ధారావాహికలు

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
శ్రీరామావతార సమాప్తి శ్రీరాముడు తరువాత వానరప్రముఖులను, విభిషణుణ్జి తన దగ్గరకు రప్పించుకున్నాడు. వాళ్ళందరికి చెప్పవలసిన సంగతులు చెప్పాడు. ఆయనను సుగ్రీవాదులు అనుగమిస్తామన్నారు. శ్రీరాముడు విధివిధానంగా అయోధ్యా పౌరులు, వానర ప్రముఖులతో సరయూనది చేరి మహాప్రస్థానం పాటించాడు, వానర ప్రముఖులు శ్రీరాముడి యుద్దసహాయకులు అందరూ తమ తమ దేవతాలోకాలకు చేరుకున్నారు. అయ్యోధ్య పౌరులందరికీ కూడా 'సంతానకాలు' అనే దివ్యలోకాలు లభించాయి. ఫలశ్రుతి శ్రీరామాయణం ఆదికావ్యం, సాటివేని మహాకావ్యం. దీని కథానాయకుడు శ్రీరామచంద్రుడు. ఉత్తమగుణాలన్నీ సమగ్రంగా కలిగినవాడు. ధర్నానికి ఆయన ప్రతిరూపం, రాజుగానే కాక, ఒక ఉత్తమ మానవుడుగా లోక క్షేమమే ధ్యేయంగా భావించినవాడు. సత్యమే ఉత్తమధర్మంగా స్వీకరించి, తన తండ్రిని సత్యసంధుడిని చేయటానికి రాజ్యం విడిచి అడవులకు పోయినవాడు. రక్షించమని కోరినవాడు శత్రువైనా సరే కాపాడటం వ్రతంగా పెట్టుకున్నవాడ

శ్రీరామరాజ్యం

ధారావాహికలు
శ్రీరామరాజ్యం గూర్చిన ప్రశంసలు సర్వకాలాల్లో జనులు చెప్పుకున్నారు. ( ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు). యజ్ఞయాగాలు ఎప్పుడు నిర్వహించినా బంగారు సీతాదేవి విగ్రహాన్ని తనతోపాటు ఉంచుకొని ఆ పుణ్యకార్యాలు నిర్వర్తించాడు శ్రీరాముడు. శ్రీరామరాజ్వంలో అతివృష్టి, అనావృష్టులు ఉండేవికావు. పంటలు పుష్కలంగా పండేవి. భూమి సస్యశ్యామలంగా ఉంటూ వచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయీదేవి పరమ పదించారు. శ్రీరాముడూ, శ్రీరామసోదరులూ వారికి భక్తిప్రపత్తులతో పితృకర్మలు నిర్వర్తించారు. పదకొండువేల సంవత్సరాలు శ్రీరాముడు రాజ్యం చేసి ప్రజలను సుఖపెట్టాడు. భరతుడి మేనమామ యుధాజిత్తు శ్రీరాముడికి తన పురోహితుడు అయిన గార్గ్యుడితో రత్నరాశులు, శ్రేష్టమైన వేల సంఖ్యలో గుర్రాలు, వెలలేని ఆభరణాలు కానుకగా పంపించాడు. గార్గ్యుడు ఆంగిరసుడి పుత్రుడు. చాలాదూరం ఎదురు వెళ్ళి శ్రీరాముడు ఆ మహర్షిని గౌరవించి ప్రీతుణ

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
1947, నవంబరులో పొట్లపల్లి రామరావుగారి "చుక్కలు" ఈ అనుభూతి కవితా పంథాలో వెలువడినదే. ఇందులోని ఏ చుక్క భావం ఆ చుక్కదే. ఇవి ఏ చుక్కకి ఆ చుక్కగా విడిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఆలోచననీ, అనుభూతినీ అందించేవే. ఈ చుక్కలలో పుస్తకాల గురించీ, శబ్దం గురించీ, మాతృప్రేమ గురించీ, భూమిగురించీ, - ఇలా ఒకటేమిటి మనిషికి అవసరమైన ప్రతి వస్తువూ ఇందులో కవితా వస్తువులయ్యాయి. ఇందులోని చుక్కలన్నీ వచన కవితనాశ్రయించే ఉన్నాయి. 1977, జనవరిలో వెలువడిన “సీమోల్లంఘున” పణతుల రామచంద్రయ్యగారిది. ఇందులోని ఖండికలు ఇరవైయ్యొకటి (21). “సీమోల్లంఘని, “మరచిపోయిన పాట; కిటికీ, 'దీర్ఘరాత్రి' మొదలైనవి ఇందులోని కొన్ని కవితా ఖండికలు. ఈ కవితా ఖండికలన్నీ వచన కవితలో సాగినవి కావటమే కాక అమభూతి ప్రధానంగా వెలువడినవి. పి. హనుమయ్యగారి “విభావరి 1978, జనవరిలో వెలువడింది. ఇది “అనిబద్ధకావ్యఖండిక'. ఇందులో మొత్తం ఎనభై(80) ఖండికలున్నాయి. అనుభూతితో వ

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
శ్రీరాముని అశ్వమేధ యాగానికి వాల్మీకి రావటం శ్రీరామచంద్రుని అశ్వమేధ యజ్ఞాన్ని గూర్చి విని వాల్మీకి మహర్షి తన ఆశ్రమ వాసులందరితో యజ్ఞవాటికి వచ్చాడు వచ్చినవారిలో కుశ, లవులు కూడా ఉన్నారు. భరతశత్రుఘ్నులు, మహర్షికీ, ఆయన పరివారనికీ విడుదల ఏర్పాటు చేశారు వాల్మీకిమహాముని కోరికపై అయోధ్యానగరంలో అన్ని వీథులలోను (శ్రుతిలయబద్ధంగా కుశలవులు శ్రీరామకథ గానం చేశారు. ఇది ఆ నోట ఆ నోట పోగడ్తకెక్కటంతో శ్రీరాముడు కుశలవులను ఆహ్వానించి తన సభలో కూడా వాళ్ల చేత పాడించాడు. తన కథ వినీ, సీతాదేవిని తలచుకొనీ ఆనందవిషాదాలకు లోనైనాడు. ఈ కథ ఎవరు రచించారు? అని లవకుశులను ఆయన అడగగా వాల్మీకిమహర్షి రచించి తమకు తాళలయానుబద్ధంగా నేర్పాడని వాళ్ళు చెప్పారు. అప్పుడు శ్రీరాముడు సీతాదేవిని తలచుకొని చాలా విషాదం పొందాడు. దుర్భరశోకం అనుభవించాడాయన. ముద్దులు మూటలు కట్టే ఈ మధురబాలగాయకులు తన కుమారులే అని శ్రీరాముడు గ్రహించాడు. ఇట్లా శ్రీర

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
తాను రాస్తున్నది అనుభూతి కవిత్వమని చెప్పుకోకపోయినా, బహుశా భావించి ఉండకపోయినా ఇప్పటి మన విశ్లేషణల ప్రకారం అప్పటి ఆయన కవిత్వం అనుభూతి కవిత్వమే అవుతుందని గమనించవచ్చు. గీతాంజులి', “నుధల' పుట్టుకకి దోహదం చలంలో కేంద్రీకృతమై ఉన్న అనుభూతే కారణం అని చలం రచనల ద్వారానే విశదమౌతుండటం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. చలం దృష్టిలో ఆధ్యాత్మికం సమాజానికి దూరమైంది కాదు. చలంగారి రచనలలో సమాజానికీ, ఆధ్యాత్మికానికి సమప్రాధాన్యం కన్పిస్తాయి. అందుకేనేమో శ్రీశ్రీ చలంగారిని 'యోగివేమన' లా వర్ణించటం జరిగింది. “గీతాంజలి” చలం జీవితానికో కొత్త వెలుగుని, ఆధ్యాత్మిక జీవితాన్నీ ఇచ్చిందని “గీతాంజలి” ముందుమాటలో చలమే రాసుకున్నాడు. “గీతాంజలి నాకో కొత్త దృక్పథాన్ని, Philosophy of lifeని, నేను అనుభవించే. అందాలకి ఓ వెలుగుని, నా ఆశలకో అర్థాన్ని ఇచ్చింది.” 50 మనసుని ఆకర్షించి, ఆత్మలో మాధుర్యాన్నీ తేజస్సునీ నింపగలగటం గొప్పకళ

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
చెల్లాచెద్యురైపోతాం మళ్ళీ కనిపించం! సీలు వెక్కగలిగినవాదే సింహాననానికి అర్హుడు!!" 48 ' సింహాసనం' అనే ఖండికలో సింహాసనానికి అర్హుడైన వ్యక్తి సిలువను సైతం ఎక్కగలిగినవాడై ఉండాలని చెప్పాడీ కవి. సింహాసనాన్ని మించిన స్ధానంలో వేసుకుంటే వారు ఎప్పుడో ఒకప్పుడు కిందకి జారిపోక తప్పుదు. “చివర్నుండి మొదలుకు నడిచిననాకు మొదలు దొరికింది కానీ చివరవతలేముందో చె ప్పేదెవరూ?"49 అని ప్రశ్నించుకుంటాడు ఈ కవి.

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
శ్వేతుడి కథ అప్పుడు శ్రీరాముడు “మహానుభావా! ఈ ఆభరణం మీకెట్లా వచ్చింది "? అని అడిగాడు. అప్పుడగస్తృ మహర్షి ఆ వృత్తాంతం శ్రీరాముడికి చెపాడు. 'ఇది జరిగిపోయిన మహాయుగంలోని జ్రేతాయుగం నాటి కథ” అని ఆయన మొదలుపెట్టాడు చెప్పుటం. “ఇంతింతనరాని విస్తీర్ణం కల ఒక మహారణ్యం ఉండేది. అది బహు యోజన విస్సృతం. అయితే అందులో ఒక మృగమైనా, ఒక క్ర సక్షి అయినా కనపడకపోవడం వింత సుమా! నాకు ఈ గడ్డు సమస్య ఎందు కేర్వ డిందో తెలుసుకుందామన్న ఆసక్తీ కలిగింది. అక్కడే తపస్సు చేసుకుంటూ ఈ వింతను కనుక్కోవాలని నిశ్చ యించుకున్నాను. ఆ అడవి మధ్య ఒక విశాలమైన సరస్సు ఉంది. దాని గట్టున ఒక ఆశ్రమం ఉంది. కాని ఆ ఆశ్రమం నిర్మానుష్యం. ఆ ఆశ్రమంలో నేను ఒక రోజు ఉన్నాను. మర్నాడు ప్రాతఃకాలాన సరస్సు దగ్గరకు స్నానార్థం వెళ్ళాను. అక్కడ ఒక ప్రేతశరీరం కన్పించింది. నేనెంతో ఆశ్చర్యంతో చూస్తుండగా ఒక దివ్వవిమానం అక్కడకు వచ్చింది. అందులో ఒక స్వర్లోకవా

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
వీరిదే మరొక కవితా సంకలనం “అనుభూతి గీతాలు” కవి అనుభూతే వస్తువుగా వెలసిన అనుభూతి కావ్యం ఇది. అనుభూతి వాదాన్ని సిద్దాంతం గా ప్రతిపాదించిన శ్రీ కాంతశర్మగారు, ఆ సిద్దాంతానికి అనుగుణంగా రచించిన కవితా సంకలనం ఇది. ఏ ఇజానికీ కట్టుబడకుండా, తనలో కల్గిన అనుభూతులకి అకారాన్నిస్తారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు. “లోకంలో బుతువుడు ఆరైతే, నీలో ప్రతి అనుభవం ఒక బుతువే! నీలో ఇరుక్కున్న ప్రపంచం బయటపడాలనుకుంటుంది. బయతునున్న ప్రపంచం నీలో జొరబడాలనుకుంటుంది, ఇది చిరఘర్షణ -"38 'దుఃఖం' అనే ఖండికలో జీవితంలో చిర ఘర్షణకి కారణం చెప్పారు. “స్వాతి వాన కోనం ముత్యపు చిప్పల్లా నిరంతరం నీ కళ్ళు కాచుకొని వుంది, అనుభవాల లోకాలోకనం చేస్తూ ఊగిసలాడుతుంటాయి - బ్రతుకంతా ఏదో సడి, తడి, అలజడి- వువ్వు గుర్తించలేనంత సున్నితంగా ఒకప్పుడు ఒళ్లు జలదరిస్తుంది- ఒకానొక అనుభవం నీలో ఘనీభావించే మౌక్తిక క్షణమది-

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
శత్రుఘ్నుడు వాల్మీకి మహాముని ఆశ్రమం చేరిన ఆ రాత్రే సితాదేవి ప్రసవించి కవలలను కన్నది. ఆమె అర్దరాత్రి ప్రసవించిందని మునిబాలకులు వచ్చి చెప్పారు. అప్పుడు వాల్మీకిమహాముని శిశువులకు శాంతికపొష్టిక కార్యకలాపం ఆచరించాడు. (భూతవినాశిని, రాక్షసఘ్ని అనే రక్షాక్రియలు నెరపాడు). పిడికిటిలో దర్భలు తీసుకొని వాటిని సమభాగాలు చెసి అగ్రభాగం వాటితో ఒకరికి, అడుగుభాగం వాటితో మరొకరికీ రక్ష కలగాలని అభిమంత్రించాడు. అందువల్ల వాళ్ళకు కుశుడు (కుశమంటే దర్భ పైభాగము), లవుడు(లవమంటే దర్భ కిందిభాగం) అనే పేర్లు వచ్చాయి. ముని పత్నులు శ్రీ సీతారాములను గూర్చి పాటలు పాడారు. పురిటి పనులు నిర్వహించారు. అప్పుడు సీతాదేవి ప్రసవించిన విషయం శత్రుఘ్నుడు తెలుసుకొని వెళ్ళి ఆమెకు నమస్కరించి రఘువంశప్రదీపకులను చూశాడు. బాగా తెల్లవారిన తర్వాత శత్రుఘ్నుడు చ్యవనమహర్షిని దర్శించాడు. శ్రిరమచంద్రుడి దగ్గరకు వచ్చి లవణుడి ఘోరకృత్యాలు చెప్పింది. ఈ

అన్నమయ్య శృంగార నీరాజనం

ధారావాహికలు
-టేకుమళ్ళ వెంకటప్పయ్య కరేణ కిం మాం గృహీతుం ఇది ఒక సంస్కృత శృంగార సంకీర్తన. అమ్మ పద్మావతి శ్రీనివాసునితో సరసమాడుతూ, దశావతార వర్ణన చేస్తున్నది. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: కరేణ కిం మాం గృహీతుం తే హరే ఫణిశయ్యా సంభోగ ॥పల్లవి॥ చ.1. జలే తవ సంచరణ మిహాధస్ స్థలే భవనం తవ సంతతం బలె రూప ప్రకటన మతులా చలే స్థానం చల చల రమణా ॥కరేణ॥ చ.2. పదే భువన ప్రామాణ్యం తవ హ్రదే ప్రచుర విహరణ మిదం ముదేమునీనాం మోహనం తనుం మదే తవ నర్మ చ మాం విసృజ ॥కరేణ॥ చ.3. స్మరే విజయ స్తవ విమలతురగ ఖురే రతిసంకుల రచన పురే తవ విస్ఫురణం వేంకట గిరే:పతే తే ఖేలాఘటిత ॥కరేణ॥ (రాగం: ఆహిరి, రేకు 40-6; సం.6-171) విశ్లేషణ: పల్లవి: కరేణ కిం మాం గృహీతుం తే హరే ఫణిశయ్యా సంభోగ ఓ శ్రీహరీ! క్షీర సాగరంలో శేషశయనుడవై, జలసంచరణంతో, అందరిని ఈ సంసార సాగరం నుండి తరింపజేస్తున్న నాధా! నా చేయి పట్టుకోడానికి వచ్చావు కదా! అని అమ్మ అంటో