సారస్వతం

నమామి భగవత్పాదం

సారస్వతం
-శారదాప్రసాద్ హిందూమత ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కానీ ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు.శంకరులు సాక్షాత్తు శివుని అవతారమనే నమ్మకం ఉంది. దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడని ఆస్తికుల నమ్మకం. బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాడు. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం చేయలేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే ఒప్పించాడు. శంకర

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య ఏల నీవు సిగ్గువడే వింతలోనను ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీనివాసుని వలచి వలపించుకొన్న అమ్మ పద్మావతీదేవి ఆభిజాత్యంతో అంటున్న మాటలను మనకు వినిపిస్తున్నాడు. "స్వామీ! మీరెందుకు సిగ్గుపడతారు. నేను మీ పట్టపు రాణిని. నిన్ను ఎంతమంది కాంతలు మోహించినా వలచినా నాకేమి స్వామీ! బంగారం వంటి భార్యను నేనే కదా! నీ హృదయంలో నే నాకు చోటిచ్చావు నాకు ఇంక నాకు దిగులేమిటి" అంటున్నది అమ్మ. అన్నమయ్య అమ్మచే పలికిస్తున్నాడు అందంగా. అదేమిటో ….ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం…. కీర్తన: పల్లవి: ఏల నీవు సిగ్గువడే వింతలోనను మేలిమియిల్లాల నీకు మించి నేనేకాదా || ఏ ల నీవు || చ.1. క్కడఁ దిరిగినా మాయింటికే వత్తువు నీవు తొక్కుమెట్టాడి నిన్ను దూరనేఁటికి పుక్కట తుమ్మిదకును పువ్వులెన్ని కలిగినా తక్కిన చుట్టుపు పొందు తామరే కాదా చ.2. తలఁపు నీకేడనున్న తనువు నాపై వేతువు చెలరేఁగి నిన్ను రట్టుసేయనేఁటికి సొల

నాడీజంఘుడు

సారస్వతం
-శారదాప్రసాద్ ధర్మరాజు " పితామహా ! రాజుకు కావలసిన వాళ్ళు, అక్కరలేని వాళ్ళు ఎవరు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఓర్పుగలవారు, ధర్మపరులు, సత్యంపలికే వారు, చంచల బుద్ధిలేని వారు, మదము, కోపం, లోభం లేనివారు, చతురతగా మాట్లాడి కార్యమును సాధించే వారు, తమ రాజుకు సకలసంపదలు చేకూర్చుతుంటారు. వీళ్ళంతా రాజుకు కావలసిన వాళ్ళు. క్రూరుడు, లోభి, ఆశపోతు, చాడీలు చెప్పేగుణం కలవాడు, మందబుద్ధులు, చేసినమేలు మరిచేవారు, అబద్ధాలు చెప్పేవారు, ఒకరితో నిందింపబడిన వారు, పిరికివారు, ధైర్యం లేనివారు, అవినీతిపరులు, దురలవాట్లకు బానిస అయినవారు రాజుకు నష్టం కలిగిస్తారు. వీరు అందరిలో చేసినమేలు మరిచేవారు పరమనీచులు. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను,జాగ్రత్తగా వినుము! ఒక బ్రాహ్మణుడు తన కులధర్మాన్ని వదిలి ఒక బోయవనితను వివాహం చేసుకున్నాడు. బోయవాళ్ళతో చేరి వేటసాగించి మాంసంతినడం లాంటి భోగములు అనుభవించ సాగాడు. మరింత

కుమార సంభవం

సారస్వతం
-శారదాప్రసాద్ కుమారస్వామి జననం గురించి పురాణాలలో పలు కధలు ఉన్నాయి.మహాకవి కాళిదాసు వ్రాసిన కుమార సంభవంలో కుమారస్వామి జననం వరకే ఉన్నది.మిగిలిన వృత్తాంతం శివపురాణం,స్కాంద మరియు ఇతర పురాణాల్లో ఉంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు అహంకారపూరితుడై సకల సజ్జనులను హింసిస్తూ ఉంటాడు.అతని బాధలను భరించలేని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు -- శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్లైతే,వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు అని! దేవతలు వెంటనే శివుడి మీదకు మన్మధుడిని ప్రయోగిస్తారు. శివుడు మన్మథుడిని దహించి వేస్తాడు .తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు జారి భూమిపై

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే ఈ కీర్తనలో అన్నమయ్య తన్ను తాను చెలికత్తెగా భావించుకొని తోడి చెలికత్తెలతో అంటున్నాడు. ఏమి చెప్పమందువే చెలీ! నాయికా నాయికలు ఇద్దరూ ఇద్దరే ఒకరి మరొకరు తీసిపోరు ఏవిషయంలోను. అహోబల నారసింహుడైనా, ఆ యమ్మ శ్రీమహాలక్ష్మి అయినా అంటూ అన్నమయ్య శృంగార వ్యవహారాలను ఏకరువు పెడుతున్నాడు. ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం. కీర్తన: పల్లవి: ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే బద్దుగా దాపెను మెచ్చెఁ బ్రహ్లాదవరదుఁడు ॥ ఇద్ద ॥ చ.1. చక్కని మొకముచూసి సారెసారె మాటలాడి చిక్కించెనాపె తొలుత చేరియాతని మిక్కిలి మేలుదియై మేను చెమరించఁగాను పక్కన నాపెను నవ్వేఁ బ్రహ్లాదవరదుఁడు ॥ఇద్ద॥ చ.2. పీఁటమీఁదఁ గూచుండి ప్రియములు చెప్పి చెప్పి దూఁటి చన్నులనొ త్తెను తొలుతాతని పాటించి యాతని మోవిపండు చూచి నోరూరఁగా బాటగానాపెను నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు ॥ఇద్ద॥ చ.3. కాఁగిలించుక యిందిర కన్న

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇంకా నీమనసెట్టో యెఱఁగఁ జుమ్మీ ఈ కీర్తనలో అన్నమయ్య తన్ను తాను నాయికగా భావించుకొని స్వామీ! నీ మనసునాకు తెలియరావడంలేదు. తమరిపై నాకు ఎంత కోరిక ఉన్నా వెనుకంజ వేస్తున్నాను. మీరంటే నాకు ప్రేమలేక కాదు సుమా! మీరు అన్యమనస్కంగాను, చీకాకుతోను ఉన్నారు అంటూ అన్నమయ్య స్వామితో తన శృంగార వ్యవహారాన్ని ఏకరువు పెడుతున్నాడు. ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం. కీర్తన: పల్లవి: ఇంకా నీమనసెట్టో యెఱఁగఁ జుమ్మీ కొంకితి నింతే నేఁ గొసరఁ జుమ్మీ చ.1 చుక్కలు గాయఁగా నేఁజూడఁ దలెత్తితి నింతె ఇక్కడ నేముండుతా నే నెఱఁగఁజుమ్మీ చిక్కువడ్డముత్యములు చేతులఁ బట్టితి నింతే అక్కర నివేఁటివని యడుగఁజుమ్మీ ॥ఇంకా॥ చ.2 తుమ్మిదలు బెదరఁగాఁ దోడ నే నవ్వితి నింతే తమ్మిమోవి నిన్ను నేమీఁ దడవఁజుమ్మీ వుమ్మ గాలివిసరఁగా నొంటి నేఁ బండితి నింతే అమ్మరో నీతో నే నలుగఁజుమ్మీ ॥ఇంకా ॥ చ.3 చీకాకురేకులు చూచి చే గోరగీరితి నింతే

కల్హణుడు

సారస్వతం
-శారదాప్రసాద్ రాజతరంగిణి (రాజుల నది) వాయువ్య భారత ఉపఖండం యొక్క చారిత్రిక సంచిక.మరీ ప్రత్యేకంగా కాశ్మీరు చరిత్రకు సంబంధించి ప్రామాణిక గ్రంథం. దీన్ని సంస్కృతంలో రచించారు. రాజతరంగిణిని కాశ్మీరీ బ్రాహ్మణుడు కల్హణుడు క్రీ.శ.12వ శతాబ్దంలో వ్రాశారు.ఈ రచన సాధారణంగా కాశ్మీరు సంస్కృతీ సంప్రదాయాలను నమోదు చేస్తుంది.కానీ రాజతరంగిణిలోని 120 శ్లోకాలు అనంత దేవరాజు కుమారుడైన కలాశ్ రాజు పరిపాలనాకాలంలో జరిగిన అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాల గురించి వివరించింది. రాజతరంగిణిలోని ప్రాచీన చారిత్రిక వివరాలు ప్రాచీన భారతీయ చరిత్ర రచనకు ప్రామాణికంగా వినియోగపడుతున్నాయి. రాజతరంగిణి సంస్కృతభాషలో కాశ్మీరీ బ్రాహ్మణుడైన కల్హణుడు రాసిన కావ్యం. చారిత్రిక పాఠ్యంగా కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో ఇది అత్యంత ప్రాచీనమైనది. కాశ్మీరు ప్రాంతం విస్తారంగా హిమాలయాలు, పిర్ పంజల్ శ్రేణి మధ్యలో వ్యాపించిన ప్రాంతం. కల్

శ్రీ వారాహీ దేవి

సారస్వతం
-శారదాప్రసాద్ కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ వరదా దండినీ ఖడ్గం బిభ్రతీ దక్షిణే కరే!! ఖేట పాత్రాభయాన్ వామే సూకరాస్యా లసద్భుజా!! తా|| శ్రీవారాహీ దేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై పెద్దపొట్టతో ఎనిమిది చేతులు(అష్టభుజ) కలిగి ఉంటుంది. వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ(పంది) ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి అర్ధాంగి. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య యిందుకంటె నున్నదదే యెంచఁగ మూలధనము ఈ కీర్తనలో అన్నమయ్య ప్రతిపాదంలో “మూలధనం” అనే మాటను వాడారు. మనం ఈ నాటి అర్ధంలో చూస్తే మూలధనం అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క కార్యక్రమము కొనసాగుటకు అవసరమైన పెట్టుబడి ధనము. దీనిని కంపెనీ వాటాలవలన కాని, ఋణపత్రములవలనకాని, అప్పువలనకాని, గత సంవత్సరములలో కలిగిన లాభాంశముల వలన కాని సేకరింపవచ్చును. కానీ, కొన్ని శతాబ్దుల క్రితం ధనవంతులు తమ వద్ద మిగిలి ఉన్నధనాన్ని భూమిలో ఒకచోట మూటగట్టి దాచిపెట్టుకుని అవసరమైనపుడు తీసి వినియోగించేవారు. ఇంకా బాగా ధనవంతులైతే లంకెల బిందెల్లో దాచుకునేవారు. ఈ కీర్తనలో అన్నమయ్య లౌకిక మూలధనం కాక శృంగారపరమైన మూలధనం ఏమిటో వివరిస్తున్నాడు. అన్నమయ్య అనేక కీర్తనల్లో ఈ మూలధనం అనే ప్రస్తావన ఉంది. "మేలులో సాకారము మించులోకము భాగ్యము తాలిమితో నీకు మూలధనమాయను" - "సిగ్గులే మూలధనమా చేరి పైకొనఁగరాదా అగ్గమై శ్రీ వేంకటేశుఁడలమఁగాన" అంటూ ప

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాడు అన్నమయ్య తానో చెలికత్తెగా మారి అమ్మ పద్మావతీ దేవికి శృంగారం విషయంలో సలహాలిస్తున్నాడు. ఆ వింతలు విశేషాలు మనమూ విని తరిద్దాం రండి. కీర్తన: పల్లవి: సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాడు బిగ్గె గాగిలించుకొని పెనగినగాక చ.1. పెదవిపై మాటల బ్రియములు పుట్టునా వుదుటు గుబ్బల బతి నూదిన గాక సదరపు జెనకుల చవులు పుట్టీనా సదమదముగ రతి సలిపిన గాక || సిగ్గుతోడ || చ.2. సెలవుల నవ్వితేనే చిత్తము గరగునా సొలయుచు మోవిచవి చూపిన గాక ములువాడి చూపుల మోహములు పుట్టునా లలిదమ్ములము పొత్తు గలసిన గాక || సిగ్గుతోడ || చ.3. సరసములాడితేనే సంగాతాలెనయునా సరుస దనువు లొక్కజటైన గాక యిరవై శ్రీవేంకటేశుడింతలోనె నిన్నుగూడె పరపుపైనే చాలునా వురమెక్కిన గాక || సిగ్గుతోడ || (రాగం: సాళంగనాట; రేకు సం: 827, కీర్తన; 18-162) విశ్లేషణ: సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మ