పుస్తక సమీక్ష

పుస్తకావిష్కరణ

"నేత మొగ్గలు" -డా. భీంపల్లి శ్రీకాంత్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి పులి జమున రచించిన "నేత మొగ్గలు" కవితాసంపుటిని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడా, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగష్ట్ 7 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల ఎక్స్ పో ప్లాజాలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరికతకు ఆనవాళ్ళు కులవృత్తులని ఆయా కులవృత్తుల ద్వారానే సమాజం అభివృద్ధి చెందిందన్నారు. సమాజానికి వస్త్రదానం చేసిన గొప్ప చరిత్ర పద్మశాలీయులదని ప్రశంసించారు. పద్మశాలీయులు బట్టలను నేయడం వల్లనే అందరూ ధరిస్తున్నారన్నారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూత పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రతి సోమవారం అందరూ

అసాధ్యుడు

అసాధ్యుడు (పి వి మొగ్గలు) - డా. భీంపల్లి శ్రీకాంత్ జూన్ 28వ తేది మాజీ ప్రధాని కీ.శే. పాములపర్తి వెంకట నరసిం హారావు శతజయంతి. కేంద్ర ప్రభుత్వం బిరుదు ఇవ్వక పోయినా పివి ని భారతజాతి రత్నంగా పరిగణించవచ్చు. దేశ ఆర్థిక సంస్కర్త, భారతదేశ నూతన శకానికి కర్త అయిన పి.వి. నరసిం హారావును మనదేశపు ఠీవీగా చెప్పుకోవచ్చు. రాజకీయవేత్తగా, విద్యార్థి నాయకుడిగా, సాహితీమూర్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా, ఇంకా తనను వరించిన ఇతరపదవులకే వన్నె తెచ్చి, తను పనిచేసిన అన్న్ని రంగాల్లో ఆదర్శప్రాయుడుగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశీలిని 360 డిగ్రీలలో ప్రస్తుతించారు కవి శ్రీకాంత్ గారు. మూడు పాదాల కవితల్లో, సరళమైన భాషలో, చదవగానే సులభంగా అర్థమయ్యే పదానుక్రమణతో రచించారు కాబట్టి 'పి వి మొగ్గలు ' అని కవితా సంపుటి పేరు పెట్టారనుకోవచ్చు. పాలమూరు సాహితి, మహబూబ్ నగర్ ప్రచురించిన 40 పేజీల ఈ పుస్తకం కావాలనుకొన్నవ

Telugu AUDIO book of Veerayya

- Krishna మన ముత్తాత  పేరే తెలియని ఈ రోజుల్లో.. రచయత కృష్ణ తన మూలాన్ని వెతుక్కుంటూ చరిత్రపుటల్లోకి..తవ్వుకుంటూ వెళ్ళిపోయి..అక్కడినించి..ఘనీభవించిన.. తమ పాత తరాల కన్నీటి బిందువుల్ని వజ్రాలుగా మూటగట్టి..'వీరయ్య' గా మన ముందు పరిచాడు కృష్ణ ముత్తాత, వీరయ్య  భారత దేశం నుండి  సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, మారిషస్ లొ బ్రిటిష్ చెరుకు పొలాల్లో పంపబడ్డ 13 లక్షల ఇండెంచర్ కూలీలలో ఒకరు... ఇది ప్రతిఒక్కరు చదవ వలసిన పుస్తకము. దాసుభాషితం అప్ లో తెలుగు ఆడియో పుస్తకాన్ని విని ఆనందించండి https://www.dasubhashitam.com/ab-title/ab-veerayya-1 తెలుగు పుస్తకాన్ని కొనటానికి క్లిక్ చెయ్యండి https://www.amazon.com/dp/8194427339 = = In times where most of us do not even know the name of our great grandfathers, Krishna spent a lifetime searching through the annals of history for his ancestor,

సురవరం మొగ్గలు

అప్పటి నిజాము రాష్త్రములో సగం ప్రాతం 8 తెలుగు జిల్లాలతో విస్తరించి వుండేది. అయిననూ, తెలుగు సాహిత్యానికి తగు ప్రాధాన్యమిచ్చే తెలుగు పత్రికలు లేకుండెను. బ్రిటిష్ ఇండియాలో ఇంగ్లీషు కల్తీలాగా, నిజాం రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వారి వాచకంలో కూడా ఉర్దూ సమ్మేళనం బాగా వినిపించేది. భాషయే గాక వేషధారణ యందు కూడా కల్తీ కనపడుచుండెను. సరైన ఆదరణ లేక ఆంధ్ర గ్రంథాలయములు మూసివేయబడుచుండెను. తెలుగు రైతుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుగా లేకుండేను. ఇలాంటి హేయమైన జీవనస్థితిని చూసి సురవరం ప్రతాపరెడ్డి గారి మనస్సు చలించిపోయేది. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ఉద్యమకారుడిగా ప్రజలలో రాజకీయ, సాంఘిక చైతన్యం తీసుకు రావటానికి నిరంతరం కృషి చేసారు సురవరం. హైద్రాబాదులోని రెడ్డి హాస్టలును తీర్చిదిద్దాడు. గోలకొండ పత్రికను స్థాపించి సంపాదకీయాల ద్వారా నిజాం రాజు నిరంకుశత్వాన్ని ప్రశ్నించాడు. తెల