Author: Sujanaranjani

తెలుగు వెలుగుల స్వాగతం పాట

కవితా స్రవంతి
పల్లవి : ముద్దు ముద్దుల మూట నా తెలుగు మాట మురిసిపోయే పూజ నా తెలుగు పాట వేల యేండ్ల చరిత గలది తెలుగు భాష ఎన్నో అణచివెతలను చవిచూసిన ఆశ నా తెలుగు భాష చరణం : నిజాము పాలనలో నలిగినట్టి భాష అయినా తన అస్తిత్వం వదులుకోని ఆశ పోన్నిగంటి తెలుగన అచ్చతెలుగు భాష మల్కిభరాముడిన కుతుబ్ షాహి పోషించిన భాష నా తెలుగు భాష ||ముద్దు|| చ|| సురవరం ప్రతాపరెడ్డి - గోల్కొండ కవుల సంచిక నన్నయ, తిక్కన, ఎర్రన = రాసిన మహాభారతం సినారె సిరా చుక్క నుండి జాలువారె భాష శ్రీశ్రీ అందించిన జయభేరి రా నా భాష రణభేరిరా నా తెలుగు ||ముద్దు|| చ|| కాళోజి నేర్పినట్టి పలుకుబడల భాషరా సామల, (సదాశివం) యశోదరేద్ది తెలంగాణా యాసరా కందుకూరి, గురజాడ, గిడుగు జనం మాటరా పాల్కుర్కి వారి ద్విపద చందము నా భాషరా సందమామనె తెలుగురా ||ముద్దు|| చ|| జానపదుల జనజాతర - తెలంగాణ నేలరా కళామతల్లి కల్పవల్లి - తెలంగాణ గడ్డరా ఆమరుల త్యాగాలకు - ఊపిరిచ్

మనబడి బాలానందం

మనబడి
మీరందరూ అభిమానించే 'మనబడి బాలానందం ' రేడియో కార్యక్రమం ఇప్పుడు వారానికి 2 రోజులు! ప్రతి శనివారం మరియు ఆదివారం టోరీ రేడియోలో!! మనబడి - బాలానందం మనబడి పిల్లలకు తరగతులలో తెలుగు నేర్చుకోవడంతో పాటూ వివిధ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉన్నదన్న విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమాలలో "మనబడి బాలానందం", రేడియో ఒకటి. గత 7 ఏళ్ళుగా మనబడి పిల్లలు "బాలానందం" కార్యక్రమాన్ని, ఒక చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదంగా అందిస్తున్నారు. పలువురు పెద్దలు బాలానందం అత్తయ్యలు, మామయ్యలుగా, మనబడి పట్టభద్రులు బాలానందం అన్నయ్యలు , అక్కయ్యలుగా మనబడి విద్యార్థులచే ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. వందలాది మంది పిల్లలు బాలానందంలో పాల్గొని, తెలుగు మాట్లాడటంపై, విని అర్థం చేసుకోవడంపై తమ పట్టుని మరింత పెంచుకొన్నారు. పెంచుకొంటున్నారు. మనబడి బాలానందం రేడియో మీ కోసం ప్రతి శనివారం 11 AM (CST) , ఆదివారం 1 PM (CST) కు

వీక్షణం సాహితీ గవాక్షం -64

శీర్షికలు
- డా|| లెనిన్ అన్నే వీక్షణం 64 వ సమావేశం మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో డిసెంబరు 10 వ తేదీన ఆసక్తికరంగా జరిగింది. శ్రీ చిమటా శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా మిసిమి పత్రిక సహ సంపాదకులు, ప్రముఖ చిత్రకళా చారిత్రకులు శ్రీ కాండ్రేగుల నాగేశ్వర్రావు ఆంధ్రుల చిత్ర కళ చరిత్ర గురించి సవివరంగా ప్రసంగించారు. ముఖ్యంగా పాశ్చాత్య యుగంలో రినైసాన్స్ తరువాత పునరుజ్జీవనం పొందిన చిత్రకళ ను గురించి, ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గురించి వివరించేరు. ముఖ్యంగా పికాసో భారతీయ చిత్రకళా గొప్పదనాన్ని, అప్పటి ఇల్లస్త్రేటెడ్ వీక్లీ సంపాదకులు ఏ. ఎస్. రామన్ గారికి తెలియజేసిన విధానాన్ని వివరించేరు. ఎవరికీ అంత సులభంగా ఇంటర్వ్యూ ఇవ్వని పికాసో ఏ. ఎస్. రామన్ ను దగ్గరకు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇస్తూ "ఇండియా ఈజ్ ఎ లాండ్ ఆఫ్ వేదాస్, ద బుద్ధా, అండ్ ద కలర్స్ " అని పొగిడారట. పార్లమెంటు భవనంలో అశోక చక్ర నమూనా ని తీ

ఎవరీ రాధ?

సారస్వతం
-శారదా ప్రసాద్ రాధ,రాధిక,రాధారాణి,రాధికారాణి అని పిలువబడే ఈమె శ్రీకృష్ణుని బాల్య స్నేహితురాలు. ఈమె ప్రస్తావన భాగవతం లోనూ, జయదేవుని 'గీత గోవిందం'లోనూ ఎక్కువగా కనపడుతుంది. రాధ ఒక శక్తి స్వరూపిణి.అందుకే శ్రీ కృష్ణ భక్తులు రాధాకృష్ణులను విడదీసి చూడలేరు. భాగవతంలో ఈమె ఒక గోపికగా చెప్పబడింది.శ్రీ కృష్ణుడు బృందావనాన్ని వదలి వెళ్ళే సమయానికి రాధ వయసు కృషుని వయసుకన్నా పదేళ్ళు తక్కువ.అయితే రాధ శ్రీకృష్ణుని కన్నాపెద్దదని చెప్పటానికి ఒక వింత కథ ప్రచారంలో ​ఉంది. ఆ కథను కూడా పరిశీలిద్దాం. రాధ ఒక ​గుడ్డి పిల్లగా జన్మించినదని ప్రచారంలో ​ఉంది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని కొన్ని కారణాల వల్ల తన కన్నా ముందుగా జన్మించమని కోరాడు.  లక్ష్మీదేవి, శ్రీహరి కన్నా ముందుగా జన్మించటానికి సున్నితంగా తిరస్కరించింది. శ్రీహరి పలుమార్లు విన్నవించుకోగా, ఒక షరతుపై, ఆమె అందుకు అంగీకరించింది. శ్రీ కృష్ణుణ్ణి చూసే వరకూ, కన

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. పాఠకులందరకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వారణాసి సూర్యకుమారి కం. నూతన సంవత్సర మున మీ తపనలు తీరి కలుగు  మెండు శుభమ్ముల్ పూతావి వోలె  కీర్తియు యేతావున  పరిమళించి  మిమ్మలరించున్ కం. పిల్లా పాపల  గూడియు చల్లగ  కాపురము సాగి చక్కగ  శుభముల్ వెల్లివిరియు  సుఖశాంతులు కొల్లగ  సంపదలు కలిగి  కోర్కెలు  తీరున్ సహస్ర కవిరత్న సహస్రకవిభూషణ విద్వాన్ శ్రీమతి జి. సందిత, బెంగుళూరు కవిరాజవిరాజి

రాశి ఫలాలు

కథా భారతి
జ్యోతిష్ పండిట్, ఆస్ట్రో సిద్దాంతి, దైవఙ్ఞ చింతామణి, జంతు జీవన జిజ్ఞాసి, ప్రకృతి ప్రేమిక్, కధా రచయిత, బ్రహ్మశ్రీ డా॥ ఆర్. శర్మ దంతుర్తి,పి.హెచ్.డి (అమెరికా) (ఈ రోజుల్లో అసలు జ్యోతిషం అంటే ఏమిటో కూడా తెలియకుండా రాశి ఫలితాలు రాయవచ్చు అని గ్రహించడం కష్టం కాదు. “మేఘాలు వస్తే వర్షం వస్తుంది,” “రోహిణీ కార్తెలో ఎండబారి పడకుండా ఉంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు” లాంటి ఫలితాలు అంతర్జాలంలో, పత్రికల్లో చదివి నేను కూడా రాయగలను అని వెక్కిరించడానికి ఇది రాసాను. దీనికోసం తెలుగు రాయడం వస్తే చాలు; మిగతా ఎటువంటి పరిజ్ఞానం అవసరం లేదు. బ్రహ్మశ్రీ,, ఆస్ట్రో పండిట్, వేదాంతిక్ అనే బిరుదులు ఎన్నికావాలిస్తే అన్ని తగిలించుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనే వాటికి ఏ సంఖ్య వేసినా ఫర్వాలేదు. మీరుకూడా రాయవచ్చు; ప్రయత్నం చేయండి.) [ఈ సంపూర్ణ జీవిత ఫలితాలు రాశి దృష్ట్యా చూసి నిశితంగా గమనించి ర

అభ్యుదయ మహిళ

కవితా స్రవంతి
సత్యవతి దినవహి విచక్షణ కలిగిన విద్యావంతురాలై ఎల్లచోటులా తన ఉనికిని చాటుతూ అన్నిటా పురుషులతో సరితూగగలనని చూపుతూ సమాజానికి తన అస్తిత్వాన్ని తెలియజేసిన అభ్యుదయ మహిళ దక్షత కలిగిన కార్య నిర్వాహకురాలై శక్తి యుక్తులతో పలురంగాల పురోగమిస్తూ తానెవ్వరికంటే తక్కువ కాదని నిరూపిస్తూ సంఘంలో తన స్థానాన్ని ఉన్నతంగా నిలుపుకున్న అభ్యుదయ మహిళ క్షమత కలిగిన గృహ నిర్వాహకురాలిగా సహజ సిద్ధమైన సౌమ్యత , సౌశీల్యతతో ఇంటా బయటా కార్యసాధకురాలిగా రాణిస్తూ సమస్త స్త్రీ జాతికే తలమానికమై నిలుస్తున్న అభ్యుదయ మహిళ కుశాగ్ర బుద్ధి కలిగిన నారీ మణిగా ఎల్లరి మన్ననను మెప్పును పొందుతూ రాజనీతిలో చాణుక్యుడిని మించిన కౌశలం కనబరుస్తూ ఉత్తమ ప్రజా నాయకురాలిగా ప్రశంశలు అందుకుంటున్న అభ్యుదయ మహిళ అధ్భుత ప్రతిభా పాటవాలతో శాస్త్రవేత్తగా , వ్యోమగామిగా రోదశీయానంలో సౌరమండలమున పాదము మోపి వచ్చి అసాధ్యమైనది సాధించి ఉన్నతికి హద్దులే

నిర్ణయం

కథా భారతి
- పాలెపు బుచ్చిరాజు సాగర్ తో తన పెళ్లి ఇలా బెడిసి కొడుతుందని అనుకోలేదు జలధి. అన్నయ్య అయితే అమ్మానాన్నలని కాదని కులంగాని పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబం నుంచి వేరుపడి వేరే కాపురం పెట్టాడు. పిల్లల మీద ఎన్నో ఆశలు పెంచుకునే అందరు తలిదండ్రుల లాగే వారిద్దరూ చాలా కృంగి పోయారు. వాళ్ళని మరింత నిరాశ పరచడం ఇష్టం లేక, వాళ్ళు చూపించిన సంబంధమే చేసుకోవడానికి ఒప్పుకుంది జలధి. సాగర్ తలిదండ్రులు బాగా డబ్బున్నవాళ్ళు. అతను ఎం టెక్ . చదివి, వైజాగులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అందంగా ఆకర్షణియంగా ఉంటాడు. జలధి కూడా ఐ.టి లో డిగ్రీ చేసి, కేంపస్ ఇంటర్వ్యులో టి. సి. ఎస్. లో సెలక్టు అయింది. పెళ్ళయిన కొత్తలో మూడు నెలల పాటు రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. అత్తవారింట్లో ఆ ఆస్థి పాస్తులు, ఆడంబరాలు చూశాక, తమ తాహతుకు మించిన సంబంధమే అనిపించింది జలధికి. తలిదండ్రులకి ఒక్కడే కొడుకు అతి గారాబంగా పెరిగాడు. ఆ యింట్లో అ