సారస్వతం

కొప్పరపు కవులు

సారస్వతం
-టీవీయస్.శాస్త్రి భారతీయ భాషా సాహిత్యాలలో మరే భాషకు లేని విలక్షణమైన స్థానాన్ని తెలుగు భాషా సాహిత్యాలకు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానం. పద్య విద్యకు పట్టంగట్టిన సాహిత్య ప్రదర్శన కళగా అవధాన ప్రక్రియ ప్రత్యేక గుర్తింపును పొందింది నాటి తిరుపతి వెంకటకవులు, కొప్పరపు సోదర కవులు మొదలుకుని ఆధునిక కవుల వరకు పద్యాన్ని అవధాన వేదికలపై ఊరేగించిన మహాకవులెందరో ఉన్నారు. కాళిదాసు కావ్యాలకు సంజీవనీ వ్యాఖ్య రాసి విశ్వవిఖ్యాతి గడించిన మల్లినాథసూరి మెదక్ జిల్లావాడే. వీరి తాతగారైన మల్లినాథుడు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని ఆస్థానంలో శతావధానం నిర్వహించి కనకాభిషేక సత్కారాన్ని పొందాడని ప్రతీతి. బహుశా వీరే మొట్టమొదటి అవధాని అయి ఉంటారు. ఈ విషయమై విస్తృతమైన పరిశోధన చేయవలసి ఉంది.కొప్పరపు సోదర కవులు తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదరకవులు. కొప్పరపు కవులుగా ప్రఖ్యాతులైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, కొప్పరప

అన్నమయ్య శృంగార నీరాజనం జనవరి 2020

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య పూవుటమ్ములు మరుఁడు అన్నమయ్య శ్రీ వేంకటనాధుని విరహవేదనను వివరిస్తున్నాడు. ఆ మన్మధుడు నా మదిలో మరులు రేపుతున్నాడు. చిలిపి కయ్యాలెందుకు? నేను శ్రీవేంకటేశ్వరుడను. నీ పతిని అంటూ శ్రీనివాసుడు అమ్మ పద్మావతిని కోరుతున్నాడు. శ్రీకృష్ణావతార రీతిలో వేడుకుంటున్నాడు. అన్నమయ్య ఊహ మరియూ భావనా ప్రపంచ విహారానికి ఈ కీర్తన అద్దం పడుతున్నది. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: పూవుటమ్ములు మరుఁడు పూఁచినాఁ డేమరఁడు రావే నామాఁట విని రవ్వపడనేఁటికే ॥పల్లవి॥ చ.1 వద్దు నీచలము వలపించఁగలము! నీ కొద్ది దెలిసిన దాఁకా గొంకే మింతే అద్దొ యిటువలె నలిగేవా నెంతలేదు చద్దికి వేఁడికి నవి సాగ వింతేకాక ॥పూవు॥ చ.2 యింతేలే నీకోపము యిందు కెల్లా నోపము! నీ- పంతము చూచినదాఁకా పాటించే నింతే యెంతో బిగువుతోడ యెలయించే దెంతలేదు సంతతము పతి వద్ద జరగదుగాక ॥పూవు॥ చ.3 మానవే నీబిరుదు మాకు నివి యరుదు నానఁబెట్టి క

భక్తి-ముక్తి

సారస్వతం
-​శారదాప్రసాద్  ​​ఈ నాడు తెలుగుదేశంలో భక్తి విపరీతంగా ప్రవహిస్తుంది.ఎన్నో భక్తి చానళ్ళు ,ఎందరో ప్రవచనకారులు, స్వాములు, పీఠాధిపతులు భక్తిని గురించి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కొంతమంది స్వాములకు, మహర్షులకు(?) ఏకంగా స్వంత చానళ్ళు ​కూడా ఉన్నాయి ​.​అందరి ప్రవచనాలు ​వినటానికి జనం కూడా విపరీతంగా వెళ్ళుతున్నారు. ఒకవైపు భక్తి విపరీతంగా పెరుగుతున్నా మరొకవైపు అశాంతి, ​అవినీతి ,​అన్యాయం ​దానికి రెట్టింపుగా ​పెరుగుతున్నాయ​నది కూడా వాస్తవమే. ఈ మధ్య ఒక రాజకీయనాయకుడు మాట్లాడుతూ ,దేవాలయాల ఆదాయం పెరగటానికి భక్తులు ఎక్కువగా చేస్తున్న పాపాలు కూడా కారణం అన్నారు.అది కొంతవరకు వాస్తవం కూడా కావచ్చు.ఆయన అవి స్వానుభవం వలన చెప్పిన మాటలు కూడా కావచ్చు!ఎందుకంటే ,సదరు నాయకుడు ఆ మధ్యనే ఆయన మనవడి జన్మదినం సందర్భంగా అధికంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చాడు.నిజమైన భక్తుడు భక్తికొలది ఏదో ఒకటి ముడు

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య నిచ్చలు నాబతుకెల్ల నీచేతిది ఈ కీర్తనలో అన్నమయ్య అమ్మ అలమేలుమంగమ్మ గా మారి నివేదిస్తున్నాడు. శ్రీనివాసునితో వివిధ శృంగార రీతుల వివరాలు విన్నవించింది. కొంత ప్రణయకోపాలు ప్రకటించింది. ఆ పిమ్మట స్వామికి చేరువై స్వామిని మనసారా ఏలుకొమ్మని శరణువేడింది. పలు ఉపాయాలతో ఆ స్వామికి చేరువైన అమ్మ ప్రణయ విహార విశేషాలను అంటూ సాగుతుంది ఈ కీర్తన. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: నిచ్చలు నాబతుకెల్ల నీచేతిది । నీ- యిచ్చవచ్చినట్టు సేయు మెదురాడ నిఁకను ॥పల్లవి॥ చ.1 పలికితి నీతోడఁ బంతములు సారెసారె సొలసితిఁ గొంత గొంత చూపులలోను అలసితి నిఁకనోప నన్నిటా నీచిత్తమునఁ గలిగినయట్లఁ జేయు కాదన నే నిఁకను ॥నిచ్చ॥ చ.2 కక్కసించితిని నిన్ను ఘనమైనరతులను వెక్కసానఁ గొసరితి వేసరించితి మొక్కెద నిఁక నేనేర మొదల నుపాయాలు మక్కువ గలట్టే సేయు మఱఁగేల యిఁకను ॥నిచ్చ॥ చ.3 కరఁగించితి మనసు కాఁగిటిరతుల నిన్ను

భక్తి-ముక్తి

సారస్వతం
​-శారదాప్రసాద్ ఈ నాడు తెలుగుదేశంలో భక్తి విపరీతంగా ప్రవహిస్తుంది. ఎన్నో భక్తి చానళ్ళు, ఎందరో ప్రవచనకారులు, స్వాములు, పీఠాధిపతులు భక్తిని గురించి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కొంతమంది స్వాములకు, మహర్షులకు(?) ఏకంగా స్వంత చానళ్ళు ​కూడా ఉన్నాయి ​.​అందరి ప్రవచనాలు ​వినటానికి జనం కూడా విపరీతంగా వెళ్ళుతున్నారు. ఒకవైపు భక్తి విపరీతంగా పెరుగుతున్నా మరొకవైపు అశాంతి, ​అవినీతి,​ అన్యాయం ​దానికి రెట్టింపుగా ​పెరుగుతున్నాయ​నది కూడా వాస్తవమే. ఈ మధ్య ఒక రాజకీయనాయకుడు మాట్లాడుతూ, దేవాలయాల ఆదాయం పెరగటానికి భక్తులు ఎక్కువగా చేస్తున్న పాపాలు కూడా కారణం అన్నారు.అది కొంతవరకు వాస్తవం కూడా కావచ్చు.ఆయన అవి స్వానుభవం వలన చెప్పిన మాటలు కూడా కావచ్చు! ఎందుకంటే, సదరు నాయకుడు ఆ మధ్యనే ఆయన మనవడి జన్మదినం సందర్భంగా అధికంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చాడు. నిజమైన భక్తుడు భక్తికొలది ఏదో ఒకటి ముడు

పౌరికుడు

సారస్వతం
-శారదాప్రసాద్ ధర్మరాజు ! " పితామహా ! చాలామంది లోపల సౌమ్యంగా ఉండి పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. మరి కొందరు లోపల దుర్మార్గంగా ఉండి పైకి చాలా సౌమ్యులుగా కనిపిస్తుంటారు. మరి వారిని గుర్తించడం ఎలాగో వివరించండి " అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు " ధర్మరాజా! నీవు అడిగిన దానికి నేను ఒక పులి నక్క కథ చెప్తాను.శ్రద్ధగా వినుము! పురిక అనే పట్టణాన్ని పౌరికుడు అనే రాజు పాలించే వాడు. ఆ రాజు చాలాక్రూరుడు. అతడు మరణించిన అనంతరం ఒక నక్కగా పుట్టాడు. పూర్వ జన్మజ్ఞానం కలిగిన ఆ నక్క కనీసం ఈ జన్మలో బాగా బ్రతుకుదామన్న కోరికతో అహింసావ్రతం ఆచరించి ఆకులు అలములు తింటూ చిక్కిశల్యమైంది. అది చూసిన తోటి నక్కలు " ఇదేమి వ్రతం? మాంసాహారులం అయిన మనం ఇలా శాకములు తిన వచ్చా ? " అని అడిగాయి . అందుకు నక్క బదులు చెప్పలేదు. ఈ విషయం తెలిసిన ఒక పులి నక్క వద్దకు వచ్చి " నక్కా ! నీవు చాలా సౌమ్యుడివి అని విన్నాను. నువ్వు న

భారతీయ – సాహిత్యం – ఆధ్యాత్మికత

సారస్వతం
[ - కల్లూరి సత్యరామ ప్రసాద్ (హైదరాబాద్) చిన్మయ మిషన్; కొత్తపట్నం - 523 286 (ప్రకాశం జిల్లా) ఆం.ప్ర. చరవాణి -> 919493403972 ] "సహిత" అనే మాటనొక విశేషణపదంగా తీసుకుంటే - దానిని 1) స+హిత = "హితము (శ్రేయస్సు)తో కూడిన" లేదా 2) "కలిసి ఉన్న" (సంస్కృతంలోని 'సహ' అనే మాట దీనికి ప్రాతిపదిక కావచ్చునేమో?) - అనే అర్థాలున్న మాటగా మనం భావించవచ్చు. కాబట్టేనేమో - దీనిలోనుండి వచ్చిన "సాహిత్యం" అనే మాటకు 1) "అర్థగౌరవం/చమత్కారంతో కూడిన రచన (rhetoric composition); 2) కూడిక/కలయిక (association/fellowship) అనే నిఘంటు-నిర్వచనాలున్నాయి. తరచి చూస్తే - నిజానికి "సాహిత్య"మనే మాటకు "పై రెండర్థాల కలయికే" సరైన నిర్వచనమేమోననిపించక మానదు! అయితే, మన వ్యవహారంలో "సాహిత్యమంటే - ఒక ప్రత్యేక అంశంపైన చేయబడిన రచన" అని చెప్పుకుంటున్నాం కదా! వివిధాంశాలపైన ఆధారపడి ఈ సాహిత్యం రకరకాలుగా ఉండచ్చు - "పద్యసాహిత్యం

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము ఈ కీర్తనలో అన్నమయ్య అమ్మ అలమేలుమంగమ్మ, చెలులతో గూడి స్వామికి విన్నవించుకుంటున్నపలుకులను మనకు అందిస్తున్నాడు. విశేషం ఏమిటంటే అన్నమయ్య కడపజిల్లా పులివెందులలో వెలసిన శ్రీరంగనాధ స్వామిపై వ్రాసిన శృంగార సంకీర్తనలో పదహారు వేల సతులతో గూడినవానికి సిగ్గెందుకు స్వామీ! మేమంతా నీ ఎదుటనే నిలబడ్డాము. భయమేల? వంకలు పెట్టకుండా మమ్ములను చేకొనండి అంటూ సాగుతుంది ఈ కీర్తన. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు ॥పల్లవి॥ చ.1 వావులు నీకెంచనేల వాడల గొల్లెతలకు దేవరవు గావా తెలిసినదే యీవల మావంక నిట్టె యేమి చూచేవు తప్పక మోవనాడితి మిధివో మొదలనే నేము ॥ఇంక॥ చ.2 చందాలు చెప్పఁగనేల సతినెత్తుక వచ్చితి విందుకు రాజవు గావా యెరిఁగినదే దిందుపడి మమ్ము నేల తిట్టేవు పెదవులను నిందవేసితి మిదివో నిన్ననే నే

బతుకమ్మ చరిత్ర

సారస్వతం
- AVR & KNR తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో చాలా మంది విశ్వసించే నేపధ్యం ఇది. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ(ప్రస్తుత కరీంనగర్ జిల్లా)లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరా

జ్ఞానం-మోక్షం

సారస్వతం
-శారదాప్రసాద్ ​ మోక్షం అంటే ఏమిటి ? బందాల నుంచి విడుదల అవ్వటం మోక్షం! బందం అంటే ?. ఎప్పుడైతే జీవన భ్రాంతిలో పడి కర్మలు చేస్తున్నామో, వాటి ఫలాలు అనుభవించాల్సి వచ్చి మళ్ళీ మళ్ళీ జన్మలను పొందుతున్నాం..ఈ కర్మ ఫలాలను అనుభవించటమే బంధం అంటే! ఈ జన్మ, కర్మల వలయంలో చిక్కుకోకుండా ఉండటమే మోక్షం అంటే. మనం కర్మలు చేయకుండా ఉండలేము. బ్రతకాలంటే కర్మలు చేయాల్సిందే! మనం చేసే కర్మ నిష్కామ పూరితమై ఉంటే, అప్పుడు కర్మ ఫలాలు మనకు అంటవు. నిష్కామ కర్మ యోగం,జ్ఞాన యోగం, భక్తి యోగాలు మోక్షానికి సోపానాలు! నిష్కామ కర్మే అసలైన మోక్ష మార్గం. మనిషి జీవితానికి నాలుగు లక్ష్యాల్ని చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నీతి, నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా గడవటానికి కావల్సిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు.ఇవి కూడా ధర్మాన్ని అనుస