కథా భారతి

ప్రక్షాళన

కథా భారతి
-G.S.S. కళ్యాణి. కాశీక్షేత్రంలో ఉన్న కేదారఘాట్ మెట్ల మీద కూర్చుని, గంగానదిని తదేకంగా చూస్తున్నాడు జానకీపతి. గంగ నిండుగా ప్రవహిస్తోంది. ఆ నదీతీరానికి వస్తున్న చిన్న చిన్న అలలు, జానకీపతి పాదాలకు చల్లగా తాకుతున్నాయి. మహాపుణ్యక్షేత్రంలోని పవిత్ర తరంగాలు జానకీపతి మనసుకు ప్రశాంతతను కలిగించే ప్రయత్నం చేస్తున్నా, ఏదో బాధ అదే మనసును అల్లకల్లోలం చేస్తోంది. ఒంటరిగా కూర్చుని ఉన్న జానకీపతికి తన జీవితమంతా ఒక్కసారి కళ్ళముందు గిర్రున తిరిగింది! జానకీపతి తండ్రి రాఘవయ్య గవర్నమెంట్ పాఠశాలలో సైన్సు మాష్టారు. రాఘవయ్య అంటే వాళ్ళ ఊరిలో అందరికీ అమితమైన గౌరవం ఉండేది. అయితే, రాఘవయ్య కేవలం అధ్యాపకుడు మాత్రమే కాదు, అతడు మొక్కలపై పరిశోధనలు జరిపే ఒక శాస్త్రవేత్త కూడా అని ఆ ఊరిలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు! మొక్కలు మనుషుల మాటలకు స్పందిస్తాయనీ, అవి మనుషులకు ప్రాణస్నేహితులుగా ఉండగలవని రాఘవయ్య నమ్మేవాడు. తమ ఇంటివెన

‘అనగనగా ఆనాటి కథ’

కథా భారతి
-సత్యం మందపాటి   స్పందనః ఆరోజుల్లో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు చూశాను. ఎంతోమంది శనివారం శ్రీవెంకటేశ్వరస్వామివారి గుడికి వస్తున్నారు, వెడుతున్నారు. కానీ నా కథలోని ముసలి గుడ్డి బిచ్చగాడినీ, అతని పక్కనే వున్న ఆరేళ్ళ పిల్లనీ చూడటం కానీ, కనీసం కొన్ని చిల్లర డబ్బులు పడేయటం కానీ చేయటం లేదు. గుడినించీ తిరిగి వెళ్ళే వారి చేతుల్లో వున్న అరటిపండునో, కొబ్బరి చిప్పనో వారికి ఇచ్చినవారు కూడా కనపడలేదు. అలాగే రాజకీయ నాయకుల బీదోద్ధరణ విన్నాక, తెలుగు సినిమా వారి ఆకలి బ్రతుకుల కథలు చూశాక, కమ్యూనిష్టుల పేద జన బంధోద్ధరణలాటి సొళ్ళు కబుర్లు విన్నాక, ‘మానవసేవయే మాధవసేవ’ మొదలైన వుత్తుత్తి ప్రవచనాలు విన్నాక, ఈ కథ వ్రాయాలనిపించింది. ఇదిగో ఆనాటి కథ ఇప్పుడు మళ్ళీ మీ ముందు పెడుతున్నాను. 0 0 0 నిచ్చెన (ఈ కథ ‘ఆంధ్రభూమి’ వారపత్రిక నవంబర్ 12, 1980 సంచికలో ప్రచురింపబడింది) ముసలయ్య అడుగుతున్నాడు, “ఏటే గవుర

అనగనగా ఆనాటి కథ

కథా భారతి
‘అనగనగా ఆనాటి కథ’ -సత్యం మందపాటి స్పందనః ఇంజనీరింగులో నా మాష్టర్స్ డిగ్రీ పూర్తయాక, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరేలోపల, వూరికే కూర్చుంటే వూరా పేరా అని పీ.డబ్ల్యూ.డీలో కొన్నాళ్ళు జూనియర్ ఇంజనీరుగా ఉద్యోగం వెలగబెట్టాను. అక్కడ చూసిన కుల పిచ్చి, కుంచాలతో లంచాలు, పదవి అహంకారం, ఆఫీసర్ల అడుగులకి మడుగులొత్తే బానిసత్వం, భూతద్దంలో వెతికినా కనపడని వ్యక్తి మర్యాద చూసి తల తిరిగిపోయింది. అక్కడవున్నప్పుడూ ఆ తర్వాతా అక్కడే జరిగిన విషయాల మీద కొన్ని కథలు కూడా వ్రాశాను. ఆ వుద్యోగం ఇక వెలగ’బెట్టలేని’ పరిస్థితిలో, ఇస్రో రమ్మనగానే తుర్రున తిరువనంతపురం వెళ్ళిపోయాను. అదన్నమాట ఈ నా గవర్నమెంటాలిటీ కథ వెనుక కథ. 0 0 0 థాంక్స్ టు ది ఇంగ్లీష్మన్! (ఈ కథ ‘’ఆంధ్ర సచిత్ర వారపత్రిక’, జులై 21, 1972 సంచికలో ప్రచురింపబడింది) ‘ఇదే మా ఆడిటోరియం’ అన్నాడు జయరాం, తమ ఆఫీసు కల్చరల్ అసోషియేషన్ వారి ఆడిటోరియం తన కొత్త

నిధి రహస్యం

కథా భారతి
G.S.S.కళ్యాణి రాజయ్య, కోటయ్య గోపాలపురంలో వర్తకులు. వారిరువురి వ్యాపారాలూ పోటాపోటీగా నడుస్తూ ఉండేవి. నలుగురికీ మంచి చేస్తే మనకు ఆ భగవంతుడు మంచి చేస్తాడన్నది రాజయ్య నమ్మకమైతే, ఈ కలియుగంలో అందరితో మంచిగా ఉంటూపోతే వ్యాపారం సమర్థవంతంగా చెయ్యలేమనేది కోటయ్య నమ్మకం. రాజయ్య మంచితనం తెలిసినవారంతా ఎట్టిపరిస్థితులలోనూ రాజయ్య తమను మోసం చెయ్యడన్న ధీమాతో ఉంటూ, తమ వ్యాపార అవసరాల కోసం రాజయ్య వద్దకు మాత్రమే వెళ్లేవారు. రాజయ్యకు తరతరాలుగా సంక్రమించిన ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. అందువల్ల రాజయ్య తన వ్యాపారానికి సంబంధించి ఏ సాహసోపేత నిర్ణయం తీసుకోవాలన్నా అందుకు వెనుకాడేవాడు కాదు. ఆ కారణంగా అప్పుడప్పుడూ కోటయ్య కన్నా రాజయ్యకు వ్యాపారంలో ఎక్కువ లాభం వస్తూ ఉండేది. కోటయ్య పూర్వీకులు ఆస్తులేవీ పెద్దగా కూడబెట్టలేదు! అందుకని తన వ్యాపారానికి నష్టం కలిగించే అవకాశమున్న వ్యవహారాలకు దూరంగా ఉంటూ, డబ్బుల విషయంలో ఎప్పుడూ జా

అనగనగా ఆనాటి కథ

కథా భారతి
సత్యం మందపాటి స్పందనః మనుష్యులు ధనవంతులయితే, వారి మనసులు అంత గొప్పగా వుంటాయా? అలాగే బీదవారి విలువలు అంత తక్కువగా వుంటాయా? ఆరోజుల్లోనే కాదు, ఇప్పటి దాకా కూడా మనవారి ఆలోచనల్లో పెద్ద తేడా వచ్చినట్టు కనపడదు. ఎందుకని? మానవత్వపు విలువలు డబ్బుతో ముడిపడి వుంటాయా? ఆరోజుల్లో సాధారణంగా జరిగే ఇలాటి విషయాల మీద విశ్లేషణతో కూడిన ఆలోచనలే ఈకథకి స్పందన. స్పూర్తి. చదివే ముందు నా ప్రియ మిత్రుడు, ఈమధ్యనే మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఎంతో గొప్ప చిత్రకారుడు ‘చంద్ర’ ఈ కథకి వేసిన బొమ్మని నిశితంగా చూడండి. అందంగా వుండటమే కాక, నేను కొన్ని పేజీల్లో చెప్పిన కధని బహు కొద్ది గీతలతో ఎంతో అర్ధవంతంగా చిత్రించిన తీరు, నా కథకే చిరస్మరణీయమైన గుర్తింపుని అందించింది. జయహో మిత్రమా! ధన్యోస్మి! 0 0 0 నింగీ నేలా (ఈ కథ ‘జ్యోతి’ మాసపత్రిక, ఆగష్ట్ 1977 సంచికలో ప్రచురింపబడింది) “ఈ సముద్రపు ఒడ్డున ఇలా కూర్చుని, పైన వున్న ఆకాశాన

‘అనగనగా ఆనాటి కథ’

కథా భారతి
-సత్యం మందపాటి స్పందనః అందమనేది శాశ్వతమా, అనుబంధమనేది శాశ్వతమా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు అల్లిన కథే ఈ “సజీవ శిల్పం”. ఈ కథ చదివితే అందంగా వచ్చిన ఈ కథకీ, నాకూ వున్న అనుబంధం మీకు ఇట్టే అర్ధమైపోతుంది. ఆ రోజుల్లో ఎన్నో కొత్త కొత్త వారపత్రికలూ, మాస పత్రికలూ వస్తుండేవి. కొన్ని ఎన్నాళ్ళ తరబడిగానో నిలిచి కాలగమనంలో అంతర్ధానమయాయి. కొన్ని ముందు బాగానే నిలద్రొక్కుకున్నా ఎక్కువ సంవత్సరాలు వుండలేక పోయాయి. కొన్ని ఒకటి రెండు సంవత్సరాల్లోనే మూతపడ్డాయి. ఆనాటి రచయితలకు ఎంతో స్పందనా, పాఠకులకు మంచి కథలూ అందించిన చిన్న సైజు పత్రికల్లో కొన్ని ప్ర్రముఖమైన పత్రికలుః ప్రజామత, జయశ్రీ, ప్రభవ, పొలికేక, విశ్వరచన, నిర్మల, విజయ, పద్మప్రియ, ప్రగతి, జనసుధ, నీలిమ, అపరాధ పరిశోధన మొదలైనవి. సాహిత్య రంగంలో అప్పుడు ఎన్నో పత్రికలతో సాహితీ ప్రియులను అలరించిన రోజులవి. ఇక చదవండి నాకు నచ్చిన ఆనాటి నా కథల్లో నాకు ఇష్టమైన ఒక మంచి కథ

ఆదుకున్న అమ్మ భాష

కథా భారతి
-G.S.S.కళ్యాణి. అది భారతదేశంలో ఒక ప్రపంచ ప్రఖ్యాత బహుళజాతి సంస్థ. అక్కడ వివిధ స్థాయిల్లో ఉద్యోగులను నియమించేందుకుగానూ ముఖాముఖి సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశానికి హాజరు కావడానికి వచ్చిన అభ్యర్థులు, అక్కడ వరుసగా వేసిన కుర్చీల్లో కూర్చుని తమ వంతు కోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. వారిలో కొత్తగా డిగ్రీ చదువు పూర్తి చేసి, ఉద్యోగాల వేటలో ఉన్న మారుతి కూడా ఉన్నాడు. తన చదువుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చేతిలో పట్టుకుని, అక్కడి పరిసరాలను గమనిస్తున్న మారుతికి తన భవిష్యత్తు పై ఇంతకుముందెన్నడూ కలగని ఆశలు కొన్ని కలుగుతున్నాయి! ‘నాకు ఈ సంస్థలో ఉద్యోగం వస్తే నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు!! నా చదువుకోసం చేసిన అప్పులన్నీ తీర్చెయ్యగలుగుతాను! నాన్న చేత కూలీపని మాన్పించేసి, అమ్మనూ, నాన్ననూ బాగా చూసుకోగలుగుతాను! డబ్బుల కోసం ఇంకెప్పుడూ ఇబ్బంది పడకుండా హాయిగా జీవితంలో స్థిరపడిపోతాను!’, అని అనుకు

వాటా

కథా భారతి
-ఆర్ శర్మ దంతుర్తి సోమవారం పొద్దున్న డాకెట్ లో మొదటి కేసు. బెనర్జీ అనే ఓనర్ గారు ఏపిల్, ఆండ్రాయిడ్ ల మీద పనిచేసే ఓ ఏప్ తయారు చేస్తున్నారు. ఒక వెంచర్ కాపిటలిస్ట్ పాతిక శాతం వాటాకి పెట్టుబడి పెట్టాడు కానీ పని అవలేదు. కారణాలు అనేకం – కోడ్ రాసే కుర్రాడు పని మానేసి వెళ్ళిపోయాడు; కొన్ని కోడ్, నెట్ వర్క్ కష్టాలు, అన్నీ కలిపి కోతి పుండు బ్రహ్మరాక్షసి లాగా తయారయ్యాయి. డబ్బులు అయిపోయాయి; ఈ ఆప్ కనక మరో ఆర్నెల్లలో పూర్తవకపోతే వెంచర్ కాపిటలిస్టు గారు పీకలమీదకి వచ్చి కూర్చుంటాడు. ఉన్న ఒకే ఒక దారి – బెనర్జీగారి ప్రకారం – మరో నూట యాభైవేలు సర్దాలి. అన్నింటికన్నా ముఖ్యం ఆ ఆప్ పూర్తిచేయడానికి అమల, వెంకటేశ్వరన్ ఇద్దరూ పనిచేయాలి –ఫుల్ టైం స్థాయిలో – అంటే, ఉన్న ఉద్యోగాలు మానుకుని. ఉన్న ఉద్యోగం మానుకుంటే ఎలా అనే ప్రశ్నకి బెనర్జీగారే చెప్పారు సరైన సమాధానం. ఏప్ అవగానే దాన్ని ఎవరో పెద్దవాళ్లకి అమ్ముతారు ఏడాదిలో

‘అనగనగా ఆనాటి కథ’

కథా భారతి
-సత్యం మందపాటి స్పందనః నాకు ఆనాటినించీ ఈనాటిదాకా ఎన్నో పుస్తకాలు, పత్రికలూ చదివే అలవాటు వుందని చెప్పాను గదా! అలాగే కొన్ని పత్రికల్లో పడుపు వృత్తి గురించి, వారు అలాటి వృత్తిలోకి కావాలని రాకపోయినా, ఆ విషవలయంలోకి ఎలా కొందరు స్వార్ధపరులు డబ్బుకోసం వారిని ఆ రొంపిలో తోసేస్తారు, సమాజంలో ఆ వృత్తి చేసుకునే వారికి మర్యాద, గౌరవం ఎలా వుంటుంది మొదలైన విషయాలు చదువుతుంటే వచ్చిన ఆలోచనే ఈ కథ వ్రాయటానికి స్పందన. ఈ కథ ఆంధ్రపత్రికలో వచ్చాక, ఎందరో పాఠకులు మెచ్చుకుంటూ ఉత్తరాలు వ్రాశారు. అంతేకాక, ఆనాటి కొన్ని మంచి కథలు ప్రచురించిన ఒక కథా సంపుటిలో కూడా, ప్రత్యేకంగా ఆ పుస్తకానికే “మనిషి” అని పేరు పెట్టి ప్రచురించారు. ఇది నాకిష్టమైన కథల్లో ఒకటి. మీ అభిప్రాయం కూడా చెబుతారు కదూ! 0 0 0 మనిషి (ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక సెప్టెంబర్ 4, 1974 సంచికలో ప్రచురింపబడింది) ఒకసారి ఆ ఆరుగురినీ పరీక్షగా చూశాడతను. ముఖాలకు

తనకు మాలిన ధర్మము

కథా భారతి
— బి వి లత ‘శశీ, ఎక్కడకు వెళుతున్నావు?’ ‘ఇప్పుడే వస్తా’ ‘నా మాట వినరా! బయట పరిస్ధితి బాగా లేదు, నువ్వు చెపితే వినవేం? ఊరంతా కరోనా అని భయపడుతోంది. జాగ్రత్తగా ఉండాలిరా’ ‘అందుకే వెళుతున్నానమ్మా! ఎవరికో ఎమర్జన్సీట!’ ‘కనీసం ఆ పి పి యీ కిట్టు ఏదో ఉంటుందిగా, అదేదో వేసుకోని, మాస్కన్నా సరిగ్గా పెట్టుకో’ ‘నాకు తెలుసులేమ్మా, నస పెట్టకు’ అంటూ హడావుడిగా వెళ్ళే కొడుకు కేసి బెంగగా చూస్తూ, ‘చూడండి, వాడు నా మాట వినకుండా, ఎలా వెళుతున్నాడో?’ అంటూ భర్తకు ఫిర్యాదు చేసింది సుగుణ. ‘ఇది మీ ఇద్దరకీ మాముూలేగా? కాస్త కాఫీ ఇవ్వు’ అంటూ శరత్ గారు టివి న్యూస్ చూడటంలో మునిగి పోయారు. *** ‘శశి రాలేదా?’ ‘లేదు, రాత్రి 10 అయ్యింది, రోడ్డుమీద పురుగు లేదు, వీడు ఎక్కడ ఉన్నాడో? ఫోన్ కూడా ఎత్తడు. అదిగో, వచ్చినట్లున్నాడు, శశీ, నీళ్ళు బయట పెట్టా, అక్కడే బట్టలు వదిలి, రెండు చెంబులు పోసుకోని రా’ వి