Author: Sujanaranjani

నాన్న

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. అమ్మ పెదవిపై విరిసే నవ్వులో నాన్న, అమ్మ జడలో మురిసే పువ్వులో నాన్న. అమ్మ చీరకట్టులో బెట్టులా నాన్న, అమ్మ నుదిటిపై బొట్టులా నాన్న. అమ్మ కలలకు ఆకారం నాన్న, అమ్మ కళలకు సాకారం నాన్న. అమ్మ కనులలో కాంతి నాన్న, అమ్మ మనసులో శాంతి నాన్న. అమ్మ గుండె ధైర్యం నాన్న, అమ్మ మాట శౌర్యం నాన్న. అమ్మకొచ్చిన మంచిపేరులో నాన్న, అమ్మ చూపే ప్రేమ తీరులో నాన్న. నాన్న లేని అమ్మ అయిపోతుంది సున్నలా, తనని తాను భావించుకుంటుంది మన్నులా.

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

సారస్వతం
స్థూలంగా వివేచిస్తే శ్రీశ్రీ వర్గరహితమైన సమాజాన్ని, ఆర్ధిక అసమానతలను తొలగించి సమసమాజాన్ని నిర్మించాలాని ప్రభోదించినాడు. ఆర్ధికాభ్యున్నతి సాధించినా జాతిజీవనం ఆధ్యాత్మిక ధర్మ చైతన్యంతో ముందుకు నడిచినప్పుడే మానవవికాసం సంపూర్ణమౌతుందనీ, అప్పుడే సమసమాజం సాధ్యపడుతుందనీ విశ్వనాథ ప్రభోదించాడు. ఒకరు ఆర్ధిక ధర్మానికి ప్రాధాన్యమిస్తే, మరొకరు హార్థిక ధర్మానికి ప్రాణం పోశారు" భావకవి ఊహాలోకాల్లో ఊరేగుతాడనీ, లోకం పట్టనివాడనీ సమాజంలో కొందరు కవులు భావించారు. ఆత్మాశ్రయ కీర్తనంగా, ప్రణయకీర్తనంగా పేరుగాంచిన భావకవిత్వం సమాజావసరాలు తీర్చలేదని భావించటం జరిగింది. ‘నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు' అని భావకవి, ‘మనసారగ ఏడ్వనీరు నన్ను' అని బజారున పడటంతో కృష్ణశాస్త్రి బాధంతా లోకానికీ బాధ అయికూర్చుంది. ఇందులో నిజం లేకపోలేదు. కానీ అంతా యథార్థంమటుకు కాదు. కవి ఎప్పుడూ తన కోసం కవిత్వం రాసుకోడు. ఈ సందర్భంలో వెల్చేరు నారాయణరావుగ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు – అభిసారిక - టేకుమళ్ళ వెంకటప్పయ్య "మదనానలసంతప్తా యాభిసారయతి ప్రియమ్| జ్యోత్స్నాతమస్వినీయానయోగ్యాంబరవిభూషణా| స్వయం వాభిసరేద్ యా తు సా భవేదభిసారికా"|| (రసార్ణవసుధాకరము) మదనానలసంతప్తయై ప్రియుని తనకడకు రప్పించుకొనునది గాని, వెన్నెల రాత్రులలో, చీకటిరాత్రులలో తన్నితరులు గుర్తింపనిరీతిగా వేషభూషలను ధరించి రహస్యముగా ప్రియుని గలియుటకు సంకేతస్థలమునకు బోవునది గాని, అభిసారిక యనబడునని పైశ్లోకమునకు అర్థము. కానీ ఈ అభిసారిక నాయికలలో ఉన్న స్వల్ప బేధాలను గమనిస్తే మొదటి రకమైన యభిసారిక సామాన్యముగా నొక దూతిక ద్వారా సందేశమును పంపి, ప్రియుని తనకడకు రప్పించుకొనును. అతడు వచ్చినప్పుడు వాసకసజ్జికవలెనే సర్వము సంసిద్ధము చేసికొని అతనితో సవిలాసముగా గడపును. ఇట్లు ఈవిధమైన అభిసారికకు, వాసకసజ్జికకు, కించిద్భేదమే యున్నది. వస్తుతః శృంగారమంజరీకర్త వంటి కొందఱు లాక్షణికులు ఈరకమైన అభిసారికను వాసకసజ్జికగానే ప

సంగీత రంజని మార్చి – 2018

-A.S.Murali గాత్రకచేరీ ఏప్రిల్ 30, 2017 న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ A.S.Murali గాత్రకచేరీలోని కొన్ని త్యాగరాయ కీర్తనలు. శ్రీమతి సంధ్య శ్రీనాథ్ వయొలిన్, శ్రీ రవీంద్రభారతి శ్రీధరన్ మృదంగం

అచ్చివస్తున్న 2018

సుజననీయం
2017 డిసెంబర్ నెల మధ్యనుండే 2018 సంవత్సరం సిలికానాంధ్రకు శుభసూచకంగా ఉంటుందన్న సంకేతాలు మెండుగా కనిపిచసాగాయి. డిసెంబర్ 15 నుండి 19 వరకు హైద్రాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ సాహిత్యవేదికలపైన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవిత మొదలుకొని పలు సాహితీ దిగ్గజాలు సిలికానాంధ్ర, మనబడి, సుజనరంజని సేవలను కొనియాడుతూ ఆ పేర్లను తమ ప్రసంగాలలో ఉటంకించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ముగింపు సమావేశాల్లో భారతదేశ ఉపరాష్ట్రపతి ప్రవాసభారతంలో మనబడి సేవలను గుర్తిస్తూ ఇప్పటి తరాలకు, భావితరాలకు మధ్య వారధిగా నిలుస్తున్నదని కొనియాడడం మరొక ఎత్తు. 2018 జనవరి మాసంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఒక సంవత్సరం పూర్తి చేసుకొన్నది. ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు ఐటీ మంత్రివర్యులు నారా లోకేశ్ ముఖ్య అతిధిగా విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వ్యాప్తికి సిలికానాంధ్ర చేస