ఆత్మలో అమృతనాథుడు
వర్ణన:కె.వి.ఎస్.ఎస్.శాస్త్రి
ఈ కన్య
ఆముక్త మాల్యద గ్రంథనాయిక||
ఈమె తండ్రి విష్ణుచిత్తుడు నేరుగా విష్ణువును పూజించిన ధన్యుడు|
తన స్వామి లీలా మానుష రూపాన్ని పలు విధాలుగా
కూతురుకి వర్ణించి వివరించి చెప్పేవాడు
ఆమె
అప్పుడె కొత్తగా, కొత్తలోకాల్లోకి అడుగుపెడుతున్న కన్య ఆయె|
తండ్రి చెప్పిన- ఆ విష్ణురూపు రేఖావిలసాలను
మనుసులోనే ఊహించుకునేది||
ఏదో తెలియని భావం| ఎంత తరచిన అవ్యక్తం|
పూలకు-లతలకు తనమనో వెతలను తెలిపింది||
అన్నం రుచిరాదు కంటికి కునుకు రాదు|
ఎక్కడ చూసినా ఆ స్వామి రూపం||
చివరికి నిశ్చయించుకుంది|
ఆయనంటే తనకిష్టం అనుకుంది||
కాని ఏంలాభం | అప్పటికే ఆ విష్ణు హృదయంలో ఇరువురు భామలు||
అక్కడ తనకి చోటు లేదనుకుంది
అయితే యేం |
తన హౄదయం లో చోటిచ్చింది ||
ఆమె తండ్రిది, ఇహంలో ఉన్నా- ఎప్పుడూ "పరధ్యానమే" ||
కూతురిని,
పెరట్లో పూలన్నీ కోసి, మాలగా కట్టమని అడిగేవాడు
అన్యం పుణ్యం ఎరుగని అవ్యక్త లోక సంచారి||
ఆమెలో|
ప్రేమయితే అంకురించింది కాని, వయసుపరిపక్వతలేదు|
చిలిపితనం గంతులు వేసేది|
మాలలుగా కట్టిన సుమాల హారాన్ని,
తాను-తనమనసులోవున్న ఆ స్వామి అలంకరించుకొంటే
ఎలావుంటుందనే చిన్న కన్నెకోరిక||
అలంకరించుకొనేది|| అందరిముందుకువెళితే...
తనకు అపరాధం- తండ్రికి అపవాదం||
మరి!
ఆ ఆనందాన్ని పంచుకునేదెవరు?
ఏకాంతంలో - అరుణవర్ణాలు, మంచుబిందువులు
మౌనమె వహించాయి మరి||
అందుకే- ఆ కల్హార సహితరూపాన్ని
బావినీళ్ళలొ తన నీడ చూసుకొని మురిసిపోయేది||
పులకరించేది- తనువుమరిచేది, నిట్టూర్చేది ||
ఆస్వామి తనవాడనుకొనేది ||
రోజులాగానే ఆమె తండ్రి ఉషోదయపూజకు సిద్ధమయ్యాడు |
కేశవునికర్పించే పూలదండలో "కేశా"న్ని చూశాడు ||
ఆ బ్రాహ్మణునికి పై ప్రాణాలు పైకే పోయాయి ||
తన కర్మలో, నిష్ఠలో, భక్తిలో అజాగ్రత్తకు వగచాడు ||
ఆరాతీస్తే|
అమ్మాయి మనసు తెలిసింది| సత్యం దాగదుకదా||
చివరకు ఏంజరుగుతుంది చెప్పండి|
ఆ స్వామి కూడా ఆంతేకదా | మగువ మనసెరిగినవాడు
ఏ కన్యను కాదంటాడనుకొంటే - అపరిపక్వతయేకదా||
లొకకల్యణమే జరిగింది | అదే గోదాదేవి కళ్యాణం ||
" భగవంతుని సృష్ఠితెలుసుకోవచ్చు | కాని కన్నెమనసు
తెలుసుకోవడం సాధ్యమా చెప్పండి. అందులోనే సృష్ఠిదాగివుంది "
ఆమె ప్రకృతి - ఆతడు పురుషుడు.
వారి కల్యణం - కమనీయం , కర్ణరసామృతం ||

























