శీర్షికలు

అమెరికా ఉద్యోగ విజయాలు

శీర్షికలు
'Intelligent behavior requires knowledge'. ఆ మాట రచనా వ్యాసంగానికి కూడా వర్తిస్తుంది. మంచి చదువులు చదివి, వివిధ స్థాయిల్లో అమెరికాలో అనుభవం గడించిన సత్యం గారు ఈ పుస్తకాన్ని ఆవేదనతో రాసానన్నారు. ఆవేదనలోంచి వచ్చినది ఏదైనా చదవటానికి ఆమోదయోగ్యమే. 'ఉద్యోగం స్త్రీ, పురుష లక్షణం' అన్నది నేటి నానుడి. కాలేజీలో పుస్తకాల్లో చదివేది పాతికవంతు మాత్రమే. మిగతా ముప్పాతిక బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి, ఉద్యోగం చేస్తున్నప్పుడు నేర్చుకోవాలి. భదవద్గీత తరహాలో 'కృష్ణ, అర్జున్ (బావ, మరది)' మధ్య జరిగే సంభాషణల రూపమే 'అమెరికా ఉద్యోగ విజయాలు ' పుస్తకంలో చెప్పబడ్డ చిట్కాలు. సత్యం గారు కృష్ణ (బావ) పాత్రలో పరకాయప్రవేశం చేసి తన అనుభవాన్ని రంగరించి అప్పుడే ఉద్యోగంలోకి అడుగిడుతున్న అర్జున్ (బావమరిది) చెప్పిన విజయసూత్రాలు పన్నెండు అధ్యాయాల్లో అగుపడుతాయి. భారతదేశంలో కూడా ఇప్పుడు విదేశీ కంపెనీలతో ప్రైవేటురంగం అభివృద్ధి చ

Man is a Social Animal

శీర్షికలు
కరోనా నేర్పుతున్న ఒక గొప్ప పాఠం "మనిషి సంఘజీవే " మనిషి తన జీవన ప్రయాణంలో తనకు ఎదురయ్యే ఎన్నెన్నో సంఘటనల ద్వారా కావాల్సినన్ని అనుభవాలు పొందుతూనే ఉంటాడు. అందుకే ప్రతి సమస్యలో, ప్రతి సంక్షోభంలో ఎన్నెన్నో కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ నేపధ్యం లో భాగంగా ప్రస్తుత సామాజిక ప్రపంచం లో వందల కోట్ల మంది ప్రజలు కరోనా రక్కసి కారణంగా "ఆరోగ్య సంక్షోభంలో" కూరుకొని పోయి స్వీయరక్షణ మార్గాల ద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకొనే దిశగా అడుగులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మన దేశంలో కోట్లాది ప్రజలు "లాక్ డౌన్ " ప్రక్రియలో భాగంగా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. దీనివలన ప్రధానంగా ఉద్యోగులు ,వ్యాపారస్తులు లేదా ఇతర వృత్తులలో ఉన్నవారికి కళ్ళ ముందే కుటుంబ సభ్యులు, వేళకు ఆహారం,పిల్లలతో ఆహ్లాదం అలాగే వృత్తి ,వ్యాపారాలలో ఇంటికే పరిమితమై పని చేసే వారికి పెద్దగా ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత పని విధానాలు, కొంతలో క

చిన్నతనం

శీర్షికలు
చట్టాలకు పదునే కాదు .. కుటుంబాల నుండీ కూడా నైతికతలు పెంచాలి !! అమరనాథ్ .జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 9849545257 మానవ నాగరిక చరిత్రలో "స్త్రీ"కున్న ప్రాశస్త్యం, పవిత్రత పూజా దేవతలుగా పూజించబడే విధానాలు మన సాంప్రదాయాల్లో సంస్కృతిలో భాగమనే విషయం అలాగే భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల్లో "స్త్రీ"ని దేవతామూర్తిగా కొలవబడటం, పూజించబడటం మన ముందున్న సజీవ వాస్తవాలే అయినా కూడా ద్వంద ప్రమాణాలతో "మహిళ" పైనే ఈ దారుణాలు నిత్యకృత్యంగాఎందుకు జరుగుతున్నాయి? శారీకంగా మగవాడు బలవంతుడైన కూడా మహిళే మానసికంగా బలవంతురాలనే ఒక సామాజిక 'సత్యం' తెలిసినా కూడా ఇటువంటి ఒత్తిళ్లకు, వివక్షతలకు, అవమానాలకు మరియు అత్యాచారాలకు ఎన్నడూ లేని విధంగా అత్యంత క్రూరంగా ఆడదే ఎందుకు గురి కావాల్సి వస్తుందనేదే నేడు కొన్ని కోట్ల కొట్ల మనస్సులను తొలిచి వేస్తున్న ప్రశ్న! సమాజంలో తరాలు మారుతున్నా తరగని పురుషాధిక్య భావజాలాలు,కుటుంబ స్థాయ

Book Review in January 2020

శీర్షికలు
*పరిమళాల వసంతం* ~ వెన్నెల సత్యం షాద్‌నగర్ యువకవి కుడికాల వంశీధర్ “సరోజనార్ధన్” పేరుతో కవిత్వం రాస్తున్నాడు. కలం పేరు కాస్త కొత్తగా అనిపించింది. అమ్మానాన్నలను కలంపేరులో నిలుపుకోవడంలోనే ఆయన “హృదయం” ఏమిటో మనకు స్పష్టమవుతుంది. తల్లిదండ్రులను ప్రేమించిన వాడు, ఆరాధించిన వాడు చుట్టూ ఉన్న సమాజాన్ని సైతం ప్రేమిస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. వంశీ నానీల్లో ఆ “ప్రేమ” మనకు అడుగడుగునా కనిపిస్తుంది. ఏ సాహితీ కార్యక్రమం చూసినా యాభై ఏళ్ళకు పైబడిన వారే అధికంగా కనిపిస్తూ ఉంటారు. ఒక వేళ అడపాదడపా యువత కనిపించినా ఏ తెలుగు ఉపాధ్యాయులో, ఉపన్యాసకులో, పరిశోధక విద్యార్థులో అయ్యుంటారు. ఇలాంటి సాహిత్య కార్యక్రమాల్లో తరుచూ పాల్గొంటాడు వంశీ. చదివింది ఆంగ్లమాధ్యమం, చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. ఈ నేపథ్యంలో వంశీ కవిత్య్వం వైపు అడుగులు వేయడం గొప్ప విషయమే. బహుశా నాన్న గారి సాహిత్య వారసత్వమూ కారణమేమో. నానీల ప్రక్రియ

*దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర*

శీర్షికలు
---పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు [ 🔯తరింపచేసేది తీర్థం... ఆ "తరించామనే భావం" ఒక అందమైన ప్రదేశం చూసిన అనుభవంతో రావచ్చు. ఒక శక్తివంతమైన చోట కాలు మోపడం వల్ల కావచ్చు... ఈ రెంటినీ కలుపుకొన్నప్పటికీ, ఇదీ అని స్పష్టంగా విప్పి చెప్పలేని, 'ఆధ్యాత్మిక' అనుభవం వల్ల కావచ్చు.. బయటకు అలా విప్పి చెప్పలేక ఆత్మ పరిధిని 'అధి' గమించే అనుభవాన్నే ఆధ్యాత్మికత అంటాం.. భారతీయ సంస్కృతి లోని ప్రత్యేకతే అది! మన సంస్కృతిలో ప్రతి చోటా ఒక చరిత్ర ఉంది. మనసుపెట్టి చూస్తే, ఒక ఆత్మను స్పృశించి, పైకి నడిపించే ఒక ఆధ్యాత్మికత ఉంది. అందుకే భారత దేశంలో ఏ యాత్ర చేసినా, అది కేవలం తీర్థ యాత్ర కాదు; అదో సంస్కృతి యాత్ర! అదో ఆధ్యాత్మిక అనుభవ యాత్ర! అలాటి ఓ యాత్ర సతీసమేతంగా చేసి వచ్చిన కాలిఫోర్నియా ఫ్రెమాంట్ వాస్తవ్యులు పిల్లలమర్రి కృష్ణకుమార్ గారి అనుభవాన్ని వారి మాటల్లో రోజూ చూద్దాం.... ― సంపాదకుడు👏] 2019 మే మాసంలో నే

వృద్ధాప్యం

శీర్షికలు
వృద్ధాప్యం వేదన కాదు! ముందు తరాలకు నివేదన! (వృద్ధుల శారీరక, మానసిక ,సామాజిక పరిస్థితులపై ఒక వ్యాసం) అమరనాథ్. జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ . 9849545257 మానవ జీవన దశల్లో బాల్యం ,యవ్వనం తర్వాతది వృద్ధాప్యం. సహజంగానే ఈ మూడవ దశలోనే అనేకానేక శారీరక, మానసిక మార్పులకు గురి అవుతుంటుంది ఈ శరీరం. పెరుగుతున్న వయసుతో పాటు తరుగుతున్న శారీరక ధారుడ్యం దానికి తోడుగా దాడికి సిద్ధంగా పొంచివున్న రకరకాల వ్యాధులు, దీంతో సహజంగానే ఏర్పడే మానసిక సమస్యలు. నిజానికి పెరిగే వయస్సు కంటే కూడా తరిగే మానసిక స్థైర్యమే మానసిక సమతూల్యతను దెబ్బతీసి శారీరక, మానసిక సమస్యల తీవ్రతను పెంచుతుంది . సమాజంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొలది దీర్ఘకాలిక సమస్యలు కూడా పెరుగుతుంటాయి. వీటిని ఆత్మస్తైర్యం తో ఎదుర్కొంటూ జీవితాన్ని నిబ్బరంగా సాగించాల్సిందే తప్ప తప్పించుకొనే అవకాశమే లేదు ! దీనికి జీవనశీలి లో మార్పులు చేసుకుంటూ వీటిత

నా శ్రీశైల యాత్ర అనుభవాలు

శీర్షికలు
ఉమాదేవి అద్దేపల్లి అసలు శివుడు అంటేనే గొప్ప ధన్వంతరి .ఆయుర్వేదానికి మారుపేరు .ఆయువును వృద్ది చెందించేది ఆయుర్వేదం .అందుకే అతను మృత్యుంజయుడు.హిమాలయ పర్వతాలు అతని ఆవాసాలు.అక్కడ ప్రవహించే నదీనదాలే కాదు ,ప్రతి చెట్టు ,ప్రతి వేరు ఔషదీ గుణాలను కలిగి ఉంటాయన్నది జగద్విదితమే.అంతటి మహిమాన్విత ప్రదేశాలలో నివశించే తపోధనులే కాదు సామాన్యవ్యక్తులు కూడా దీర్ఘాయురారోగ్యాలు కలిగి ఉంటారన్నది ప్రత్యక్ష ప్రమాణంగా చూచిన వారెందరో . హనుమంతుడు కూడా నేటికీ హిమవత్పర్వతాలలో జీవించే ఉన్నాడన్న నమ్మకం చాలామందికి వుంది.అక్కడ గాలి ,నీరు , హరిత సంపదతో అలరారే పరిశుద్ద వాతావరణంలో అడుగుపెట్టిన ఏ వ్యక్తీ అయినా తమకున్న రుగ్మతలన్నీ మందు మాకు అవసరం లేకుండానే పోగొట్టుకొని సంపూర్ణ స్వస్థతతో తిరిగి వస్తాడు. అంతటి దివ్య శక్తి సంపన్నమయిన హిమగిరులలో నెలకొన్న కైలాసపతి ఎక్కడ వుంటే అక్కడే ఆరోగ్యమనే మహాభాగ్యంతో తులతూగుతుంది ఆ పరమ శివుడు

వీక్షణం-72 సమీక్ష

శీర్షికలు
-వరూధిని ఆగస్టు నెల వీక్షణం కాలిఫోర్నియా బే ఏరియా లోని స్వాగత్ హోటల్ లో 12 వ తారీఖున అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది.అధ్యక్షులు శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ముందుగా మొదటి ఉపన్యాసకులు శ్రీ వేణు ఆసూరి గారిని ఆహ్వానించారు. ఆయన అర్మను హైసీ రచించిన "సిద్ధార్థ" నవలను సభకు పరిచయం చేసారు. కథని సూక్ష్మంగా పరిచయం చేస్తూ సిద్ధార్థ అనే యువకుడు గౌతమ బుద్ధుణ్ణి కలవడానికి వెళ్లడం, వరిరువురి మధ్య జరిగిన సంభాషణ, సన్యాసి సంసారిగా మారడం, తిరిగి సన్యాసిగా మారడం, చక్రభ్రమణం జీవితం అని తెలుసుకోవడం మొదలైన విషయాల్ని ఆసక్తి కరంగా వివరించారు. అధ్యక్షుల వారి మాటల్లో చెప్పాలంటే "వేణు గారు అత్యంత గహనమైన విషయాన్ని ప్రశాంతంగా విడమర్చి చెప్పారు". ప్రసంగానంతరం రచయిత జీవిత విశెషాలు, ఇతర రచనల గురించి కూడా వివరించారు.ఆ తర్వాత శ్రీమతి ఆర్. దమయంతి "డా||కె.గీత కవిత్వంలో స్త్రీ హృదయ స్పందన" అనే అంశమ్మీద ప్రసంగించారు. నారింజ చె