ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం
తొలిమెట్టు అని భావిస్తోంది. వ్యక్తి వ్యక్తిని వ్యక్తిగా గుర్తించటం నేర్చుకోవాలి. మానవ అంతర్వికాసం భౌతిక దృక్పథం వల్ల కలగదు. ఆధ్యాత్మికంగా మనిషి పురోభివృద్ధి చెందినప్పుడే మానవుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు.
మానవుడు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించాలనే విషయం ఇప్పుడిప్పుడే అన్ని దేశాలవారూ గ్రహిస్తున్నారు. భారతదేశం ఆధ్యాత్మింగా సుసంపన్నదేశం. ప్రాచీన కాలంలోనే ఆధ్యాత్మిక దృష్టిని అలవరచుకొని ప్రతి మనిషి అంతర్వికాసాన్నీ, వ్యక్తి విలువలను కలిగి ఉన్నాడు. రాను రానూ పాశ్చాత్య ప్రభావం వల్ల దేశంలో అన్ని వేదమాతను వీడిపరప్రదేశం పట్ల ఆకర్షితుడయ్యాడు.
పాశ్చాత్యులు మనిషిని బాహ్యంగానే వికసింప చేయగలిగారు కానీ అంతరంగికమైన వికాసానికి ఏమాత్రం కృషి చేయలేదు. వారు మనిషిని కేవలం సాంఘిక జంతువు (Social being)గానో, రాజకీయ జంతువు (Political being)గానో, ఆర్ధికజీవి (Economic being)గానో చూశారు. అంతేకాని వారి పరి