శీర్షికలు

నీకు నీవే పోటీ!

శీర్షికలు
అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 సామాజిక వాతావరణంలో పోటీతత్వం రోజు రోజుకు పెరిగిపోతొంది. చదువుల్లో, పోటీ పరీక్షల్లో, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో, ఉద్యోగ పదోన్నతుల్లో ఈ పోటీ సర్వసాధారణంగా మారిపోయి అనేకానేక మానసిక ఉద్వేగాలకు తెరలులేపుతోంది! ఆరోగ్యకరమైన పోటీ తత్వం అవసరమైన విషయమే కానీ అనవసర పోటీతత్వంతో మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసికోవటంలోనే అసలు సమస్యలనేవి ప్రారంభం అవుతాయి. మనలో చాలామందికి వుండే అలవాటు మనల్ని ఇతరులతో పోల్చుకుని మనల్ని తక్కువ చేసుకోవటం. పరీక్షల్లో అనుకున్న రాంక్ సాధించగలనా? ఉద్యోగ ప్రయత్నంలో అనుకూల ఫలితం లభిస్తుందా? ఇలా అనేక విషయాలకి సంబంధించి మనమే కాదు మనతో పాటు అదే స్థాయిలో ఈ పోటీ పరీక్షలకి, ఉద్యోగ ఇంటర్వూస్ కు వచ్చే వారిలో కూడా ఇటువంటి ఆందోళనే ఉంటుంది. కారణం మన కంటే ఇతరులలో ఎక్కువ జ్ఞానం ఉందనో, మన కంటే ఎక్కువ చదువుందనో, మనకంటే బాగా మ

వీక్షణం సాహితీ గవాక్షం-69 సమీక్ష

శీర్షికలు
- విద్యార్థి వీక్షణం 69వ సమావేశము విలంబి నామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ త్రయోదశి నాడు, అనగా మే 13వ తారీఖున శ్రీయుతులు గీతా మాధవి, సత్యనారాయణ గార్ల స్వగృహమునందు జరిగినది. ఈ రోజు అమెరికా దేశస్తుల మాతృ దినోత్సవం అవటం కూడా ఒక ప్రత్యేకత. ఈ సభకు శ్రీ తాటిపాముల మృత్యుంజయడు గారు అధ్యక్షత వహించారు. అధ్యక్షుల వారు ఈ నాటి ముఖ్య అతిధి శ్రీ చెన్నకేశవ రెడ్డి గారిని సభకు పరిచయం చేస్తూ, "వారు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో తెలుగు ఎన్సైక్లోపేడియా విభాగాధిపధిపత్యం తో బాటు పలు బాధ్యతలు నిర్వహించారు". శ్రీ చెన్నకేశవ రెడ్డిగారిని తెలుగులో గేయ రచన గురించి చేసిన పరిశోధనని ప్రశంసించారు. శ్రీ చెన్నకేశవ రెడ్డిగారి ప్రసంగ విశేషములు ' గేయం గతి ప్రధానమైనది. గతులు నాలుగు. అవి త్రిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులు. కావ్యమంటే కథ, పాత్రలు, రసపోషణ, ధ్వని, వస్త్వైక్యం, అలంకారాలు, వర్ణనలు మొదలగు కావ్యా

ఒత్తిడిని జయిద్దాం విజయం సాధిద్దాం

శీర్షికలు
ఒత్తిడి దీన్నే మనం Stress అని కూడా అంటుంటాం. వేగంగా మారుతున్న నేటి సామాజిక ప్రభావం వలన ఈ ఒత్తిడి లేని వారు రాని వారు లేరంటే అతిశయోక్తి లేదు. అ ఆ లు చదివే (క్షమించాలి ABCD) పిల్లలనుండి ఆఫీసుకు పరుగులెత్తె పెద్దలు మరియు జీవన సమరంలో అలసి సొలసిన వృద్ధుల వరకు ఈ ఒత్తిడి నుండి మినహాయింపు లేకపోగా, నేటి సమాజంలో ఇది ఒక మానసిక రుగ్మతగా మారి మనిషి మానసిక శారీరక ఆరోగ్యాలపై సవాలు చేస్తోంది! మానవ జీవనశైలిలోనే అనేకానేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి! దాని ఫలితమే దినదినాభి వృధ్ధిగా పెరుగుతున్నాయి ఈ ఒత్తిళ్లు.వృత్తిగా చేసే పనులకు వ్యక్తిగా చేసే పనులు మధ్య సామరస్యం లేకపోవటం ఒకటైతే, వ్యక్తిగా పెంచుకున్న, పెరుగుతున్న అవసరాలు కూడా ఈ ఒత్తిడికి దోహద పడుతున్నాయి. ప్రతిదినం చేయవలసిన పనుల పరుగులో అందుకోవాల్సిన బస్సు మొదలు ట్రాఫిక్ జాములతో చేరవలసిన చోటుకు చేరేవరకు సాగే ఈ ఉద్వేగంలో మనసు ఒత్తిడికి గురి అవుతూ మనిషి శారీ

వీక్షణం సాహితీ గవాక్షం- 68

శీర్షికలు
వీక్షణం 68 వ సమావేశం కాలిఫోర్నియాలోని ప్లెసంటన్ లో శ్రీ వేమూరి వెంకటేశ్వర్రావు గారింట్లో జరిగింది. శ్రీ సి.బి.రావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా కాళీ పట్నం రామారావు గారి "యజ్ఞం" కథ మీద సుదీర్ఘమైన చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో సభలోని వారంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఈ కథ గురించి సి. ఎస్. రావు గారు రాసిన ఈ- మాట లోని పరిశీలనా వ్యాసం లోని కొన్ని భాగాలను యథాతథంగా తెలియజేస్తూ  ఈ చర్చలో కథ ను, కథా సందర్భాన్ని  సూక్ష్మంగా డా||కె.గీత వివరించారు. "కథావేదిక సుందరపాలెం అనే గ్రామం.  కథావిషయం అప్పల్రాముడి కుటుంబం గోపన్నకి బాకీగా ఉన్న అప్పుకు సంబంధించి, దేవాలయం దగ్గరి ధర్మమండపం పంచాయితీ వేదికగా జరుగుతున్న సమావేశంలో పడే తర్జన భర్జనలు. మండపానికి చుట్టూరా, వీధికి ఆ చివరి నుండి ఈ చివరి దనుకా హాజరై కూర్చున్న జనంలో మనం కలిసి పోతాము. సంక్షిప్తంగా కథ: దశాబ్దాల క్రింద తాను మధ్యవయస

ఆలోచిద్దాం @ అడుగులేద్దాం

శీర్షికలు
వేసవి సెలవుల్లో ... -అమరనాథ్ జగర్లపూడి వేసవి సెలవల్లో ……. హాయి హాయిగా! జాలీ జాలీగా వేసవి వస్తోందంటేనే విద్యార్థుల్లో ఆమ్మో అనే పరీక్షల ఉద్యేగం! వేసవి వేడి కంటే పరీక్షల వేడి విద్యార్థుల ఫై ఎక్కువ ప్రభావం చూపుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడెప్పుడు పరీక్షలు అవుతాయా వేసవి శెలవలెప్పుడు వస్తాయా! వేసవి శెలవల్లో ఏమేమి చేయాలా అనే ప్రణాళికలు విద్యార్థుల మెదళ్లలో తయారౌతాయి కూడా! సంవత్సరం పాటు సాగిన చదువుకు ముగింపుగా జరిగిన పరీక్షల తర్వాత వచ్చే శెలవులు నిజంగానే పిల్లల మనస్సులో సంతోషం నింపటమే కాదు వారికి మానసిక ఉత్సాహానికి నిజమైన ఆటవిడుపుల విడిది కూడా ఈ వేసవి శెలవులు. పరీక్షల ఒత్తిడి నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపటానికి ప్రతి విద్యార్ధికి ఒక చక్కని అవకాశం ఈ వేసవి శెలవులు! ఏదో ఎండ వేడిమికి ఇంట్లో కాలక్షేపానికి మాత్రమే కాదు ఈ శెలవులు. ఈ శెలవల్లో తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయాలెన

వీక్షణం సాహితీ గవాక్షం- 67

శీర్షికలు
-పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ వీక్షణం 67 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిలిపిటాస్ లో కథా రచయిత శ్రీ అనిల్ రాయల్ గారింట్లో జరిగింది. శ్రీ సి.బి.రావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా కథల్లోని "రెడ్ హేరింగ్స్" అనే అంశమ్మీద సోదాహరణమైన ఉపన్యాసాన్నిస్తూ తన కథ "శిక్ష" ను మరొకసారి సభకు పరిచయం చేసారు అనిల్ రాయల్. "రెడ్ హేరింగ్స్" ని తెలుగులో "ఎండు చేపలు" అని అనొచ్చని అన్నారు. "శిక్ష" కథలోని "రెడ్ హేరింగ్స్" ని కనిపెట్టే కథా క్విజ్ అందర్నీ అలరించింది. ఆ తరువాత శ్రీ చెన్న కేశవ రెడ్డి గారు సినారె కవిత్వాన్ని వినిపించేరు. ఆ సందర్భంగా శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు సినారె దుబాయి యాత్రలో తమ అనుభవాలు సభలోని వారితో పంచుకున్నారు. ఎప్పటిలాగే శ్రీ కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యాన జరిగిన సాహితీ క్విజ్ అత్యంత ఆసక్తి దాయకంగా జరిగింది. విరామం తర్వాత శ్రీ సి.బి.రావు హైదరాబాదులో తమ ఆధ్వర్యాన నెల నెలా నిర్వహిం

పుస్తక సమీక్ష

శీర్షికలు
సత్యమేవ జయతే సమీక్షకుడు - తాటిపాముల మృత్యుంజయుడు; రచయిత - సత్యం మందపాటి మంచి రచన చేయడం అంత సులభమేమి కాదు. మెప్పించే రచనలు చేస్తూ ఒక మంచి రచయితగా పేరొందడమంటే ఆషామాషి వ్యవహారం అసలే కాదు. మందపాటి సత్యంగారు మంచి రచయితల కోవలోకి వస్తారు. నేను అమెరికాలో అడుగుపెట్టి సమయం దొరికించుకొని తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకొన్న పాతికేళ్ళ నుండి వారి సాహిత్యంతో నాకు పరిచయం ఉంది. వైవిధ్యమైన రచనలు చేయడంలో వారిది అందె వేసిన చెయ్యి. పాఠకులను ఆకట్టుకొనే రచనలు చేయాలంటే రచయిత అందరి మనుసుల్లాగే జీవిస్తూ సమాజాన్ని 'ఓరకంట (Special Eye)' నిరంతరం పరికిస్తూ ఉండాలి. అలా చేస్తే, కథ వస్తువులకు సరిపడే ముడిసరుకు లభ్యమవుతూనే వుంటుంది. ఈ పుస్తకం 'సత్యమేవ జయతే' ముందు మాటలో రచయిత ఉటంకించినట్టు, నిత్యసత్యమైన అనేక విషయాలపై కాసిన్ని హాస్య రచనలు చేయడం జరిగింది. వ్యంగ్యాస్త్రాలను సంధించడం జరిగింది. అప్పుడప్పుడు ఆవేదన వెలిబుచ్చ

వీక్షణం సాహితీ గవాక్షం -64

శీర్షికలు
- డా|| లెనిన్ అన్నే వీక్షణం 64 వ సమావేశం మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో డిసెంబరు 10 వ తేదీన ఆసక్తికరంగా జరిగింది. శ్రీ చిమటా శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా మిసిమి పత్రిక సహ సంపాదకులు, ప్రముఖ చిత్రకళా చారిత్రకులు శ్రీ కాండ్రేగుల నాగేశ్వర్రావు ఆంధ్రుల చిత్ర కళ చరిత్ర గురించి సవివరంగా ప్రసంగించారు. ముఖ్యంగా పాశ్చాత్య యుగంలో రినైసాన్స్ తరువాత పునరుజ్జీవనం పొందిన చిత్రకళ ను గురించి, ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గురించి వివరించేరు. ముఖ్యంగా పికాసో భారతీయ చిత్రకళా గొప్పదనాన్ని, అప్పటి ఇల్లస్త్రేటెడ్ వీక్లీ సంపాదకులు ఏ. ఎస్. రామన్ గారికి తెలియజేసిన విధానాన్ని వివరించేరు. ఎవరికీ అంత సులభంగా ఇంటర్వ్యూ ఇవ్వని పికాసో ఏ. ఎస్. రామన్ ను దగ్గరకు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇస్తూ "ఇండియా ఈజ్ ఎ లాండ్ ఆఫ్ వేదాస్, ద బుద్ధా, అండ్ ద కలర్స్ " అని పొగిడారట. పార్లమెంటు భవనంలో అశోక చక్ర నమూనా ని తీ

పద్యం – హృద్యం

శీర్షికలు
నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: దత్తపది: వంగ, దోస, కాకర, కంద పదములను అన్యార్ధములతో వాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరానికి సంభందించిన విషయముపై స్వేచ్ఛా ఛందస్సులో పద్యము వ్రాయాలి గతమాసం ప్రశ్న: తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్ ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. శ్రీమతి జి సందిత  బెంగుళూరు ప్రీతిన్ పెళ్ళాడన్ కవి నా తాళంవారి తార నటులఁజిలిపిగా నాతండు ముద్దుపేరున తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిల

ఆకాశవాణి

శీర్షికలు
జానపదాల నుండి జ్ఞానపీఠం దాకా డా.సి. నారాయణ రెడ్డి ప్రస్థానం డా. జె. చెన్నయ్య 9440049323 విద్యార్థి దశలో అలవోకగా సీసపద్యాలనే అల్లిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు 70 సంవత్సరాల పాటు మహా ప్రవాహంలా నిరంతరం సాగిన కవితాయాత్రను ఆపి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు మహాకవి డా.సి.నారాయణ రెడ్డి. సినారె అన్న మూడు అక్షరాలు తెలుగు సాహితీ క్షేత్రంలో భిన్న పక్రియల్లో పేరెన్నిక గన్న రచనల ఆవిర్భావానికి అక్షయపాత్రలై నిలిచాయి. కోట్లాది మంది అభిమానులను ఆయనకు సంపాదించిపెట్టాయి. జానపదవాఙ్మయ ప్రభావంతో సాహితీ సృజనకు శ్రీకారం చుట్టింది మొదలు అత్యున్నతమైన జ్ఞానపీఠ గౌరవాన్ని పొందడమే గాక మరెన్నో కావ్యాలను సృష్టించిన దశ వరకు సాగిన సినారె జీవనయాత్రను, కవితా యాత్రను గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. అక్షరాస్యతే కాదు విద్యాగంధం సైతం అంతంతమాత్రంగా వున్న తెలంగాణ జనపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల ఒడిలో పెరిగి ఇంతింతై విరాణ