జగమంత కుటుంబం

ప్రమీలాదేవి హఠాన్మరణం

-తమిరిశ జానకి

నవంబర్ ఒకటి 2018 వ తేదీన డా.మంగళగిరి ప్రమీలాదేవి గారు దివంగతులయ్యారు. ఆవిడ వయసు 75 సంవత్సరాలు. మచిలీపట్నంలో హిందూకాలేజ్ లో తెలుగులెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.చిన్నవయసులోనే సంగీతం లో డిగ్రీ పొందడమేకాక సాహిత్యంలో కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నలభైగ్రంధాలు రచించారు.
తెలుగు, హిందీ, సంస్కృతం భాషలలో పాండిత్యంఉన్న వ్యక్తి. పదసాహిత్యంలో పరిశోధనలు చేసి పి.హెచ్.డి.పట్టా పొందారు.పదసాహిత్యపరిషత్ అనే
సంస్థ స్థాపించి అనేక సాహిత్య సభలు మచిలీపట్నం లోనూ, హైదరాబాద్ లోనూ ఘనంగా నిర్వహించారు. ఆవిడ రాసిన పద్యగేయనాటికలకు 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.ఈమధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ఆవిడకు సరస్వతీ సమ్మాన్ పురస్కారం ఇచ్చి సత్కరించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించింది. సుమారు నలభై సంవత్సరాలుగా ఆవిడ నాకు మంచి స్నేహితురాలు.
సుజనిరంజనిలో కూడా మంచి వ్యాసాలు రాశారు.ప్రతిభ మాత్రమే కాదు మంచితనానికి మారుపేరులా ఉండే డా.మంగళగిరి ప్రమీలాదేవి గారు హఠాత్తుగా మనందరినీ వదిలి వెళ్ళి పోవడం తీరని లోటుగా భావిస్తున్నాను.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked