సారస్వతం

భయం వద్దు! జయమే నీ హద్దు!

సారస్వతం
-అమరనాథ్ జగర్లపూడి దుక్కి దున్నందే మొక్క మొలవదు! ప్రయత్నం చేయకుండా ఫలితం రాదు! జయానికి, అపజయానికి మూలాలివే. ప్రతి విజయం వెనక నిరంతర సాధన, ప్రతి అపజయంలో జయం సాధించటం వెనుక పట్టు వదలని దృఢ నిశ్చయం అనేది మరవద్దు! అపజయం అనేది ప్రతికూలం (నెగటివ్) కాదు తిరిగి ప్రయత్నం చేయకపోవటమే నిజమైన అపజయం. ఇది ప్రతి విద్యార్ధి , ప్రతి యువకుడు ఖచ్చితం గా మనస్సులో బలంగా ముద్ర వేసుకొని ప్రయత్నాలు ప్రారంభించాలి. నేటి విద్యార్ధి, యువత చదువుల్లో మరియు ఉద్యోగాల్లో ఉద్వేగాలకు ముగింపు చెప్పే సమయం ఆసన్నమైంది. దానికి తగ్గట్టుగా ధీటుగా చదువుల్లో నైనా,ఉద్యోగ ప్రయత్నాలలోనైనా పట్టువదలని కృషి పెరగవలసిన ఆవశ్యకం ఎంతైనా వుంది. ముఖ్యంగా విద్యార్థులైనా, యువకులైనా అవసరమైనప్పుడే అవగాహన పెంచుకుంటే చాలానే అభిప్రాయాలకు అడ్డుకట్ట వేసి నిత్య సాధన ద్వారా అనుకున్న ఫలితాలను అవలీలగా సాధించ వచ్చు .ఉదాహరణకు” ఈ రోజు పని రేపటికి వాయిదా వే

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య “చిత్తగించి చూడవయ్య - సిగ్గువడ నీకేటికి” అన్నమయ్య తానే చెలికత్తె పాత్ర ధరించి "చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేఁటికి" అంటూ స్వామి వారు అమ్మవారిని చూసి సిగ్గుపడే సన్నివేశాన్ని హృద్యంగా వర్ణిస్తున్నాడు. ఆ ముచ్చటేదో మనమూ విందాం. కీర్తన: పల్లవి: చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేఁటికి బత్తిసేసీ నాకె నీపై భావించవయ్యా ॥పల్లవి॥ చ.1. సెలవుల నవ్వుతాను చేరి మాఁటలాడుతాను పలువరుసలు చూపీఁ బడఁతి నీకు నిలుగునివ్వెరగుతో నిండుసింగారములెల్లాఁ బలుమారు నీముందరఁ బచరించీని ॥చిత్తగించి॥ చ.2. కొప్పు చక్కఁబెట్టుకొంటా కొలువులు సేసుకొంటా నెప్పునఁ జన్నుల నొ త్తీ నెలఁత నిన్ను వుప్పతిల్లుఁగళలతో నుడివోనిజవ్వనాన కుప్పళించి వలపులు గురిసీ నీయెదుట ॥చిత్తగించి॥ చ.3. సరులు దిద్దుకొనుచు చవులెల్లా మోవిఁ జూపి మరిగించీ నల మేలుమంగ నిన్నును ఇరవై శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి వురముపై

అహంకారం

సారస్వతం
-శారదాప్రసాద్ నిఘంటువు అర్థం ప్రకారం “అహం” అంటే “నేను”, “నా” అనే స్వంత సామర్థ్యానికి సంబంధించిన భావన. “నేను”, “నా”, అని సూచించేంతవరకు “అహం” అనేది ఒక పదం మాత్రమే. ఆత్మగౌరవానికి, అహంకారాకి తేడా ఏమిటంటే, “ఈ సామర్థ్యం నాకుంది” అనడం ఆత్మగౌరవం. “ఈ సామర్థ్యం నాకొక్కడికే ఉంది” అనడం అహంకారం . విద్య, ఐశ్వర్యం, అందం, అన్నిటిలో ఉన్నతులైన వారు రాణించాలంటే ముఖ్యంగా వారిలో ఉండవలసినది తగినంత అణకువ, వినయం . అహంకారానికి వయస్సు, ధన, కుల, మత ప్రాంత, భాష- ఇవేమీ సంబంధం లేదు. కొంతమంది (అతి)తెలివిగా తమ అహంకారాన్ని ఆత్మాభిమానం అని చెప్పుకుంటారు. అదే ఇతరుల గురించి చెప్పేటప్పుడు వారిది (అహంకారానికి) ‘గర్వం’ అని అంటారు. అహంకారం పెరిగితే ఈర్ష్య,అసూయ లాంటి మిగిలిన దుర్లక్షణాలు దాన్ని అనుసరిస్తాయి!పాండవుల కన్నా అన్నిటా నేనే గొప్పవాడిగా ఉండాలనే సుయోధనుడు దురాలోచనే కౌరవ వంశాన్ని నాశనం చేసింది. “మనోబుధ్ధి రహంకార చిత్తం

గుప్పిట్లో ఛందస్సు

సారస్వతం
-పెయ్యేటి రంగారావు లఘువుః పొట్టి అక్షరాలు. ఉదాః క, ల, ప, క్త, ప్ప, క్ర మొదలైనవి. ఋ త్వంతో కూడినవి. ఉదాః కృతి లో కృ. కాని కృష్ణుడు లో కృ గురువు అవుతుంది. ఎందుకంటే కృ తరువాత ద్విత్వాక్షరమైన ష్ణు వచ్చింది కనుక. తేల్చి పలికే రేఫకు ముందున్న అక్షరాలు. ఉదాః కద్రువ, అద్రి మొదలైనవి. లఘువుకు గుర్తుః I గురువుః దీర్ఘమైన (పొడుగు) అక్షరాలు. ఉదాః కా, లా, పా. మరిన్నీ, ఒత్తున్న అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలు. ఉదాః రక్తి లో ర గురువు అవుతుంది. అభ్యాసము లో అ మరియు భ్యా గురువులు. పూర్ణానుస్వారంతో కూడిన అక్షరాలు. ఉదాః రం, యం, తం మొదలైనవి. పొల్లులతో కూడిన అక్షరాలు. ఉదాః నిన్, గల్, రన్ మొదలైనవి. విసర్గలతో కూడినవి. ఉదాః అంతఃపురము లో అం, తః గురువులు. ఐత్వంతోను, ఔత్వం తోను వున్న అక్షరాలు. ఉదాః కౌపీనము, కైలాసము లలో కౌ మరియు కై గురువులు. గురువుకు గుర్తుః Uగణములుః కొన్ని అక్షరములు కలిసి గణములు అవుతాయి. గణాలకు పేర్లు ఉ

హయగ్రీవ స్వామి

సారస్వతం
-శారదాప్రసాద్ హయగ్రీవ స్వామి చదువుల యొక్క దేవుడు.హయగ్రీవ స్వామిని కూడా విష్ణు అవతారముగా భావిస్తారు.హయగ్రీవుణ్ణి జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి మరియు అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము మరియు చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి.ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది.హయగ్రీవ సతీమణి మరిచి (మరిచి బహుశా ఒక అవతారము), మరియు లేదా లక్ష్మి. శ్రావణ పూర్ణిమ హయగ్రీవ స్వామి అవతరించిన రోజు. హయగ్రీవ స్వామి వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ దేవత. ఉన్నత చదువు మరియు లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినపుడు హయగ్రీవ స్వామిని తప్పక ప

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
“చాలు జాలు నీతోడి సరసాలు” -టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య తానే నాయిక పాత్ర ధరించి "చాలుఁ జాలు నీతోడి సరసాలు" అంటూ స్వామి వారి శృంగార చేష్టలకు కోపం ప్రదర్శిస్తున్నాడు ఈ కీర్తనలో.. ఆ ముచ్చట మనమూ చూద్దాం రండి. కీర్తన: పల్లవి: చాలు జాలు నీతోడి సరసాలు యిట్టె పాలిండ్ల కొంగుజారి బయటఁ బడితిమి చ.1. సిగ్గువడితిమిర నీ చేసిన చేతలకు నగ్గమైతిమిర మరునమ్ములకును దగ్గరి నీకాకల దగులఁబట్టి నేఁడు బగ్గన నిందరిలోన బలచనైతిమి || చాలు జాలు || చ.2. నొగిలితిమిర నేము నోచిన నోములకు పొగిలితిమిర నీ పొందులకును తెగి నీవు నన్ను రతి దేలించి తేలించి నాకు పగటు బిగువులెల్ల బచ్చిగా జేసితివి || చాలు జాలు || చ.3. దప్పి బడితిమిర నీతాలిములనే కడు నొప్పి బడితిమీర నీ నొక్కు జేతల ఇప్పుడిట్టె తిరువేంకటేశుడ నీవు నా కొప్పు సవరము దీసి కొల్లగొంటి మానము || చాలు జాలు || (రాగం: రామక్రియ; రేకు సం: 92, కీర్తన; 5-364) విశ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య “కన్నుల మొక్కేము అంటున్న నాయిక” కడపను ఒకప్పుడు దేవుని గడప అని పిలిచేవారు. ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప  “గడప”  అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కాలాంతరంలో కడపగా మారిందంటారు. క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు. కరిపె అనే మాటే చివరికి కడపగా మారి ఉండవచ్చు.అక్కడ కొలువై ఉన్న శ్రీనివాసుని పేరు కడపరాయుడు. ఈ కీర్తనలో "కన్నుల మొక్కేము నీకు కడపరాయా!" అని నాయిక కృతజ్ఞతా భావంతో అలమేలుమంగమ్మ స్వామిని వేడుకొంటోంది. చిత్తగించండి. కీర్తన: పల్లవి: కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ గన్నెనాఁడె యేలితివి కడపరాయ చ.1. కందర్పగు

శ్రీ దక్షిణామూర్తి

సారస్వతం
వైష్ణవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ హయగ్రీవుడిని ఆరాధిస్తారు. శైవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ దక్షిణా మూర్తిని ఉపాసిస్తారు.శివకేశవులు వేరు కారని భావించే మాలాంటి వారు ఇద్దరినీ ఆరాధిస్తారు. ప్రస్తుతం శ్రీ దక్షిణామూర్తి తత్వాన్ని గురించి క్లుప్తంగా తెలియచేస్తాను. వీలైనప్పుడు హయగ్రీవుడిని గురించి కూడా తెలియచేస్తాను!శ్రీ దక్షిణామూర్తి అనబడేది అతి ప్రాచీనమైన ఈశ్వర తత్త్వం.సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలనుంచి వ్యక్తమైన రూపాలే సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు.వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు. అందుకు వారు అంగీకరించక తమకు జ్ఞానం కావాలని అక్కడినుంచి వెళ్లిపోయారు. జ్ఞానం కావాలని కోరుకోవటం కూడా ఒక రకమైన అజ్ఞానమే. మనకు నియంత్రించిన విధి, కర్తవ్యాలను నిర్వర్తించక మోక్షం కోసం అడవులకు పోయే వారందరూ నిజానికి అహంభావులు,అజ్ఞానులు! శివుడు ఇది గమనించి వారి