Month: April 2019

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
పైన చెప్పబడిన ప్రముఖుల భావాలు పరిశీలిస్తే భావకవితానంతర కాలంలో ప్రభవిల్లిన అభ్యుదయ కవిత్వం నియమాలకూ, నిబద్ధతకూలోనై వర్తిస్తుండగా, సామాజికావసర కారణంగానే అనుభూతి కవిత్వం పుట్టుకొచ్చిందనే తోస్తున్నది. అనుభూతి కవితావాదం విషయమై మంచి వ్యాసాన్ని ప్రభురించారు ఆర్.ఎస్. సుదర్శనంగారు. ఆ వ్యాసంలో వారు చేసిన వివేచన, విశ్లేషణ విలువైన అంశాలను అందిస్తున్నాయి. అనుభూతి కవిత్వంలోని నవ్యత హృదయానికి హత్తుకొని అనిర్వచనీయమైన, అనిర్ధిష్టమైన అనుభూతిగా మిగలాలి. ఇది పోలికల ద్వారా కానీ ఊహల అల్లికల ద్వారా కానీ ఇంద్రియ సంవేదన రేకెత్తించే వర్ణన ద్వారా కానీ కావచ్చు. ఒక ఖండిక చదివిన తర్వాత దానిలోనుంచి మనం ఎటువంటి సందేశాన్ని పొందనవసరం లేదు. అది మనకెటువంటి దృక్పథాన్నీ కల్గించాల్సిన అవసరం లేదు. ప్రాచీన కవితోద్దేశాలను పరిశీలిస్తే - “యద్వేదాత్ప్రభు సమ్మితాదధిగతం శబ్దప్రధానాచ్చిరం యచ్చేర్థ ప్రవణాత్పురాణ వచనాదిష్టం సుహృత్సమ్మి

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
-డా. అక్కిరాజు రామాపతిరావు నందీశ్వరుడి శాపం నందీశ్వరుడు రావణుణ్ణి 'నా రూపాన్ని చూసి వెటకారం చేశావు కదా! నా వంటి వక్రరూపులైన కపులు నీ లంకపై దండు వెడలి నిన్ను సర్వనాశనం చేస్తారు' అని దశగ్రీవుణ్ణి శపించాడు. ‘నిన్ను ఒకే ముష్టిఘాతంతో చంపివేయగలను కాని, చచ్చిన వాణ్ణి చంపటమెందుకని ఉపేక్షిసున్నాను. ఇప్పటికే నీవు చచ్చినవాడి కింద లెక్క' అని క్రోధతామ్రాక్షుడై నంది రావణుణ్ణి నిరసించాడు. పార్వతీదేవి భయం పోగొట్టటానికి పరమశివుడు తాము కూచున్న గద్దె కిందికి తన పాదం చాచి కొండను తన కాలిబొటన వేలితో అదిమాడు. కొండ కింద రావణుడి శరీరం నలిగిపోయింది. తన భుజాలను, చేతులను దశకంఠుడు కొండ కింద నుంచి ఇవతలకు తీసుకోలేకపోయినాడు. కెవ్వుకెవ్వున కేకలు వేస్తూ కుయ్యో, మొర్రో అని ఆక్రందించాడు రావణుడు. అంగలార్చాడు. పదినోళ్ళతో మిన్నూమన్నూ ఏకమైపోయేట్లూ, ప్రచండపయోధరం గర్జించినట్లూ, ప్రళయకాలపు మబ్బులు ఉరుమురిమినట్లూ రోదించాడు. సమ

వీక్షణం సాహితీ గవాక్షం-80

వీక్షణం
-వరూధిని వీక్షణం-80 వ సమావేశం కాలిఫోర్నియా బే-ఏరియాలోని పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారింట్లో ఏప్రిల్ 14, 2019 న జరిగింది. ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు, శాంత గారు సభకు ఆహ్వానం పలుకుతూ నిన్నా మొన్న ప్రథమ సభ జరిగినట్లుగా ఉందని ఇంతలోనే వీక్షణం 80 వ సమావేశం లోకి అడుగు పెట్టడం, ఈ సమావేశం తమ ఇంట్లో జరగడం తమకు అత్యంత ఆనందదాయకమని అన్నారు. ఉగాది కవి సమ్మేళనం ప్రధాన కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశానికి శ్రీ రావు తల్లాప్రగడ గారు అధ్యక్షత వహించారు. ముందుగా శ్రీ చరణ్ గారు "రామ నామ శబ్ద విశిష్టత" అనే అంశమ్మీద మాట్లాడుతూ "రం" అనే ధాతువు గురించి, ఋగ్వేదంలోని శబ్ద మూలాల గురించి వివరించారు. రాముని పుట్టుకకు ముందే ఈ శబ్దం ఉన్నదనీ, అత్యంత ఆనందస్థితే ఈ శబ్దమని అంటూ రామ శబ్దానికి ఈశ్వర తత్త్వానికి ఒకటే అర్థమని వివరించారు. ఇందులో భాగంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాల గురించి వివరిస్తూ వేదాల్లో చెప్పిన విషయాలను

కలియుగ అజామిళ

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారద్దేశం. అప్పల్నాయుడు పుట్టినప్పుడు జాతకం చూసిన పంతులు చెప్పడం ప్రకారం నాయుడిది సింహ లగ్నం. ఎలాగైనా సరే పెద్దయ్యాక నాయకుడై తీరుతాడు. అయితే ఎందులో నాయకుడౌతాడనేది పెంపకాన్ని బట్టి ఉంటుందనీ అందుకోసం నాయుడి తండ్రి కొంచెం కష్టపడాలనీ పంతులు చెప్పాక అప్పల్నాయుడి తండ్రి ఆలోచించాడు - ఏ లైన్లో కుర్రాణ్ణి సులభంగా నాయకుణ్ణి చేయచ్చో, ఏ వృత్తిలో అయితే పెద్ద చదువు, సంధ్యా అక్కర్లేదో, ఏదైతే లక్ష్మీ కటాక్షం కురిపిస్తుందో. దీని కోసం నాయిడి తండ్రికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. నాయుడికి సరిపోయేవి రాజకీయాలు. ఓ సారి ఊళ్ళో సర్పంచో ఏదో ఒకటి అయితే అక్కణ్ణుంచి జిల్లాకి, తర్వాత ఎమ్మెల్యే అలా పైకి పాకడం తారాజువ్వ ఆకాశంలోకి ఎగిరినట్టూ జరిగిపోతుంది. సింహ లగ్న ప్రభావమో మరోటో కానీ మూడో క్లాసులోంచే అప్పల్నాయిడు నాయకుడి లక్షణాలు చూపించడం మొదలుపెట్టేడు - పక్కింటి అమ్

అన్నమయ్య జయంతి

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు తెనాలి రామకృష్ణుడు తాళ్ళపాక కవులను ఒక పద్యములో ఇలా ప్రశస్తించెను - చిన్నన్న ద్విపదకెఱగును పన్నుగ బెదతిరుమలయ్య పదమున కెఱగన్ మిన్నంది మొరసె నరసిం గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్! అన్నమాచార్యుడు, అతని వంశీయులైన నరసన్న, పెదతిరుమలయ్య, చిన్నన్న అందరూ కవులే. అన్నమయ్య తెలుగు నుడికారమున దిట్ట. సంస్కృతమున కూడా మంచి సంకీర్తనలు రచించాడు కూడా. ద్రావిడ, కర్ణాటక, తెలుగు భాషల్లో మొదటగా సంకీర్తనలు రచించిన వాడు అన్నమాచార్యుడు. అందుకే 'పదకవితాపితామహుడు ' బిరుదాంకితుడు. ఎన్నో కవితారీతుల్లో మధురంగా రచించిన అన్నమయ్య జానపద రీతులు కొన్ని ఇవి - జాజఱలు, గొబ్బి, నలుగులు, గుజ్జెనగూళ్ళు, అల్లోనేరెళ్ళు, తందనాలు. మే 25, 26, 27 తేదీల్లో జరిగే అన్నమయ్య జయంతి ఉత్సవానికి తప్పక విచ్చేయండి. ఆ సంకీర్తనాచార్యునికి గాన, నాట్య కళలతో అర్పించే నివాళిలో పాలుపంచుకోండి. వివరాలకు 'ఈ మాసం సిలికాన

ఏకాకి జీవితం

కవితా స్రవంతి
డి.నాగజ్యోతిశేఖర్ మురమళ్ళ, తూర్పుగోదావరి జిల్లా. 9492164193 కాలం గుప్పిట్లో బందీనై నిన్ను నేను ఎడబాసినప్పటికీ... నా ఒంటరి నిశీధి అంచుల్లో చెకుముకి రాళ్ళై నీ జ్ఞాపకాలు నాలో రాపాడుతూనేఉన్నాయి! వేదనకొమ్మల్లో పూలపిట్టలై నీ ఆలోచనలు నాతో సంఘర్షిస్తూనేఉన్నాయి! గతం శిథిలాల్లో స్మృతుల తీగలై నీ చేరువలు నన్ను అల్లుకోవాలని తపనపడుతూనే ఉన్నాయి! కన్నీటి కొసల్లో కొసమెరుపులై నీ సాంగత్యాలు నన్ను ఓదారుస్తూనేఉన్నాయి! గుండె పటం ఫ్రేములో వెచ్చని ముద్రలై నీ ఔన్నత్యాలు నన్ను తడుముతూనే ఉన్నాయి! నాకు తెలుసు... నేనేం కోల్పోయానో... ఇంక... నీ ఎడబాటు చీకటిని తరగడం నా తరం కావడం లేదు! నీ జంటబాసిన సమయాలను దాటాలంటే నా శ్వాసకు అడుగుసాగడం లేదు! నీవు లేని ఈ ‘ఏకాంతాన్ని’ ఏలాలంటే దహనమౌతున్న నా హృదయతనువుకు సాధ్యం కావడం లేదు! పొరలుపొరలుగా పొగిలివస్తున్న దుఃఖ సంద్రాన్ని వెలేయడానికి గుండె గొ

నిత్య సూర్యుళ్ళం!

కవితా స్రవంతి
వెన్నెల సత్యం షాద్ నగర్ 94400 32210 ఎప్పట్లాగే ఈ రోజూ ఈ రోజు కోడి కూత కన్నా ముందే నిద్ర లేచాను నా స్వేచ్ఛా ప్రపంచపు వంటింట్లోకి ఠంచనుగా అడుగు పెట్టాను! యుద్ధభూమిని తలపించే ఆ వంట గదిలో పాత్రలతో పోరు చేస్తూ కాయగూరలతో కత్తియుద్ధం చేస్తూ చెమటోడుస్తున్నాను! జిహ్వకో కూర తీరొక్క అల్పాహారాలతో తిండికీ నోచుకోని తీరిక లేని పనులు మసిబారిన మగ దురహంకారపు అంట్లన్నీ తోముతూ దుష్ట సంప్రదాయాల మురికి గుడ్డల్ని ఉతుకుతూ కసవు నిండిన మది గదులన్నీ ఊడుస్తూ తుడుస్తూ బడలిక ఎరుగని బానిసలా ఏ అర్ధరాత్రో తీసే కూసింత కునుకు మా శరీరాలకే గానీ మనసులకు మాత్రం విశ్రాంతి ఎండమావే! మున్నూట అరవై ఐదు రోజులూ సూర్యుడితో పోటీ పడుతూ శ్రమశక్తితో ప్రపంచాన్ని నడిపించే మాకు ఏడాదికోసారి మీరిచ్చే గౌరవాలు అక్కర్లేదు! మా విన్నపాన్ని మన్నించండి మమ్మల్ని దేవతల్ని చేయక్కర్లేదు సాటి మనిషిగా చూడండి

ఓటు నీ సిఫార్సులేఖ

కవితా స్రవంతి
- శ్రీ గాదిరాజు మధుసూదన రాజు తెల్లారకముందేచీకట్లోలేచి ఇంట్లోంచి బయల్దేరి.. ఎక్కడుంటారో ఎప్పుడుంటారో ఎలావుంటారో కనుక్కుంటూ బతుకుబాగుచేసుకునేందుకు సాయాలూ సిఫార్సులేవో చేస్తారని ఆశిస్తూ కలలుగంటూ ఎమ్మెల్యే మంత్రీ సియం యంపీ పియమ్ముల కలవాలంటూ రేయింబగళ్ళూ పడిగాపులుకాచావునీవు! వాళ్ళంతా కట్టకట్టుకుని ఆ పదవులు అందుకునేందుకు నీ ఓటుసిఫార్సు కోసం నీ వద్దకు వస్తున్నారు ఆలోచించుకో గుర్తుకు తెచ్చుకో కనీసంనిన్ను ఓటరుగాగుర్తించిన వారెవరో ఒక్కవోటుతో నేనేంచేస్తా ననిధైర్యం వీడకు ఒక్కొక్కచుక్కకలిస్తేనే సముద్రం అయ్యిందికడకు ఓటు నీ సిఫార్సులేఖ ఎవరికిస్తావో నీ ఇష్టం నీ అనుభవాలను క్రోడీకరించు నీ తెలివినంతా చూపించు వోటేసి మంచిని గెలిపించు భవిష్యన్నిర్ణేతవై నీ సత్తాచూపించు నీకు నచ్చిన నేతలతో నీ పాలన సాగించు నిజమైన ప్రజా స్వామ్యాన్ని నీ వోటుతో స్థాపించు!!

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
అనుభూతి కవిత్వం ఒక వాదంగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో టి.యల్. కాంతారావుగారు ఎంతో ఆనందంగా ఈ వాదాన్ని గురించి చర్చించారు. వారి వారి భావాల్లో "భావ అభ్యుదయ కవితా ప్రక్రియల అనంతరం తిలక్ భావనా స్రవంతిలో వచ్చిన ఒకానొక విశిష్టపరిణామం అనుభూతి వాదం" అని చెప్పారు. ఇదే విషయాన్ని కొనసాగిస్తూ, “అనుభూతివాదం యొక్క పారమార్థిక లక్షణమేమిటంటే - కవి తన గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న అనేకానేక స్వచ్ఛమైన భావతరంగాలకి ఏ ఆర్భాటం లేకుండా స్పష్టమైన ఆకృతినివ్వటం.” ఈ వ్యాఖ్య సమగ్రమైన వ్యాఖ్యగా గమనింపగలం. స్వచ్ఛమైన భావతరంగాలు అనటంలో కవి హృదయంలోంచి కెరటాల వలే ఉవ్వెత్తుగా లేచే భావపరంపరకు ఏ నిబద్ధతా, ఏ నియమాలూ లేవు అని చెప్పటం గమనింపవచ్చు. ఆ భావాలు ఏ ఆర్భాటం లేకుండా ఉంటాయి అంటే భావకవిత్వంలో ఉండే స్వాప్నిక డోలికావిహారం ఇందులో లేదు అనుకోవచ్చు. స్పష్టమైన ఆకృతి ఇవ్వటం అనటంలో సమకాలీనంగా సాగిస్తున్న అభ్యుదయ కవులమని చెప్పుకునేవారు ర

రావణుడి శివాపచారం

ధారావాహికలు
అప్పుడు రావణుడు కుబేరుడి దివ్యభవన సింహద్వారం దగ్గరకు చొచ్చుకొని పోయినాడు. అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న సూర్యభానుడు రావణుణ్ణి తీవ్రంగా ఎదిరించాడు. దాపులో ఉన్న ఒక స్తంభాన్ని పెకలించి దానితో దశకంఠుణ్ణి మోదాడు. అయతే బ్రహ్మ వర ప్రభావం వల్ల రావణుడు చావలేదు. కాని రక్తం కక్కాడు. దానితో ఒళ్ళు తెలియని కోపావేశంతో ఆ స్తంబాన్నే చేతపట్టి సూర్యభానుణ్ణి మోది వైరిని విగతజీవుణ్ణి చేశాడు. దీనితో యక్షుల బలం కకావికలమై పోయింది.కొందరు కుప్పకూలి పోయినారు. కొందరు గుహలలో దూరి ప్రాణాలు రక్షించుకున్నారు. కొందరు నిశ్చేష్ట్రులైనారు. వాళ్లకు కాలు చేతులాడలేదు. అప్పుడు కుబేరుడు, మణిభద్రుడనే యక్ష ప్రముఖున్ని చూసి 'పాపాత్ముడైన, క్రూరపరాక్రముడైన రావణుణ్ణి వధించి యక్షులను రక్షించే భారం నీదే'నని ఆనతిచ్చాడు. అప్పుడు మణిభద్రుడు నాలుగువేల మంది యక్షవీరులతో బయలుదేరి రణభూమికి వచ్చాడు. యక్షులకు, రాక్షసులకూ పోరు ఘోరంగా జరిగింది. రాక్షసుల