ధారావాహికలు

శ్రీ రామ సంగ్రహం

ధారావాహికలు
రాక్షసులు దేవలోకంపై దండెత్టటం -అక్కిరాజు రామాపతి రావు రాక్షసులకప్పుడు అనేక దుర్నిమిత్తాలు, దుశ్శకునాలు ఎదురైనా వాళ్ళు జంకలేదు. ముగ్గురు అన్నదమ్ములు అశేష రాక్షససేనతో పోయి దేవతలతో తలపడ్డారు. ఈ విషయం విష్ణుమూర్తికి మొర పెట్టుకోవటానికి దేవతలు, దూతలను పంపారు. శ్రీమహావిష్ణువు యుద్ధసన్నద్ధుడైనాడు. సుపర్ణు ఆయనను విక్రమోత్సాహంతో తనపై అధిష్టింప చేసుకున్నాడు. రాక్షసులకూ, విష్ణుమూర్తికీ మహా భయంకరమైన యుద్ధం జరిగింది. కొండమీద పెనువర్షం కురుస్తున్నట్లుగా మహావిష్ణువుపై రాక్షసులు బాణవర్షం కురిపించారు. అయినా విష్ణుమూర్తి ఏమీ చలించలేదు. ఆయన కూడా వజ్రసమానమైన బాణాలను రాక్షసులపై ప్రయోగించాడు. తన పాంచజన్యాన్ని పూరించి రాక్షసులపై విజృంచాడు. ఆ శంఖ ధ్వనికే గుండెలు పగిలి చాలామంది రాక్షసులు హతులైనారు. ఇట్లా వేల సంఖ్యలో రాక్షసులు యుద్ధంలో నిహతులైనారు. రాక్షస సంహారం శ్రీమావిష్ణువు ఆ రాక్షసులను శరభమృగం సింహాలనువలెను

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి 1966 లో తెలుగు సాహిత్య విమర్శలోకి ప్రవేశించిన "అనుభూతివాదం" అనే మాట ఈనాటికి ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనంలో ఒక ప్రముఖ సిద్ధాంతంగా స్థిరపడింది. 1966 నవంబర్ సృజనలో "అనుభూతివాది తిలక్" అనే వ్యాసంలో అద్దేపల్లి రామమోహనరావుగారు మొట్టమొదటిసారిగా 'అనుభూతివాది' అనే పదాన్ని ప్రయోగించారు. ఆ తరువాత క్రమక్రమంగా అనుభూతికవిత్వం, అనుభూతివాదం లాంటి పదాలు పారిభాషికపదాలుగా సాహిత్య విమర్శలో ప్రచురంగా వ్యాప్తిలోకి వచ్చాయి. అయితే తెలుగు సాహిత్య విమర్శలోని అనేక పారిభాషిక పదాలలాగానే ఈ పదాల విషయంలో కూడా ఒక స్పష్టమైన నిర్వచనం, అవగాహన ఇంతవరకూ రూపొందలేదు. ఉదాహరణకు కొందరు విమర్శకులు తిలక్ కవిత్వం విషయంలో మాత్రమే అనుభూతి కవిత్వం అనే పేరును ఉపయోగిస్తారు. మరికొందరు గుడిపాటి వెంకటచలం, అరిపిరాల విశ్వం, వేగుంట మోహనప్రసాద్, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇస్మాయిల్, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, పొట్లపల్లి రామారావు,

ఆత్మవిశ్వాసం

ధారావాహికలు
అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 ఆత్మన్యూనత వద్దు ఆత్మవిశ్వాసమే ముద్దు (Inferiority to Self Confidence) మానవ జీవన అభివృద్ధి సోపానాలకు ఆత్మవిశ్వాసమే పునాది. ఆత్మవిశ్వాసం కొరవడిన జీవితం సంక్లిష్టంగా, బరువుగా నడుస్తుంది. ఇది కేవలం విద్యార్థులకో యువతకో పరిమితమైనది కాదు సమస్త మానవాళికి ఇది ఆవశ్యకమైనది.మనపై మనకున్న నమ్మకమే మనల్ని జీవిత వైకుంఠపాళి లో పరమపద సోఫానాన్ని అధిరోహింప చేస్తోంది. వైకుంఠపాళి లో క్రిందకు లాగే పాములే కాదు పైకి చేర్చే నిచ్చెనలు కూడా వుంటాయని అవగాహన మనలో ఉన్నంత వరకు ఆత్మన్యూనతా (Inferiority) తో కాదు ఆత్మవిశ్వాసం (Self Confidence) తో మన అభివృద్ధికి విఘాతం కలిగించే ఏ విషయాన్నైనా ధైర్యంతో ఎదుర్కోగలం! జీవన గమనంలో సామాజికంగా,సాంఘికంగా,సాంకేతికంగా జరిగే మార్పులు అనుక్షణం మన ముందు అనేకానేక కొత్త కొత్త సవాళ్ళను తెస్తుంటాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జరుగ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి “అయ్యయో! ఊర్వశీ విషాదార్ద్రమూర్తి ఈ నిశీథాన నా హృదయాన నిండె! పూర్ణిమా శుభ్రయామిని బొగ్గువోలె ఈ యెడదవోలె కాలిపోయినది నేడు!” దీనిలో 'నేను' అంటే నేను అనే అర్థం. కానీ "నా బాహువు పడుకుంటే, పొలాలు ,కార్ఖానాలు నిద్రిస్తాయి" అన్న ఆధునిక కవి రచన చదివితే, ఇందులో ఉన్న నేను 'నేను' కాదు. ఇక్కడ 'నేను' అంటే సమాజం అనే అర్థం. కాబట్టి ఆధునిక రచనలోని ఆత్మాశ్రయ కవిత్వం సామాజిక అనుభూతులకి సంబంధించిందే. కవి వైయక్తికంగా తాను పొందిన అనుభూతిని సామాజికంగా చెప్తున్నాడు. ఈ రచన సమాజంలోని ప్రజలందరి భావంగా మారి ప్రయోజనాలను ఉద్దేశించిందిగా కన్పిస్తుంది. కవి రచన అనుభూత్ని స్వాత్మీకరణం చేసుకున్నా, ఆ అనుభూతి సమాజం పొందేదే. శేషేంద్ర- “నది పోలాలవైపు పరిగెత్తింది అన్నార్తుల్ని రక్షిద్దామని చెయ్యి రైఫిల్ వైపు పయనించింది ప్రజాద్రోహుల్ని శిక్షిద్దామని" అని అంటాడు. ఇక్కడ చెయ్యి అంటే తన చెయ్యి కాదు. ఏ ఒక్క

శ్రీ రామ సంగ్రహం

ధారావాహికలు
రావణుడి తాతతండ్రులు -అక్కిరాజు రామాపతి రావు సుకేశుడు ధర్మమార్గావలంబి అయినాడే కాని రాక్షస ప్రవృత్తినిస్వీస్వేకరించలేదు. గ్రామణి అనే గంధర్వుడు సుకేశుణ్ణి చూసి ఎంతో ముచ్చటపడి తన కూతురు దేవవతినిచ్చి అతడికి పెళ్ళి చేశాడు. సుకేశుడు దేవవతితో అభీష్టసుఖాలు పొందుతూ ఆనందంగా కాలం గడుపుతుండగా ఆ దంపతులకు క్రమంగా ముగ్గురు కొడుకులు పుట్టారు. వాళ్ళు ఆ సంతానానికి మాల్యవంతుడు, సుమాలి, మాలి అని పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు మహాదేవుడి వరప్రభావం వల్ల జన్మించారని ఆ తండ్రి ఎంతో మురిసిపోయినాడు. అయితే వీళ్ళకి తండ్రి తాతల సత్త్వగుణసంపద అబ్బలేదు. తమ తండ్రికి, శివానుగ్రహం ఉన్నదని తెలుసుకొని తాము కూడా అత్యంత బలపరాక్రమాలతో, లోకాలన్నిటినీ శాసించే శక్తిసామర్థ్యాలతో విలసిల్లాలని బ్రహ్మదేవుణ్ణి గూర్చి వాళ్ళు ముగ్గురూ ఘోరతపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై వాళ్ళకు వారు కోరిన వరాలిచ్చాడు. ఇక వాళ్ళు అహంకరించి, తమకు ఎవరూ ఎదురు

ఆవేశాలే మానవ జీవితాలకు అనర్ధాలు

ధారావాహికలు
అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 ఆవేశ మనేది ఒక అగ్ని లాంటింది ఇది ఆవేశపడే వారినే కాదు ఒక్కొక్కసారి తోటివారిని కూడా దహించి వేస్తోంది వేగంగా మారుతున్నఈనాటి సామాజిక పరిస్థితులలో ప్రతి రోజు ఈ ఆవేశాలకు బలిపీఠం ఎక్కుతున్నవారికి సంబంధించిన వార్తలు రాని పత్రికలు, మీడియాలు, సామాజిక మాధ్యమాలు లేవంటే అతిశయోక్తి లేదు! అనేక కుటుంబాలు, యువకులు, విద్యార్థులు, వ్యాపార వ్యవహారాలలో వున్నవారు ఒకరేమిటి అన్ని రంగాలలో వారిని ఈ భావోద్రేకాలు ఆవరించి దాని ఫలితంగా అసహనాలు పెరుగుతూ అవే ఆవేశాలకు ఆజ్యంగా మారి అనేకానేక జీవితాలు నేల కూలుస్తున్నాయి. అనర్ధాలకు మూలం ఆవేశం అని తెలిసినా కూడా ఆవేశానికి మూలాలు కనుగొని దానిని నియంత్రించడంలో మనము ఇంకా వెనుక పడే వున్నాము. ఆవేశమనేది ప్రమాదకారిగా మన జీవితానికి ప్రతిబంధకంగా ఉంటుందో తెలిసి కూడా నియంత్రణ అనేది ఒక్కొక్కసారి మన చేయిజారి పోవటం విచారకరం. ఈ ఆవేశమ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి భావకవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చింది అబ్యుదయ కవిత్వం. వీరు అభ్యుదయ కవులమని చెప్పుకున్నా తిరుగుబాటే వీరి ప్రధాన ఆశయం. తరువాతి కాలంలో ఈ కవులే విప్లవ రచయితల సంఘంగా ఏర్పడటం గమనిస్తే, సమాజంలో వీరికి కావలసింది తిరుగుబాటు. వర్గపోరాటం వీరి ప్రధాన ధ్యేయం. రచనల్లో వీరు కోరుకునేది రెచ్చగొట్టే లక్షణం, “హరోం! హరోం హర! హర! హర! హర! హర! హరోం హరా! “ అని కదలండి! అని చెప్పే రాచనలే వీరికి ప్రధానం. పోల్చి చూస్తే ఇదే కవి చెప్పిన “నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా? నడుమ తడబడి నడలిముడుగక పడవతీరం క్రమిస్తుందా?” అని చెప్పిన రచన ఈ వర్గపోరాటం ఆశించేవారికి చాలదు. రచన చదివిన తర్వాత తెలియని ఆనందంతో ఎక్కడికో వెళ్ళే సహృదయుడు ఈ గేయాన్ని పదికాలాలపాటు గుర్తుంచుకోగలడు. కానీ మార్క్సిస్తులకది చాలదు. వారికి కావలసింది, “బాటలు నడచే. పేటలు కడచే. కోటలన్నిటిని దాటండి! నదీనదాలూ, అడవులు, కొండలు,