స్, హోటళ్ళు కూడా కూల్చేశారు కదా? ఉదాహరణకి గ్రాండియోర్ హోటల్, డాక్టర్స్ n డాక్టర్స్ హాస్పటల్" "అవన్నీ నాలాల్లోనూ, ప్రభుత్వస్థలాల్లోనూ కబ్జాలు చేసి కట్టినవి. కూలిస్తే తప్పేముంది? ఒక్క ప్రాణనష్టమైనా జరగలేదే. అధికారంతోటి, రాజకీయబలం తోటి, కొంతమంది అధికారుల అవినీతిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని కొంతమంది దుర్మార్గులు, లొంగ దీసు

ఈ నెల ప్రత్యేకతలు

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు - అమర్ నాథ్ జగర్లపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హైద్రాబాద్ వారి శీర్షిక గత నెలనుండి ప్రారంభమయ్యాయి. పిల్లలకు, పెద్దలకు వివిధ అంశాలపై వచ్చే రచనలు ప్రతినెల చదవండి. - 2002వ సంవత్సరంలో సిలికానాంధ్ర హస్యవల్లరి పేరిట సేకరించిన కొత్తపాత కార్టూనిష్టుల కార్టూన్లు ఈ నెలనుండి 'హాస్యరంజని ' లో చూడండి. - అమెరికాదేశ వ్యాప్తంగా జరిగిన మనబడి పరీక్షలు, స్నాతకోత్సవాల ఫోటోలు కొన్నింటిని 'మనబడి ' లో చూడండి. మరిన్ని శీర్షికలతో వచ్చే నెలలో కలుద్దాం.  

సంగీత రంజని జూన్ 2018

610వ అన్నమయ్య జయంత్యుత్సవం లో భాగంగా మిల్పీటస్ లో ఏప్రిల్ 23 న జరిగిన ప్రాంతీయ పోటిల్లో బే ఏరియా గురువులు ఆలపించిన కొన్ని కీర్తనలు.

బ్రహ్మ తేజస్సు

కథా భారతి
-అన్నపంతుల జగన్నాధ రావు (ఇది తెలంగాణలో నవాబుల కాలంలో జరిగిన యదార్ధ సంఘటనగా జనశ్రుతిలో వుంది) ఆకలి. మూడక్షరాల మాట. మనిషిని ముప్పుతిప్పలు పెట్టే మాట. జఠరాగ్నిని తట్టుకోవడం కష్టమనిపిస్తోంది నారాయణ సోమయాజికి. అన్నం తిని మూడు రోజులైంది. మూడు రోజుల కిందట సాయంకాలం తిన్న గుప్పెడు అటుకులే ఆఖరి ఆహారం. రెండురోజుల నుండీ మంచినీళ్ళ తోనే కాలం గడుపుతున్నాడు. పొద్దున్న పంటి బిగువున సంధ్యావందనం చేశాడు. అప్పటి నుంచి నిస్త్రాణగా పడుకొనే వున్నాడు మండువాలో. లేచి మంచినీళ్ళు తాగడానికి కూడా సత్తువ లేదు. కానీ కడుపులో అగ్నిహోత్రుడు వూరుకుంటాడా? బలవంతంగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు. కాసిన్ని మంచినీళ్ళు తాగడంతో కొద్దిగా ఓపికవచ్చినట్టు అనిపించింది. “అమ్మా, గంగాభవానీ, నా ప్రాణాలు నిలబెడుతున్నావా తల్లీ” అనుకున్నాడు. ఇల్లంతా కలయ జూశాడు. లంకంత యిల్లు. ఒకప్పుడు పిల్లా పాపలతో, వచ్చేపోయే బంధువులతో కళకళలాడుతూ వుండేది. తన దగ

శాంతి చిరునామా?

బాలానందం
(బాలల కథ) -ఆదూరి.హైమవతి ధర్మపురం అనే ఊర్లో ధర్మన్న అనేఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు.పేరులోనే తప్ప 'ధర్మ 'మనేది అతగాడి జీవితం లో లేనేలేదు. ఎంగిలిచేత్తో కాకిని కూడా అదిలించని పరమ పిసినారి. బాగాలాభాలు వచ్చివ్యాపారం ఎదిగినా అతడి బుధ్ధి మాత్రం మారలేదు. తనవద్ద పనిచేసే గుమాస్తాలకు, ఇతర పని వారికీ జీతాలు పెంచడు సరికదా సకాలంలో నెల జీతం ఇవ్వడు. ఐతే అంతా ఉద్యోగ భద్రతవల్ల, మానకుండా అతగాడివద్దే పని చేస్తున్నారు. ఇంట్లో సైతం సరుకులు సమంగాతెచ్చేవాడుకాదు. భార్యా పిల్లలూ అన్ని అవసరాలకూ అతగాడ్ని దేబిరించి, విసిగిపోయేవారు. కాస్తఅనువైన బట్టలూ కొనడు. అతడి భార్య సీతమ్మ, పిల్లలను సముదాయించు కుంటూ ఓర్పుగా సంసా రాన్ని, నెట్టుకొస్తున్నది. సరైన చీరలైనా లేక సీతమ్మ ఏ ఇంటికీ పేరంటా నికైనా వెళ్ళేదికాదు. అంతా ఆమెను అదోలా చూసేవారు. ధర్మయ్య వ్యాపార వ్యవ హారాలతో, ఇంట్లో భార్యా పిల్లలు వారి అవసరాల కోసం సొమ్ము, వస్తువులు అడుగ

వీక్షణం సాహితీ గవాక్షం-69 సమీక్ష

శీర్షికలు
- విద్యార్థి వీక్షణం 69వ సమావేశము విలంబి నామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ త్రయోదశి నాడు, అనగా మే 13వ తారీఖున శ్రీయుతులు గీతా మాధవి, సత్యనారాయణ గార్ల స్వగృహమునందు జరిగినది. ఈ రోజు అమెరికా దేశస్తుల మాతృ దినోత్సవం అవటం కూడా ఒక ప్రత్యేకత. ఈ సభకు శ్రీ తాటిపాముల మృత్యుంజయడు గారు అధ్యక్షత వహించారు. అధ్యక్షుల వారు ఈ నాటి ముఖ్య అతిధి శ్రీ చెన్నకేశవ రెడ్డి గారిని సభకు పరిచయం చేస్తూ, "వారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో తెలుగు ఎన్సైక్లోపేడియా విభాగాధిపధిపత్యం తో బాటు పలు బాధ్యతలు నిర్వహించారు". శ్రీ చెన్నకేశవ రెడ్డిగారిని తెలుగులో గేయ రచన గురించి చేసిన పరిశోధనని ప్రశంసించారు. శ్రీ చెన్నకేశవ రెడ్డిగారి ప్రసంగ విశేషములు ' గేయం గతి ప్రధానమైనది. గతులు నాలుగు. అవి త్రిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులు. కావ్యమంటే కథ, పాత్రలు, రసపోషణ, ధ్వని, వస్త్వైక్యం, అలంకారాలు, వర్ణనలు మొదలగు కావ్యా