సుజననీయం

ఆరోగ్యమే మహాభాగ్యం

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే | ఔషధం జాన్హవీతోయం వైద్యో నారాయణో హరిః వైద్యుడు 'నారాయణుడు 'తో సమానమని పై శ్లోకం అర్థం. మనకొచ్చే వ్యాధులు మందులతోనే నయం కావు. ఔషాథాలతో పాటు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు కూడా చికిత్సకు దోహదం చేస్తాయి. మన జీవనశైలి, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యాంశాలే. సిలికానాంధ్ర సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయలను విస్తరింపజేస్తూ తెలుగువారి జీవనవిధానాన్ని గత పదిహేడేళ్ళుగా మెరుగుపరుస్తున్నది. ఇప్పుడు వైద్యసేవలను అందించడానికి కూచిపూడీ గ్రామంలో 'రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవనీ వైద్యాలయం' ప్రారంభించింది. ఇది ఈ రంగంలో మొదటి అడుగు మాత్రమే. ముందు ముందు వైద్యరంగంలో చాలా సేవలు చేయాలన్నది సిలికానాంధ్ర ఉద్దేశం. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' చూడండి. అలాగే మనసుకు ఆహ్లాదపరిచే ఇతర రచనలను చదవండి. ***

నివాళులు

సుజననీయం
నవంబర్ ఒకటి 2018 వతేదీన డా.మంగళగిరి ప్రమీలాదేవి గారు దివంగతులయ్యారు. ఆవిడ వయసు 75 సంవత్సరాలు. మచిలీపట్నంలో హిందూకాలేజ్ లో తెలుగులెక్చరర్ గా ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు.చిన్నవయసులోనే సంగీతం లో డిగ్రీ పొందడమేకాక సాహిత్యంలో కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.నలభైగ్రంధాలు రచించారు.తెలుగు, హిందీ, సంస్కృతం భాషలలో పాండిత్యంఉన్నవ్యక్తి. పదసాహిత్యంలో పరిశోధనలు చేసి పి.హెచ్.డి.పట్టా పొందారు.పదసాహిత్యపరిషత్ అనే సంస్థ స్థాపించి అనేక సాహిత్య సభలు మచిలీపట్నం లోనూ, హైదరాబాద్ లోనూ ఘనంగా నిర్వహించారు. ఆవిడ రాసిన పద్యగేయనాటికలకు 1971లో ఆంధ్రప్రదేశ్సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈమధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ఆవిడకు సరస్వతీ సమ్మాన్ పురస్కారం ఇచ్చి సత్కరించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించింది. సుమారు నలభై సంవత్సరాలుగా ఆవిడ నాకు మంచి స్నేహితురాలు.సుజనిరంజనిలో కూడా మంచి వ్యా

సంకీర్తనామృత సౌరభము

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు ప్రప్రధమ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య 610 జయంతుత్సవం సంధర్భంగా సిలికానాంధ్ర మీ కందరికీ మా శుభాభినందనలు తెలియచేసుకొంటూన్నాము. తాళ్ళపాకవాసి విరచితమైన వేల పదకవితలు తామ్రపత్రాల ద్వారా దాదాపు 4 శతాబ్ధుల తర్వాత వెలుగులోకి రావడము, వివిధ మాధ్యమాల ద్వార ఇంటింటా పరిచయం కావడం ఒక యెత్తైతే, అన్నమయ్య లక్ష గళార్చన, అఖిల భారత అన్నమయ్య జయంతి మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగ వాటికి ఒక సమోన్నత స్థానాన్ని సాధించడానికి ఇతోధికంగా కృషి చేసింది మాత్రం ఒక్క సిలికానాంధ్ర మాత్రమే అని చెప్పవచ్చు. అన్నమయ్య కీర్తనలోని సాహిత్యాన్ని, చూసిన అసమాన వైవిధ్యాల్ని, చేసిన ప్రయోగాల్ని, ప్రక్రియల్ని ఒక మహాసాగరంతో పోల్చవచ్చు. ఐతే, సిలికానాంధ్ర చేసే ప్రయత్నాలు, ఆ సముద్రంలోని నీటిని తీరాన నిలబడిదోసిలితో పట్టుకోడానికి చేస్తున్న చిన్న కృషి మాత్రమే కావచ్చు. కాని, మొక్కవోని ఈ సంకల్పం భావి

కొంగ్రొత్త ఆశలు

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు క్రొత్త సంవత్సరం, క్రొత్త ఆశలు... ఆగష్టు 4... సిలికానాంధ్ర 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోనికి అడుగిడుతున్నది. ముందున్న ఎన్నో ఆశలు, ఆశయాలు, పథకాలు, ప్రణాళికలు... అటు భారతదేశంలో, ఇటు అమెరికాలో, అలాగే ఇతర దేశాల్లో కూడాను. ఈ వివరాలన్నీ తెలియాలంటే www.siliconandhra.org దర్శించండి. అలాగే, విళంబి ఉగాది ఉత్సవ సందర్భంగా జరిగిన 'ఎనుకుదురాట - అచ్చ తెలుగు అవధానం' పుస్తకరూపంలో ప్రచురణ అయ్యింది. ఆ పుస్తకం సాఫ్ట్ కాపీ వచ్చే నెల సుజనరంజనిలో లభ్యమవుతుంది. అలాగే, జులై 27న జరిగిన పుస్తకావిష్కరణ ఫోటోలను 'ఈ మాసం సిలికానాంధ్ర ' శీర్షికలో చూడండి. శుభాభినందనలు!

సంజీవని – జీవనప్రదాత

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు సిలికానాంధ్ర తను దత్తత తీసుకొన్న కూచిపూడి గ్రామాభివృద్ధిలో బాగంగా నిర్మిస్తున్న 'సంజీవని ' ఆసుపత్రి కోసం TV9 భాగస్వామ్యంతో నిధుల విరాళల కోసం ఒక విన్నూత్న కార్యక్రమం నిర్వహించింది. ఆ ప్రోగ్రాం పేరు 'sanjivanithon. వివరాలకోసం ఈ క్రింది వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=hyaUIaq_SfI అలాగే మార్చి నెలలో విళంబి ఉగాది ఉత్సవంలో నిర్వహించిన 'అచ్చ తెలుగు అవధానం' ఈ నెలలో పుస్తక రూపంలో అచ్చు అవుతున్నది. Softcopy కూడా వెబ్ లో ఉంచబడుతుంది. తెలుగు సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి ప్రధానంగా వివిధ శీర్షికలతో వెలువడుతున్న సుజనరంజని ని ప్రోత్సాహించండి.

ఈ నెల ప్రత్యేకతలు

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు - అమర్ నాథ్ జగర్లపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హైద్రాబాద్ వారి శీర్షిక గత నెలనుండి ప్రారంభమయ్యాయి. పిల్లలకు, పెద్దలకు వివిధ అంశాలపై వచ్చే రచనలు ప్రతినెల చదవండి. - 2002వ సంవత్సరంలో సిలికానాంధ్ర హస్యవల్లరి పేరిట సేకరించిన కొత్తపాత కార్టూనిష్టుల కార్టూన్లు ఈ నెలనుండి 'హాస్యరంజని ' లో చూడండి. - అమెరికాదేశ వ్యాప్తంగా జరిగిన మనబడి పరీక్షలు, స్నాతకోత్సవాల ఫోటోలు కొన్నింటిని 'మనబడి ' లో చూడండి. మరిన్ని శీర్షికలతో వచ్చే నెలలో కలుద్దాం.  

వెళ్ళిపోయిన సూర్యనారాయణుడు

సుజననీయం
-తాటిపాముల మృత్యుంజయుడు 'మాదీ స్వతంత్ర  దేశం, మాదీ స్వతంత్ర జాతి ', 'మేలుకో హరి సూర్యనారాయణా' పాటల పేర్లు చెప్పుకోగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బాలాంత్రపు రజనీకాంతరావు గారు. 1941 నుండి తన సంగీత, సాహిత్య, గాన మాధుర్యాలతో ఆకాశవాణిలో తెలుగుజాతిని ఓలలాడించిన ప్రముఖుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు 22 ఏప్రిల్ న మనలను వీడిపోయారు. సరిగ్గా తేదీ గుర్తులేదు కాని, నాకు ఆ సంఘటనలు మాత్రం బాగా గుర్తు. కొద్ది సంవత్సరాల క్రితం సిలికానాంధ్ర నిర్వహించిన ఉగాది ఉత్సవంలో రజనీ గారి పాటలు కొన్ని నేర్చుకొని కార్యక్రమం ఇవ్వదలిచాం. అప్పుడు నేను ఉత్సుకతతో వారి గురించి ఇంటర్నెట్లో వెదుకుతుంటే వారి గురించిన సమాచారం ఎంతగానో లభించింది. వారి చేసిన ఎనలేని సేవలను ఆ సమయంలో తెలుసుకొన్నాను. సిలికానాంధ్ర చైర్మన్, శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు రజనీకాంతరావు గారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అపూడు వారు మాతో పంచుకొన్న మాటలివి. "

అచ్చివస్తున్న 2018

సుజననీయం
2017 డిసెంబర్ నెల మధ్యనుండే 2018 సంవత్సరం సిలికానాంధ్రకు శుభసూచకంగా ఉంటుందన్న సంకేతాలు మెండుగా కనిపిచసాగాయి. డిసెంబర్ 15 నుండి 19 వరకు హైద్రాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ సాహిత్యవేదికలపైన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవిత మొదలుకొని పలు సాహితీ దిగ్గజాలు సిలికానాంధ్ర, మనబడి, సుజనరంజని సేవలను కొనియాడుతూ ఆ పేర్లను తమ ప్రసంగాలలో ఉటంకించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ముగింపు సమావేశాల్లో భారతదేశ ఉపరాష్ట్రపతి ప్రవాసభారతంలో మనబడి సేవలను గుర్తిస్తూ ఇప్పటి తరాలకు, భావితరాలకు మధ్య వారధిగా నిలుస్తున్నదని కొనియాడడం మరొక ఎత్తు. 2018 జనవరి మాసంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఒక సంవత్సరం పూర్తి చేసుకొన్నది. ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు ఐటీ మంత్రివర్యులు నారా లోకేశ్ ముఖ్య అతిధిగా విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వ్యాప్తికి సిలికానాంధ్ర చేస

కొన్ని విశేషాలు

సుజననీయం
-తాటిపాముల మృత్యుంజయుడు ఈ నెల సంచికలోని కొన్ని విశేషాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. - శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవం మార్చి 17న జరుగుతుంది. డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి 'అచ్చ తెలుగు అవధానం' ఈ ఉత్సవ ప్రత్యేకత. వివరాలు 'ఈ మాసం సిలికానాంధ్ర ' లో చూడండి. - సిలికానాంధ్ర తెలుగుభాషకు మనబడి ద్వారా చేస్తున్న సేవను గుర్తించి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 'స్ఫూర్తి ' అవార్డును అందజేసింది. వివరాలు 'ఈ మాసం సిలికానాంధ్ర ' లో చూడండి. - కొత్త శీర్షికలు 'మల్లె మాటలు ', 'మహాకవుల భావచిత్రాలు 'మొదలయ్యాయి. 'ధారావాహికలు ' శీర్షికలో చదవండి. - వంగూరి కథల పోటీ వివరాలకై 'జగమంత కుంటుంబం'లో చూడండి. - సుజనరంజనిలో దిగ్విజయంగా నడిచిన 'సత్యమేవ జయతే' పుస్తకరూపంలో వచ్చింది. వివరాలకు 'ధారవాహికలు ' లో 'పుస్తక సమీక్ష ' చూడండి. పాఠకులందరికి శ్రీ విళంబ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

తెలుగుకు జేజేలు!

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు హైద్రాబాదు మహానగరంలో తెలంగాణా ప్రభుత్వం 'ప్రపంచ తెలుగు మహాసభలు ' నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు మొదలెట్టింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనున్న ఉద్ధండుల్ని, అలాగే విదేశాల్లో నున్న తెలుగు సాహిత్య, భాషా సేవకుల్ని పేరుపేరునా పిలుస్తూ, బొట్టుపెట్టి ఆహ్వానించడం ఎంతగానో మెచ్చుకోదగ్గ విషయం. ప్రాంతీయ భేదాలు పొడసూపకుండా ఎక్కడ వున్నా అందరం తెలుగుసంతతి వారమే అన్న ధోరణి అవలంబించడంలో తెలంగాణా ప్రభుత్వాన్ని తప్పనిసరిగా హర్షించాలి. ఈ విధానం తెలుగుభాషా వికాసానికి, తెలుగు సాహిత్యం ఔన్నత్యానికి దోహదం చేస్తుంది. ఈ సంతోష సమయంలో, పండగ వాతావరణంలో మన తెలుగు పెద్దలు చెప్పిన తీయని పలుకులు పునశ్చరణ చేసుకొందాం. చైయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతొ ఘనకీర్తి కలవాడా (వేములపల్లి శ్రీకృష్ణ) తెలుగువాడు ఏడనున్న తెలుగువాడు తెలుగుభాషనే సొంపుగా పలుకుతాడు (కొసరాజు)