Author: Sujanaranjani

వలస

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి ఆఫీసునుంచి సాయంత్రం ఇంటికొచ్చిన రమణ లోపలికి వస్తూ అరిచేడు, “ఈ రోజు కొత్త న్యూస్; శాన్ ఆంటానియోలో నాకో మంచి ఉద్యోగం వచ్చింది మనం టెక్సాస్ వెళ్ళిపోతున్నాం.” “అదేమిటి, మరి ఇక్కడ ఈశ్వరి చదువో? మధుని ఇప్పుడే డే-కేర్ లో చేర్పించాం. వాడు కుర్రాడు కనక ఎలాగోలా తట్టుకున్నా, అమ్మాయి అక్కడ కలవగలదా? టెక్సాస్ అంటే అక్కడ స్పానిష్ మాట్లాడే మెక్సికన్లు ఎక్కువగా ఉంటారంటారు కదా?” కల్పన అడిగింది రమణని అనుమానంగా చూస్తూ. ఈ లోపుల, నాలుగో తరగతి చదివే అమ్మాయి ఈశ్వరికి ఇది అర్ధం అయిందో లేదో కానీ వీళ్ళ మధ్యలోకి వచ్చి ఈ తతంగం ఏమిటో చూడబోయింది. “మొన్నామధ్య ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, మొదట్లో ఉత్తి ఫేమిలీ కేర్ డాక్టర్ లా పనిచేస్తావా అని అడిగారు. ఆలోచిస్తాను అని చెప్పాను. కానీ ఈ రోజు ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ, ఫేమిలీ కేర్, డయాబెటిక్ కేర్ కి కలిపి ఓ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారుట. వస్తావా అని అడిగారు. వె

కల్హణుడు

సారస్వతం
-శారదాప్రసాద్ రాజతరంగిణి (రాజుల నది) వాయువ్య భారత ఉపఖండం యొక్క చారిత్రిక సంచిక.మరీ ప్రత్యేకంగా కాశ్మీరు చరిత్రకు సంబంధించి ప్రామాణిక గ్రంథం. దీన్ని సంస్కృతంలో రచించారు. రాజతరంగిణిని కాశ్మీరీ బ్రాహ్మణుడు కల్హణుడు క్రీ.శ.12వ శతాబ్దంలో వ్రాశారు.ఈ రచన సాధారణంగా కాశ్మీరు సంస్కృతీ సంప్రదాయాలను నమోదు చేస్తుంది.కానీ రాజతరంగిణిలోని 120 శ్లోకాలు అనంత దేవరాజు కుమారుడైన కలాశ్ రాజు పరిపాలనాకాలంలో జరిగిన అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాల గురించి వివరించింది. రాజతరంగిణిలోని ప్రాచీన చారిత్రిక వివరాలు ప్రాచీన భారతీయ చరిత్ర రచనకు ప్రామాణికంగా వినియోగపడుతున్నాయి. రాజతరంగిణి సంస్కృతభాషలో కాశ్మీరీ బ్రాహ్మణుడైన కల్హణుడు రాసిన కావ్యం. చారిత్రిక పాఠ్యంగా కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో ఇది అత్యంత ప్రాచీనమైనది. కాశ్మీరు ప్రాంతం విస్తారంగా హిమాలయాలు, పిర్ పంజల్ శ్రేణి మధ్యలో వ్యాపించిన ప్రాంతం. కల్

శ్రీ వారాహీ దేవి

సారస్వతం
-శారదాప్రసాద్ కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ వరదా దండినీ ఖడ్గం బిభ్రతీ దక్షిణే కరే!! ఖేట పాత్రాభయాన్ వామే సూకరాస్యా లసద్భుజా!! తా|| శ్రీవారాహీ దేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై పెద్దపొట్టతో ఎనిమిది చేతులు(అష్టభుజ) కలిగి ఉంటుంది. వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ(పంది) ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి అర్ధాంగి. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉ

జోల పాట

కవితా స్రవంతి
~ తిరునగరి శరత్ చంద్ర హైదరాబాద్ చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకున్నాడు రేయి మంచంపైన నక్షత్రాలు లాలిపాట పాడుతున్నాయి మబ్బులు వీవన వీస్తున్నాయి తన నీలి నీలి ముంగురులు గాలికి రెపరెపలాడుతుంటే ఉలిక్కిపడి నిద్రలేచాడు చంద్రుడు ఇది యేమిటి వింతగా ఉందే! పసిపాపలను నిద్ర పుచ్చడానికి 'చందమామ రావే జాబిల్లి రావే' అని జోలపాటలు పాడే తల్లులకు ఉపయోగపడే ఈ చంద్రునికి లాలిపాటలు పాడడం కొత్తగా గమ్మత్తుగా ఉందే అనుకుంటూ మళ్లీ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు చంద్రుడు. నిదురపోతూ ముద్దొస్తున్న చంద్రునికి దిష్టి తీయడానికి చీకటిరేఖను త్రుంచిందొక మేఘం. చంద్రుడు హాయిగా నిదురపోవడానికి తీయతీయని రాగాలను వాడుకున్నాయి నక్షత్రాలు తమ లాలిపాటలో.. సౌందర్యం వర్షించే సౌజన్యం దీపించే సౌశీల్యం నడయాడే సౌకుమార్యం జాలువారే ఆ చంద్రున్ని చూసి స్వర్గలోకాలు చిన్నబోయాయి. మనోవీవనలతో వీచి

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య యిందుకంటె నున్నదదే యెంచఁగ మూలధనము ఈ కీర్తనలో అన్నమయ్య ప్రతిపాదంలో “మూలధనం” అనే మాటను వాడారు. మనం ఈ నాటి అర్ధంలో చూస్తే మూలధనం అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క కార్యక్రమము కొనసాగుటకు అవసరమైన పెట్టుబడి ధనము. దీనిని కంపెనీ వాటాలవలన కాని, ఋణపత్రములవలనకాని, అప్పువలనకాని, గత సంవత్సరములలో కలిగిన లాభాంశముల వలన కాని సేకరింపవచ్చును. కానీ, కొన్ని శతాబ్దుల క్రితం ధనవంతులు తమ వద్ద మిగిలి ఉన్నధనాన్ని భూమిలో ఒకచోట మూటగట్టి దాచిపెట్టుకుని అవసరమైనపుడు తీసి వినియోగించేవారు. ఇంకా బాగా ధనవంతులైతే లంకెల బిందెల్లో దాచుకునేవారు. ఈ కీర్తనలో అన్నమయ్య లౌకిక మూలధనం కాక శృంగారపరమైన మూలధనం ఏమిటో వివరిస్తున్నాడు. అన్నమయ్య అనేక కీర్తనల్లో ఈ మూలధనం అనే ప్రస్తావన ఉంది. "మేలులో సాకారము మించులోకము భాగ్యము తాలిమితో నీకు మూలధనమాయను" - "సిగ్గులే మూలధనమా చేరి పైకొనఁగరాదా అగ్గమై శ్రీ వేంకటేశుఁడలమఁగాన" అంటూ ప

అమెరికా ఉద్యోగ విజయాలు – 5

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా..’ ఆరోజు కృష్ణ ఇంట్లో భోజనాలు అయాక, కృష్ణ అర్జనుడితో అన్నాడు, “వసంత ఋతువు వచ్చేసిందిగా.. అలా లేక్ ఆస్టిన్ ఒడ్డున కూర్చుని మాట్లాడుకుందాం పద” అన్నాడు. “మీరిద్దరూ వెళ్ళండి. నిర్మల వస్తానంది, మా ఇద్దరికీ వేరే పనుంది” అంది రుక్మిణి. “అయితే ఎక్కడో సేల్ వుంది, మేం వేరే వెడతాం అని అర్ధం అన్నమాట. సరే వెళ్ళండి. మేము ఒక గంటా, రెండు గంటల్లో వస్తాం” అన్నాడు కృష్ణ. ఆదివారం అవటం వల్ల లేక్ ఒడ్డున చాలమంది జనం వున్నారు. ఇద్దరూ దూరంగా ఒక చెట్టు దగ్గర కూర్చున్నాక , అర్జున్ అన్నాడు. “బావా, తాము చేసే ప్రతి పనిలోనే కాక, వారి జీవితంలో కూడా అడుగడుగునా విజయం సాధించాలని ప్రతివారికీ వుంటుంది. కానీ ఆ విజయ పథంలో విహరించటం ఎలా?” కృష్ణ అన్నాడు, “ముందుగా అసలు విజయం అనే మాటకి అర్ధమేమిటో తెలుసుకోవటం అవసరం. ఎన్నో తెలుగు, హిందీ సినిమాల్లోనూ, కొన్ని ఇంగ్లీషు సినిమాల్లోనూ చూస్

ఇక్కడికెందుకొచ్చాను

కథా భారతి
- భారతీనాథ్ చెన్నంశెట్టి ఇక్కడికెందుకొచ్చానబ్బా, అంటూ మిత్రుడు, శాత కర్ణి, వాట్సప్ గ్రూపులో తన స్వగతం పంచిన నాటినుoడి, నాలో అంతర్మథనం మొదలయ్యిoది. అసలు నేనెoదుకు వచ్చాను, అని, నేనెవ్వరు, అన్న పుస్తకం చదువుతున్న మా ఆవిడను అడిగాను. జీడి పప్పుల కోసం అయ్యుoటుoది. వంట గదిలో పై అరలో వుoటాయి తీసుకోoడి అంది మా ఆవిడ. అసలు ఈ భూమి పైకి ఎందుకు వచ్చానో అని నా సందేహం, అన్నాను. నా బుర్ర తినడానికి వచ్చుoటారు, నా పనికి అడ్డం రాకండి అంటూ విసుక్కుoది. అప్పుడెప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాల రావు అన్నట్టు “తిని తొoగుoటే మనిషికీ గొడ్డుకు తేడా ఏముoటుoది”, మనిషన్నాక కాసిoత జ్ఞానాన్వేషణ వుoడాలి, అంటూ గతంలోకి వెళ్ళాను. ఉన్న చిన్న బుర్రను పగలకొట్టుకోకుoడా, ఆలోచిoచడం మొదలు పెట్టాను. అరవై మూడు సంవత్సరాల జీవన పయనంలో, ఎన్నెన్నో ఎత్తు పల్లాలు. ఎన్నెన్నో వింతలు విశేషాలు. ఎందుకు జరుగుతున్నాయో, అర్ధమయ్యే