సుజననీయం

పద్దెనిమిదేళ్ళ వేడుకలు!

– తాటిపాముల మృత్యుంజయుడు

సిలికానాంధ్ర ఏర్పడి 18ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆగష్టు 4వ తేదీన సంస్థాపక దినోత్సవాన్ని జరపటానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో ప్రముఖ వాయులీన విద్వాంసులు అశోక్ గుర్జాలే ఆధ్వర్యంలో 20మంది కళాకారులతో వాయులీన నాదామృతవర్షిణి పేరిట సంగీత విభావరి, సినీకవి జొన్నవిత్తుల ఆధ్వర్యంలో పేరడీ కవితాగానం నిర్వహింపబడతాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సేవాసంస్థ రోటరీ క్లబ్ ‘సిలికానాంధ్ర రోటరీ క్లబ్’ పేరుతో ఏర్పాటు చేయబడుతుంది. ఈ శాఖ సంస్థాపక దినోత్సవ సందర్భంగా 203 మంది సభ్యులతో ‘చార్టరింగ్ సెరిమొనీ’ జరుతుంది.

వివరాలకు ‘ఈ మాసం సిలికానాంధ్ర ‘ శీర్షిక చూడండి. అందరికి ఇదే ఆత్మీయ ఆహ్వానం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked