- భారతీనాథ్ చెన్నంశెట్టి
ఇక్కడికెందుకొచ్చానబ్బా, అంటూ మిత్రుడు, శాత కర్ణి, వాట్సప్ గ్రూపులో తన స్వగతం పంచిన నాటినుoడి, నాలో అంతర్మథనం మొదలయ్యిoది. అసలు నేనెoదుకు వచ్చాను, అని, నేనెవ్వరు, అన్న పుస్తకం చదువుతున్న మా ఆవిడను అడిగాను.
జీడి పప్పుల కోసం అయ్యుoటుoది. వంట గదిలో పై అరలో వుoటాయి తీసుకోoడి అంది మా ఆవిడ. అసలు ఈ భూమి పైకి ఎందుకు వచ్చానో అని నా సందేహం, అన్నాను. నా బుర్ర తినడానికి వచ్చుoటారు, నా పనికి అడ్డం రాకండి అంటూ విసుక్కుoది.
అప్పుడెప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాల రావు అన్నట్టు “తిని తొoగుoటే మనిషికీ గొడ్డుకు తేడా ఏముoటుoది”, మనిషన్నాక కాసిoత జ్ఞానాన్వేషణ వుoడాలి, అంటూ గతంలోకి వెళ్ళాను. ఉన్న చిన్న బుర్రను పగలకొట్టుకోకుoడా, ఆలోచిoచడం మొదలు పెట్టాను.
అరవై మూడు సంవత్సరాల జీవన పయనంలో, ఎన్నెన్నో ఎత్తు పల్లాలు. ఎన్నెన్నో వింతలు విశేషాలు. ఎందుకు జరుగుతున్నాయో, అర్ధమయ్యే