సాహితీ వార్తలు

సాహితీ వార్తలు

సాహిత్య అకాడమీ గ్రహీతలకు అభినందనలు ఎన్నో ఏళ్ళ కృషి , దీక్ష , పట్టుదల తో సాగుతున్న కవి లేదా రచయిత ఎవరైనా ఒక్క సాహిత్య అకాడమీ అవార్డు రావడంతో ఒక్కసారిగా సేదదీరుతారు. అంటే సాహిత్యం లో తమకంటూ ఒక పేజీ ఉంటుందని ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం కవిగా సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న దిగంబర కవి నిఖిలేశ్వర్ గారు అసలు పేరు కుంభం యాదవరెడ్డి. తెలుగులో నిఖిలేశ్వర్ రచించిన అగ్నిశ్వాస కవిత్వానికి ఈ అవార్డు ఇచ్చారు. వీరు కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని నిఖిలేశ్వర్‌ గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు. దిగంబర కవులలో ఒకరిగా, 1965 నుండి 1970 వరకు మూడు సంపుటాల దిగంబర కవిత్వమును ప్రచురించారు. నిఖిలేశ్వర్ విప్లవ కవిత్వోద్యమంలో కూడా ప్రధానమైన కవ

మెరిసే అక్షరాలు

-జ్వలిత 'ద హౌస్ ఆఫ్ స్పిరిట్స్' నవలా పరిచయం (ప్రపంచ సాహిత్యంలో చదవదగిన నవలలు) ద హౌస్ ఆఫ్ ది స్పిరిట్ అనే నవల 1982లో ఇసాబెల్ అలెండా అని ఒక జర్నలిస్ట్ మరియు టెలివిజన్ హోస్ట్ అయిన మహిళ యొక్క రచన. ఆమె చైనా నుండి రాజకీయ బహిష్కృతురాలు. 1981 జనవరి 8 వ తేదీన వెనిజులాలో కూర్చొని దాదాపు వంద సంవత్సరాల వృద్ధుడైన తన తాతకు లేఖ రాయడం ప్రారంభించింది. అందులో ఆమె తన వర్తమానానికి తన కుటుంబం యొక్క గతానికి మధ్య ఉన్న దూరాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. తన చిన్నతనంలో విన్న ఒక పిట్ట కథతో నవల మొదలవుతుంది. రోజా అనే ఒక స్త్రీ తన గురించి చెప్పినట్టుగా. రోజా పొరపాటున విషపూరితమైనట్టు రాసింది. 'పోస్ట్ చేయని ఉత్తరాలు' అనే నవల చేతి ప్రతి " the house of the spirit"గా మారి ఒక ఉత్తమ నవలగా రూపుదిద్దుకున్నది. ఒక స్త్రీ యొక్క మూడు తరాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి స్పష్టంగా చిత్రించింది రచయిత