Author: Sujanaranjani

అనుభూతి – ప్రాచీన దృక్పథం (4- భాగం)

సారస్వతం
– సునీల పావులూరు ఈ పంచకోశాల ద్వారా కలిగే సంపూర్ణమైన అనుభూతే సమగ్రానుభూతి. ఒక్కొక్క కోశం ద్వారా ఒక్కొక్క విధమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి పాక్షికంగా ఉంటుంది. సమాజం పాక్షికానుభూతిని కాకుండా సమగ్రానుభూతిని కాంక్షిస్తోంది. అనుభవం మానవసమాజానికి మూడు రకాలుగా అందించబడుతోంది. శాస్త్రపరంగానూ, తత్త్వపరంగానూ, కవిత్వపరంగానూ అనుభవ ఏకసూత్రత జరుగుతోంది. “భూమిమీద మనిషి అడుగు పెట్టినప్పట్నించీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికీ, ఈ ప్రపంచంతో సంధానం (adjustment) కుదుర్చుకోవటానికీ ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమంటే విభిన్నమైన ప్రాపంచిక అనుభవాల్లో ఏకసూత్రతని సాదృశ్యాన్ని సాధించటమన్నమాట. ఈ ప్రయత్నం శాస్త్రం ద్వారా, తత్త్వం ద్వారా, కవిత్వం ద్వారా మూడు విధాలుగా సాగింది. భౌతిక సంఘటనల్లో ఏకసూత్రతని సాధించటానికి శాస్త్రం పూనుకుంది. వివిధ శాస్త్రాలకు చెందిన భౌతిక సూత్రా

జ్ఞాన భూములు

సారస్వతం
మన దేశ సంస్కృతి అంతా గంగానదితో పెనవేసుకొని ఉంది. గంగకు ఎగువున ఉన్న హిమాలయాలను దేవభూములు అని, గంగానది పర్వతాలనుండి మైదానాలకు వచ్చిన ఋషీకేశ్, హరిద్వార్ లను జ్ఞానభూములు అని, ఇంకా గంగకు దిగువ ప్రాంతమంతా కర్మభూమి అని పరిగణిస్తారు. శివుని జటాజూటం నుండి బయలు వెడలి భగీరధుని వెంట ప్రయాణించిన పాయను భాగీరధి అంటారు. ఇది గంగోత్రి వద్ద గోముఖం ద్వారా బయటకు వస్తుంది. గంగోత్రి నుండి ఋషీకేశ్ కి వచ్చే దారిలో 5 ప్రయాగలు (సంగమ స్థానాలు) ఉన్నాయి. (1) విష్ణుప్రయాగ వద్ద అలకనంది దౌళీగంగతో కలిసి ముందుకు సాగి (2) నంద ప్రయాగ వద్ద నందాకినితో కలిసి సాగుతుంది. (3) కర్ణ ప్రయాగ వద్ద పిండారినదితో కలిసిన అలకనంద (4) రుద్ర ప్రయాగ వద్ద భాగీరధితో కలుస్తుంది. ఇక నుండి గంగానదిగా పిలవబడుతూ, ఋషీకేశ్ ను చేరుతుంది. ఇక్కడ గంగానది రెండు కొండల మధ్య యిరుకైన దారిలో పరవళ్ళు తొక్కుతూ 30కి||మీ|| ముందుకు సాగి హరిద్వార్ వద్ద సమతుల ప్రదేశం

ఆధ్యాత్మిక అహంభావం

సారస్వతం
-శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి) ఈ మధ్య నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక ఆధ్యాత్మిక గ్రంధాన్ని పోస్ట్ లో పంపించాడు.దానికొక రచయిత(?) కూడా ఉన్నాడు. ఆ గ్రంధంలోని విషయాలన్నీ ప్రాచీన గ్రంధాలలోని విషయాలను ఏర్చి కూర్చినవి.ఆ శ్లోకాలను వ్రాసిన వారు పరమ పురుషులు,అద్వైత సిద్ధాంత ప్రవచకులు,సాక్షాత్తు శంకర స్వరూపులు.అలా ఏర్చికూర్చిన గ్రంధానికి 'రచయిత ' అని పేరు పెట్టుకోవటం ఆది శంకరులకు ద్రోహం చేయటమే!దీనినే ఆధ్యాత్మిక అహంభావం అని అనవచ్చు.జ్ఞానం వలన అహంభావం పెరిగే అవకాశం ఉన్నదని మరొకసారి తెలుసుకున్నాను.మనసు ఎలాగైతే సృజనాత్మక దృష్టితో సృష్టి చేయగలదో, అలాగే అదే మనసుకు నసింపచేసే శక్తికూడా ఉన్నదని 'జ్ఞానయోగం'ద్వారా తెలుసుకొనవచ్చును.అన్నీ నాకే తెలుసు అని అనుకోవటం అహంకారం,అజ్ఞానం.నాకు తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది ఇంకా ఎక్కువ ఉంది అని అనుకోవటం 'జ్ఞానం'.ఈ అజ్ఞానపు చీకటిలో పడిన ఇంకా చాలామంది ఆధ్యాత్మికవేత్తలు మ

అనుకోని ఆనందం

కథా భారతి
రచయిత్రి : ఇందిరామూర్తి ఏమండీ, ఏం? ఏం ఆలోచిస్తున్నారింకా? లేవండి, లేచి బట్టలు మార్చుకొని మీ తమ్ముడింటి కెళ్ళండి. ఆయనో పెద్ద ఉద్యోగస్థుడుగా! ఆమాత్రం సాయం చేయడని, నేననుకోను. అదికాదు లలితా! నేను పెద్దవాణ్ణి. వాడి అవసరాలకు నేను నిలబడాలి గానీ వాడిముందు చేయిచాపడం న్యాయంకాదు. అబ్బా! అవన్నీ చింతకాయ సిద్ధాంతాలు. వాటిని పట్టుకు కూర్చుంటే జరిగేదేమీ వుండదు. న్యాయాలు, ధర్మాలు నడిచినన్నాళ్ళే. సోది ఆపి బయలుదేరండి. మీరిట్లా తెమల్చకపోతే అవతల పాడైపోయేది పిల్లాడి జీవితం. ఇదుగో ఒకటే చెప్తున్నా నా మనసంగీకరించడం లేదే. అమ్మానాన్న లేకున్నా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం అందరం. ఇప్పుడీ అప్పు ప్రస్థాపన తెచ్చి, వాడిచ్చ్జ్హినా నాకు అవమానంగానే ఉంటుంది. చిన్నవాడి దగ్గర అడిగానేనని. లేదన్నాడా, అది మరీ బాధ, మనస్ఫర్థలకు బీజం పడినట్లవుతుందే కుటుంబాల మధ్య ఆలోచించు. ఆలోచించి చేసేది ఏమీలేదు. ఏమన్నా కానీ, నాకొడుకు అ
శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
– డా. అక్కిరాజు రమాపతిరావు “అన్నా! నీవు పితృవాక్య పరిపాలన రూపమైన సన్మార్గం అవలంభించి, జితేంద్రియుడవై ఉన్నా నిన్ను ధర్మం ఆపదలనుండి కాపాకలేకపోతున్నది. కాబట్టి ఆ ధర్మం నిష్ప్రయోజనం. లోకంలో స్థావరాలు (చెట్లు, కొండలు మొ.), జంగమాలు (పశువులూ, మనుషులూ మొ.) కనపడినట్లు ధర్మాధర్మాలు కనపడటం లేదు. కాబట్టి ధర్మాధర్మాలనేవి లేనే లేవు. అధర్మమే వాస్తవానికి ఉండవలసివస్తే రావణుడివంటి అధార్మికుడు కష్టాలపాలు కావాలి. నీవంటి ధార్మికుడికి కష్టాలే రాకూడదు.రావణుడికి ఆపదలు రాకపోవాటాన్నీ, నీకు కష్టాలు రావటాన్నీ పరిశీలిస్తే - అధర్మం, ధర్మఫలాన్నీ, ధర్మం అధర్మఫలాన్నీ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అధర్మమే ఆచరించేవారికి సంపదలూ, ధర్మాన్నేఆచరించేవారికి కష్టాలు కలగటాన్ని బట్టి ధర్మాధర్మాలు నిష్ఫలాలు. ఉన్నదో లేదో తెలియని, అది ఉత్తమఫలాన్నే ఇస్తుందనే నిశ్చయం లేని ధర్మాన్ని పట్ట్టుకొని పాకులాడేకంటే దాన్ని విడిచి పెట్టటమే మంచిది అనుక

కాలం మహిమ!

సుజననీయం
ప్రధాన సంపాదకులు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదక బృందం: తమిరిశ జానకి కస్తూరి ఫణిమాధవ్ కాలం మహిమ! 'ప్రభో , కాలం నీ చేతుల్లో అనంతం నీ నిమషాల్ని లెక్కపెట్టగలవారెవరూ లేరు ' (గీతాంజలి, చలం) 'ఎందులోంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలము? ఎవరివల్ల, ఎవరికోసం జరిగిందీ ఇంద్రజాలం?' (త్వమేవాహం, ఆరుద్ర) 'గాలంవలె శూలం వలె వేలాడే కాలం వేటాడే వ్యాఘ్రం అది, వెంటాడును శీఘ్రం' (ఖడ్గ సృష్టి, శ్రీ శ్రీ) పైవన్నీ మన తెలుగు కవులు తమ కవితల్లో కాలానికి అన్వయించుకున్న అర్థాలవి. మరి తత్వవేత్తలు, ఆధ్యాత్మికులు కాలాన్ని ప్రవాహమని, చక్రమని పరిగణించారు. ఇదలా ఉంచితే, శాస్త్రవేత్తలు కాలం ఈ విశ్వం ఉద్భవించినప్పటినుండి పుట్టిందని పేర్కొన్నారు. నిరంతరం క్రియప్రక్రియలతో నిరాఘాతంగా వ్యాపిస్తున్న ఈ విశ్వంలో ఎప్పుడో ఒకప్పుడు వివిధరూపాల్లో ఉన్న శక్తులు ఉట్టడుగుతాయని (Thermal Equillibrium), అప్పుడు సంకోచం ప్ర

దేవతగా మారిన మనిషి “అమ్మ”

కవితా స్రవంతి
  - భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అమ్మకుకూడా కొరుకుడుపడని కోపం ఉంటుంది, అది అప్పుడప్పుడూ తన విశ్వరూపాన్ని చూపుతూనే ఉంటుంది, కానీ,తరుచూ శాంతం దాన్ని అధిగమిస్తూ ఉంటుంది. అమ్మకుకూడా లోలోపల దహించే ద్వేషం ఉంటుంది, అది అప్పుడప్పుడూ పడగవిప్పి నాట్యమాడుతూనే ఉంటుంది, కానీ, తరుచూ ప్రేమ దానిని అధిగమిస్తూ ఉంటుంది. అమ్మకు కూడా దుర్గుణాలు కొన్ని ఉంటాయి, అవి అప్పుడప్పుడూ తమ ఉనికిని చాటుతూనే ఉంటాయి, కానీ,తరుచూ సుగుణాలు వాటిని అధిగమిస్తూ ఉంటాయి. అమ్మకి కూడా పక్షపాత బుద్ధి ఉంటుంది, అది అప్పుడప్పుడూ తన పవర్ ఫుల్ పాత్రను పోషిస్తూనే ఉంటుంది, కానీ,తరుచూ సమత్వబుద్ధి దానిని అధిగమిస్తూ ఉంటుంది. ఆవేశం,కావేశం అమ్మకు కూడా తప్పనిసరిగా కలుగుతుంటాయి, అవి అమ్మను వశపరుచుకోవాలని ఉవ్విళ్ళుఊరుతూనే ఉంటాయి, కానీ, తరుచూ ఆవేశాన్ని ఆత్మీయత, కావేశాన్ని ఆర్ద్రత అధిగమిస్తూ ఉంటాయి. అవివేకం,అసహనం అమ్మను కూడా త