సారస్వతం

రండి! కాళన్నను ఆవాహన చేసుకుందాం!!

సారస్వతం
 - సంగిశెట్టి శ్రీనివాస్‍   1937లో 23 యేండ్ల వయసులో నిజామాబాద్‍ ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నది మొదలు 2002లో చనిపోయే వరకూ మొత్తం ఆరున్నర దశాబ్దాల పాటు నిరంతరం ప్రజాక్షేత్రంలో న్యాయం వైపు, పీడితుల వైపు నిలబడ్డ గొంతుక, ధిక్కార పతాక కాళోజి నారాయణరావు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తెలుగు ప్రజలందరి గుండెల్లో కాళన్నగా నిలిచిపోయిండు. ఆర్యసమాజీయుడిగా, ఉద్యమకారుడిగా, హక్కుల కార్యకర్తగా, నిజాం ఫ్యూడల్‍ పాలనపై నిరసన తెలిపి జైలుకెళ్ళిన ప్రజాస్వామ్యవాదిగా, కవిగా, కథకుడిగా, అనువాదకుడిగా, పేదల అడ్వకేట్‍గా, ఎమ్మెల్సీగా ఎప్పటికప్పుడు తన, పర అనే తేడా లేకుండా తప్పెవరు చేసిన తిప్పి కొట్టిండు. తోటి వారి బాధను తన బాధగా పలవరించిండు. కన్నీళ్ళ పర్యంతమయ్యిండు. మొత్తం తెలుగువారి ఇంటి మనిషిగా, తెలంగాణ ప్రజలకు ఆత్మీయుడిగా, ఆత్మగా బతికిన కాళోజి నారాయణరావు శతజయంతి సందర్భమిది. అనితర సాధ్యమైన ఆయన ఆచరణను ఆవాహన చేసుకోవా

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు - వాసక సజ్జిక - టేకుమళ్ళ వెంకటప్పయ్య "ప్రియాగమనవేళాయాం మణ్డయన్తీ ముహుర్ముహుః|/కేళీగృహం తథాత్మానం సా స్యాద్వాసకసజ్జికా||" అని విద్యానాథుడు తన ‘ప్రతాపరుద్రీయము’లో వాసకసజ్జిక యొక్క లక్షణాలను చెప్తాడు. వాసకం అంటే ఇల్లు, వస్త్రం, పరిమళం వెదజల్లే మూలిక / వేరు, సజ్జిక అంటే సిద్దంగా ఉండడం అందుకే వాసక సజ్జికకు ఆ పేరు. ఈ తరహా నాయిక ప్రియుడు లేక పతిరాక కోసం ఎదురుచూపులు చూస్తూ, ఏ క్షణమైనా రావచ్చునని తనను, తన పడకగదిని సుమనోహర, పరిమళ, సుగంధ భరితంగా అలంకరించుకొని తన పతికి కనువిందు చేయటానికి సిద్ధంగా ఉండే నాయిక. రకరకాల మణులు పొదిగిన బంగారు ప్రమిదల్లో సువాసన గల తైలం పోసి దివ్వెలను వెలిగించి, లేత తమలపాకులు, పోకచెక్కలు, పచ్చకర్పూరం, కుకుమపువ్వు, యాలకులు, లవంగాలు ఒక అందమైన పళ్ళెంలో సిద్ధం చేసుకుని ప్రియునికోసం యెదురు చూసే నాయిక. ఈమె అందంగా తయారై ప్రియుని రాకకోసం తద్వారా లభించే ఆనందాల కోసం న

దాశరధి 92వ జయంతి(1925-1987)

సారస్వతం
" నా తెలంగాణా కోటి రతనాల వీణ" – తాటిపాముల మృత్యుంజయుడు ఎవరు కాకతి! ఎవరు రుద్రమ! ఎవరు రాయలు! ఎవరు సింగన! అంతా నేనే! అన్నీ నేనే! అలుగు నేనే! పులుగు నేనే! వెలుగు నేనే! తెలుగు నేనే! పూర్తి పేరు: దాశరధి కృష్ణమాచార్యులు తల్లిదండ్రులు: వేంకటమ్మ, వేంకటాచార్యులు జననం: 22 జులై 1925 - ఖమ్మం జిల్లా (అప్పడు వరంగల్ జిల్లా) చిన గూడూర్ గ్రామం మరణం: నవంబరు 5, 1987 చదువు: బి.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఉద్యోగాలు: ఉపాధ్యాయుడు, పంచాయతీ ఇన్ స్పెక్టరు‌, ఆకాశవాణి ప్రయోక్త రచనలు: గాలిబ్ గీతాలు, మహాంద్రోదయం, తిమిరంతోసమరం, అగ్నిధార, రుద్రవీణ, కవితాపుష్పకం, ఆలోచనాలోచనాలు‌‌, రుద్రవీణ, అమృతాభిషేకం సినిమా పాటలు: ఆరుద్ర ,ఆత్రేయ ,సినారె వంటి సమకాలికులతో పనిచేస్తూ 2000 పైగా పాటలు రాసారు. బిరుదులు, సత్కారాలు: 'కవితాపుష్పకం‌' కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు,'తిమిరంతో సమ

ఉపనిషత్తులు

సారస్వతం
శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి) ​వేదాల యొక్క చివరి భాగాలను అంటే అంతములయిన (వేద+అంతములు)వేదాంతాలకు ఉపనిషత్తులని పేరు. ఉపనిషత్తులు మనమంతా దివ్యాత్మ స్వరూపులమని చెబుతున్నాయి .మరణించే ఈ శరీరంలో అమృతత్త్వమైనది ఒకటి ఉంది. అదే ఆత్మతత్త్వం. మానవుడు ఇంద్రియాలు తమంతట తామే పని చేస్తున్నాయని అనుకుంటాడు . కానీ, అంతర్గతంగా లోపల ఉన్న శక్తితత్త్వమే దివ్య చైతన్యమనీ మానవునికి తెలియదు. లోపలున్న ఆత్మ మనకంటికి కంటిగా, చెవులకు చెవిగా, మనస్సుకు మనస్సుగా ఉన్నదని కేనోపనిషత్‌ ఉద్ఘోషిస్తుంది. శరీరంలోని ఒక అవయవం ఇంకొక అవయవాన్ని బాధించడం అసహజమైన చర్య. ఆ విధంగానే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి భగవంతుని అవయవాలు.ఈ ఆత్మ చెవికి చెవి, మనసుకు మనసు, వాక్కునకు వాక్కు మరియు ప్రాణానికి ప్రాణము, కన్నుకు కన్ను అని ఆ పరబ్రహ్మ తత్వాన్ని అపూర్వ౦గా తెలిపినది కేనోపనిషత్. అడవులలో గురుశిష్యుల మధ్యన జరిగిన చర్చలనే ‘ఉపనిషత్తులు’ అంటారు. ఈ ఉప

భక్తి వ్యసనంగా మారకూడదు!

సారస్వతం
(కార్టూన్ సౌజన్యం --మిత్రుడు శ్రీ రామకృష్ణ గారు) -శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) ​నాకొక మిత్రుడున్నాడు.నా కన్నా వయసులో చాలా చిన్నవాడే!24 గంటలూ భక్తి టీవీ చూస్తుంటాడు.అన్ని భక్తి కార్యక్రమాలకు వెళ్లుతాడు. వివిధ యాత్రాస్ధలాలు చూస్తుంటాడు. కుటుంబం కోసం కన్నా ఎక్కువ కాలాన్ని భక్తి కార్యక్రమాలకు కేటాయిస్తాడు. అడ్డూ, అదుపు లేకుండా ధనాన్ని భక్తి కార్యక్రమాలకోసమే విపరీతంగా ఖర్చు చేస్తాడు.ఎన్నో గ్రంధాలను కొంటాడు.నిజానికి అతనొక మధ్యతరగతి కుటుంబీకుడు. పైకి రావలసిన పిల్లలున్నారు.కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వహించలేక పోతున్నాడేమోననిపిస్తుంది!ఒక్కొక్కసారి తాదాత్మ్యం చెంది ,"నాకు శివుడిలో లీనం కావాలనిపిస్తుందని అంటాడు!శివైక్యం చెందని జీవితం వృధా" అని అంటాడు. నిజం చెబితే బాధపడుతారేమో కానీ ఇవన్నీ histrionic లక్షణాలు. సాధారణంగా ఈ లక్షణాలు ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కూడా చాలామంది

అన్నమయ్యకు ఆరాధనా నివాళి 

సారస్వతం
- దీప్తి కోడూరు  భగవంతుని గుణకీర్తనం చేసి తరించిన భక్తులు ఎందరో మన దేశంలో ఉద్భవించారు. వీరినే భక్త కవులంటారు. భక్త కవుల గురించి సుదీర్ఘ వివరణలు చెప్పుకునేకంటే ఒక్క సంఘటనను స్మరిస్తే వారి అంతరంగం స్పష్టమవుతుంది. ఒకనాడు ఒక భక్తురాలు భగవాన్ శ్రీ రమణ మహర్షి వద్ద ఇలా అడిగింది,"నాయనా త్యాగయ్య అన్నమయ్య రామదాసు వీరంతా గానం చేసి తరించారు కదా! అది అందరికీ సాధ్యమవుతుందా?" అని. దానికి మహర్షి చిన్న చిరునవ్వుతో ఇలా జవాబిచ్చారు, "అమ్మా వారంతా గానంతో తరించలేదే, తరించాకే ఆ అనుభవాన్ని గానం చేశారు. " ఒక మహాత్ముని అంతరంగాన్ని ఇంకొక మహాత్ముడు తప్ప సామాన్యులు ఎలా అర్ధం చేసుకోగలరు?!! మీరాబాయి, గోదాదేవి, అక్కమహాదేవి, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు, తులసీదాసు, కబీరుదాసు, నామదేవుడు, రామానందుడు, సూరదాసు, బసవన్న, అల్లమప్రభువు, రవి దాసు, తుకారాం , చైతన్య ప్రభు చెప్పుకుంటూ పోతే మన దేశంలో మహానుభావులు ఉదయించ

అనుభూతి – ప్రాచీన దృక్పథం (5వ- భాగం)

సారస్వతం
– సునీల పావులూరు వ.క్ర. ప్రవృత్తి కోశం అనుభూతి 1 ఇంద్రియచైతన్య ప్రవృత్తి అన్నమయకోశం వాస్తవికానుభూతి 2 భావచైతన్య ప్రవృత్తి మనోమయకోశం కాల్పనికానుభూతి 3 జ్ఞానచైతన్య ప్రవృత్తి విజ్ఞానమయకోశం జ్ఞానానుభూతి 4 జీవచైతన్య ప్రవృత్తి ప్రాణమయకోశం పూర్ణచైతన్యాంశం 5 ఆధ్యాత్మికచైతన్య ప్రవృత్తి ఆనందమయకోశం తాత్త్వికానుభూతి “ఈ అయిదు కోశాలద్వారా పొందే అనుభవం సమాజంలో ఉంది. దానితో సహజీవనం చేయటం సామాజిక జీవితం; ఆ సహజీవనంలో వ్యక్తి సహజ ప్రవృత్తికి శక్తిగా వ్యక్తమౌతాడు. సామాజికానుభూతిని రికార్డుచేసే సాత్త్వికసాధనం మనిషి. రికార్డుచేసి ఊరుకుంటే సామాజికుడు. దాన్నే ఉద్దీపనం చ్బెసి సాహిత్యరూపంగా అభివ్యక్తీకరిస్తే రచయిత. సమాజంలో భుక్తమౌతున్న అనుభ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు - స్వాధీనపతిక -టేకుమళ్ళ వెంకటప్పయ్య అష్టవిధ నాయికల గురించిన ప్రస్తావన మొట్టమొదట క్రీ.పూ.2వ శతాబ్దంలో భరతముని సంస్కృతంలో రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనబడినది. 16వ శతాబ్దిలో జీవించిన కందుకూరి రుద్రకవి అష్టవిధ నాయికలను వర్ణిస్తూ జనార్ధనాష్టకం రచించాడు. అష్టవిధ నాయికలు కేవలం రచనల్లోనే కాక చిత్రకళ, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్య సాంప్రదాయాలలో తెలుపబడ్డాయి. మధ్యయుగపు చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి. అన్నమయ్య రచించిన శృంగార కీర్తనల్లో ఈ నాయికల విశేష వర్ణన ఉంది. అన్నమయ్యకు ఈ ప్రేరణ వైష్ణవ భక్తి నుండి సంక్రమించినదని భావించవచ్చు. అన్నమయ్య శ్రీవైష్ణవ వేదాంత పద్ధతి ననుసరించి, శ్రీవైష్ణవ మతమునకు చెందిన పండ్రెండుమంది ఆళ్వార్ల యొక్క "నాలాయిర దివ్య ప్రబంధము"లో నున్న నాయికా భావనకు అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. గురువుల యొద్ద నేర్చిన వేదాంతము, ఆళ్వారుల

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య నాయికలలో వయస్సును, కౌశలాన్ని బట్టి "ప్రౌఢ" అనే నాయికను సాహిత్య దర్పణము "స్మరాంధా గాఢ తారుణ్యా సమస్త రతికోవిదా/భావోన్నతాదరవ్రీడా ప్రగల్భా క్రాంత నాయకా" అని పరిచయం జేస్తుంది. అనగా స్మరాంధురాలు, సంపూర్ణ యౌవనము గలది, శృంగారచేష్టలు గలది, కొంచెం సిగ్గు గలిగి నాయకుని వశపరచుకొన్న స్త్రీ అని అర్ధము. ప్రౌఢకు ప్రగల్భ అని నామాంతరము గలదు. ఒక ప్రౌఢ నాయికతో చెలికత్తెలు ఈ క్రింది కీర్తనలో ఎలా మేలమాడుచున్నారో గమనించండి. ఎంత మనసెరిగిన నాయికవైనా ఇంత అతిచనువు పనికిరాదు నీకు, ఆ కుప్పిగంతులేమిటి? ఆ మొరటుదనంతో ప్రవర్తించడమేటి? హవ్వ. ఇది నీకు తగునా? అని చనువుగా అమ్మను మందలిస్తున్నారు. కీర్తన: పల్లవి: ఇల్లాలికిఁ దగునటే యింత రట్టడితనము వొల్లనే మితిమేరతో నొనగూడవలదా చ.1. రవ్వలుగా నవ్వేవు రతికిట్టె లాచేవు చివ్వన పతిముందర సిగ్గువడవు వువ్విళ్లూరఁ జన్నులను వూఁదేవాతని వీఁపున ఇవ్

మనకేం కావాలి?

సారస్వతం
- దీప్తి కోడూరు మనం రోజూ చేసే పనులు, ఆలోచనలు, తీర్మానాలు, నిశ్చయాలు అన్నీ క్రోడీకరించి చూసుకుంటే మనందరం 3 అంశాల కోసం ఆరాటపడుతుంటాము అని అర్ధమైపోతుంది. కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే మనమే అవేంటో తెలుసుకోవచ్చు. ఒకడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. వాడికి ఆ అమ్మాయి తప్ప మరో లోకం లేకుండా బతికేస్తున్నాడు. వాడిని, "నీకు ఏం కావాల్రా?" అని అడిగితే ఏం చెప్తాడు. ప్రతిక్షణం తన ప్రియురాలి చెంత గడిపేస్తే చాలు అంటాడు. ఎందుకు రా? అంటే అదే నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది అంటాడు. సరే మరొకడు ఉన్నాడు. వాడికి రాజకీయాలంటే ఇష్టం. నీకేం కావాలిరా అనడిగితే, "నాకు ఫలానా పదవి కావాలి అంటాడు" వాడు నిజాయితీపరుడైతే, పదవులు ఎందుకు రా అంటే "నేను అందరికంటే గొప్ప పనులు చేసే అవకాశం వస్తుంది. అందరికీ సహాయం చేయగలను. దాని వల్ల అందరూ నన్ను గౌరవంగా చూస్తారు. ఆ తృప్తి చాలు నాకు." అంటాడు. అలాగే ఇంకొకడు వ్యాపారం చేసుక