కథా భారతి

అష్టావక్రుడు

కథా భారతి
అర్చన ఆర్ట్స్‌ అకాడెమీ (హ్యూస్టన్‌), శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్‌ ఛారిటబుల్‌ సొసైటీ, సంయుక్త కథల పోటీ 2019 -యర్రమిల్లి విజయలక్ష్మి ద్వితీయ బహుమతి పొందిన కథ హాల్లో నా ఎదురుగా గోడమీద ఎత్తున ఇనుప తీగకు బిగించిన మా తాతగారి నిలువెత్తు తైల చిత్రం వ్రేలాడుతోంది. పక్కనే మా మామ్మది. ఇంకా ఎవరెవరో పూర్వీకులు, కుటుంబ సభ్యుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు తగిలించి ఉన్నాయి. వాటిని చూస్తుంటే నేను పరిష్కరించవలసిన ఇంటి సమస్య గుర్తుకొచ్చింది. దాదాపు వంద సంవత్సరాల క్రితం మా తాతగారు కట్టించిన ఇల్లది. మా తాతగారికి ఇద్దరు మగ సంతానం. మా నాన్న, గోవిందు నాన్న. చిన్నతనంలోనే తల్లినీ, తండ్రినీ పోగొట్టుకున్నాడు గోవిందు. మా తాతగారు అయన తరువాత మా అమ్మ, నాన్న వాడ్ని మాతోనే పెంచారు. చాలా తింగరి తింగరిగా ఉండేవాడు. చదువు వంటపట్టలేదు. ఎప్పుడూ ఊరిమీద తిరుగుతూ ఎవరికే సాయం కావాల్సినా చేస్తుండేవాడు. కన్నవాళ్ళు లేకపోవటం వల్ల అ

జరుగుతున్న కథ

కథా భారతి
-కట్టా రాంబాబు ప్రథమ బహుమతి పొందిన కథ ఆరోజే కాలేజి 'రివోపెనింగ్‌ డే'. అందుకే అక్కడి వాతావరణమంతా ఉత్సాహంగాను, ఆహ్లాదకరంగాను వుంది. రంగు రంగుల సీతాకోక చిలుకల్లా అలంకరించుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలాకాలం తర్వాత కలుసుకొన్నారేమో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడంతా ''హాయ్‌'', ''హల్లో'' లతో గందరగోళంగావుంది. సమయం తొమ్మిదిన్నరే అయింది. క్లాసెస్‌ కమెన్స్‌ కావడానికింకా అరగంట టైముంది. చాలామంది అబ్బాయిలుకాంటిన్‌ ముందు నిలబడి క్రొత్తగా జాయినవ్వడానికి అప్లికేషన్లు తీసుకెళుతున్న అమ్మాయిలకు పోజులిస్తున్నారు. కాలేజిముందున్న గార్డెన్‌లో ఓ చెట్టు క్రింద నీడలో పదిమంది వరకు అమ్మాయిలు కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా ఫస్టియర్‌ పూర్తిచేసి సెకండియర్‌ డిగ్రీలో ప్రవేశిస్తున్నారు. సమయం కావడంతో ప్రిన్సిపాల్‌గారు తమ 'హోండా సిటీలో' వచ్చి ఆఫీసులో కూర్చున్నారు, లెక్చరర్లు కూడ ఒక్క

చెఱసాల

కథా భారతి
-నండూరి సుందరీ నాగమణి ద్వితీయ బహుమతి పొందిన కథ “పిల్లాడు ఫోన్ చేసాడండి, అక్కడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాడట!” దీనంగా చెప్పింది రాజేశ్వరి భర్తకు కాఫీ కప్పు అందిస్తూ. “చూడు రాజీ, ఇది పోటీ ప్రపంచం… ఇక్కడ మనమూ పోటీ పడకపోతే తప్పదు… వాడికి ఇంటిమీద బెంగ ఉండటం సహజం. కానీ... నిజానికి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అసలలాంటి కార్పొరేట్ కాలేజీ అయితేనే వీడిలాంటి బద్దకిష్టులకి సరియైన చోటు… నువ్వేం బెంగపడకు, వాడలాగే అంటాడు.” తాపీగా టీవీ ఛానల్ మార్చుతూ, కాఫీ సిప్ చేయసాగాడు గరళకంఠం. “అయ్యో, మీకెలా చెప్పాలి? మొదట్లో టాప్ టెన్ లో ఉండేవాడు కనుక బాగానే ఉండేది. ఇప్పుడు వాడి రాంక్ తగ్గిపోవటంతో సెక్షన్ మార్చేసారట. వీడిని… వీడిననే కాదు వీడి క్లాసుమేట్స్  అందరినీ ఎంతో  హీనంగా చూస్తారట. ఎన్నో మాటలు, సాధింపులనట… ఛ! ఏం మాస్టర్లండీ? ఎగతాళిగా మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి అడల్ట్ జోక్స్ కూడా వీడిమీద వేస్తారట! ముడుకుల

వలస

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి ఆఫీసునుంచి సాయంత్రం ఇంటికొచ్చిన రమణ లోపలికి వస్తూ అరిచేడు, “ఈ రోజు కొత్త న్యూస్; శాన్ ఆంటానియోలో నాకో మంచి ఉద్యోగం వచ్చింది మనం టెక్సాస్ వెళ్ళిపోతున్నాం.” “అదేమిటి, మరి ఇక్కడ ఈశ్వరి చదువో? మధుని ఇప్పుడే డే-కేర్ లో చేర్పించాం. వాడు కుర్రాడు కనక ఎలాగోలా తట్టుకున్నా, అమ్మాయి అక్కడ కలవగలదా? టెక్సాస్ అంటే అక్కడ స్పానిష్ మాట్లాడే మెక్సికన్లు ఎక్కువగా ఉంటారంటారు కదా?” కల్పన అడిగింది రమణని అనుమానంగా చూస్తూ. ఈ లోపుల, నాలుగో తరగతి చదివే అమ్మాయి ఈశ్వరికి ఇది అర్ధం అయిందో లేదో కానీ వీళ్ళ మధ్యలోకి వచ్చి ఈ తతంగం ఏమిటో చూడబోయింది. “మొన్నామధ్య ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, మొదట్లో ఉత్తి ఫేమిలీ కేర్ డాక్టర్ లా పనిచేస్తావా అని అడిగారు. ఆలోచిస్తాను అని చెప్పాను. కానీ ఈ రోజు ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ, ఫేమిలీ కేర్, డయాబెటిక్ కేర్ కి కలిపి ఓ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారుట. వస్తావా అని అడిగారు. వె

ఇక్కడికెందుకొచ్చాను

కథా భారతి
- భారతీనాథ్ చెన్నంశెట్టి ఇక్కడికెందుకొచ్చానబ్బా, అంటూ మిత్రుడు, శాత కర్ణి, వాట్సప్ గ్రూపులో తన స్వగతం పంచిన నాటినుoడి, నాలో అంతర్మథనం మొదలయ్యిoది. అసలు నేనెoదుకు వచ్చాను, అని, నేనెవ్వరు, అన్న పుస్తకం చదువుతున్న మా ఆవిడను అడిగాను. జీడి పప్పుల కోసం అయ్యుoటుoది. వంట గదిలో పై అరలో వుoటాయి తీసుకోoడి అంది మా ఆవిడ. అసలు ఈ భూమి పైకి ఎందుకు వచ్చానో అని నా సందేహం, అన్నాను. నా బుర్ర తినడానికి వచ్చుoటారు, నా పనికి అడ్డం రాకండి అంటూ విసుక్కుoది. అప్పుడెప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాల రావు అన్నట్టు “తిని తొoగుoటే మనిషికీ గొడ్డుకు తేడా ఏముoటుoది”, మనిషన్నాక కాసిoత జ్ఞానాన్వేషణ వుoడాలి, అంటూ గతంలోకి వెళ్ళాను. ఉన్న చిన్న బుర్రను పగలకొట్టుకోకుoడా, ఆలోచిoచడం మొదలు పెట్టాను. అరవై మూడు సంవత్సరాల జీవన పయనంలో, ఎన్నెన్నో ఎత్తు పల్లాలు. ఎన్నెన్నో వింతలు విశేషాలు. ఎందుకు జరుగుతున్నాయో, అర్ధమయ్యే

” తిండి యావ” (హాస్య కధ)

కథా భారతి
పెళ్ళి చూపుల్లో ముద్దబంతి పువ్వులా ఉన్న సుందరి అందచందాల మీద గాని వాళ్ళు జరుపుతామంటున్న పెట్టిపోతలు, కట్నాల మీద గాని ధ్యాస లేదు సుబ్బారావు కి..ఆడపెళ్ళి వారు పళ్ళాలలో పెట్టిన తినుబండారాల మీదే అతని దృష్టి మొత్తం..ఉంది.చూపులయ్యాక " ఏరా సుబ్బూ.. పిల్ల నచ్చిందా? అనడిగాడు అటు ఆడపెళ్ళి వారికి ఇటు మగ పెళ్లి వారికి మథ్యవర్తిగా వ్యవహరిస్తున్న సుబ్బారావు సొంత మేనమామ..తినబండారాలపై దృష్టి మరచలేని సుబ్బారావు నోరూరించే మైసూర్ పాక్ ఇంకా తినవేంటి అంటూ పచ్చగా హొయలు బోతూ నవ్వినట్లనిపించి అమాంతం ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకుని దాని రుచిని ఆస్వాదిస్తూ 'ఆహా'..అన్నాడు తన్మయంగా.... ఇహనేం మా వెధవాయ్ కి పిల్ల నచ్చింది ఇక శుభస్యశీఘ్రం ..పెళ్ళున నవ్వుతూ అన్నాడు మేనమామ. ఆ నవ్వు అదురుకి టేబిల్ పై నున్న పళ్ళాలలో నీటుగా సర్ది పెట్టిన తినుబండాలు చెల్లా చెదరు అయేసరికి ఆడపెళ్ళి వారు హడలిపోయారు..! ఇక పెళ్ళి చూపుల తతం

కలియుగ అజామిళ

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారద్దేశం. అప్పల్నాయుడు పుట్టినప్పుడు జాతకం చూసిన పంతులు చెప్పడం ప్రకారం నాయుడిది సింహ లగ్నం. ఎలాగైనా సరే పెద్దయ్యాక నాయకుడై తీరుతాడు. అయితే ఎందులో నాయకుడౌతాడనేది పెంపకాన్ని బట్టి ఉంటుందనీ అందుకోసం నాయుడి తండ్రి కొంచెం కష్టపడాలనీ పంతులు చెప్పాక అప్పల్నాయుడి తండ్రి ఆలోచించాడు - ఏ లైన్లో కుర్రాణ్ణి సులభంగా నాయకుణ్ణి చేయచ్చో, ఏ వృత్తిలో అయితే పెద్ద చదువు, సంధ్యా అక్కర్లేదో, ఏదైతే లక్ష్మీ కటాక్షం కురిపిస్తుందో. దీని కోసం నాయిడి తండ్రికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. నాయుడికి సరిపోయేవి రాజకీయాలు. ఓ సారి ఊళ్ళో సర్పంచో ఏదో ఒకటి అయితే అక్కణ్ణుంచి జిల్లాకి, తర్వాత ఎమ్మెల్యే అలా పైకి పాకడం తారాజువ్వ ఆకాశంలోకి ఎగిరినట్టూ జరిగిపోతుంది. సింహ లగ్న ప్రభావమో మరోటో కానీ మూడో క్లాసులోంచే అప్పల్నాయిడు నాయకుడి లక్షణాలు చూపించడం మొదలుపెట్టేడు - పక్కింటి అమ్

లావయిన కథ

కథా భారతి
-భారతీనాథ్ చెన్నంశెట్టి చక్కనమ్మ చిక్కినా అందమే, అని, నాలో నేను అనుకుందామనుకుని, పైకే అనేశాను. అది విన్న, మా ఆవిడ ఖయ్యిమంటూ, నా మీద, అగ్గి మీద గుగ్గిలం పొగలా లేచింది. నాకు, నా సతిని, ఆవిడ  అని అంటే, పెరుగు ఆవడ తిన్నంత సంతోషంగా ఉంటుంది. అదే, భార్య అంటే, భారము మీద పడినట్టై,  మనసుకు నచ్చదు. అసలు విషయం వదిలి,  పక్క దోవ పట్టాను. రామాయణంలో పిడకల వేట అంటే ఇదేనేమో. అసలు విషయానికి వచ్చేద్దాం, ఇక. ఎవరా చక్కనమ్మ , ఏమిటా కథ అంటూ విరుచుకు పడింది, మా ఆవిడ. వీధి చివర మూడో మేడ, ఆరో అంతస్తులోని, చుక్కమ్మ గారి గురించేనా, అంటున్నారు, అంది. హవ్వ, ఆవిడ మా అమ్మమ్మ ఆఖరి చెల్లెలు, నూరుకు, ఆరు నెలలు దూరంలో ఉందావిడ, అన్నాను. అయితే, తప్పని సరిగా, ఆరో ఇంట్లో మూడో అంతస్తులోని, జేష్టమ్మ గారి గురించే అయ్యుంటుంది, అంది మా ఆవిడ. ఆవిడకు, వాళ్ళ అమెరికా మనవరాలు, క్రితం నెలలోనే, స్కైపులో, తొంభైవ పుట్

సెల్లోపాఖ్యానం

కథా భారతి
తమిరిశ జానకి హైదరాబాద్ డ్రయివింగ్ లో ఉన్నాడు సుందరం. జేబులో సెల్ మోగుతోంది. కాదుకాదు పాడుతోంది నిను వీడని నీడను నేనే అంటూ. కాస్తంత దూరంలోనే ట్రాపిక్ పోలీస్ కనిపించాడు. జేబుదాకా వెళ్ళిన చెయ్యి వెనక్కి వచ్చేసింది. ఆ ట్రాఫిక్ పోలీస్ అక్కడ లేకపోతే బండి నడుపుతూ మాట్లాడదామనే......బండి పక్కకి పెట్ట్టే ఉద్దేశం లేదు. అంత రద్దీలో పక్కకి పెట్టి కూచుంటే ఇల్లు ఎప్పటికి చేరాలి..... పైగా సి సి కెమేరాలు వచ్చి పడ్డాయిగా ప్రాణానికి అన్న కోపం . తన ప్రాణానికే ముప్పు అన్న ఆలోచన లేదు. ఇల్లుచేరాక ఇంటి గుమ్మంలో స్కూటర్ స్ట్టాండ్ వేసి వెంటనే సెల్ తీశాడు. స్నేహితుడు ప్రసాద్ కాల్. అతనితో మాట్లాడుతూనే ఇంటి తలుపు కొట్ట్టాడు. నీకసలు పిచ్చెక్కింది అంటూ పకపకా నవ్వుతూ తలుపు తీసిన భార్య కవిత మాటలకి జుట్టు పీక్కునేవాడే గానీ చెవికీ భుజానికీ మధ్య కనిపించింది సెల్. ఆమెగారి ఆత్మీయ స్నేహితురాలని అర్ధమయింది. ప్రసాద్ చెప్తున్నది

మురికి

కథా భారతి
 -ఆర్ శర్మ దంతుర్తి అప్పల్నాయుడు సర్పంచి అయినప్పటినుండీ డబ్బులు వెనకేసుకోవడంలో చూపించిన చొరవ మరొకరెవరికీ చేతకానికిది. ఎక్కడ ఏమూల పైసా దొరికినా అందులో నాయుడి చేతిలోకి వాటా రావాల్సిందే. అయితే ఎలా తినేసినా కొంతలో కొంత ఊరికి మంచి చేసినట్టే లెక్క. మరుగుదొడ్లు కట్టించడం, వాటిని రోజూ క్లీన్ చేయడానికో టీం ఏర్పాటు అలా మొత్తంమీద ఏదో ఒక మంచి చేస్తూంటే ఎలక్షన్ లలో నెగ్గుతూ వస్తున్నాడు. అయితే మరుగుదొడ్లు కట్టడంలో ఇరవై శాతం తినేసాడనీ, వాటిని రోజూ క్లీన్ చేయడానికి ఇచ్చే సరుకుల్లో, ఫినాయిల్ కి ఇచ్చే డబ్బులో సగం నాయుడిదేననీ జనం అనుకున్నా మనం అటువంటి పనికిరాని అమాయకపు ప్రశ్నలు అడగరాదు. చేతులు తడవకుండా ఉత్తినే ఎవరూ ఏ పనీ చేయడానికి ఇది సత్యయుగం కాదు కదా? సర్పంచ్ నుంచి, ఎమ్మెల్యే దాకా ఎదిగే సరికి నాయుడికి మూడు కార్లూ, ఒక బంగళా, గేటు దగ్గిర కాపలాకి గూర్ఖా, వీళ్ళందర్నీ చూడ్డానికో పెర్సనల్ సెక్రటరీ ఇలా మందీ మా