వీక్షణం

వీక్షణం 56వ సమావేశం

వీక్షణం
-సుభాష్ పెద్దు వీక్షణం 56వ సమావేశం ఏప్రిల్ 9, 2017 నాడు మిల్పిటాసు లోని అనిల్ రాయల్ గారి ఇంటిలో జరిగగింది. ఈ సమావేశానికి శ్రీ పెద్దింటి తిరుములాచార్యులు గారు అధ్యక్షత వహించారు. అధ్యక్షుల వారు ముఖ్య అతిథిగా ప్రముఖ కథా, నవలా రచయిత్రి, టీ.వీ సీరియల్ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారిని సభకు ఆహ్వానించి ప్రసంగించవలసినదిగా కోరారు. బలభద్రపాత్రుని రమణి గారి ప్రసంగ విశేషాలు - "నేను 7, 8వ తరగతులలో ఉన్నప్పుడు కథలు వ్రాయటం మొదలుపెట్టాను. ఒకసారి ఒక పత్రికకు కథ పంపిస్తుంటే మా అన్నయ్య బల్ల కొట్టి మరీ చెప్పాడు, ఈ కథను ప్రచురించరు అని. ఆ కథ ప్రచురించబడటమే కాకుండా పలు ప్రశంసలకు కూడా పొందింది. అద్రక్-కె-పంజే వంటి నాటికలు, చలం గారి రచనలు, ముఖ్యముగా "దైవమిచ్చిన భార్య" మొదలైనవి నన్ను ప్రభావితం చేశాయి. నన్ను ప్రోత్సహించిన వారు ఎందరో. వారిలో ముఖ్యులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు.

వీక్షణం 55వ సమావేశం

వీక్షణం
కాలిఫోర్నియా క్యూపర్టినోలోని నాగసాయి బాబా గారి ఇంట్లో ఈ నెల 12న వీక్షణం 55వ సమావేశం జరిగింది. అతిధేయ దంపతుల ఆత్మీయ ఆహ్వానం తరువాత, అధ్యక్షులు శ్రీ నరసింహాచార్యులు గారు సమావేశాన్ని తమ అధ్యక్షోపన్యాసం తో ప్రారంభించారు. ఆచార్యులవారు బమ్మెర పోతన విరచితమైన శ్రీమద్భాగవతం లోని భక్తి తత్వాన్ని, సాంప్రదాయ నవనవోన్మేష కవిత్వ వైభవాన్ని సాధికార సమగ్రతతో కొనియాడారు. స్థాలీపులాక న్యాయంగా ఉటంకిస్తాను అంటూనే, పోతన బాల్య ఉదంతాల నుండి గజేంద్ర మోక్ష ఘట్టాల దాకా ఆసక్తికరంగా వివరించారు. ఆచంద్ర తారార్కా లైన  సెలయేళ్ళ గిరిసీమలో ఆదిశంకరుణ్ణి నెలకొల్పుకొని, తన నోట రామభద్రునిచే భాగవత బృహద్రచనను పలికించుకున్న హరిహరాద్వైత భక్త కవితల్లజుడు బమ్మెర. ఆచార్యుల వారి ప్రసంగంలో ఆణిముత్యాల లాంటి అనేక పోతన పద్యాలు అలవోకగా దొర్లాయి. "పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట",  "అలవైకుంఠ పురములో", "మందార మకరంద మాధుర్యమును గ

వీక్షణం – సాహితీ గవాక్షం – బే ఏరియా వీక్షణం సాహితీ సమావేశం- 54

వీక్షణం
- నాగరాజు రామస్వామి వీక్షణం 54వ సమావేశం ఫిబ్రవరి 12, 2017 నాడు శ్రీ చుక్కా శ్రీనివాస్ గారి స్వగృహమున జరిగింది. ఈ సమావేశమునకు శ్రీ పిల్లలమఱ్ఱి శ్రీ కృష్ణ కుమార్ గారు అధ్యక్షత వహించారు. మొదటి వక్త శ్రీ ఉప్పలూరి విజయ కుమార్ గారు. వారు గత 40 సంవత్సరాలుగా పలు కథలు, నవలలు వ్రాసానని తెలిపి, 30 సంవత్సరాల క్రితం పల్లకీ పత్రికలో ప్రచురితమైన తమ కథ "లోపలి మనిషి" అనే కథను చదివారు. అంటరానితనమును ప్రశ్నిస్తూఒక వ్యక్తి తనలో అంతర్గతంగా ఉన్న అంటరానితనాన్ని ప్రశ్నించుకునే ఈ కథ అందరినీ ఆకట్టుకుంది. తరువాతి కార్యక్రమం శ్రీ నాగరాజు రామస్వామి గారి రవీంద్రుడి గీతాంజలికి తెలుగు అనువాదం "గీతాంజలి" పుస్తకావిష్కరణ. మొదటి సమీక్షకులు శ్రీ వేణు ఆసూరి గారు. వారి ప్రసంగ విశేషములు "ఈ గీతాంజలి చదువుతున్నప్పుడు నేను మూలాన్ని కాని, మరో అనువాదాన్ని కాని ప్రక్కన పెట్టుకుని పోల్చి చూడలేదు. నాగస్వామిగారి రచనను ఒక సరిక