కథా భారతి

పెయ్యేటి శ్రీదేవి గారి కధ

కథా భారతి
శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి ప్రముఖ రచయిత్రి , కార్టూనిస్ట్ , గాయని శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు( 68 సం.లు) ఫిబ్రవరి 21వతేదీ ,2021న గుండెపోటు తో హఠాన్మరణానికి గురికావటం వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాదు మిత్రులను , బంధువులను ,సాహితీ మిత్రులను అందరినీ కూడా విచారసాగరంలో ముంచివేసినది. వారి శ్రీవారు పెయ్యేటి రంగారావు గారు స్టేట్ బ్యాంక్ లో ఆఫీసర్ గా చేసి రిటైరయ్యారు. వారుకూడా కధా రచయిత, ప్రముఖ రంగస్థల నటులు , పాటల రచయిత. వారు రాసిన పాటలు శ్రీదేవిగారు స్వయంగా రాగాలు కట్టి పాడుతుంటారు. వీరి పెద్ద కుమార్తె విజయ మాధవి గొల్లపూడి ఆస్ట్రేలియా లో ప్రభుత్వరంగసంస్థలో ఉద్యోగం చేస్తూ తెలుగు వన్.రేడియో టోరీలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్న కుమార్తె కాంతి కలిగొట్ల అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం వీరి స్వంత ఊరు. సందేశాత్మకమైన కధలు, హాస్యకధలు చాలారాశారు శ్రీదేవిగారు. క

ఆత్మకథ

కథా భారతి
-Sahitya Academy Awardee P. Sathyavathy ఒక లింగమార్పిడి యొక్క ఆత్మకథ - తమిళ పుస్తకాన్ని అనువదించినందుకు ఆంధ్రప్రదేశ్ పి సత్యవతి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.సత్యవతి కథల్లో అనసవరమైన పాత్రలు, సంఘటనలు, వర్ణనలు వుండవు. శైలీ వ్యామోహంగానీ, వర్ణనా చాలప్యం గానీ ఆమెకు లేవు. ఒకటి రెండు చోట్ల తళుక్కుమన్నా అది హద్దులు దాటలేదు. సత్యవతి శైలిలో భావం (సెన్స్‌), భావోద్రేకం (ఫీలింగ్‌), కంఠస్వరం (టోన్‌), ఉద్దేశం (ఇన్‌టెన్షన్‌) స్పష్టంగా వుండవలసిన మోతాదులో వుంటాయి. అందులో కవిత్వం బరువుకాని, భాష బరువుకాని, వాక్య నిర్మాణపు బరువుకాని వుండవు. సత్యవతి కథలు 'నిశ్చల నిశ్చితాలను' ఆదర్శీకరించవు. కుహనా ఆదర్శాలాను ప్రతిపాదించవు. సమాజ పరిణామశీలతను తిరస్కరించవు. జీవిత సమస్యను పరిణామం నుంచి వేరు చేసి చూడవు. స్త్రీ కళ్ళలోకి చూడగల సాహసంలేక మనం తప్పించుకు తిరుగుతున్న ప్రశ్నల్ని ఈ కథలు మనం నడు

రెండు మాటలు

కథా భారతి
-తమిరిశ జానకి రచయిత్రి శ్రీమతి పెయ్యేటి శ్రీదేవిగారి గురించి రెండు మాటలు కధా రచయిత్రి , కార్టూనిస్ట్ , గాయని, మంచి మనిషి శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు ఫిబ్రవరి , 2021 వ తేదీన గుండెపోటుతో హఠాన్మరణానికి గురి కావటం వారి కుటుంబసభ్యులను మాత్రమే కాదు బంధువులను , మిత్రులను , సాహితీమిత్రులను అందరినీ విచారసాగరంలో ముంచివేసింది. ఆమె శ్రీవారు శ్రీ పెయ్యేటి రంగారావుగారు బ్యాంక్ లో ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యారు. వారి గురించి ప్రస్థావన ఎందుకంటే ఆయన కూడా రచయిత, ప్రముఖ రంగస్ధల నటులు, పాటల రచయిత, అంతర్జాలంలో అచ్చంగాతెలుగు గ్రూప్ కి , భగవద్గీత గ్రూప్ కి అడ్మిన్ గా ఉన్నారు. శ్రీదేవి గారు రచించిన ఎన్నో సందేశాత్మకమైన కధలు, హాస్య కధలు, నాటికలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఎన్నో పురస్కారాలు, బహుమతులు పొందారు, సి.పి.బ్రౌన్ కధలపోటీలో కూడా బహుమతి పొందారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె విజయమాధవి గొల్లపూడి ఆస్ట

మానసిక హత్య

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి పదహరేళ్ళ అమెరికన్ అమ్మాయి వెండీ కార్సన్ టేన్నిస్ కోర్టులోకొచ్చేసరికి చప్పట్లు వినిపించాయి. కొత్తగా అప్పుడే టెన్నిస్ ప్రొఫెషనల్ గా మారిన వెండీకి వింబుల్డన్ లో ఎదురే లేదు ఫైనల్ కి రావడానికి. దాదాపు అరడుగులు ఉన్న వెండీ చేసే పవర్ సర్వీస్ తోనూ, కొట్టే గ్రౌండ్ స్ట్రోక్ లతోనూ చూసేవాళ్లకి ఔరా అనిపించే ఆట; అసలు మొదటిసారి ఫైనల్స్ కి వచ్చినప్పుడు కొత్త ఆటగాళ్ళు పడే స్ట్రెస్ గానీ ఉన్నట్టే లేదు మొహంలో. ఎప్పుడో బోరిస్ బెకర్ కి ‘బూమ్ బూమ్ బెకర్’ అని పేరు తగిలించినట్టూ ఇప్పుడు ‘బూమ్ బూమ్ వెండీ’ అనడం మానలేదు చూసేవాళ్ళు. అటువైపు వెండీతో ఆడబోయేది క్రితం ఏడాది వింబుల్డన్ నెగ్గిన కామినిస్కోవా అనే రష్యన్ భామ. ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా పోగొట్టుకోకుండా ఫైనల్ కి వచ్చినావిడ. బెట్టింగ్ రాయుళ్ళ ప్రకారం కామినిస్కోవా ఈ ఫైనల్స్ గెలిచి తీరుతుంది, కానీ వెండీ నెగ్గడానికి పది శాతం ఇచ్చారు ఛాన్సు; ఆటలో ఎట

పది నిమిషాలు

కథా భారతి
-కృష్ణ అక్కులు రాహుల్ గురించి ఆలోచిస్తూ చాలా ఆలస్యంగా నిద్రపోయాడు సుధాకర్ రావు. అందుకే ఉదయం పది గంటలైనా మెళుకువ రాలేదు. లేచిన వెంటనే ఆతురతగా వాట్సప్ చూశాడు. రాహుల్ మేసెజ్ చూశాడు కాని బదులివ్వలేదు. రిటైర్ కావడం, భార్య చనిపోవడంతో ఒక్కసారిగా ఎక్కడలేని ఒంటరితనం కమ్మేసినట్లయింది సుధాకర్ రావుకి. ఒక లెక్చరర్‌గా కన్నా ఒక విద్యార్థి సలహాదారుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకొన్నాడు సుధాకర్ రావు. అతడి మనోవికాస క్లాసుల ద్వారా ఉత్తేజితులై ఎంతోమంది ఐయెస్‌లు, ఐపియస్‌లు, ఐఐటిలు సాధించారు. రాహుల్ కూడా విద్యార్థులకు తండ్రి చేప్పె క్లాసులలో కూర్చొని శ్రద్ధగా వినేవాడు. దాని ఫలితంగానే ఐఐటిలో మంచి ర్యాంక్ తెచ్చుకొని, ఐఐటి ముంబాయిలో కంప్యూటర్ కోర్సు చేసి, అమజాన్ మూడు సంవత్సారాలు చక్కగా ఉద్యోగం చేశాడు. అ తరువాత ఎమైందో తెలియదు. ఉద్యోగం మానేశాడు. గత రెండేళ్ళుగా ఇంట్లోనె వుంటున్నాడు. ఎప్పుడు చూసినా లాపుటాప్‌

‘గురు దేవో భవ!’

కథా భారతి
-G.S.S. కళ్యాణి ముందుగదిలోని వాలుకుర్చీలో కూర్చుని రేడియోలో పాటలు వింటున్న చంద్రం కళ్లజోడును సరి చేసుకుంటూ గోడగడియారం వంక చూశాడు. సమయం మధ్యాహ్నం మూడు గంటలు దాటి ఇరవై నిమిషాలు అయింది. "రాముడింకా బడినుండీ రాలేదేంటో?", అన్నాడు చంద్రం గేటువైపు చూస్తూ. "వస్తాడులెండి! అయినా మీకు మీ మనవడంటే ఎంత ప్రేముంటే మాత్రం? రోజూ కన్నా ఒక్క పది నిమిషాలు ఆలస్యమైనందుకు అంత కంగారు పడతారెందుకూ? ఎంతలేదన్నా వాడు పదేళ్లవాడయ్యాడు. పైగా వాడిని బడినుండీ తీసుకొచ్చేందుకు మన కోడలు హిమజ కూడా వెళ్ళింది కదా?", అంది అక్కడే కూర్చుని పుదీనాకు వలుచుకుంటున్న చంద్రం భార్య అలివేలు. "నేనేం కంగారు పడట్లేదులే! ఊరికే అడిగా!", అంటూ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు చంద్రం. అంతలో గేటు తీసిన చప్పుడైంది. హిమజ అభిరామ్ తో ఇంట్లోకి వచ్చింది. సాధారణంగా బడి నుంచీ ఇంటికి రాగానే 'తాతయ్యా' అంటూ చంద్రాన్ని వాటేసుకునే అభిరామ్ ఆ ర

దేవుని న్యాయం

కథా భారతి
- జానకి చామర్తి (మలేసియా) (TAGS (Telugu Association of Greater Sacramento) నిర్వహించిన “శ్రీ ఊఆణ్ మూర్తి స్మారక 3వ రచనల పోటీ”లో మొదటి బహుమతి పొందిన కథ) పార్కులో దీపాలు వెలిగాయి . శ్రీనివాసరావు కు లేచి రాబుద్ధవలేదు. చీకటి పడినా ఇంటికి చేరాలని అనిపించలేదు.   తండ్రి ని తలచుకుంటే అతనికి దడగా ఉంది. ఎందుకాయన అలా సణుగుతూ ఉంటాడు, ఏమి కావాలాయనకు . ఎనభైమూడేళ్ళ వయసు. ఆయనతో పోల్చుకుంటే తనే ఉసూరని ఉంటాడు. చెయ్యెత్తు మనిషి .  ఎముకలు ఎండిపోయి కండలు కరిగిపోయి కట్టెలాటి శరీరంతో ఎక్కడా వంగకుండా  ఇప్పటికీ అంగలు పంగలు వేసుకుంటూ నడవగలడు. ఆ నాలుక రుచులను చంపుకోలేదు , కోడలు ఉప్పెక్కువేసిందనో తక్కువేసిందనో , బూతులు తిట్టేయగల సమర్ధుడు. పద్మ అవన్నీ వినలేక తన కేసి బేలగా చూసినా తనూ ఏమీ చేయలేడు , నిస్సహాయంగా ఊరుకోవడం తప్ప. ఏమన్నా అన్నాడా తండ్రి పెంట పెట్టేస్తాడు చుట్టుపక్కల నాలుగు వీధులు వినిపించేట్టు అరుస్తూ. తన 

మౌనమేలనోయి

కథా భారతి
-రచన: కోసూరి ఉమాభారతి పొద్దుటే యోగాభ్యాసన ముగించి... గ్రీన్-టీ సేవిస్తూ ఇంటిముందున్న గార్డెన్ లోకి నడిచాను. సూర్యకిరణాలు నా పై పడేలా కుర్చీ లాక్కొని కూర్చున్నాను. ఈ మధ్యనే సంజీవరెడ్డి నగర్ లోని మా కొత్త ఇంట్లోకి వచ్చాక.. ప్రాణం హాయిగా ఉంది. బోలెడంత స్థలం. నా మ్యూజిక్ ప్రాక్టీసుకి ప్రత్యేకంగా పై అంతస్తులో స్టూడియో కూడా. టీ కప్పు తీసుకుని ఇంట్లోకి వెళ్లబోతుంటే, పట్టాభి పరుగున వచ్చి రింగవుతున్న నా ఫోన్ అందించాడు. చూస్తే ఊర్మిళమ్మ నుండి.. ‘అమ్మో, ఈమె నాకు ఫోన్ చేసిందేమిటి?’ అనుకుంటూ, “హలో నమస్తే అత్తయ్య, ఎలా ఉన్నారు? చెప్పండీ” అన్నాను తిరిగి కుర్చీలో కూర్చుంటూ. “నిన్న నీ మ్యూజిక్ ప్రోగ్రాంకి వస్తిమి శ్యామా. మీ మామయ్యకి సిటీలో జరిగే కార్యక్రమాలకి ఆహ్వానాలు వస్తుంటాయి కదా! ‘సరిగమప’ వాళ్ళ కార్యక్రమంలో నీవు పాడుతున్నావని చూసి.. ప్రోగ్రాంకి వద్దామనుకుంటిమి. ఆఖరి నిముషంలో మీ మామయ్య క్యాంప్ కి

ఠింఠాకరాళుడు

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి స్వర్గంలో ఇంద్ర సభ జరుగుతోంది. చర్చించే విషయం భూమి మీద జీవితం అసహ్యకరమైనది. తుఛ్ఛమైన చీము, రక్తంతో కూడుకుని రోగాలతో ఎవరు ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితుల్లో అదే ఆనందం అనుకుంటూ బతకడం. తీరా దేహం చాలించాక వెళ్ళేది నరకానికో స్వర్గానికో తెలియదు. అలా బతుకుతూ కూడా సంతోషంగా ఉన్నామని మానవులు భావించుకోవడం, చావు తరుముకొస్తున్నా ఎల్లకాలం జీవిస్తామేమో అనుకుంటూ ఆస్తులు కూడబెట్టుకోవడమూను. వింత ఏమిటంటే, భూమ్మీద బతికినంతకాలం భగవంతుడూ, స్వర్గ నరకాలు ఉన్నాయని అనుకుంటూ ఓ రకం మనుష్యులు ఉంటే అసలు అవి లేనే లేవని మరో రకం వాదనలు వినిపించే జనం కోకొల్లలుగా ఉన్నారు. సభ ఇలా జరుగుతూండగానే కళావతి అనే ఒక అప్సర భామ, ఇంద్రుడి అనుమతితో చెప్పడం సాగించింది, “మీరందరూ చెప్పినది బాగానే ఉంది కానీ ఇక్కడ స్వర్గంలో కన్నా భూమ్మీద జీవితమే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదట భూమి మీద మంచి కార్యాలు చేయ