Author: Sujanaranjani

విశ్వామిత్ర 2015 – నవల ( 9వ భాగము )

ధారావాహికలు
- యస్. యస్. వి రమణారావు ఉదయం తొమ్మిదికల్లా రాజు కారుతో సిబిఐ గెస్ట్ హౌస్ దగ్గర సిద్ధంగా ఉన్నాడు.అభిషేక్ వచ్చి కారులో కూర్చున్నాడు.’ఎడ్రస్ సార్"అడిగాడు రాజు."లక్ష్మీపురం దగ్గరకు వెళదాం. అక్కడికి వెళితే గుర్తు పట్టగలను "విశ్వామిత్రని చూశానని చెప్పి గొప్ప షాక్ ఇచ్చారు సార్.మేమింకా విశ్వామిత్ర హోమ్ కి భయపడి అండర్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడని అనుకుంటున్నాం అంతవరకు."నవ్వాడు అభిషేక్,కారులోంచి అందంగా కనబడుతున్న విశాఖ నగరాన్ని చూస్తూ."మీరు వెళ్ళాక జగదీష్ గారు మినిష్టర్ గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయనకూడా షాక్ అయ్యారు సార్" "అందులో నా గొప్పతనం ఏముంది?It`s purely accidental." "వాట్ ఈజ్ మిరకిల్ టు మేన్ ఈజ్ లాజికల్ టు గాడ్ అన్నాడు సార్ షేక్స్పియర్. భగవంతుడు మీద్వారానే ఈ కేసు సాల్వ్ చేద్దామనుకుంటున్నాడు సార్.అందుకునే మిమ్మల్ని విశ్వామిత్రని కలుసుకునేలా చేశాడు."అంతవరకూ సిటీని చూస్తూ లైట్ మూడ్ లో ఉన్న
శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
- డా. అక్కిరాజు రమాపతిరావు యుద్ధంలో ఇంద్రజిత్తు మాయాసీతను సంహరించటం శ్రీరాముడి నిర్ణయం తన మాయాబలంతో ఇంద్రజిత్తు తెలుసుకున్నాడు. వెంటనే లంకలోకి పారిపోయినాడు. జరిగిన రాక్షస మారణహోమాన్ని తలచుకొని మరింత క్రుద్ధుడై రామలక్ష్మణులకు దూరంగా ఉన్న లంక పశ్చిమద్వారానికి వెళ్ళాడు. వానరులూ, రామలక్ష్మణులూ శోకోపహతచేతనులై, నిస్తేజులై, నిర్వీర్యులైపోయే ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక మాయాసీతను సృష్టించి తన రథంపై ఆసీనురాలిని చేశాడు. ఆ మాయాసీతను తాను సంహరించి వానరులను భ్రమింపచేసే పూనికతో యుద్ధరంగంలో నిలిచాడు. ఇంద్రజిత్తు మళ్ళీ యుద్ధభూమికి రావడం వానరసేనా, శ్రీరామలక్ష్మణులూ చూశారు. క్రోధవివశులైనారు. హనుమంతుడు ఒక పర్వతశిఖరాన్ని ఇంద్రజిత్తుపై విసరడానికి ఉద్యుక్తుడైనాడు. కాని రథంలో అత్యంతకృశాంగి, దుఃఖ పరిదీనవదన, ధూళిధూసరితదేహ, మలినవస్త్ర, కేశసంస్కారరహిత, ఏకవేణీధర అయిన సీతాదేవిని హనుమంతుడు నివ్వెరపాటుతో ఒక్కక్షణం సేపు ఇ

ఏకలవ్యుడు ఎవరు?-ఒక పరిశీలన

సారస్వతం
- టీవీయస్.శాస్త్రి (శారదాప్రసాద్) మనలో చాలామందికి ఏకలవ్యుడి కధ ఈ క్రింది విధంగా తెలుసు! ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప పాత్ర. ఇతను ఎరుకల కులానికి చెందినవాడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలని కోరిక ఇతనికి ఎక్కువగా ఉండేది. ఆ కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. ద్రోణుడు అతని కోరికను మన్నించక, దాన్ని తిరస్కరించాడు.కానీ కొన్ని కథల్లో, ద్రోణుడు ఏకలవ్యుడిని దూరంగా ఉంచటానికి కారణం అతని కులం అని చెపుతారు.ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా తెలియక ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషదారణతో ఏకలవ

కుంతి మాట – సత్సంగ్

సారస్వతం
- కుంతి మెయిన్ హాలులో చిన్న బల్బు వెలుగు మిగిలిన ఇల్లంతా చీకటిగా ఉంది. గోడగడియారము పన్నెండు గంటలు కొట్టింది. సోఫాలో దిగాలుగా కూర్చున్న అన్నపూర్ణమ్మ. అదే హాలులో, ఉబికి వస్తున్న కన్నీరునాపుకుంటూ వెక్కిళ్ళు పెట్టడానికి సిద్ధపడుతున్న గుండెను అదుము కుంటూ, అన్యమనస్కంగా పచార్లు చేస్తున్నది అన్నపూర్ణమ్మ మనవరాలు అపరాజిత. వారిరువురూ గేటు వెలుపలి రోడ్దు వైపుకు చూస్తున్నారు. బయట ముసురు పడుతున్నది. ఇంతలో స్కూటర్ శబ్దము వినిపించింది. ఇద్దరూ ఒకేసారి అటు వైపుచూసారు. నిండుగా తడిసిన శ్రీ రామచంద్రమూర్తి స్కూటర్ పార్క్ చేసి కురిసిన వర్షము వలననో, జారిన కన్నీటి వలననో తడిసిన శరీరముతో లోపలికి వచ్చాడు.. అతడు దీనంగా ఉన్నాడు.ఇంతలో మళ్ళీ గేటు శబ్దమైంది. ముగ్గురు అటు వైపు చూసారు. తండ్రిలాగే తడిసి ముద్దైన రాజీవ్ తన బైక్ ను పార్క్ చేసి ఇంటిలోనికి వచ్చాడు. ఇద్దరు గంభీరంగా ఉన్నారు. ఆ యింట్లోని వారికి , వారి వాలకము చూస

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య ముగ్ధ నాయిక గురించి అన్నమయ్య చెప్పిన చక్కని కీర్తన గురించి తెలుసుకుందాం. ముగ్ధ అనగా ఉదయించుచున్న యౌవనముగలది. పండ్రెండేండ్ల వయసుగల యువతి అని నిఘంటువులు చెప్తున్నాయి. రామరాజ భూషణుడు తన కావ్యాలంకార సంగ్రహం లో ఇలా నిర్వచించాడు. కీర్తన: శా. ఆలాపంబున కుత్తరంబొసగ దాయాసంబునంగాని, తా నాలోకింపదు; పాటలాధరమరందాస్వాద సమ్మర్ధ ముం దాళంజాలదు; కౌగిలీయదు, తనూ తాపంబు చల్లాఱగా నేలజ్జావతి ; త ద్రతంబు దయితాభీష్టంబు గాకుండునే? అనగా అప్పుడే ఉదయించుచున్న యౌవనము గల స్త్రీకి బిడియము మొదలైనవి సహజంగానే ఉంటాయని చెప్పాడు. మనం భక్తి విషయానికి వస్తే... అన్నమయ్య ప్రతి పదమూ భక్తి రసస్ఫోరకమే అన్న విషయం తెలుస్తుంది. ఆది శంకరుల వారు వివేకచూడామణిలో "మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి" అంటాడు. అన్నమయ్య తను సర్వం సహార్పణ గావించి సృష్టించిన అనంత సాహిత్య నిధిని ఎన్ని వందల సంవత్సరాలైనా మన

నరసింహ సుభాషితం

సారస్వతం
- ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి శ్లోకం: यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।। యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం? । లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి? ।। సంధి విగ్రహం యస్య, న, అస్తి, స్వయం, ప్రజ్ఞా, శాస్త్రం, తస్య, కరోతి, కిం। లోచనాభ్యాం, విహీనస్య, దర్పణః, కిం, కరిష్యతి।। శబ్దార్థం యస్య = ఎవనికి, నాస్తి = లేదు, తస్య = అతనికి, కరోతి = చేస్తుంది, కిం =ఏమి, శాస్త్రం = ఏ విషయ గ్రంథమైనా, లోచనాలు = కళ్ళు, విహీనస్య = లేని వానికి, దర్పణః = అద్దం, కిం =ఏమి, కరిష్యతి =చేయగలదు Meaning One who does not have any stuff with in him or does not possess any inherent abilities and grasping of things, what a Shastra or subject can do to him? Means, subjects simply cann

అష్టకాలు – రాఘవాష్టకం

సారస్వతం
- కాకుమాని మూర్తికవి కలికిరా పూములికిరా ముద్దు చిలుకరా అలుకేలరా కులుకు గుబ్బల తళుకు చెలగే కొమ్మరా ముద్దుగుమ్మరా అళులు మ్రోయగ నంతకంతకు నలరి వెన్నెల గాయగా జలజలోచన నోర్వలేదిక జానకీపతి రాఘవా ఏర పొందును జామురా నా స్వామిరా నికు ప్రేమరా తీరు గలిగిన బొమ్మ చక్కని దివ్య కపురపు క్రోవిరా సారె సారెకు యేచ నేటికి జాణ శేఖర మానరా రార యేలుకొ బుక్కపట్ణము రామచంద్ర దయానిధి వద్దురా యెలుగొద్దురా యీ ప్రొద్దుయే సరిప్రొద్దురా బుద్ధి విను నా సద్దు లడిగెడి ముద్దుబాలకి గోలరా ఒద్దికతొ కూడుండరా యీ ప్రొద్దు నేనిక మ్రొక్కెదా సుద్దులాడక సుదతి నేలుకొ సొంపుతోడుత రాఘవా మాటిమాటికి యింతేటికి యిచ్చోటికి అలుకేంటికీ నాటినాటికి విరహమెచ్చెను నలినలోచను తేగదే పూట యొక యేడాయనే పూబోణికి అలివేణికి బోటినేచ నీబోటివారికి పొందుకాదుర రాఘవా కొమ్మరా (నిను సమ్మెరా) ముద్దుగుమ్మ అన్నియు నెరుగురా ఎమ్మెమీరగ యేచనేటీకి యింతిపూ

‘దీప్తి’ వాక్యం – ఆధ్యాత్మిక కళలు

సారస్వతం
సర్వలోక శరణ్యాయ రాఘవాయ! - దీప్తి కోడూరు     తెల్లవారితే యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన రాముణ్ణి, కన్న కొడుకు మీద మమకారంతో, అసూయాపరురాలైన పినతల్లి కైక అడవులకు  పంపమని దశరథుని కోరింది.  తండ్రి మాటను అనుసరించి రాముడు భార్య, తమ్ముడితో కలిసి అడవులకు పయనమయ్యాడు. ఋష్యాశ్రమాల్లో మహర్షుల సత్సంగంలోనూ, జనపదాల్లో సామాన్యులను బాధిస్తున్న రాక్షసులను హతమారుస్తూ, ముని జీవనం సాగిస్తున్నారు వారు.  అలా ఉండగా ఒకనాడు మాయలేడి నాటకంతో మోసగించి రావణుడు సీతను అపహరించి సముద్రానికి ఆవలి వైపున ఉన్న తన లంకా  నగరానికి తీసుకుపోయాడు.  సీత లేని రాముడు శశి లేని నిశిలా కుంగిపోయాడు.  ఏమైందో, ఎక్కడ వెతకాలో తెలియక కుప్పకూలిపోయాడు రాముడు. ఎన్నో ప్రయాసలు, వెతుకులాటల తర్వాత, ఎందరో సన్నిహితుల సహాయంతో సీత జాడ తెలుసుకున్నాడు.  లంక మీదకి దండెత్తాలని నిర్ణయించుకున్నాడు.  హనుమత్సహిత సుగ్రీవ, అంగ, జాంబవం

అనుభూతి – ప్రాచీన దృక్పథం (3- భాగం)

సారస్వతం
- సునీల పావులూరు "దేహో యమన్న భవనోన్నమ యస్తుకోశ శ్చాన్నేన జీవతి వినశ్యతి తద్విహీనః, త్వక్చర్మ మాంసరుధిరాస్థి పురీషరాశి ర్నాయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధం:"5 "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్| అన్నాధ్దేవ ఖల్విమాని భూతాని జాయంతే| అన్నేన జాతాని జీవంతి| అన్నం ప్రయం త్యభిసం విశంతీతి| తద్విజ్ఝాయ|"6 ప్రతిప్రాణీ అన్నం వలన జన్మించి, అన్నంతో జీవించి, అన్నంలోనే లయిస్తోంది. ఈ అన్నమయ్య కోశాన్ని "కర్మేన్ద్రియైః పంచభిరంచితోయం ప్రాణో భవేత్ప్రాణమయస్తు కోశః, యేనాత్మవానన్న మయోన్న పూర్ణాత్ ప్రవర్తతే సౌ సకల క్రియాసు"7 "ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్| ప్రాణాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే| ప్రాణేన జాతాని జీవంతి| ప్రాణం ప్రయం త్యభిసంవిశంతీతి| తద్విజ్ఞాయ|" 8 అన్నమయకోశాన్నావరించుకొని ప్రాణమయకోశం ఉంది. ఇది స్థూల శరీరాన్ని ఆవరించుకొని ఉంది. ప్రాణమయ కోశానికి కూడా జనన మరణాదులు ఉన్నాయి. "జ్ఞానేన్దియాణి చ మన

రామాయణంలో ముఖ్య ఘట్టాలు

సారస్వతం
- డా. పద్మజా వేదాంతం శ్రీమద్రామాయణం ఆదికావ్యం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథం. దీనిని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించాడు. ఇది శ్రీరాముని జీవిత చరిత్ర లేదా ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇందులో ఆరు కాండలు ఉన్నాయి. (1) బాలకాండ (2) అయోధ్యకాండ (3) అరణ్యకాండ (4) కిష్కింధకాండ (5) సుందరకాండ (6) యుద్ధకాండం, (ఏడవది అయిన ఉత్తరకాండ తరువాత చేర్చబడింది.) 1) బాలకాండ- అయోధ్యానగర మహారాజు దశరధుడు. ఆయనకి ముగ్గురు భార్యలు. చాలా కాలం సంతానంన లేక, పుత్రకామేష్టి యాగం చేశాక, ఆయనకు నలుగురు పుత్రులు కలుగుతారు. కౌసల్యకి రాముడు, కౌకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మిస్తారు. కులగురువైన వశిష్ట మహర్షి వద్ద వారు విద్యాభ్యాసం చేస్తారు. ఈ రాజకుమారుల జననం, విద్యాభ్యాసం వశిష్టమహర్షి ద్వారా జరుగుతాయి. వీరి వివాహం విశ్వామిత్ర మహర్షి ద్వారా జరుగుతుంది. విశ్వామిత్ర మహర్షి తన యాగ సంరక్షణకై రామలక్ష్మ