ఆచరణ
-ఆదూరి హైమావతి
సత్యానందులవారు " సునందూ!" అంటూ తన శిష్యుడ్ని పిలిచారు. "గురుదేవా!" అంటూ సునందు గురువు ఎదుట నిలిచాడు వినయంగా.
" సునందూ! నీవు ఒకపని చేయాల్సి ఉంది .. కావేరీ నదికి ఆవల ఉన్న నామిత్రుడు విజయానందులవారి 'ఆనందాశ్రమానికి ' వెళ్ళి , మన తోటలో కాసిన ' చూత ' ఫలాలను , సమర్పించి రావాలి ,వాటిని ఒక వెదురు బుట్టలో నింపి తయారుగా ఉంచాను." అని చెప్పారు. " అలాగే గురుదేవా!" అంటూ తన సమ్మతిని తెలిపాడు సునందు.
" సునందూ ! నీవు ఒక్కడివే వెళ్ళిరాగలవా లేక నీకు తోడుగా మరొకర్ని పంపమన్నావా?" అని అడి గారు గురుదేవులు.
"గురుదేవా తమ ఆశీస్సులే నాకు తోడు ..తమ సమ్మతి ప్రకారం చేస్తాను." అని వినయంగా గురువు పాదాలంటి నమస్కరించాడు సునందుడు.
" సరేమరి . నీవుఒక్కడివే బయల్దేరు , ఎప్పుడు బయల్దేరుతావు?"
" వెంటనే గురుదేవా! ఆ వెదురు బుట్ట ఇప్పించండి "అన్నాడు.
అది మధ్యాహ్న సమయం .మరికొద్ది క్షణాల్లో భోజనాలు మొదలవు తాయి.శిష