Month: August 2018

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి భావకవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చింది అబ్యుదయ కవిత్వం. వీరు అభ్యుదయ కవులమని చెప్పుకున్నా తిరుగుబాటే వీరి ప్రధాన ఆశయం. తరువాతి కాలంలో ఈ కవులే విప్లవ రచయితల సంఘంగా ఏర్పడటం గమనిస్తే, సమాజంలో వీరికి కావలసింది తిరుగుబాటు. వర్గపోరాటం వీరి ప్రధాన ధ్యేయం. రచనల్లో వీరు కోరుకునేది రెచ్చగొట్టే లక్షణం, “హరోం! హరోం హర! హర! హర! హర! హర! హరోం హరా! “ అని కదలండి! అని చెప్పే రాచనలే వీరికి ప్రధానం. పోల్చి చూస్తే ఇదే కవి చెప్పిన “నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా? నడుమ తడబడి నడలిముడుగక పడవతీరం క్రమిస్తుందా?” అని చెప్పిన రచన ఈ వర్గపోరాటం ఆశించేవారికి చాలదు. రచన చదివిన తర్వాత తెలియని ఆనందంతో ఎక్కడికో వెళ్ళే సహృదయుడు ఈ గేయాన్ని పదికాలాలపాటు గుర్తుంచుకోగలడు. కానీ మార్క్సిస్తులకది చాలదు. వారికి కావలసింది, “బాటలు నడచే. పేటలు కడచే. కోటలన్నిటిని దాటండి! నదీనదాలూ, అడవులు, కొండలు,

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య “కన్నుల మొక్కేము అంటున్న నాయిక” కడపను ఒకప్పుడు దేవుని గడప అని పిలిచేవారు. ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప  “గడప”  అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కాలాంతరంలో కడపగా మారిందంటారు. క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు. ఈ ఊరిని కరిపె, కరిగె అంటారని రాశాడు. కరిపె అనే మాటే చివరికి కడపగా మారి ఉండవచ్చు.అక్కడ కొలువై ఉన్న శ్రీనివాసుని పేరు కడపరాయుడు. ఈ కీర్తనలో "కన్నుల మొక్కేము నీకు కడపరాయా!" అని నాయిక కృతజ్ఞతా భావంతో అలమేలుమంగమ్మ స్వామిని వేడుకొంటోంది. చిత్తగించండి. కీర్తన: పల్లవి: కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ గన్నెనాఁడె యేలితివి కడపరాయ చ.1. కందర్పగు

అనర్ధాలకు మూలం! అసూయలే శాపం!

ధారావాహికలు
-అమరనాథ్ జగర్లపూడి అసూయ (Jeously) ఇది మనం తరచుగా వినే పదమే తనకున్నదేదో పోతుందనో, తనకు రానిది ఇతరులకు దక్కుతుందనే, తానూ పొందలేంది ఇతరులు పొందుతారనో అని మనస్సు అనేకానేక భావోద్వేగాలకు గురౌతూ మనసును అనేక చికాకులకు గురిచేస్తుంటుంటుంది ఇదే అసూయ అనే మూలాలకు బీజాలు. ఇది బుద్ధిజీవి యైన మనిషి లో సర్వసాధారణమైన విషయం. ఈ సాధారణం అసాధారణమైతేనే అసలు సమస్యలు ప్రారంభమయి మనసు అల్లకల్లోలంలోకి ముంచి అభద్రతా భావాలకు గురి చేస్తుంది. సహజంగా వ్యక్తి తన ఉనికికి భంగం కలుగుతుందను కునేటప్పుడు,దాని వలన సమాజంలో తన సంబంధాలలో పరువు, ప్రతిష్టల లలో సమతూల్యతలకు భంగం కలుగుతుందనుకొనేటప్పుడు ఈ'అసూయ అనేది పొడసూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే ఒక్కొక్కసారి ద్వేషం రూపంలో అనేక అఘాయిత్యాలకు కారణమయి జీవితాలను నాశనం చేస్తుంది కూడా ప్రేమలు, చదువులు, ఆర్ధిక కారణాలు ఆటలు, పాటలు, రాజకీయాలు, సామాజిక వివక్షతలు, ఉద్యోగాల్లో, పిల్లల పెంపకాల

భిన్నత్వంలో ఏకత్వం (Unity in Diversity)

కథా భారతి
రచన: ఇర్షాద్ జేమ్స్ జగన్ పూర్తి పేరు జంబలకిడి జగన్మోహన రావు. జగన్ ఆమెరికా వచ్చి Jag అని పేరు మార్చుకున్నాడు, పిలవటానికి సులువుగా వుండటానికి. జగన్‌కి ముప్పై యేళ్ళుంటాయి. కాని ఇంకా పెళ్ళి కాలేదు. జగన్ ఎప్పుడు ఇండియాకి ఫోన్ చెసినా, వాళ్ళమ్మ, నాన్న, “ఒరేయ్, పెళ్ళెప్పుడు చేసుకుంటావురా?” అని అడుగుతూంటారు. “నాకు పెళ్ళి ఇష్టం లేదమ్మా !!” అంటాడు జగన్. కాని ఈసారి ఇండియాకి ఫోన్ చేసినప్పుడు జగన్ వాళ్ళ నాన్న ఒక కొత్త డైలాగు వేసాడు. “ఒరేయ్, త్వరగా పెళ్ళి చేసుకోరా, మేము ముసలివాళ్ళమైపొతున్నాము”, అన్నాడు జగన్ వాళ్ళ నాన్న. “నేను పెళ్ళి చేసుకుంటే మీరు ముసలివాళ్ళవటం మానేస్తారా?” అని మనసులొ అనుకున్నాడు జగన్. కాని బయటకి మాత్రం, “నాకు పెళ్ళి ఇష్టం లేదు నాన్నా !!” అని పాత డైలాగే వేసాడు జగన్. ఈసారి జగన్ వాళ్ళమ్మ కొత్త డైలాగు వేసింది. “ఒరేయ్, మా సంగతి పక్కన పెట్టు. నువ్వు కూడా ముసలి వాడివయిపోతున్నావు !!” అంది జ

శ్రీ దక్షిణామూర్తి

సారస్వతం
వైష్ణవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ హయగ్రీవుడిని ఆరాధిస్తారు. శైవులు జ్ఞాన ప్రదాతగా శ్రీ దక్షిణా మూర్తిని ఉపాసిస్తారు.శివకేశవులు వేరు కారని భావించే మాలాంటి వారు ఇద్దరినీ ఆరాధిస్తారు. ప్రస్తుతం శ్రీ దక్షిణామూర్తి తత్వాన్ని గురించి క్లుప్తంగా తెలియచేస్తాను. వీలైనప్పుడు హయగ్రీవుడిని గురించి కూడా తెలియచేస్తాను!శ్రీ దక్షిణామూర్తి అనబడేది అతి ప్రాచీనమైన ఈశ్వర తత్త్వం.సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాలనుంచి వ్యక్తమైన రూపాలే సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులు.వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు. అందుకు వారు అంగీకరించక తమకు జ్ఞానం కావాలని అక్కడినుంచి వెళ్లిపోయారు. జ్ఞానం కావాలని కోరుకోవటం కూడా ఒక రకమైన అజ్ఞానమే. మనకు నియంత్రించిన విధి, కర్తవ్యాలను నిర్వర్తించక మోక్షం కోసం అడవులకు పోయే వారందరూ నిజానికి అహంభావులు,అజ్ఞానులు! శివుడు ఇది గమనించి వారి