రావణాసురిడి జననం
-అక్కిరాజు రామాపతి రావు
ఆ తర్వాత ఆ అన్నదమ్ములు ముగ్గురూ తండ్రి ఉండే తపోవనానికి తరలి పోయినారు. ఎప్పుడైతే రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుడి వల్ల అచింత్యమైన, అమోఘమైన వరాలు పొందారని సుమాలి తెలుసుకొన్నాడో ఇక నిర్భయంగా ఉండవచ్చుననీ,పోయిన ఆధిపత్యం తిరిగి సంపాదించుకోవచ్చుననీ 'మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు' అనే మంత్రులతో పాతాళలోకం నుంచి నేరుగా దశకంఠుడి దగ్గరకు వచ్చి అతణ్ణి కౌగిలించుకొని అభినందించి 'నాయనా! నీ వల్ల మేము నిర్భయులమైనాము. మనం లంకలో ఉండక పోవటం చూసి మీ అన్న ధనదుడు అక్కడ విలాసంగా పరిపాలిస్తున్నాడు. నీవు సామ, దాన, భేదోపాయాలలో దేనితోనైనా వాణ్ణి అక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. మేమంతా నిన్ను అనుసరించుకొని ఉంటాము. నీవు మన రాక్షసజాతిని విపత్సముద్రం నుంచి రక్షించావు' అని ప్రశంసించాడు. దశాస్యుడు మొదట ఒప్పుకోలేదు. ‘నీవు నా మాతామహుడివి! నిజమే కాని, కుబేరుడు నాకు జ్యేష్ఠభ్రాతకదా! జ్యేష