కవితా స్రవంతి

శ్రీ దేవులపల్లి క్రృష్ణశాస్త్రి!

కవితా స్రవంతి
- S. హరికృష్ణశాస్త్రి శ్రీ దేవులపల్లి క్రృష్ణశాస్త్రి! (వారి 125 వ జన్మదినం,నవంబర్ 1, సందర్భంగా) ఆకులో ఆకునై కానలో ఆగిపోదునను కవితా మౌని/ నాక వాహినీ శీకర సమ స్వాదు పద సువిశేష ధని/ ఆక్రృతి లేని మొయిలునె దూతగ ఒప్పించిన గేయ చణి/ సకల ప్రక్రృతి శోభతో మై మరచు భావాంబర ద్యుమణి! ***** సుర నందన కుందము లందముగ మాల కట్టినట్లు వర వీణా పాణి, వాణియె పలుకుల నందించినట్లు పూర్ణిమా స్నపిత శబ్ద ద్యుతు లెదురుగ నిల్చినట్లు విరియు నా గీతములు శబ్దార్ధ భావ సౌరభములై!!          ***** నవ్విన లోకమును జూసి తా నల్లన లోలోన నవ్వుకొనె రివ్వుమని పై కెగయు గువ్వకు దిశల చెప్ప జాలుదురే సవ్వడియె లేని హృదయ విపంచీ రాగముల నాపుదురే పువ్వులై భావము ల్మది విరియ,తావి నొల్లరె యనుచున్!!         **** భరత మాతను సేవించె, గేయ సుందరోద్యానముల, బాగ ననల పూయించి! శ్రీ శైలేశ భ్రామరుల కొల్చె పద  సురభు ల్సిరి గిరి నల్

రాధాష్టమి

కవితా స్రవంతి
-నాగలక్ష్మి N. భోగరాజు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారికి 'ప్రేమ' అన్న పదం వినపడగానే స్ఫురణకు వచ్చే దైవం రాధాకృష్ణులు. ‘దేవీ భాగవతం’ ప్రకారం ఆ పరమేశ్వరికున్న పరిపూర్ణ అవతారాలలో రాధాకృష్ణ స్వరూపమొకటి! రాధను సేవించడంవల్ల శ్రీ కృష్ణ పరమాత్ముడి అనుగ్రహం సులభముగా పొందవచ్చునని అంటారు ఆధ్యాత్మికవేత్తలు. అంతేకాకుండా, భక్తులూ, సాధకులూ నిరంతరం రాధాదేవిని శ్రీ కృష్ణుడి సహితంగా స్మరించడమూ, ఆరాధించడమూ వలన, వారు రాధాదేవి కృపకు పాత్రులు కాగలరనీ, తద్వారా సామాన్యులకు దుర్లభమూ, పరమునందు అత్యున్నతమూ అయిన ఆ గోలోక నివాసం వారికి లభిస్తుందనీ పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టత కలిగిన ఆ రాధాదేవి, వృషభానుడి కుమార్తెగా ఈ భూమిపై అవతరించిన తిథిని మనము రాధాష్టమిగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం సెప్టెంబరు 14న వివిధ ప్రాంతాలలోని కృష్ణ భక్తులు రాధాష్టమిని ఘనంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా రాధాదేవిపై రాసినదీ ఈ క్రింది కవిత:

కృష్ణ తత్త్వం!

కవితా స్రవంతి
-సముద్రాల హరిక్రృష్ణ   సామవేదము నా రూపమనె స్వామి, వేణు/ గానము సన్ననయ్యె, మొగము చిన్ననయ్యె! ప్రేమ మీర గోప గణములు,మా వాడనె/ కనుబ్రామి ఎపుడో రాధామోహనుడయ్యె! నా సన్నల యదు సింహమని, సాత్రాజితి/ తా మొగ్గె వైదర్భి దెస, బృంద దళమున!! నీవే నా తోడు నీడ, గురుడవనె క్రీడి/ నగుబాటు జేసె గాంగేయు మార్కొను వేళ! నమ్మిన ఫలమీ రీతైనను, వీరు,వారెవరుర నళిన నేత్ర! తన,పర భేదములేమొ,నీకే తెలియు,కృష్ణ! గహన విచిత్ర! *******

గజల్

కవితా స్రవంతి
  - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ చీకటిలో ఉన్నపుడు ఉదయాలను వెలిగిస్తాను ఒంటరిగా ఉన్నపుడు హృదయాలను గెలిపిస్తాను చేదు జ్ఞాపకాలెన్నో జీవితాన ముసురుకున్నా మదిలోని తీపిగుర్తులు అందరికీ పంచుతాను ముసురుకమ్మిన బతుకుల్లో విషాదాలెన్ని ఉన్నా మధురజ్ఞాపకాలెన్నింటినో అందరికీ పంచుతాను సంసారసాగరాన్ని భారంగానే నెట్టుకొస్తున్నా కన్నీటి సముద్రాలను దాటుకుంటూ వెళతాను చెప్పలేని ఆవేదనలు కడుపులోనే దాచుకుని గుండెధైర్యంతోనే అడుగులు ముందుకు వేస్తాను దుఃఖసముద్రాలెన్నో అలల్లా పోటెత్తుతుంటే ఆటుపోటులనధిగమించి వజ్రంలా మెరుస్తాను చింతలెన్నో నీడలా వెంటాడుతుంటే భీంపల్లి కన్నీళ్ళను దాటుకుంటూ కాలంతో పయనిస్తాను --000--

కాటువేసిన కరోనా

కవితా స్రవంతి
- శిష్ట్లా రాజేశ్వరశాస్త్రి అంత్య క్రియలులేవు అశ్రువులు కనపడవు భయం నీడన బరువెక్కిన మాటలతో ఆన్లైన్లో కనపడేధ్యానాలు శ్రద్ధాన్జలితంతులు వినిపించే విలక్షణ అనుభవాల ధ్వనులు వైదికమంత్రాలు, పలుకుబడుల విశేషాలు! దానం లేదు, ధర్మం లేదు, చలనం లేదు దుఃఖం లేదు బాధ లేదు వేదన తెలియదు మరణ భయం తప్ప మరే కేక వినిపించదు కలవరం కనపించదు కన్నవారు, ఉన్నవారు కట్టుకున్న వారు, హితులు, స్నేహితులు దగ్గరి వారు, దగ్గరున్నా దూరమే ఉంటున్న మన అనుకున్న వారు ఎందరో! మరెందరో! అందరికీ గొడుగై ఆశ్రయమిస్తున్న వైరస్ అనుబంధాలని తనలో బంధించిన వైరి ఈ బ్రూటస్ మనిషి పతనానికి పచ్చ జెండా ఊపింది అసలు శాస్త్రం ఇదే, ఇలానే బ్రతకాలని కొత్త లోకాన్ని ఆవిష్కరించింది ఆగమాగం అయోమయం చేసింది బ్రతుకుల్ని బలి తీసుకుంది బతుకుతెరువు తెంచింది అమ్మ నాన్న, అక్క, చెల్లి భార్య బంధువు బంధాలూ నవ్వుల పాలయ్యాయి మనసు మానవత్వం చతికెల పడ్డాయి రో

మన ఆస్తి మన్నుండ

కవితా స్రవంతి
- గాదిరాజు మధుసూదన రాజు తరతరాల నరజాతికి ఆస్తిగా మారిన గుండ్రని మన్నుండలాంటి పుడమిని చుట్టేస్తూ.... పొంగుతు క్రుంగుతూ ఆటుపోట్లందుకుంటున్న నీటిమడుగులాంటి కడలిని గమనిస్తూ..... 'ఆదీ తుదీ లేని లలనల ఆశలఊహారచనం లాంటి గగనం' తన బాధ్యతగా హరితవర్ణపు పర్ణతివాచీని పరిచేందుకు ప్రయత్నిస్తోంది పరిపరివిధాలుగా పట్టుదలగా జీవజాతులను బ్రతికిస్తున్నందుకు ప్రకృతిసమస్తాన్ని సన్మానిస్తూ తృప్తిగా ** ** ** కాలుష్యాన్ని అదేపనిగా సృష్టిస్తూ హరితాన్ని హరిస్తూ అడ్డొస్తోంది నవమానవయాంత్రికతత్త్వం తమ ఆస్తిని అస్తిత్వాన్ని అపహాస్యం పాలుచేస్తూ స్వయంనాశనాన్కి తానే మద్దతిస్తూ

పిల్లల ప్రపంచం

కవితా స్రవంతి
-(శిరాశాస్త్రి) శిష్ ట్లా రాజేశ్వర శాస్త్రి మా నాన్న చిన్నతనాన్ని నేను చూడలేదు మా తాతా చూడలేదు, ఆ భాగ్యంలేదువారిద్దరికీ, మాకు ఆ లోటే లేదు మనుమడు, అడుగులు వేస్తుంటే పోల్చుకుంటూ అంతా ఎంత మురిసి పోతామో, ఎన్ని జ్ఞపకాలు నెమరు వేసుకుంటామో ఎన్ని మార్లు కళ్ళు తుడుచుకుంటామో, ఎంత భాగ్యమో అది. నాన్న పోలికలు, హావభావాలుమాతోచెలిమి ఆ నడక, ఆ చనువు, ఆ పలువరుస, ఆఠీవి ఆ చొరవ, ఆ శ్రద్ధ, చదువుతీరు,అనుబంధం నాన్నే వచ్చాడా నేను తీర్చని రుణానికి చూపని ప్రేమకి చేయని సేవకు పంచుకో ని భావాలకు బాల మేధావిగా కొడుకుచెలిమలా బ్రతుకు గురుతుగా నాకై నా మీద స్వతంత్రం, తాత నాదే అనేహక్కు నా ఒడిలో తలపెట్టి కళ్ళల్లో మెరిసే చూపు నేనే మీ నాన్నను అని తెలియచెప్పే యా తనేమో ఆ భావాల చూపుల భాష ప్రయాస. నాయనమ్మను చూడగానే తాత నాదీ అనీ ఎదపై చెయ్యివేసి, ఒడిలో తలపెట్టి సొంతం చేసుకునే కొంటెతనం ఆ పోటీ ఆ హక్కు ఆ కవ్వింపు, చూపులో

తేనెల సోన

కవితా స్రవంతి
తెలతెలవారున కలకూజితాల —తమిరిశ జానకి మధురమంజుల నాదమంటిది తెలుగు ! ఉదయించే రవి కిరణ శోభ సంతరించుకున్న గగనమంతటి సుందర దృశ్యకావ్య సోయగమే తెలుగు ! తెలిమంచు బిందువుల తడిసి తళతళలాడు తరువుల చిరునవ్వుల గలగలలే తెలుగు ! వివిధ వర్ణాల సుమాల వనాలతో విలసిల్లు ధరిత్రి వికసిత వదన లాలిత్యమే తెలుగు ! కృష్ణా గోదావరి తరంగాల కదలాడు కమనీయ సొబగులు తెలుగుపదాల పరవళ్ళలో తేలియాడేను ! ప్రకృతి రామణీయకతలా ప్రపంచమంత పరిఢవిల్లు తెలుగు ! నన్నయ తిక్కన యర్రాప్రగడ పోతన శ్రీనాధ దాశరధి దేవులపల్లి సి.నా.రె. మరెందరో మహాకవుల కలాల జాలువారిన రసామృతధార మన తెలుగు ! పద్య సంపదకు అవధాన విద్య విశిష్ఠతకు పేరొందిన తెలుగు తరిగిపోని భాషాగని తీయందనాల తేనెలసోన కురిసే వెన్నెలవాన ఎన్నటికీ కాబోదది మృతభాష ! దేశభాషలందు తెలుగులెస్సయన్న కృష్ణదేవరాయని మాట చెక్కు చెదరబోదు శిలాక్షరమె అది ! ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ పొగడబడిన భాష పొగ