సారస్వతం

క్రోధం

సారస్వతం
-శారదాప్రసాద్ అరిషడ్వర్గాల్లో ఒకటైన క్రోధం అంటే కోపాన్ని , ఉద్రేకాన్ని, ఆవేశాన్నికల్గి ఉండటం .ఆగ్రహావేశం వచ్చినటువంటి వాడు గురువుని చంపేయడానికి కూడా వెనుకాడడు. క్షణికావేశంలో చేయకూడని పనులు చేసి జీవితాంతం కారాగారంలో ఉండిపోయిన మేధావులున్నారు. ఈ మధ్యనే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిలస్ (యూసీఎల్‌ఏ)లో భారతీయ విద్యార్థి మైనాక్ సర్కార్ (38) కాల్పులకు పాల్పడి ఓ ప్రొఫెసర్‌ను హత్యచేశాడు.ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఏకంగా దాదాపు 3222 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణించి వచ్చాడు. అంటే అతని క్రోధం పగగా మారిందన్నమాట!ఐఐటీ ఖరగ్‌పూర్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) విద్యార్థి అయిన మైనాక్ సర్కార్.. యూసీఎల్‌ఏ ప్రొఫెసర్ విలియమ్ వద్ద డాక్టరేట్ విద్యార్థిగా ఉండేవారు. 2013లో అతని డాక్టరేట్ పూర్తయింది.చూసారా ఒక మేధావి తన విచక్షణను ఎలా కోల్పోయాడో! మనుషుల్లో కోపానికి

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
శృంగార వియోగ నాయిక -టేకుమళ్ళ వెంకటప్పయ్య అలమేలు మంగమ్మ శృంగార తాపాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు అన్నమయ్య. స్వామి రాలేదని మదన తాపంతో ఉన్నది. చల్లదనం కలిగించే వస్తువులు కూడా మంట మండిస్తున్నాయి. అన్ని కీర్తనల్లో వాడే "శ్రీవేంకటేశ్వర" అనే మకుటం కాకుండా ఈ కీర్తనలో "శేషాద్రి వల్లభుడు" అని క్రొత్తరకంగా సంబోధించడం వింతగానే ఉంది. చిత్తగించండి. కీర్తన: పల్లవి: చలిగాలి వేడేల చల్లీనె కప్పురపు మలయజము తానేల మండినే చ.1.పాపంపు మనసేల పారీనే నలుగడల చూపేల నలువంజజూచీనే తాపంపు మేనేల తడవీనె పూవింటి తూపేల చిత్తంబు దూరీనే || చలిగాలి|| చ.2.వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు కోయిలలు దామేల గొణగీనే రాయడికి నలులేల రాసీనే మాతోను కాయజుడు తానేల కసరీనే|| చలిగాలి|| చ.3.ఏకాంతమున నేల యెదురైతినే తనకు లోకాధిపతికేల లోనైతినే చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుడు పైకొనిదె మమ్మేల పాలించెనే || చలిగాలి|| (రాగం: శ్

యద్దనపూడి జ్ఞాపకాలు

సారస్వతం
నవలారచనలో మకుటం లేని మహారాణి... యద్దనపూడి సులోచనారాణి జ్ఞాపకాలివి (ఈనాడు ఆదివారం అనుబంధంలో.. 2004 మే నెలలో ప్రచురితమైన, కథనం) (మిత్రుడు రవిప్రసాద్ ఆదిరాజు సౌజన్యంతో) పదో తరగతితోనే చదువు ఆగిపోయినా... చుట్టూ ఉన్న సమాజాన్నే ఆమె నిరంతరం అధ్యయనం చేశారు. ఆ నిశిత పరిశీలనలో ప్రాణం పోసుకున్న పాత్రలే ఆమె నవలల్లోకి నడిచి వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నవలారచనలో మకుటం లేని మహారాణిలా వెలుగొందిన ఆమె.. ఆంధ్రుల అభిమాన రచయిత్రి... యద్దనపూడి సులోచనారాణి. రచయిత్రిగా ఆదర్శాలు వల్లించడమే కాకుండా స్వయంగా సామాజిక సేవకూ నడుం బిగించిన సులోచనారాణి సాఫల్యాలతోపాటు వైఫల్యాలనూ చవి చూశారు. తన జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలకు ఆమె ఇచ్చిన అక్షరరూపమిదీ... చిన్నప్పటి నుంచి నాకు మే నెల అంటే చాలా ఇష్టం. సహజంగా ఆ నెల్లో మండే ఎండలకి అందరూ హుష్షూ-హుష్షూ అంటూ హైరానా పడిపోతూ ఎండలను తిట్టకుంటారు. నేను మాత్రం సంవత్సరం మొత్త

శృంగార వియోగ నాయిక

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య శృంగార తాపంతో బాధపడుతున్న నాయిక అలమేలు మంగను వర్ణిస్తున్నాడు. పరి పరివిధాల సపర్యలు చేసినా అవన్నీ ఏమీ ఎక్కడం లేదు. మన్మధ తాపంతో తన్మయావస్థలో ఉన్నది అమ్మ. ఈ కీర్తనలో అన్నమయ్య చెలికత్తెలతో ఏమి చెప్పిస్తున్నాడో చూద్దాం. కీర్తన: పల్లవి: ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును చ.1.చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా యెందును నిద్రలేదేమి సేతమే గందపుటోవరిలోనఁ గప్పరంపుటింటిలోన యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును || ఉయ్యాల|| చ.2.పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక మంచముపైఁ బవ్వళించి మాటలాడదు నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు|| ఉయ్యాల|| చ.3.వెన్నెలల వేంకటద్రివిభుని లేనవ్వులాన నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి మన్ననల యింత లోన మలసేని జెలియ|| ఉయ్యాల|| (రాగం: కాంబో

దృగ్దృశ్య వివేకం

సారస్వతం
​-శారదాప్రసాద్ ఈ ప్రపంచంలో ఉన్న సకల మానవాళిని మూడు విధాలుగా వర్గీకరించవచ్చు! మొదటి వర్గం -పరమాత్మను గురించి తెలియని వారు . వీరే అజ్ఞానులు.రెండవ వర్గం -పరమాత్మను గురించి తెలుసుకోవటానికి తపనపడేవారు. వీరిని జిజ్ఞాసువులు అంటారు.ఇక మూడవ వర్గం --పరమాత్మను గురించి తెలిసినవారు.వీరిని జ్ఞానులు అనొచ్చు! వీరందరూ కూడా ప్రపంచాన్ని వారి వారి దృష్టిలో చూస్తారు.దృగ్దృశ్య వివేకం అనే ఈ గ్రంధం మూడవ వర్గం వారి కోసం వ్రాయబడింది .నిత్యానిత్య వస్తు వివేకం వలన మాత్రమే వైరాగ్య భావం ఏర్పడుతుంది.ఇటువంటి విశ్లేషణం వలన మనసులో ద్వద్వములు లేకుండా పోతాయి.అలా వైరాగ్యం ఏర్పడుతుంది.దృగ్ -దృశ్యం అంటే ఏమిటని కదూ మీ సందేహం?సాధారణ భాషలో చెప్పాలంటే-- చూచేది చూడబడేది -వీటిని గురించి తెలుసుకోవటం. నాలుగు వివేకములను పూర్తి చేసిన సాధకుడు, దృక్ దృశ్య వివేక పరిధిలోకి వస్తాడు. 1) నిత్యానిత్యవస్తువివేకము. 2) ఆత్మానాత్మవివేకము 3)

ఉపమన్యు ,ధౌమ్య మహర్షులు

సారస్వతం
-శారదాప్రసాద్  (​పాము పాదము పతంజలి మరియు పులి పాదముల వ్యాఘ్రపాద మహర్షి కలసి నటరాజస్వామి రూపములో ఉన్న శివునికి నమస్కరిస్తున్న దృశ్యం) వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాద మహర్షి లేదా వ్యాఘ్రపాదుడు అనగా వ్యాఘ్రము వలె చరించువాడు అని అర్ధము. పాదములు వ్యాఘ్రము యొక్క పాదములు వలె ఉండును కాన వ్యాఘ్రపాదుడు అని, వ్యాఘ్రము వలె చరించువాడు అని అర్ధము చెబుతారు .కృతయుగము నందు ధర్మ ప్రవచన దక్షుడు, వేద వేదంగ విదుడు, జంతువుల యెడల భయంకరముగా చరించు వాడు, అయిన ఒక మహా ముని పేరు వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాదుడు.పురాణాలలో వ్యాఘ్రపాదుడు అనే ఒక ఋషి ఉన్నట్లు చెప్పబడింది. వ్యాఘ్రపాదునకు ,భారతదేశం యొక్క తమిళనాడు నందలి చిదంబరంలో ఆలయ ప్రాంగణంలో నటరాజుగా ఉన్న శివుడు యొక్క నిత్య పూజ అందించటం కోసం, తేనెటీగచే తాకబడని తాజా పుష్పాలు సేకరించే యొక్క పని అప్పగించబడుతుంది. అయితే, పువ్వులు కోసి సేకరించే సమయములో వ్యాఘ్రపాదుడు ముళ్ళు మరియు

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
దేవీదేవరల శృంగార సంవాదము -టేకుమళ్ళ వెంకటప్పయ్య సంవాదము అంటే ప్రశ్నోత్తర రూపమగు సంభాషణము అని అర్ధం ఉన్నది. శృంగారంలో నాయిక అలక వహించి యున్న సమయంలో నాయకుడు శృంగారంగా ఏదో అడగడం దానికి నాయిక పైకి కోపం నటిస్తూనే లోపల ప్రేమ దాచుకుని చిరుకోపం నటిస్తూ సమాధానాలనిస్తూ ఉంటుంది. నాయికా నాయకుల సంభాషణలు మనకు పోట్లాటలాగా అనిపించినా అవి అన్నీ శృంగార సంభాషణలలోని భాగమే! నాయికను వశపరచుకోడానికి నాయకుడు అలాగే నాయకునికై నాయిక సత్యభామలా కోపం నటించడం ఇవన్నీ ఉత్తుత్తవే! అమ్మ అలమేలుమంగమ్మను శ్రీనివాసుడు ఏవిధంగా తన సంవాదంతో స్వాధీన పరచుకుంటాడో అన్నమయ్య ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనలో అన్నమయ్య నాయకుని చేత నాయికతో శ్రీనివాసునితో ఏమి చెప్తున్నాడో చూద్దాం. కీర్తన: పల్లవి: మగువ నేరుతువే మాఁటలు । నీవు తగిలి తెలుసుకో తారుకాణలు చ.1. చెనకేనే వో చెలియా - నీ చెనకులే కావా చెక్కులవి పెనఁగకు చనుఁగవ పిసికేనే

ఈసునసూయలు

సారస్వతం
-శారదాప్రసాద్ ​ తెలుగు సినిమాల్లో నాకు నచ్చిన పాటల రచయితలలో శ్రీ పింగళి గారు ముఖ్యులు! ఆయన మాటలతో చక్కని ప్రయోగాలు చేస్తుంటారు. 'ఏమి హాయిలే హలా' హలా అంటే హలో అనుకోవచ్చు!వై గురూ?(ఎందుకు గురూ). ఇలా చాలానే ఉన్నాయి ఆయన ప్రయోగాలు. ఈ మధ్య ఒక యువకుడితో కలసి టీవిలో విజయావారి 'మిస్సమ్మ' చూడటం తటస్థించింది. అందులోని పాటలన్నీ ఆణిముత్యాలే! అన్నీ పింగళి విరచితాలే!' బృందావన మందరిది, గోవిందుడు అందరి వాడేలే!' అనే పాటలో 'ఎందుకే రాధ ఈసునసూయలు?' అనే చరణం వస్తుంది. ఆ పాట టీవిలో అయిపోగానే నాతో సినిమా చూస్తున్న యువకుడు అసహనంగా --'మీరేమో పాత సినిమాలు చూడమంటారు. వాటిల్లోని పాటలకు అర్ధం పర్ధం ఉండదు.కాకపోతే, 'ఈసునసూయలు' ఏమిటండీ?'అని తన అయిష్టతను వ్యక్తం చేసాడు.నిజానికి అతనికే కాదు, మనలో చాలామందికి కూడా 'ఈ సునసూయలు' అంటే అర్ధం తెలియదు.అసలు దాన్ని గురించి మనసు పెట్టి ఆలోచిస్తే కదా అర్ధం తెలిసేది! వెంటనే ఆ యువకుడిని

సప్త స్వర అవధానము

సారస్వతం
-స్వర వీణాపాణి (ఇచ్చిన సాహిత్యానికి కోరిన వివాదిరాగంలోవెంటనే స్వర కల్పన) 1. సప్త స్వర అవధానము .. 7 గురి తో /14 మంది తో పైన పేర్కొనబడిన ప్రక్రియకు క్రింద వివరించిన నియమ నిబంధనలు. ప్రతి ఒక్కరు కేవలం 4 పంక్తుల గేయ/వచన/బాల సాహిత్యాన్ని ఏ భావానికి సంబంధించినదయినా స్వయముగా రచించుకొని ఈ ప్రక్రియకు హాజరు కావలెను . లేదా వేరెవరి సాహిత్యాన్నయినా తెచ్చుకొని, సాహిత్యాన్ని చదవ బోయేముందు వారి పేరును చెప్పవలెను. తీసుకు రాకూడని అంశములు : పద్యం సినిమా పాటలు ఇంతకు ముందు ధ్వని ముద్రణ/రికార్డు కాబడిన/స్వర పరచ బడిన ఏ అంశమైనా సంగీతబోధనాంశములు, కృతులు, కీర్తనలు మొదలగునవి అసభ్యకరమైన, అశ్లీలకరమైన, అమర్యాదకరమైన అంశములు వివరణ: ఇది 72 మేళకర్త రాగములలో చాలా తక్కువగా వాడబడుతున్న 40 వివాది రాగాలనూ ప్రపంచానికి తెలియ పరచడానికి, విద్యార్ధులకు అవగాహనకల్పించడానికి, సామాన్య ప్రేక్షకులకుకూడా విషయ అవగాహన కల్పించి, మన