వీక్షణం

వీక్షణం సాహితీ గవాక్షం-110 వ సమావేశం

వీక్షణం
-వరూధిని వీక్షణం-110 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా అక్టోబర్ 10, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీమతి రాధికా నోరి గారు " సి నా రె - యుగళగీతాలు" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు. రాధిక గారు ముందుగా సి.నారాయణరెడ్డి గారి గురించి, ఎన్నుకున్న ప్రసంగాంశం గురించి మాట్లాడుతూ "నారాయణరెడ్డి గారు గొప్ప కవి, రచయిత, నాటకకర్త, సంగీతకర్త, గాయకులు, సాహితీవేత్త, ప్రొఫెసరు, రాజ్యసభ మెంబరు, సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత, అంతేకాకుండా మన సాహిత్య ప్రపంచంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా. ఈవేళ నేను చలనచిత్రాల కోసం ఆయన రాసిన గీతాల గురించి మాట్లాడదాము అనుకొంటున్నాను. ఆయన మన చలనచిత్రాలలో సుమారుగా మూడు వేలకు పైగా పాటలు రాశారు. అన్ని జానర్స్ లోనూ రాశారు. వాటన్నిటి గురించి చెప్పటం కూడా సాధ్యం కాదు. అందుకని కేవలం ఆయన రాసిన కొన్ని యుగళగీతాల గురించి మాత్రం చెప్పదలచుకున్నాను. యుగళగ

వీక్షణం సాహితీ గవాక్షం -109

వీక్షణం
వీక్షణం సాహితీ గవాక్షం- నవమ వార్షికోత్సవం -వరూధిని కాలిఫోర్నియాలో బే ఏరియాలోని వీక్షణం సాహితీ గవాక్షం 9వ వార్షిక సాహితీ సమావేశం సెప్టెంబరు 11, 2021 న ఆన్లైనులో జరిగింది. ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా||కె.గీత గారు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల క్రితం ఒక చిన్న సమావేశంగా మొదలయ్యి ఇంతలోనే 9 సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యంగా ఉందని అంటూ, తమలో సాహితీ స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ, ఉచిత, స్వచ్ఛంద వేదికగా సమావేశాల్ని జరపుకుంటూ వస్తున్న ఉన్నతమైన లక్ష్యానికి తనకు తోడ్పడుతున్న వీక్షణం సభ్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. వీక్షణం సభ్యులందరికీ వీక్షణమంటే కుటుంబజీవితం తర్వాత అతి ప్రధానంగా మారిన సాహితీ కుటుంబమని అన్నారు. పక్కా కార్యాచరణతో సమావేశాలు నెలనెలా క్రమం తప్పకుండా, ఆసక్తి కోల్పోకుండా నడపడం వెనక ఎడతెగని శ్రమ ఉన్నా అది చక్కని ఆనందాన్నిచ్చే శ్రమ అని, గొప్ప బాధ్యత ఉన్నా అత్యంత ఆత్మీయమైన బ

వీక్షణం సాహితీగవాక్షం-108 వ సమావేశం

వీక్షణం
-వరూధిని వీక్షణం-108 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఆగస్టు 8, 2021 న జరిగింది. ఈ సమావేశంలో తెలుగుతల్లి కెనడా మాస పత్రిక ఎడిటర్, రచయిత్రి శ్రీమతి లక్ష్మీ రాయవరపు (ఎన్నెల) గారి కథాపఠనం, చర్చ, కవిసమ్మేళనం, సాహితీ క్విజ్ జరిగాయి. ముందుగా లక్ష్మీ రాయవరపు గారు తెలంగాణా మాండలికంలో రాసిన " ఓ పాలబుగ్గలా జీతగాడా" కథని చదివి వినిపించారు. పసితనం వదలని పాల బుగ్గల వయసులో రాజాలు తండ్రి చనిపోవడం, తల్లి అనారోగ్యం...దాంతో తానే అన్నీ అయ్యి చదువు ఆపి కూలీకి వెళ్ళడంతో మొదలవుతుంది కథ. తల్లికి ఆసరా అని చిన్న వయసులోనే వివాహం, వెనువెంటనే సంతానం. స్నేహితులు వెళుతున్నారని , గుడిసె తనఖా పెట్టి విదేశీ యానం. నిండా పదహారేళ్ళు లేవు.. వయసు ఎక్కువ వేయించడం.. కానీ అదేమంత పెద్ద విషయం కాదుగా!! ఆ దేశంలో కొంత కాలం బానే ఉంది. స్నేహితులు అందరూ కలిసి ఇళ్ళకి వడ్డీలు ఖర్చులకి పంపడమూ, అప్పుడప్పుడు

వీక్షణం సాహితీ గవాక్షం-107 వ సమావేశం

వీక్షణం
వీక్షణం సాహితీ గవాక్షం-107 వ సమావేశం-వరూధిని వీక్షణం-107 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జూలై 11, 2021 న జరిగింది. ఈ సమావేశంలో డా|| కె.గీత గారి కథాపఠనం, చర్చ, కవిసమ్మేళనం, శ్రీధర్ రెడ్డి గారి కవిత్వ సంపుటి "ప్రతిబింబం" ఆవిష్కరణ జరిగాయి. ముందుగా డా|| కె.గీత గారు కాలిఫోర్నియాలోని వైల్డ్ ఫైర్స్ నేపథ్యంలో రాసిన కథ "ఇవేక్యుయేషన్" ను చదివి వినిపించారు. ఈ కథ జూలై 4న ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. ఈ కథలో ప్రధాన కథ ఒకపక్క విరుచుకుపడుతున్న విపత్తును గురించి తెలియజేస్తూ ఉన్నా, అంతర్లీనంగా కోవిడ్ కష్టకాలంలో భార్యా భర్తల మధ్య దూరమవుతున్న అనుబంధాన్ని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యంగా కొనసాగింది. ఉద్యోగమే సర్వం అనుకునే భర్త, భర్తే సర్వమనుకునే భార్య. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట అయినా జీవితాల్లోని ఒడుదుడుకులు ఎదురయినపుడు ఒకరినొకరు ఓదార్చుకోకుండా సమస్యని జటిలతరం చేసుకోవడం

వీక్షణం సాహితీ గవాక్షం-106 వ సమావేశం

వీక్షణం
-వరూధిని వీక్షణం-106 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆసక్తిదాయకంగా జూన్ 13, 2021 న జరిగింది. ఈ సమావేశంలో కా.రా. మాస్టారికి నివాళి గా "కాళీపట్నం రామారావు గారి కథలు" అనే అంశమ్మీద శ్రీమతి కొండపల్లి నీహారిణి గారి ప్రసంగం, కవిసమ్మేళనం జరిగింది. ముందుగా నీహారిణి గారు మాట్లాడుతూ కథానిలయం రూపకర్త, కథలకు చిరునామా కారా మాస్టారు గారి గురించి వీక్షణం లో మాట్లాడే అవకాశం కలగడం సంతోషదాయకమైన విషయం అని పేర్కొంటూ "ఎప్పుడో చదివిన కారా గారి కథలను మళ్ళీ ఇప్పుడు చదివి మరింత లోతుగా వారిని అర్థం చేసుకున్నాను" అన్నారు. కాళీపట్నం రామారావుగారి కథల గురించి వివరిస్తూ "కవి క్రాంతదర్శి అనడం బహుశా: ఇటువంటి గొప్ప రచయితలు ఉంటారనే నిర్వచించి ఉంటారు మన పూర్వీకులు. ఇంతలా మనసుపెట్టి సమాజాన్ని పరిశీలించి , మంచి చెడులను కథలుగా మలిచిన కథా రచయితలు బహుతక్కువగా ఉన్నారు. కాళీపట్నం రామారావుగారు కథలను అల్లలేదు. కథలలో జీవితాలను చూ

వీక్షణం సాహితీ గవాక్షం-105 వ సమావేశం

వీక్షణం
-వరూధిని వీక్షణం-105 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆసక్తిదాయకంగా మే 9, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీమతి గునుపూడి అపర్ణ గార్ల కథా పఠనం, కవిసమ్మేళనం జరిగింది. కథాపఠనంలో ముందుగా శ్రీధర్ రెడ్డి గారు "మాతృప్రేమ" కథను చదివి వినిపించారు. “పండు పండు ముసలమ్మ! గింత ఫాస్టు రోడ్డు మీద కారు నడుపుకుంట పోతాందా?”, "వేడిగాలి ఏమంత పెద్దగ లేదు గని, ఎండ మాత్రం సుర్రుమంటాంది” వంటి సంభాషణలతో తెలంగాణా యాసలో రాసిన డయాస్పోరా కథ మాతృప్రేమ. ప్రపంచంలో ఎక్కడైనా తల్లి హృదయం ఒక్కటే అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ రాసిన చక్కని కథ. పాత్రలు సహజ సంభాషణలతో కళ్ళ ముందు కదలాడినట్లు ఉండడం ఈ కథలో విశేషం. తర్వాత అపర్ణ గారి కథ "సంకర్షణ" పెళ్ళికి స్వస్తి పలికి, సింగిల్ పేరెంట్ గా కోరుకుని మరీ మారుతున్న యువత గురించిన ఆలోచింపచేసే విలక్షణమైన డయాస్పోరా కథ. కథలో ఆద్యంతం రెండు సంస్కృతుల మధ్య సంఘర్షణని స్పష

వీక్షణం సాహితీ గవాక్షం-104 వ సమావేశం

వీక్షణం
-వరూధిని వీక్షణం-104 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా ఏప్రిల్ 11, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా గారు "జాషువా కవిత్వం" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు. "సుమారు 18వ శతాబ్దం వరకు ఛందోబద్దమైన సాహిత్యమంతా దైవ స్తుతుల్లోనో, పురాణేతిహాసాల్లోనో , రాజ మందిర చరిత్రలోనో, శృంగారవర్ణనల బాహుబంధాల్లోనో చిక్కుకుపోయిదని, అక్కడక్కడా వేమన పద్యాల్లోనో, శ్రీనాథుని చాటువుల్లోనో కనిపించినా వాటిని కావ్యాలుగా పరిగణించలేం" అని అన్నారు శ్రీధర్ రెడ్డి గారు. "సుమారు 17~18 శతాబ్దాలలో సాంఘిక, సామాజిక అంశాల పట్ల గురజాడ, కందుకూరి, విశ్వనాథ, దువ్వూరి, దాశరథి, చిలకమర్తి, జాషువా మొదలైన కవులు వ్రాయటం మొదలెట్టినా ఎక్కువమంది కవులు సాంఘిక అంశాలకు కథ, నాటక, నవలా రూపాల్ని ఎంచుకున్నారు. జాషువాగారు మాత్రం ప్రాచీన ఛందోబద్ధమైన శైలిలోనే కొనసాగించారు. జాషువా గారి రచనాశైలి ప్రాచీనం కాన

వీక్షణం సాహితీ గవాక్షం-103 వ సమావేశం

వీక్షణం
వీక్షణం సాహితీ గవాక్షం-103 వ సమావేశం -వరూధిని వీక్షణం-103 వ సమావేశం అంతర్జాల సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా మార్చి 14, 2021 న జరిగింది. ఈ సమావేశంలో ముందుగా శ్రీ,మతి గునుపూడి అపర్ణ "కృతి, భాషాకృతి, భావనాకృతి, శ్రవ్యాకృతి " అనే అంశం మీద ప్రసంగించారు. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, భక్త రామదాసు మొ.న వాగ్గేయకారులు రచించిన అనేక కీర్తనల్ని అపర్ణ గారు సోదాహరణంగా ప్రస్తుతించారు. కర్ణాటక సంగీత కృతుల్లో ఉన్న సంగీత సాహిత్య విశేషాల గురించి వివరిస్తూ, కీర్తనల్ని రాగయుక్తంగా ఆలపిస్తూ దాదాపు గంటసేపు ప్రసంగించి సభికుల్ని మంత్రముగ్ధుల్ని చేసేరు. ముందుగా ముత్తుస్వామి దీక్షితుల కృతిలో "గురుగుహ మాతుల కాంతాం లలితాం" అంటూ లక్ష్మీ దేవిని సంబోధించడం వెనుక అర్థాన్ని వివరించారు. త్యాగరాజ కృతుల్లో "మా జానకి చెట్టాపట్టగ మహారాజువైతివి", "బ్రోవభారమా" మొ.న వాటి అర్థ వివరణ చేస్తూ భాషలోని భావానికి సరిపడా మంద్ర

వీక్షణం సాహితీ గవాక్షం-102 వ సమావేశం

వీక్షణం
-వరూధిని వీక్షణం-102 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా ఫిబ్రవరి 14, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ సుభాష్ పెద్దు (విద్యార్థి) గారి కథ "కోరికలు" కథా పఠనం జరిగింది. విద్యార్థి గారు రాశి కంటే వాసి ముఖ్యమైనదనుకునే కథారచయిత. అతి తక్కువ కాలంలో చక్కని కథనాన్ని అలవరుచుకుని, విభిన్న వస్తువులతో ప్రయోగాత్మక రచనలు చేస్తున్నారు. స్త్రీ విజయం వీరి రచనల లక్ష్యం. "కోరికలు" కథ కౌముది లో ప్రచురింపబడి అత్యంత ప్రజాదరణ పొందిన కథ. అహోబిల క్షేత్ర దర్శనంలో రచయితకు ఎదురైన వ్యక్తులు, అనుభవాల ఆధారంగా రాసిన అద్భుతమైన కథ. ఈ కథా పఠనంలో స్త్రీ పాత్రల్ని డా. కె.గీత , పురుష పాత్రల్ని విద్యార్థి గారు కలిసికట్టుగా చదివి వినిపించడం విశేషం. కథని పాత్రలకనుగుణంగా యాసలో చదువుతున్నంతసేపూ సభాసదులు మంత్రముగ్ధులై విన్నారు. కథలో ప్రధాన పాత్రధారిణి ముసలవ్వ. జైలు నించి విడుదలై తిన్నగా అహోబిల అహోబిల క్ష

సాహితీ వార్తలు

వీక్షణం
తగుళ్ళ గోపాల్ కు పాలమూరు సాహితి అవార్డు ప్రదానం ====================================== తెలుగు సాహిత్యరంగంలో విశేషకృషి చేస్తున్న కవులకు గత పది సంవత్సరాలుగా ఇచ్చే పాలమూరు సాహితి పురస్కారాన్ని 2019 సంవత్సరానికి గాను "దండకడియం" రచించిన యువకవి తగుళ్ళ గోపాల్ కు అందజేశారు. ఫిబ్రవరి 14 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాలలోని కాళోజీ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పురస్కారంతో పాటు 5,116/- నగదు, శాలువా, మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించి వారి కీర్తిని అజరామరం చేశారన్నారు. ఆ మార్గంలో పాలమూరు సాహితి తెలుగు సాహిత్యంలో వెలుగొందుతున్న కవులకు పురస్కారాలను అందజేయడం అభినందించదగ్గ విషయమన్నారు. పాలమూరు జిల్లా కవులకు పెట్టని కోట అని, అది పాలమూరు మట్టికున్న బలమని చెప్పడం అ