సారస్వతం

ఆధ్యాత్మిక అహంభావం

సారస్వతం
-శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి) ఈ మధ్య నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక ఆధ్యాత్మిక గ్రంధాన్ని పోస్ట్ లో పంపించాడు.దానికొక రచయిత(?) కూడా ఉన్నాడు. ఆ గ్రంధంలోని విషయాలన్నీ ప్రాచీన గ్రంధాలలోని విషయాలను ఏర్చి కూర్చినవి.ఆ శ్లోకాలను వ్రాసిన వారు పరమ పురుషులు,అద్వైత సిద్ధాంత ప్రవచకులు,సాక్షాత్తు శంకర స్వరూపులు.అలా ఏర్చికూర్చిన గ్రంధానికి 'రచయిత ' అని పేరు పెట్టుకోవటం ఆది శంకరులకు ద్రోహం చేయటమే!దీనినే ఆధ్యాత్మిక అహంభావం అని అనవచ్చు.జ్ఞానం వలన అహంభావం పెరిగే అవకాశం ఉన్నదని మరొకసారి తెలుసుకున్నాను.మనసు ఎలాగైతే సృజనాత్మక దృష్టితో సృష్టి చేయగలదో, అలాగే అదే మనసుకు నసింపచేసే శక్తికూడా ఉన్నదని 'జ్ఞానయోగం'ద్వారా తెలుసుకొనవచ్చును.అన్నీ నాకే తెలుసు అని అనుకోవటం అహంకారం,అజ్ఞానం.నాకు తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది ఇంకా ఎక్కువ ఉంది అని అనుకోవటం 'జ్ఞానం'.ఈ అజ్ఞానపు చీకటిలో పడిన ఇంకా చాలామంది ఆధ్యాత్మికవేత్తలు మ

జ్ఞాన భూములు

సారస్వతం
మన దేశ సంస్కృతి అంతా గంగానదితో పెనవేసుకొని ఉంది. గంగకు ఎగువున ఉన్న హిమాలయాలను దేవభూములు అని, గంగానది పర్వతాలనుండి మైదానాలకు వచ్చిన ఋషీకేశ్, హరిద్వార్ లను జ్ఞానభూములు అని, ఇంకా గంగకు దిగువ ప్రాంతమంతా కర్మభూమి అని పరిగణిస్తారు. శివుని జటాజూటం నుండి బయలు వెడలి భగీరధుని వెంట ప్రయాణించిన పాయను భాగీరధి అంటారు. ఇది గంగోత్రి వద్ద గోముఖం ద్వారా బయటకు వస్తుంది. గంగోత్రి నుండి ఋషీకేశ్ కి వచ్చే దారిలో 5 ప్రయాగలు (సంగమ స్థానాలు) ఉన్నాయి. (1) విష్ణుప్రయాగ వద్ద అలకనంది దౌళీగంగతో కలిసి ముందుకు సాగి (2) నంద ప్రయాగ వద్ద నందాకినితో కలిసి సాగుతుంది. (3) కర్ణ ప్రయాగ వద్ద పిండారినదితో కలిసిన అలకనంద (4) రుద్ర ప్రయాగ వద్ద భాగీరధితో కలుస్తుంది. ఇక నుండి గంగానదిగా పిలవబడుతూ, ఋషీకేశ్ ను చేరుతుంది. ఇక్కడ గంగానది రెండు కొండల మధ్య యిరుకైన దారిలో పరవళ్ళు తొక్కుతూ 30కి||మీ|| ముందుకు సాగి హరిద్వార్ వద్ద సమతుల ప్రదేశం

అనుభూతి – ప్రాచీన దృక్పథం (4- భాగం)

సారస్వతం
– సునీల పావులూరు ఈ పంచకోశాల ద్వారా కలిగే సంపూర్ణమైన అనుభూతే సమగ్రానుభూతి. ఒక్కొక్క కోశం ద్వారా ఒక్కొక్క విధమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి పాక్షికంగా ఉంటుంది. సమాజం పాక్షికానుభూతిని కాకుండా సమగ్రానుభూతిని కాంక్షిస్తోంది. అనుభవం మానవసమాజానికి మూడు రకాలుగా అందించబడుతోంది. శాస్త్రపరంగానూ, తత్త్వపరంగానూ, కవిత్వపరంగానూ అనుభవ ఏకసూత్రత జరుగుతోంది. “భూమిమీద మనిషి అడుగు పెట్టినప్పట్నించీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికీ, ఈ ప్రపంచంతో సంధానం (adjustment) కుదుర్చుకోవటానికీ ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమంటే విభిన్నమైన ప్రాపంచిక అనుభవాల్లో ఏకసూత్రతని సాదృశ్యాన్ని సాధించటమన్నమాట. ఈ ప్రయత్నం శాస్త్రం ద్వారా, తత్త్వం ద్వారా, కవిత్వం ద్వారా మూడు విధాలుగా సాగింది. భౌతిక సంఘటనల్లో ఏకసూత్రతని సాధించటానికి శాస్త్రం పూనుకుంది. వివిధ శాస్త్రాలకు చెందిన భౌతిక సూత్రా

‘పూర్ణ పురుషుడు’, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు

సారస్వతం
  డా. ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి మొదటి భాగం : (2014 శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల  తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసవర్యుల 149వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన హరికథా సప్తాహంలో సమర్పించిన వ్యాసముల ఒకటి) ఉపోద్ఘాతము ‘సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖీ పరమేశ్వరుడు’, ‘హరికథా పితామహ’, ‘అట పాటల మేటి’ లాంటి ఎన్నో బిరుదులూ ఆయనను వరించాయి. ఆరున్నర దశాబ్దాల సంగీత, సాహిత్య, హరికథా కళా ప్రస్థానంలో ఆయన అందుకోని సన్మానం లేదేమో. రాజ సన్మానాలూ, పౌర సన్మానాలూ, బిరుద ప్రదానాలూ గజారోహణలు, సువర్ణ ఘంటాకంకణ ధారణలూ, గండపెండేర ధారణలూ ఇలా ఎన్నో, ఎన్నెన్నో గౌరవాలు ఆయనకు లభించాయి. ఆదిభట్ల నారాయణ దాసుగారు తెలుగులో, అచ్చతెలుగులో, సంస్కృతంలో సుమారు ఏభై గ్రంధాలను రచించారు. వాటిలో స్వతంత్ర కావ్యాలు, ప్రబంధాలు, అనువాద గ్రంధాలు, వచన గ్రంధాలు, కవితా సంపుటాలు, శ

Is God Dead?

సారస్వతం
శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) ​ఈ చరాచర జగత్తును సృష్టించిన దేవుడు చరమా లేక అచరమా?అచరమైతే చరమైన ఈ జగత్తును ఎలా సృష్టిస్తాడు?ఒక నిర్జీవమైన పదార్ధం మరొక నిర్జీవమైన లేక  జీవమున్న పదార్ధాన్ని ఎలా సృష్టించగలదు?మరింత క్లారిటీ కోసం--ఒక టేబుల్ మరొక టేబుల్ ను కానీ ,పిల్లిని కానీ సృష్టించగలదా ?మనకు బాహ్యంగా కనపడే సమాధానం సృష్టించలేదనే!చరమైతే జీవం ఉండాలిగా!జీవం ఉన్నదంటే మరణం కూడా ఉండాలిగా! Is God Dead?తమిళ డ్రామా Is God Dead? ను చాలా రోజుల క్రితం నేను చూసాను !దీని రచయిత చో రామస్వామి. చరం అంటే కొందరు కదిలేదని అంటారు. అచరం అంటే చలనం లేనిదని మరికొందరు అనుకుంటారు!ఇంతకీ మన స్కూటర్ చరమా?అచరమా?కదులుతుంది కాబట్టి చరమని అందామా?  చరాచరాలు అంటే కదలికను బట్టి నిర్ణయించలేమని పై ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం కదా!మరి ఈ సృష్టి ఎవరు ,ఎలా చేశారనే సందేహం మనల్ని ఎప్పటినుండో పీడిస్తుంది!ఒక్కమాటలో చెప్పాలంటే ఒక పెద్ద వ

నరసింహ సుభాషితం

సారస్వతం
నరసింహ సుభాషితం ధీరోదాత్తులు-1     ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి శ్లోకం:                    वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥   వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి । లోకోత్తరాణాం చేతాంసి కో హి విజ్ఞాతుమర్హతి ॥   సంధి విగ్రహం వజ్రాత్, అపి, కఠోరాణి, మృదూని, కుసుమాత్, అపి, లోకోత్తరాణాం, చేతాంసి, కః, హి, విజ్ఞాతుం, అర్హతి  శబ్దార్థం వజ్రాదపి = వజ్రముకంటెను కూడా, కఠోరాణి = కఠినమైనవి, మృదూని = సుకుమారమైనవి, కుసుమాదపి = పుష్పములకంటెను కూడా, లోకోత్తరాణాం = మహానుభావులైన కార్యవాదుల యొక్క, చేతాంసి = చేతల యందు,  కః హి = కోహి = ఎవరికైననూ,  విజ్ఞాతుమర్హతి = తెలిసికొనుట దుర్లభము. Meaning It is harder than diamond and impossible to understand the intent in the actions of

ఏకలవ్యుడు ఎవరు?-ఒక పరిశీలన

సారస్వతం
- టీవీయస్.శాస్త్రి (శారదాప్రసాద్) మనలో చాలామందికి ఏకలవ్యుడి కధ ఈ క్రింది విధంగా తెలుసు! ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప పాత్ర. ఇతను ఎరుకల కులానికి చెందినవాడు. ద్రోణాచార్యుని వద్ద విలువిద్యను అభ్యసించాలని కోరిక ఇతనికి ఎక్కువగా ఉండేది. ఆ కోరికను ద్రోణుడికి తెలియచేసాడు. ద్రోణుడు అతని కోరికను మన్నించక, దాన్ని తిరస్కరించాడు.కానీ కొన్ని కథల్లో, ద్రోణుడు ఏకలవ్యుడిని దూరంగా ఉంచటానికి కారణం అతని కులం అని చెపుతారు.ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా తెలియక ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషదారణతో ఏకలవ

కుంతి మాట – సత్సంగ్

సారస్వతం
- కుంతి మెయిన్ హాలులో చిన్న బల్బు వెలుగు మిగిలిన ఇల్లంతా చీకటిగా ఉంది. గోడగడియారము పన్నెండు గంటలు కొట్టింది. సోఫాలో దిగాలుగా కూర్చున్న అన్నపూర్ణమ్మ. అదే హాలులో, ఉబికి వస్తున్న కన్నీరునాపుకుంటూ వెక్కిళ్ళు పెట్టడానికి సిద్ధపడుతున్న గుండెను అదుము కుంటూ, అన్యమనస్కంగా పచార్లు చేస్తున్నది అన్నపూర్ణమ్మ మనవరాలు అపరాజిత. వారిరువురూ గేటు వెలుపలి రోడ్దు వైపుకు చూస్తున్నారు. బయట ముసురు పడుతున్నది. ఇంతలో స్కూటర్ శబ్దము వినిపించింది. ఇద్దరూ ఒకేసారి అటు వైపుచూసారు. నిండుగా తడిసిన శ్రీ రామచంద్రమూర్తి స్కూటర్ పార్క్ చేసి కురిసిన వర్షము వలననో, జారిన కన్నీటి వలననో తడిసిన శరీరముతో లోపలికి వచ్చాడు.. అతడు దీనంగా ఉన్నాడు.ఇంతలో మళ్ళీ గేటు శబ్దమైంది. ముగ్గురు అటు వైపు చూసారు. తండ్రిలాగే తడిసి ముద్దైన రాజీవ్ తన బైక్ ను పార్క్ చేసి ఇంటిలోనికి వచ్చాడు. ఇద్దరు గంభీరంగా ఉన్నారు. ఆ యింట్లోని వారికి , వారి వాలకము చూస

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య ముగ్ధ నాయిక గురించి అన్నమయ్య చెప్పిన చక్కని కీర్తన గురించి తెలుసుకుందాం. ముగ్ధ అనగా ఉదయించుచున్న యౌవనముగలది. పండ్రెండేండ్ల వయసుగల యువతి అని నిఘంటువులు చెప్తున్నాయి. రామరాజ భూషణుడు తన కావ్యాలంకార సంగ్రహం లో ఇలా నిర్వచించాడు. కీర్తన: శా. ఆలాపంబున కుత్తరంబొసగ దాయాసంబునంగాని, తా నాలోకింపదు; పాటలాధరమరందాస్వాద సమ్మర్ధ ముం దాళంజాలదు; కౌగిలీయదు, తనూ తాపంబు చల్లాఱగా నేలజ్జావతి ; త ద్రతంబు దయితాభీష్టంబు గాకుండునే? అనగా అప్పుడే ఉదయించుచున్న యౌవనము గల స్త్రీకి బిడియము మొదలైనవి సహజంగానే ఉంటాయని చెప్పాడు. మనం భక్తి విషయానికి వస్తే... అన్నమయ్య ప్రతి పదమూ భక్తి రసస్ఫోరకమే అన్న విషయం తెలుస్తుంది. ఆది శంకరుల వారు వివేకచూడామణిలో "మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి" అంటాడు. అన్నమయ్య తను సర్వం సహార్పణ గావించి సృష్టించిన అనంత సాహిత్య నిధిని ఎన్ని వందల సంవత్సరాలైనా మన

నరసింహ సుభాషితం

సారస్వతం
- ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి శ్లోకం: यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।। యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం? । లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి? ।। సంధి విగ్రహం యస్య, న, అస్తి, స్వయం, ప్రజ్ఞా, శాస్త్రం, తస్య, కరోతి, కిం। లోచనాభ్యాం, విహీనస్య, దర్పణః, కిం, కరిష్యతి।। శబ్దార్థం యస్య = ఎవనికి, నాస్తి = లేదు, తస్య = అతనికి, కరోతి = చేస్తుంది, కిం =ఏమి, శాస్త్రం = ఏ విషయ గ్రంథమైనా, లోచనాలు = కళ్ళు, విహీనస్య = లేని వానికి, దర్పణః = అద్దం, కిం =ఏమి, కరిష్యతి =చేయగలదు Meaning One who does not have any stuff with in him or does not possess any inherent abilities and grasping of things, what a Shastra or subject can do to him? Means, subjects simply cann