సుజననీయం

తప్పనిసరి మనిషి

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు మానవజాతి దుర్భర కష్టంలో వున్నపుడు చీకటి మబ్బులనుండి వెలుగు కోణాల దిక్కు నడిపించడానికి ఒక మార్గదర్శకుడు అవసరమవుతాడు. పుట్టుకొస్తాడు కూడా. అలాంటి వారినే 'తప్పనిసరి మనిషి ' (Necessary Human Being) అంటారు. ఈ యుగంలో అలాంటి కోవకు చెంది, అన్ని దేశాల ప్రముఖులతో ప్రశంసింపబడ్డ 'తప్పనిసరి మనిషి ' మహాత్మ అని పిలవబడే మోహన్ దాస్ కరంచంద్ గాంధి. 'సత్యశోధన, అహింస, సత్యాగ్రహం'లను త్రిశూల ఆయుధంగా మార్చుకొని భరతజాతికి రెండు శతాబ్దాలుగా పీడించిన దాస్యం నుండి విముక్తి కలిగించి మామూలు మనిషిగా జీవించిన మహనీయుడు అతడు. మానవజాతి అభివృద్ధి చెందాలంటే గాంధీజీని, అతను చెప్పిన సూత్రాలను ఆచరణలో పెట్టక పక్కకు తప్పించడం అసాధ్యం. మానవులందరు తోబుట్టువులు అని మనస్పూర్తిగా నమ్మిన మనిషి అతను. మహాత్మ గాంధి జీవించిన శతాబ్దంలో, అతను జన్మించి, నడయాడిన గడ్డపై పుట్టిన భారతీయులందరు అదృష్టవంతులు! 'స

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ భూమిపూజ

సుజననీయం
ఇరవై ఏళ్ళుగా వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో ప్రగతిపథంలో ముందుకెడుతున్న సిలికానాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయానికి ఆగష్టు 14వ తేదీన నాంది జరిగింది. సిలికాన్ వ్యాలీకి అతి చేరువలో నున్న ట్రేసీ పట్టణంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి భూమిపూజ జరిగింది.  సువిశాల 65 ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో త్వరలో ప్రారంభం కానున్న విశ్వవిద్యాలయ భవన సముదాయ నిర్మాణానికి శుభాన్ని కోరుతూ సాంప్రదాపూర్వకంగా నిర్వహించే భూమిపూజను చేయడం జరిగింది. ముందుగా విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ఆయన సతీమణి శాంతి గారి సారథ్యంలో సిలికానాంధ్ర సభ్యులు కుటుంబ సమేతంగా సాముహిక సత్యనారాయణ వ్రతం ఆచరించారు. పురోహితుడు మారేపల్లి వెంకటశాస్త్రి గారు ఈ వ్రతాన్ని ముందు తరాల శ్రేయస్సును కోరుతూ జరిపే వ్రతంగా అభివర్ణించారు. భవిష్య విశ్వవిద్యాలయ ప్రాంగణానికి నిర్ణయించిన మూలస్థంభ ప్రాంతాన్ని సిలికానాంధ్ర ఆడపడుచులు రంగవల్లులతో అలంకరించారు. ఈ

WASC గుర్తింపు

సుజననీయం
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం - WASC గుర్తింపు ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారిగా భారతీయులచే స్థాపించబడి భారతీయ భాషలు, కళలకు నెలవైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి (`University of Silicon Andhra`) జులై 13th న ప్రతిష్ఠాత్మకమైన `WASC` (`Western Association of Schools and Colleges`) గుర్తింపు లభించింది. ప్రతిభగల విద్యార్థులకు బోధన చేయటానికి ఈ గుర్తింపు ఆవశ్యకం కాబట్టి, అమెరికాలో ప్రతి విశ్వవిద్యాలయం ఈ గుర్తింపు తెసీసుకోటానికి ప్రయత్నం చేస్తాయి. ఈ గుర్తింపుతో విశ్వవిద్యాలయం అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తూ, కళలు, భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయటానికి సహకరిస్తుంది. అభివృద్ధికి ఎన్నో బాటలు వేస్తుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా రాష్ట్రం, మిల్పిటాస్ నగరంలో 2016లో స్థాపించబడింది. 2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు సంపాదించి భారతీయ కళలు, భాషల్లో విద్యాబోధన ప

దేశభక్తి కవిత

సుజననీయం
దేశమే నేను-నేనే దేశము రచయిత్రి-తమిరిశ జానకి దేశమంటే మట్టికాదని దేశమంటే మనుషులని పాడుకుందాం గురజాడవారి జాడలో ! వట్టిమాటలు కావవి గట్టిమేలుకొలుపులు మనసా వాచా కర్మణా దేశాన్ని ప్రేమించు మనుషులం మనమవుదాం మంచిమనసులకు రూపాలు అవుదాం ! నడుచుకుందాం తోటిమనిషికి సాయపడుతూ నడవనిద్దాం వారి వృద్ధికి అడ్డుపడక ! నటనకాదు దేశభక్తి స్వతహాగా రావాలి మనసులోంచి ! దేశం నాకేమిచ్చిందని రుసరుసలాడకు దేశానికి నేనేమి చెయ్యగలనని యోచించు ! ఏడాదికోసారి ఎగరవేస్తే జెండా అయిపోదు బాధ్యత అని తెలుసుకుందాము ! కులమతభేదాలు కుతంత్రాలు కూలదొయ్య్కపోతె ప్రక్షాళన చెయ్యకుంటె అవినీతీ అక్రమాలు దేశమేగతి బాగుపడును భవిత ఏ తీరున చక్కపడును ! భావిభారత పౌరుల తీర్చిదిద్దాలంటె ఉండాలి మెండుగా దేశమంటే భక్తి నేనే దేశము దేశమే నేనన్న భావన నిండాలి మనసున దండిగా ! ఎందరి త్యాగఫలమో మనదేశ స్వాతంత్ర్యం అర్పించుకుందాము అందరికీ వందనాలు ! గౌరవ

కీ.శే. చంద్ర గారికి సుజనరంజని నివాళి

సుజననీయం
ప్రఖ్యాత చిత్రకారుడు, కీ.శే. చంద్ర గారికి సుజనరంజని నివాళి! కొద్ది రోజుల కాలం చేసిన చిత్రకారుడు చంద్ర గారితో సిలికానాంధ్ర సంస్థకు, సుజనరంజని మాసపత్రికకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. వాటి అక్షర గుర్తింపు చిహ్నాలను (logos) తీర్చి దిద్దింది ఆ మహనీయుడే. అలాగే, అన్నమయ్య అంటే ఇలాగుండాలి అని అన్నమయ్య ఉత్సవాల కోసం పదకవితామహుణ్ణి కో అందమైన రూపం కల్పించి ప్రపంచమంతా అందరూ ఉపయోగించుకునేలా చేసింది ఆ అపురూప శిల్పియే. ప్రతి ఏడు వెలువడే ప్రత్యేకసంచికలలో కొన్నింటికి ముఖచిత్రం వేయటమే కాకుండా లోపలి కథలు, కవితలకి బొమ్మలు కూడా గీసారు. ఈ పనుల్లో వారితో ఫోనులో పలుసార్లు సంభాషించటం జరిగింది. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆ మాటలు నెమరువేసుకుంటాను. తెలుగు ప్రజలకు తీర్చలేని లోటు అతని మరణం. ఓం శాంతిః - తాటిపాముల మృత్యుంజయుడు

సుజననీయం

సుజననీయం
ప్రొ. వేల్చేరు నారాయణరావు ప్రవాసాంధ్రుడైన నారాయణరావు గారు అమెరికా దేశంలో తెలుగు ఆచార్యుడిగా పనిచేశారు. ప్రఖ్యాత తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య, క్షేత్రయ్య గార్ల సాహిత్యాన్ని మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవ పురాణం, క్రీడాభిరామం వంటి ప్రసిద్ధ తెలుగు రచనల్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పురస్కారాన్ని 14వ గ్రహీతగా, తొలి భార్తీయునిగా అందుకొన్నారు. 1971నుండి ప్రముఖ తెలుగు సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని, ఇతరులతో కలిసి ఆంగ్లంలోకి అనువదిస్తూ తెలుగుభాషకు ఎనలేని సేవ చేస్తున్నారు. డేవిడ్ షుల్మన్ తో "క్లాసికల్ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ" అను రచనకు సహ రచయితగా, సహ సంపాదకుడిగా మరియు "గాడ్ ఆన్ ద హిల్: టెంపుల్ పోయెమ్స్ ఫ్రం తిరుపతి" అను రచనకు సహ ఆంగ్లానువాదకుడిగా వ్యవహరించారు. "ట్వంటీయత్ సెంచురీ తెలుగు పోయెట్రీ: యాన్ ఆంథాలజీ" అను గ్రంథానికి సంపాదకత్వం, అనువాదం అందించారు. గురజాడ అప్పారా

డా.సి.ఆనందారామం

సుజననీయం
- తమిరిశ జానకి విద్వన్మణి,ప్రముఖరచయిత్రి మంచిమనిషి డా.సి.ఆనందారామంగారు నిన్నరాత్రి (Febraury 11) మనందరినీ వదిలి వెళ్ళిపోయారన్న వార్త ఈ ఉదయం తెలియగానే మనసు స్తబ్ధుగా అయిపోయింది. ఈమధ్య కొన్నిరోజులుగా ఆవిడకి ఒంట్లో బాగులేదని తెలిసి రెండుసార్లు పలకరించాను. ఫోన్లో కూడా ఒక్క నిమిషం కంటే మాట్లాడలేకపోతున్నాను జానకీ అన్నారు.అందుకే తరచుగా ఫోన్ చెయ్యడం మానేశాను.ఆవిడ ఆరోగ్యం ముఖ్యం కదా. ఈ కరోనా గొడవ కాస్త తగ్గితే వెళ్ళి చూసిరావాలనుకున్నాను. ఎప్పుడు సభల్లో కలిసినా మాజానకి అంటూ నన్ను దగ్గిరకి తీసుకునేవారు. మా పుట్టిల్లు ,ఆవిడ అత్తవారిల్లు రెండూ నర్సాపురమే. పైగా ఆవిడ అత్తవారిల్లు మా నాన్నగారింటికి దగ్గిరే. నర్సాపురంలో మా తాతయ్య గారి కాలేజీ వై.ఎన్.కాలేజ్ లో ఆవిడ కొన్నాళ్ళు లెక్చరర్ గా చేశారు. అందరికీ ఆవిడంటే చాలా గౌరవం. నర్సాపురంలో అప్పట్లో ఆ కాలేజీలో చదివిన మా కజిన్స్ అందరికీ ఆవిడ తెలుసు.మా అందరికీ ఆవిడ

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం

సుజననీయం
*అంతర్జాల మాధ్యమం ద్వారా 2021 సంవత్సరపు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం* జనవరి 30, 2021 శనివారం సాయంత్రం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గ మండలి, అధ్యాపకులు, విద్యార్థులు, దాతలు, శ్రేయోభిలాషులు అంతర్జాల స్నాతకోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. 2021 సంవత్సరంలో పట్టభద్రులవుతున్న విద్యార్థులు (Class of 2021) సాధించిన విజయాలను ప్రతిఫలింపజేసుకొంటూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందించిన తోడ్పాటును తలచుకొంటూ, వారు మొదలెట్టబోతున్న నూతన రంగాల్లో విజయాలను అభిలషించారు. మిల్పిటాస్, జనవరి 30, 2021 - సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులవుతున్న 2021 సంవత్సరపు విద్యార్థులను అభినందిస్తూ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ 'తాము సాధించిన విజయాలను చూసి గర్వపడాలని ' అన్నారు. సభను ఉద్దేశిస్తూ, "భారతదేశ సంస్కృతి ఎంతో పురాతనమైనది. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం తొలినాళ్లలోనే ప్రపంచ ప్రఖ్యాతినొ

ఆకాశమే హద్దు!

సుజననీయం
పుట్టగానే బంగారు తొట్టెలో నిద్రపోక పోవచ్చు. జీవితం వడ్డించిన విస్తరి కాకపోవచ్చు. 'ఆడ'తనం ఎన్నో అడ్డంకులను తెచ్చిపెట్టవచ్చు. జాతి, మత, వర్ణాలు అనేక ఆటంకాలను ఎదురుపెట్టవచ్చు. వీటన్నిటిని అధిగమిస్తూ, 'ఆసాధ్యం' కానిదేది లేదంటూ అగ్రరాజ్యంలో ఒక అధినేతగా వెలుగబోతున్న అచ్చమైన భారతీయత పేరున్న 'కమల దేవి ' హార్రీస్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. (గమనిక: సిలికానాంధ్ర ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఏ ఒక్క రాజకీయ సిద్ధాంతాన్ని బలపరచదు. సిలికానాంధ్ర ఒక సాంస్కృతిక సంస్థ.)