Author: Sujanaranjani

ప్రక్షాళన

కథా భారతి
-G.S.S. కళ్యాణి. కాశీక్షేత్రంలో ఉన్న కేదారఘాట్ మెట్ల మీద కూర్చుని, గంగానదిని తదేకంగా చూస్తున్నాడు జానకీపతి. గంగ నిండుగా ప్రవహిస్తోంది. ఆ నదీతీరానికి వస్తున్న చిన్న చిన్న అలలు, జానకీపతి పాదాలకు చల్లగా తాకుతున్నాయి. మహాపుణ్యక్షేత్రంలోని పవిత్ర తరంగాలు జానకీపతి మనసుకు ప్రశాంతతను కలిగించే ప్రయత్నం చేస్తున్నా, ఏదో బాధ అదే మనసును అల్లకల్లోలం చేస్తోంది. ఒంటరిగా కూర్చుని ఉన్న జానకీపతికి తన జీవితమంతా ఒక్కసారి కళ్ళముందు గిర్రున తిరిగింది! జానకీపతి తండ్రి రాఘవయ్య గవర్నమెంట్ పాఠశాలలో సైన్సు మాష్టారు. రాఘవయ్య అంటే వాళ్ళ ఊరిలో అందరికీ అమితమైన గౌరవం ఉండేది. అయితే, రాఘవయ్య కేవలం అధ్యాపకుడు మాత్రమే కాదు, అతడు మొక్కలపై పరిశోధనలు జరిపే ఒక శాస్త్రవేత్త కూడా అని ఆ ఊరిలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు! మొక్కలు మనుషుల మాటలకు స్పందిస్తాయనీ, అవి మనుషులకు ప్రాణస్నేహితులుగా ఉండగలవని రాఘవయ్య నమ్మేవాడు. తమ ఇంటివెన

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: బాలలు నచ్చరని నెహ్రు బలముగ పలికెన్! ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న: రెండవ భార్యనేలుకొనరే పతులందరు తల్లిమెచ్చగన్ ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి. ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్ 1. ఉ. పాండవు లందరున్ తమకు పత్నిగ కృష్ణను స్వీకరించి, లే కుండ విభేదముల్ తమకు, నుంచిరి నీమము, వత్సరంబునన్ యుండును పత్నిగా యొకరి యోకము నందని, భోగ కాంక్షులై రెండవ భార్య నేలుకొనరే, పతు ల

‘అనగనగా ఆనాటి కథ’

కథా భారతి
-సత్యం మందపాటి   స్పందనః ఆరోజుల్లో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు చూశాను. ఎంతోమంది శనివారం శ్రీవెంకటేశ్వరస్వామివారి గుడికి వస్తున్నారు, వెడుతున్నారు. కానీ నా కథలోని ముసలి గుడ్డి బిచ్చగాడినీ, అతని పక్కనే వున్న ఆరేళ్ళ పిల్లనీ చూడటం కానీ, కనీసం కొన్ని చిల్లర డబ్బులు పడేయటం కానీ చేయటం లేదు. గుడినించీ తిరిగి వెళ్ళే వారి చేతుల్లో వున్న అరటిపండునో, కొబ్బరి చిప్పనో వారికి ఇచ్చినవారు కూడా కనపడలేదు. అలాగే రాజకీయ నాయకుల బీదోద్ధరణ విన్నాక, తెలుగు సినిమా వారి ఆకలి బ్రతుకుల కథలు చూశాక, కమ్యూనిష్టుల పేద జన బంధోద్ధరణలాటి సొళ్ళు కబుర్లు విన్నాక, ‘మానవసేవయే మాధవసేవ’ మొదలైన వుత్తుత్తి ప్రవచనాలు విన్నాక, ఈ కథ వ్రాయాలనిపించింది. ఇదిగో ఆనాటి కథ ఇప్పుడు మళ్ళీ మీ ముందు పెడుతున్నాను. 0 0 0 నిచ్చెన (ఈ కథ ‘ఆంధ్రభూమి’ వారపత్రిక నవంబర్ 12, 1980 సంచికలో ప్రచురింపబడింది) ముసలయ్య అడుగుతున్నాడు, “ఏటే గవుర

శ్రీ దేవులపల్లి క్రృష్ణశాస్త్రి!

కవితా స్రవంతి
- S. హరికృష్ణశాస్త్రి శ్రీ దేవులపల్లి క్రృష్ణశాస్త్రి! (వారి 125 వ జన్మదినం,నవంబర్ 1, సందర్భంగా) ఆకులో ఆకునై కానలో ఆగిపోదునను కవితా మౌని/ నాక వాహినీ శీకర సమ స్వాదు పద సువిశేష ధని/ ఆక్రృతి లేని మొయిలునె దూతగ ఒప్పించిన గేయ చణి/ సకల ప్రక్రృతి శోభతో మై మరచు భావాంబర ద్యుమణి! ***** సుర నందన కుందము లందముగ మాల కట్టినట్లు వర వీణా పాణి, వాణియె పలుకుల నందించినట్లు పూర్ణిమా స్నపిత శబ్ద ద్యుతు లెదురుగ నిల్చినట్లు విరియు నా గీతములు శబ్దార్ధ భావ సౌరభములై!!          ***** నవ్విన లోకమును జూసి తా నల్లన లోలోన నవ్వుకొనె రివ్వుమని పై కెగయు గువ్వకు దిశల చెప్ప జాలుదురే సవ్వడియె లేని హృదయ విపంచీ రాగముల నాపుదురే పువ్వులై భావము ల్మది విరియ,తావి నొల్లరె యనుచున్!!         **** భరత మాతను సేవించె, గేయ సుందరోద్యానముల, బాగ ననల పూయించి! శ్రీ శైలేశ భ్రామరుల కొల్చె పద  సురభు ల్సిరి గిరి నల్

వీక్షణం సాహితీ గవాక్షం-110 వ సమావేశం

వీక్షణం
-వరూధిని వీక్షణం-110 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా అక్టోబర్ 10, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీమతి రాధికా నోరి గారు " సి నా రె - యుగళగీతాలు" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు. రాధిక గారు ముందుగా సి.నారాయణరెడ్డి గారి గురించి, ఎన్నుకున్న ప్రసంగాంశం గురించి మాట్లాడుతూ "నారాయణరెడ్డి గారు గొప్ప కవి, రచయిత, నాటకకర్త, సంగీతకర్త, గాయకులు, సాహితీవేత్త, ప్రొఫెసరు, రాజ్యసభ మెంబరు, సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత, అంతేకాకుండా మన సాహిత్య ప్రపంచంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా. ఈవేళ నేను చలనచిత్రాల కోసం ఆయన రాసిన గీతాల గురించి మాట్లాడదాము అనుకొంటున్నాను. ఆయన మన చలనచిత్రాలలో సుమారుగా మూడు వేలకు పైగా పాటలు రాశారు. అన్ని జానర్స్ లోనూ రాశారు. వాటన్నిటి గురించి చెప్పటం కూడా సాధ్యం కాదు. అందుకని కేవలం ఆయన రాసిన కొన్ని యుగళగీతాల గురించి మాత్రం చెప్పదలచుకున్నాను. యుగళగ

వీక్షణం సాహితీ గవాక్షం -109

వీక్షణం
వీక్షణం సాహితీ గవాక్షం- నవమ వార్షికోత్సవం -వరూధిని కాలిఫోర్నియాలో బే ఏరియాలోని వీక్షణం సాహితీ గవాక్షం 9వ వార్షిక సాహితీ సమావేశం సెప్టెంబరు 11, 2021 న ఆన్లైనులో జరిగింది. ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా||కె.గీత గారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల క్రితం ఒక చిన్న సమావేశంగా మొదలయ్యి ఇంతలోనే 9 సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యంగా ఉందని అంటూ, తమలో సాహితీ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ, ఉచిత, స్వచ్ఛంద వేదికగా సమావేశాల్ని జరపుకుంటూ వస్తున్న ఉన్నతమైన లక్ష్యానికి తనకు తోడ్పడుతున్న వీక్షణం సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. వీక్షణం సభ్యులందరికీ వీక్షణమంటే కుటుంబజీవితం తర్వాత అతి ప్రధానంగా మారిన సాహితీ కుటుంబమని అన్నారు. పక్కా కార్యాచరణతో సమావేశాలు నెలనెలా క్రమం తప్పకుండా, ఆసక్తి కోల్పోకుండా నడపడం వెనక ఎడతెగని శ్రమ ఉన్నా అది చక్కని ఆనందాన్నిచ్చే శ్రమ అని, గొప్ప బాధ్యత ఉన్నా అత్యంత ఆత్మీయమైన బ

సంగీత రంజని

వైణిక సార్వభౌమ ఈమణి శంకరశాస్త్రి శతజయంతి సభ సిలికానాంధ్ర SAMPADA సగౌరవంగా నిర్వహించిన మహామహోపాధ్యాయ ఈమణి శంకరశాస్త్రి శతజయంతి ఉత్సవంలో ప్రముఖుల ప్రసంగాలు, విదుషీమణి ఈమణి కల్యాణి లక్ష్మీనారాయణ వీణాకచ్చేరి కింద ఇచ్చిన యూట్యూబ్ వీడియోలో తిలకించండి.

తప్పనిసరి మనిషి

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు మానవజాతి దుర్భర కష్టంలో వున్నపుడు చీకటి మబ్బులనుండి వెలుగు కోణాల దిక్కు నడిపించడానికి ఒక మార్గదర్శకుడు అవసరమవుతాడు. పుట్టుకొస్తాడు కూడా. అలాంటి వారినే 'తప్పనిసరి మనిషి ' (Necessary Human Being) అంటారు. ఈ యుగంలో అలాంటి కోవకు చెంది, అన్ని దేశాల ప్రముఖులతో ప్రశంసింపబడ్డ 'తప్పనిసరి మనిషి ' మహాత్మ అని పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధి. 'సత్యశోధన, అహింస, సత్యాగ్రహం'లను త్రిశూల ఆయుధంగా మార్చుకొని భరతజాతికి రెండు శతాబ్దాలుగా పీడించిన దాస్యం నుండి విముక్తి కలిగించి మామూలు మనిషిగా జీవించిన మహనీయుడు అతడు. మానవజాతి అభివృద్ధి చెందాలంటే గాంధీజీని, అతను చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టక పక్కకు తప్పించడం అసాధ్యం. మానవులందరు తోబుట్టువులు అని మనస్పూర్తిగా నమ్మిన మనిషి అతను. మహాత్మ గాంధి జీవించిన శతాబ్దంలో, అతను జన్మించి, నడయాడిన గడ్డపై పుట్టిన భారతీయులందరు అదృష్టవంతులు! 'స

తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తి

ఈ మాసం సిలికానాంధ్ర
తెలుగు ప్రపంచం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఖండఖండాంతరాల వరకు విస్తరించిన ఘనత గలది మన తెలుగుజాతి. తొలి తరాల్లో విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రముఖులు ఖండాంతరాలలో మన ఖ్యాతిపతాకాన్ని ఎగురవేశారు. విదేశాల్లో స్థిరపడ్డ మన తెలుగువారు ఇప్పుడు కూడా అదే పరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలోని తెలుగువాళ్లు సొంత విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఐదేళ్ల కిందట ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శాన్‌వాకిన్‌ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణానికి చేరువలో అరవైఏడు ఎకరాల సువిశాల స్థలంలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణ నిర్మాణాన్ని తలపెట్టింది. దీనికి సీనియర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ కమిషన్‌ గుర్తింపు లభించడం విశేషం. తెలుగు ప్రజలు గర్వించదగిన పరిణామం ఇది. ఖండాంతరాలలో తెలుగువారి కీర్తపతాక రెపరెపలకు దోహదపడిన తొలితరం ప్రముఖులను ఈ సందర్భంగా గుర్తు