ధారావాహికలు

రావణుడి వివాహం

ధారావాహికలు
-అక్కిరాజు రామాపతి రావు లంకారాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత దశగ్రీవుడు తన చెల్లెలు శూర్పణఖను, కాలరాక్షసుడి కొడుకైన విద్యుజ్జిహ్వుడి కిచ్చి పెళ్ళి చేశాడు. ఒకనాడు లంకాధిపతి వేటకు వెళ్లి, అక్కడ - నవయౌవనవతి అయిన తన కూతురితో చెట్టుకింద నిరీక్షణ దృక్కులుతో ఉన్న ఒక దైతుణ్ణి చూశాడు. రావణుడు విస్మయం చెంది 'ఈ నిర్జన వనంలో మీరెందుకిక్కడ ఉన్నారని' ఆ దైతుణ్ణి అడిగాడు. అప్పుడా పిల్ల తండ్రి 'నేను దితి పుత్రుణ్ణి. నన్ను మయు డంటారు. దేవతలూ, రాక్షసులూ కూడా నాకు దగ్గర వాళ్ళే. దేవతలు నా ప్రజ్ఞాశాలితను మెచ్చి హేమ అనే అప్సరసను నాకు భార్యగా ఇచ్చారు. ఆమెతో నేను సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఉండేవాణ్ణి. ఇంతలో హేమ దేవతల పనిమీద స్వర్గానికి వెళ్లి ఇప్పటికి పదమూడు సంవత్సరాలైనా ఇంకా తిరిగిరాలేదు. పద్నాలుగో సంవత్సరం నేను నా ప్రజ్ఞనంతా వినియోగించి స్వర్ణప్రభా విలసితమైన, వజ్రవైడూర్య శోభితమైన ఒక నగరాన్ని నా మాయాశక్తితో నిర్

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి 1989లో ఈ వాదంపై వెలువడిన మరో వ్యాసం ఆర్,ఎస్, సుదర్శనంగారి "అనుభూతి కవిత్వం" అస్తిత్వవాదంలో మనిషికీ బాహ్యప్రపంచానికీ ఆత్మీయమైన సంబంధం కావాలేకానీ, ఆలోచనాత్మకంగా ఉండదని పేర్కొంటూ, అనుభూతి వాదాన్ని అస్తిత్వవాదంతో ముడిపెట్టారు. ముందు పేర్కొన్నట్లుగా, ఈ కాలంలోనే 'అనుభూతి కవిత్వం', ‘అనుభూతివాదం' అనే అంశాలపై ఏవిధంగా చర్చ సాగుతుందో, అదేవిధంగా అనుభూతి అనే అంశంపై కూడా చర్చసాగటం గమనార్హం. కవి పొందిన అనుభూతిని పాఠకులకు అందించగలగాలనీ, అసలు కవిత్వానికి గీటురాయి అనుభూతే అని వీరందరి అభిప్రాయం కావటం ముదావహం. ఇలా అభిప్రాయపడిన వారిలో ఎక్కువగా ప్రత్యేకించి 1960 తర్వాత వారు కావటం కూడా గమనించాల్సిన మరో విషయం. వీరు కేవలం అనుభూతి గురించి చర్చించటమేకాక, వారి వారి అనుభూతులను కావ్యరూపంలో వ్యక్తం చేసిన వారు కావటం కూడా గమనించాల్సిన మరో విషయం. కేవలం అనుభూతిని గురించి మాత్రమే చర్చించిన వారిలో ముఖ్యులు త

అమెరికా ఉద్యోగ విజయాలు

ధారావాహికలు
శుభారంభం సత్యం మందపాటి చెబుతున్న అమెరికా ఉద్యోగ విజయాలు - 1 ఆదివారం ప్రొద్దున్నే ఫోను మ్రోగింది. అది తెలిసిన ఫోన్ నెంబరు కాదు. సేల్స్ వాళ్ళు పిలుస్తున్నారేమో వాళ్ళని నాలుగు చివాళ్ళు పెడదామని, వెంటనే ఫోన్ తీసుకుని “హలో” అన్నాడు కృష్ణ, కొంచెం కరుగ్గానే. “నేను బావా, అర్జున్ మాట్లాడుతున్నాను” “అర్జునా?.. ఏ అర్జున్?” “ఏ అర్జున్ కాదు బావా. బి. అర్జున్. బి అంటే భమిడిపాటి అర్జున్” అదెవరో తెలీక ముఖం ఇబ్బందిగా పెట్టాడు కృష్ణ. ఈలోగా అర్జున్ తనే అన్నాడు, “అవునులే. నువ్వు అమెరికాకి వచ్చి ముఫై ఏళ్ళ పైనే అయింది కదా. మర్చిపోయుంటావు. నేను మీ భమిడిపాటి పాండురంగారావు మామయ్య, సుబ్బలక్ష్మిగార్ల అబ్బాయిని. ఆమదాలవలస. అప్పుడు మా నాన్నా వాళ్ళ ఇంటికి దగ్గరలో వుండేవాళ్ళుట మీరు. నువ్వు అమెరికాకి వచ్చాకనే నేను పుట్టాను కదా. ఏదో ఒకటి రెండుసార్లు ఇండియాలో కలిశాం కానీ, పెద్దగా కలవలేదు. అదీకాక ఇప్పుడు మేమెక్కడో...

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి తిలక్ కవిత్వంలో భావ, అభ్యుదయ కవిత్వాలతో పాటుగా, రాబోయే అనుభూతివాద కవితా పరిణామం కన్పిస్తుందనీ, దానికి తిలక్ కవిత్వమే ఆరంభ సూచకమనీ టి.ఎల్. కాంతారావుగారు పేర్కొన్నారు. 1981లో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు ఆలోచన అనే గ్రంథంలో ప్రత్యేకంగా 'అనుభూతివాదం' అనే వ్యాసాన్ని రాశారు. ఈ వాదం 'ఏ ఇజానికీ కట్టుబడి ఉందనీ’. ‘ఆత్మాశ్రయ కవిత్వానికి ప్రాణప్రదమైనదనీ’, అంతేకాక ‘అనుభూతికి అగ్రప్రాదాన్యం ఇస్తుంద’నీ వీరు చెప్పి సాహిత్యంలో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. కడియాల రామమోహనరాయ్ గారు 1982లో "తెలుగు కవితా వికాసం" అనే గ్రంథంలో 'అనుభూతివాదం', ‘అనుభూతి కవిత్వం' అని పేర్లు పెట్టి ప్రత్యేకంగా రాయటం జరగలేదు. కానీ నూతన కవితారీతులను పరిచయం చేసేటప్పుడు మాత్రం 'అనుభూతివాదం', ‘అనుభూతి కవిత్వం', అనుభూతి కవుల' గురించి వీరు పేర్కోవటం జరిగింది. వీరు అనుభూతివాదాన్ని 'భావ కవితా సంబంధి'గానే చూసినా, ఈ

రావణాసురిడి జననం

ధారావాహికలు
-అక్కిరాజు రామాపతి రావు ఆ తర్వాత ఆ అన్నదమ్ములు ముగ్గురూ తండ్రి ఉండే తపోవనానికి తరలి పోయినారు. ఎప్పుడైతే రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుడి వల్ల అచింత్యమైన, అమోఘమైన వరాలు పొందారని సుమాలి తెలుసుకొన్నాడో ఇక నిర్భయంగా ఉండవచ్చుననీ,పోయిన ఆధిపత్యం తిరిగి సంపాదించుకోవచ్చుననీ 'మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు' అనే మంత్రులతో పాతాళలోకం నుంచి నేరుగా దశకంఠుడి దగ్గరకు వచ్చి అతణ్ణి కౌగిలించుకొని అభినందించి 'నాయనా! నీ వల్ల మేము నిర్భయులమైనాము. మనం లంకలో ఉండక పోవటం చూసి మీ అన్న ధనదుడు అక్కడ విలాసంగా పరిపాలిస్తున్నాడు. నీవు సామ, దాన, భేదోపాయాలలో దేనితోనైనా వాణ్ణి అక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. మేమంతా నిన్ను అనుసరించుకొని ఉంటాము. నీవు మన రాక్షసజాతిని విపత్సముద్రం నుంచి రక్షించావు' అని ప్రశంసించాడు. దశాస్యుడు మొదట ఒప్పుకోలేదు. ‘నీవు నా మాతామహుడివి! నిజమే కాని, కుబేరుడు నాకు జ్యేష్ఠభ్రాతకదా! జ్యేష

రావణాసురిడి జననం

ధారావాహికలు
-అక్కిరాజు రామాపతి రావు అట్లా ఆమెకు మొదట దశగ్రీవుడు జన్మించాడు. ఆ తరువాత కుంభకర్ణుడు పుట్టాడు. వాళ్ళిద్దరూ చిన్నతనంలోనే పరమభయంకర క్రూరకృత్యాలు చేస్తూ మునివాటికలను వెరపు కలిగిస్తూ వచ్చారు. ఋషులను పీడించసాగారు. వీళ్ళిద్దరి తరువాత పుట్టిన విభీషణుడు మాత్రం సాధువర్తనుడై, ధర్మతత్పరుడై, వేదనిరతుడై, జితేంద్రియుడై పెరుగసాగాడు. ఇట్లా కాలం గడుస్తుండగా ఒక రోజున వైశ్రావణుడు (కుబేరుడు) పుష్పకవిమానం ఎక్కి తండ్రిని చూడడానికి వచ్చాడు. అప్పుడు కైకసి దశగ్రీవుడితో 'చూడు, నీ సోదరుడు, ఎంత మహావైభవంతో, దివ్యతేజస్సుతో విలసుల్లుతున్నాడో! నీవు కూడా అంతటి వాడివి కావాలి. అతన్ని మించిపోవాలి' అని ప్రేరణ చేసింది. అప్పుడు దశగ్రీవుడు 'అమ్మా చూడు! ఆ ధనదుడి కన్నా బలవంతుణ్ణి అవుతాను, ధనవంతుణ్ణి అవుతాను. లోకాలన్నిటినీ జయిస్తాను. వాడి లోకపాలకత్వం ఒక లెక్కా? బహులోకపాలకుణ్ణి అవుతాను' అని తల్లికి ప్రియం కలిగించాడు. రావణాసురుడూ,

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి అనుభూతివాదం, అనుభూతి కవిత్వం అనే పేర్లు శ్రీకాంతశర్మగారి తర్వాత సాహిత్యంలో మరింత బలంగా పాతుకున్నట్లుగా తోస్తుంది. 1982లో నందిని సిద్దారెడ్డిగారి 'అనుభూతివాదం', 1982లో కొడవంటి లీలామోహనరావుగారి 'అనుభూతి కవిత్వం', 1983లో డా, ముదిగొండ వీరభద్రయ్యగారి 'అనుభూతి కవిత్వం' (కొన్ని వ్యాసాలు), 1987లో డా|| జి.వి. సుబ్రహ్మణ్యంగారి 'అనుభూతి కవిత్వం', 1989లో ఆర్. యస్. సుదర్శనంగారి ‘అనుభూతి కవిత్వం’ - ఈ వ్యాసాలన్నీ వివిధ పత్రికలలోనూ, సంకలన గ్రంథాలలోనూ ప్రచురితమయ్యాయి. వీరి తర్వాత పైన పేర్కొన్న విమర్శ వ్యాసాలు ప్రచురితం కావటమే ఇందుకు తార్కాణం. ఈ కాలంలో అత్యధిక విమర్శకులు అనుభూతిని కవిత్వ ప్రధాన లక్షణంగా గుర్తించటం కూడా మనం గమనించాల్సిన అంశం. కుందుర్తిగారి అనుభూతివాదం అనే పదాన్ని ప్రయోగించటమే కాకుండా, “తిలక్ తాను ప్రధానంగా అనుభూతి వాదినని బల్లగుద్ది చెప్పుకున్నాడు” అని వీరు చెప్పారు. “పాఠక