సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం
*అంతర్జాల మాధ్యమం ద్వారా 2021 సంవత్సరపు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం*
జనవరి 30, 2021 శనివారం సాయంత్రం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గ మండలి, అధ్యాపకులు, విద్యార్థులు, దాతలు, శ్రేయోభిలాషులు అంతర్జాల స్నాతకోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. 2021 సంవత్సరంలో పట్టభద్రులవుతున్న విద్యార్థులు (Class of 2021) సాధించిన విజయాలను ప్రతిఫలింపజేసుకొంటూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందించిన తోడ్పాటును తలచుకొంటూ, వారు మొదలెట్టబోతున్న నూతన రంగాల్లో విజయాలను అభిలషించారు.
మిల్పిటాస్, జనవరి 30, 2021 - సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులవుతున్న 2021 సంవత్సరపు విద్యార్థులను అభినందిస్తూ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ 'తాము సాధించిన విజయాలను చూసి గర్వపడాలని ' అన్నారు.
సభను ఉద్దేశిస్తూ, "భారతదేశ సంస్కృతి ఎంతో పురాతనమైనది. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం తొలినాళ్లలోనే ప్రపంచ ప్రఖ్యాతినొ