సారస్వతం

విశ్వనాథ గారి సినిమా సమీక్ష

సారస్వతం
పేరడీ రచన -- శ్రీరమణ సేకరణ--శారదాప్రసాద్   పేరడీ అనేది ఆంగ్ల సాహిత్యం నుండి మనం దిగుమతి చేసుకున్న ఒక సాహితీ ప్రక్రియ . సూక్ష్మంగా చెప్పాలంటే ఒక విధంగా అనుకరణను ​పేరడీ అనవచ్చు.​పేరడీలు వ్రాయటం కష్టతరమైన పని. చాలామంది అనుకున్నట్లుగా మూలాన్ని వ్రాసిన కవిని ఎగతాళి చేయటం కాదు ​పేరడీ అంటే!మూలాన్ని వ్రాసిన రచయితను దగ్గరగా చూసి,ఆయన రచనా శైలిని క్షుణ్ణంగా అనుక(స)రించి వ్రాయటమే ​పేరడీ. కాకపోతే మూలంలో భావగర్భితంగా,గంభీరంగా ఉన్న దానికి కొద్దిగా హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి వ్రాస్తుంటారు ​పేరడీలు వ్రాసే కవులు. శ్రీశ్రీ మొదలుకొని శ్రీ రమణ గారి దాకా ఎందరో ఈ ​పేరడీ ప్రక్రియతో పాఠకులను రంజింపచేసారు. ఈ ​పేరడీకి వన్నె తెచ్చిన వాడు శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు. వీరు శ్రీశ్రీ కి అత్యంత ఆప్తులు. శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు వ్రాసిన ఈ పేరడీనిని చూడండి! నేను సైతం కిళ్ళీకొట్

గీతా సారం

సారస్వతం
-శారదాప్రసాద్ హిందూధర్మ సాహిత్యంలో ఎంతో ఉన్నతమైనది భగవద్గీత.వేదాలు,ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సిద్ధాంతాలు!-'వీటిలో దేన్ని అనుసరించాల’ ని చాలామంది అడుగుతుంటారు.దానికి సమాధానం--'సర్వ శాస్త్రమయీ గీతా..’. అన్ని శాస్త్రాల సారమే గీత అని శ్రీకృష్ణుడే చెప్పాడు.భగవద్గీత ఒక్కటి చదివితే చాలు, చాలా ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి! శాశ్వతమైన దానిని ,అశాశ్వతమైన దానిని గురించి చెప్పింది. పాప పుణ్యాలను విశదీకరించింది . ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పింది. పరుల సుఖం కోసం జీవించమని చెప్పింది. పండితుడికి , స్థితప్రజ్ఞుడుకి గల తేడాను చెప్పింది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందాన్ని గురించి చెప్పింది.ఎలా జీవించాలో,ఎలా జీవించకూడదో కూడా చెప్పింది.పరమాత్ముడికి ఇష్టమైన వారు ఎవరో చెప్పింది .ఆయనలో ఐక్యమయ్యే మార్గాన్నిచూపించింది .ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి,మరుజన్మ ఆధారపడి ఉ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య తాను చేసినచేత తరుణిమేనను నిండె కీర్తన: పల్లవి: తాను చేసినచేత తరుణిమేనను నిండె వీనులు చల్లుగ నిట్టె విన్నవించరే చ.1.జక్కవ గుబ్బలమీద చంద్రోదయములాయె చుక్కలు మొలచెనిదె సొంపు మోవిని అక్కజపుతురుమున నద్దమరేతిరి నిండె వెక్కసపు పతికిది వేళ చెప్పరే ||తాను|| చ.2.కనుచూపు తామెరల గక్కునను దెల్లవారె యెనయెని తలపోత నెండలు గాసె పనివడి విరహాన పట్టపగలై తోచె ననిచిన పతికి సన్నలు శేయరే ||తాను|| చ.3.వడిగొన్న జవ్వనాన వసంతకాలము వచ్చె పొడవైన కళలను పున్నమ గూడె యెడమిచ్చి శ్రీవేంకటేశుడింతలో గూడె బడివాయకుండు దన్ను బాస గొనరే ||తాను|| (రాగం: శంకరాభరణం; రేకు సం: 195, కీర్తన; 7-561) విశ్లేషణ: తాను చేసినచేత తరుణిమేనను నిండె వీనులు చల్లుగ నిట్టె విన్నవించరే ఆ శ్రీనివాసుడు చేసే శృంగారచేష్టలకు, తల్లి అలమేలుమంగమ్మ శరీరమంతా తమకంతో, మైమరుపుతో నిండి న

కుండలినీ యోగం

సారస్వతం
-శారదాప్రసాద్   ఆధ్యాత్మిక మార్గంలో చాల కష్టతరమైన సాధనామార్గం కుండలినీ యోగం.దీనిని అభ్యసించటానికి అనుభవం కలిగిన గురువు తప్పనిసరి. పుస్తకాలు చదివి, ఎక్కడో విని విషయ సేకరణ చేసి కుండలినీ యోగ సాధనకు ఉపక్రమించరాదు. అసలు కుండలినీ అంటే ఏమిటో తెలుసుకుందాం!ఇదొక అనంతమైన శక్తి! దీని స్థావరం మూలాధారం! లలితా సహస్ర నామాల్లో అమ్మవారికి 'కుండలినీ' అనే పేరు కూడా ఉండటం మీరు గమనించే ఉంటారు. ముందు పురీష నాళం ,వెనక మలాశయం -వీటి మధ్యనే ఉంది మూలాధారం. ఇదే మన జన్మ స్థానం! మూలాధారంకు ఆధారం మూల(Root). విశేషమేమంటే అమ్మవారి నక్షత్రం కూడా మూలా నక్షత్రమే!అందుకే శక్తి ఆరాధకులు కుండలినీ యోగాన్ని చేస్తుంటారు. మన కర్మ ఫలాలు అన్నీ కుండలినిలోనే నిక్షిప్తం అయి ఉంటాయి. జీవితమంతా అంతా కుండలిని ఆజ్ఞ ప్రకారమే సాగుతుంటుంది.రాజయోగ సాధకులు కూడా దీన్ని అభ్యసిస్తారు. నూతన యోగ మార్గ ప్రవక్త మాస్టర్ CVV యోగ మార్గాన్ని అనుసరించే

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య “మదనుని తండ్రికి మజ్జనవేళ” శ్రీవేంకటేశ్వరునికి స్నానానంతరం జరిగే విశేష భోగాలను అన్నమయ్య వివరిస్తున్నాడు ఈ కీర్తనలో. మదనుడికే తండ్రి అయిన శ్రీనివాసుడు ఎంత అందగాడయి ఉంటాడు. ఆయనకు కర్పూరకాపు, పుణుగుకాపు, పన్నీరు కుంకుమకాపు వంటివెన్నో సేవలు చేస్తారు. ఆ వైభోగం విని మనమూ తరిద్దాం రండి అంటున్నాడు అన్నమయ్య. కీర్తన: పల్లవి: మదనుని తండ్రికి మజ్జనవేళ పొదిగొనీ సింగారపు భోగములెల్లాను ॥ మదనుని ॥ చ.1 పడఁతుల నవ్వులెల్లా పైనంటుకొన్నట్టు కడలేక పొగడొందెఁ గప్పురకాపు నిడివిఁ గల్ప వృక్షము నిండాఁ బూచినట్టు కడుఁ దెల్లనై యమరెఁ గప్పురకాపు ॥ మదనుని ॥ చ.2. సుదతుల చూపులు సొరిది పైఁగప్పినట్టు పొదిగొని జొబ్బిలీని పుణుఁగుకాపు అదన నల్లగలువలట్టె ముంచుకొన్నట్టు పొదలెఁ దిరుమేనను పుణుఁగుకాపు ॥ మదనుని ॥ చ.3. అలమేలుమంగ వురమందుండి యనురాగము కులికినట్టు పన్నీరుఁ గుంకుమకాపు యెలమి శ్రీ వెంకటేశుఁ

సారస్వతం

సారస్వతం
డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి (డా. జుర్రు చెన్నయ్య సౌజన్యంతో) తెలుగు గడ్డ మీద పుట్టిన, తెలుగు వారందరూ గర్వంగా చెప్పుకొనే సాహితీమూర్తి 'సినారే' సాహిత్య సాగరం మీ గుప్పెట్లో ఉండాలనుకొంటున్నారా? అయితే, ఈ క్రింది వెబ్ సైట్ దర్శించండి. "కర్పూర వసంతరాయులు", "ఋతు చక్రం", "ప్రపంచపదులు", "విశ్వంభర", "గజల్స్" మొదలీనవి, ఇంకా ఇతర రచనలు ప్రింట్, ఆడియో, వీడియో రూపాల్లో చదవండి, వినండి, చూడండి! www.drcnarayanareddy.com

నిర్వాణ షట్కం

సారస్వతం
-శారదాప్రసాద్ ఆది శంకరాచార్య (వేదాంతపరంగా చాలా గొప్ప భావన ఇది! అందరూ జాతి,కుల,మత బేధాలు లేకుండా తప్పకుండా కంఠతా చెయ్యగలరు,అర్ధంతో సహా!ఎందుకంటే,ఆత్మతత్త్వం అందరికీ ఒకే విధంగా ఉంటుంది కనుక!నిర్వాణం అంటే సూక్ష్మంగా చెప్పాలంటే మోక్షం! ఆరు శ్లోకాలలో ఆత్మ స్వరూపాన్ని గురించి అద్భుతంగా బోధచేసారు ఆదిశంకరులు. ఈ శ్లోకాలు ఆత్మతత్వాన్ని గురించి చక్కగా తెలియచేశాయి కనుక, ఈ ఆరు శ్లోకాలని ఆత్మషట్కం అని కూడా కొందరు అంటారు.షట్కం అంటే ఆరు! ప్రపంచ సాహిత్యం మొత్తం మీద ఇలా వేదాంత సారాన్ని ఇంత సరళంగా,క్లుప్తంగా చెప్పిన జ్ఞాని మరెవ్వరూ ఉండకపోవచ్చు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ! వేదాంత సారమంతా ఈ ఆరు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన ఆది శంకరులకు ప్రణమిల్లుతున్నాను!) 1.మనోబుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్త్రే న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు: చిదానంద రూప: శివోహం శివోహం అర్ధం-మనస్సు,బుద్ధి,

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
“వలపు నిలుపలేనివారము” -టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య తానే నాయిక పాత్ర ధరించి "వలపు నిలుపలేనివారము" అంటూ స్వామి వారి ని పరిపరివిధముల బ్రతిమాలుతున్నాడు. ప్రశ్నలు వేస్తున్నాడు. ఓ శ్రీనివాసా! ఎన్నో మార్లు పట్టుకుని లాగుతుంటే ఏమి చెయ్యగలవారము “ అంటున్నాడు అన్నమయ్య. “అలాగే నీవు ఆగ్రహించినట్లైతే మేము ఉండగలమా ?” అంటూ స్వామిని బహువిధాల ప్రసన్నుడిని చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నాయిక పాత్రధారిగా అన్నమయ్య రీతిని ఈ శృంగార కీర్తనలో గమనించండి. ఈ కీర్తన భక్తి భావాలతో ఉన్నప్పటికీ అన్నమయ్య భగవంతుని "రా" అని సంబోధిస్తూ...నాయిక శృంగారసమయంలో యిలాంటివి సాధారణం అనికూడా తెలియజేస్తున్నాడు అన్నమయ్య. వినండి. కీర్తన: పల్లవి: వలపు నిలుపలేనివారము నేమటుగాన పలుమారుఁ బట్టుకొన్నఁ బయికొనవేలరా ॥ వలపు ॥ చ.1. ఒత్తి నీవాడినమాటకోరువఁ జాలక నే- ముత్తరమిత్తము గాని ఊరకుండలేమురా బత్తి గొట్టానఁ బెట్టఁగఁ బనిలేదు వోరి నీ- చిత

కోరికలు లేకుండా…

సారస్వతం
కోరికలు లేకుండా జీవించేవారే మోక్షానికి అర్హులు! -శారదాప్రసాద్ ​​పూర్వం రంతీదేవుడనే రాజు ఉండేవాడు. అతడు రాజు అయినప్పటికీ మహర్షివలె, మహాయోగి వలె ప్రాపంచిక సుఖాలకు లోనుకాక నిరంతరం హరి నామస్మరణతో కాలం గడిపేవాడు . లభించిన దానితోనే తృప్తిగా జీవించిన మహానుభావుడు ఆయన . ఆ రాజు గొప్ప దాన గుణం కలవాడు. దానాలు చేసీ చేసీ చివరికి కడు పేదవాడయ్యాడు. ఆయనతో పాటు కుటుంబం అంతా కష్టాల పాలయింది . 48 రోజులు అన్నము, నీళ్ళు లేకుండా గడపవలసి వచ్చినా గుండెనిబ్బరం చెడలేదు. ఒక రోజు ప్రాతః కాలమున అతనికి నెయ్యి పాయసము, నీళ్ళు లభించాయి. భోజన కాలం కాగానే రంతీదేవుడు సకుటుంబముగా భోజనం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. అందరూ ఆకలి బాధను, దప్పికను తీర్చుకుందాం అని అనుకుంటున్న సమయములో, ఓ పేద బ్రాహ్మణుడు అతిధిగా వచ్చాడు. రంతీదేవుడు అతనిని ఎంతో ప్రేమగా గౌరవించి హరి సమర్పణముగా ఆహారములో అర్ధ భాగాన్నిఅతడికిచ్చాడు. ఆ బ్రాహ్మణుడు తృప్తిగా భ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
“ఏల చెప్పేవు నీ సుద్దులు” టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య తానే చెలికత్తె పాత్ర ధరించి " ఏల చెప్పేవు నీ సుద్దులు " అంటూ స్వామి వారికి అనేక ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఓ శ్రీనివాసా! నీ దివ్యగాధలు ఎన్నని చెప్పను? ఎలా వర్ణించను అంటున్నాడు అన్నమయ్య. “బ్రహ్మచారివైతివి” అంటున్నాడు. శ్రీమహావిష్ణువు బ్రహ్మచారి అవడం ఏమిటి? దానికొక గాధ ఉంది. పరీక్షిత్తు మృతశిశువుగా జన్మించాడు. ఎవరైనా అస్ఖలిత బ్రహ్మచారి ఆ శిశువును ఎత్తుకున్నట్లైతే తిరిగి జీవిస్తాడని వ్యాసమునీంద్రుల వారు చెప్తారు. చివరికి భీష్ములవారితో సహా తమకా అర్హత లేదని తప్పుకుంటారు. శ్రీకృష్ణుడు అలా ఎత్తుకోగానే బిడ్డ కేరుమని ఏడ్చి ప్రాణం పోసుకుంటుంది. పదహారు వేల గోపికలు, అష్ట భార్యలతో అలరారిన శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారా? విచిత్రము కాకపోతే చెప్పండి? ఆ విషయమేమిటో ఈ శృంగార కీర్తనలో చూద్దాం. ఈ కీర్తన భక్తి భావాలతో సాగినప్పటికీ అన్యాపదేశంగా నీవు బ్రహ్