కుమార సంభవం
-శారదాప్రసాద్
కుమారస్వామి జననం గురించి పురాణాలలో పలు కధలు ఉన్నాయి.మహాకవి కాళిదాసు వ్రాసిన కుమార సంభవంలో కుమారస్వామి జననం వరకే ఉన్నది.మిగిలిన వృత్తాంతం శివపురాణం,స్కాంద మరియు ఇతర పురాణాల్లో ఉంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు అహంకారపూరితుడై సకల సజ్జనులను హింసిస్తూ ఉంటాడు.అతని బాధలను భరించలేని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు -- శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్లైతే,వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు అని! దేవతలు వెంటనే శివుడి మీదకు మన్మధుడిని ప్రయోగిస్తారు. శివుడు మన్మథుడిని దహించి వేస్తాడు .తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు జారి భూమిపై