ధారావాహికలు

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
స్త్రీ గురించి రాసే మరో కవయిత్రి జయప్రభ. ' స్వేచ్చకోసం కవిత్వం వ్రాస్తున్నాను, స్వేచ్చకోసం కవిత్వం రాస్తాను' అని ఈవిడ ప్రకటించుకున్నారు. ఈవిడ తన కవిత్వం ఫెమినిస్టు ధోరణికి చెందినదని చెప్పుకుంటారు. సమాజంలో తనకు జరిగిన అన్యాయాల వల్ల ఒక స్త్రీ సానిగా మరవలసి వచ్చింది. అటువంటి స్త్రీని ' సానిపాప' అనే ఖండికలో సమాజంపై తిరగబడమని చెప్తున్న సందర్భంలో - "రగులుతున్న ఆవేశాన్ని ఆరానీకు, చైతన్య తూరుపులా ప్రజ్వరిల్లు ! అప్పుడు బిగిసిన నీ పిడికిలి మాటున సూర్యుడు కూడా ఉదయిస్తాడు "32 అంటూ స్త్రీ జాతికి సూర్యోదయం కావాలని ఈవిడ కోరుకుంటున్నారు. సమాజంలో జరిగే అనేక సంఘటనలు ఈవిడకు వస్తువులుగా మారాయి. స్త్రీలపై మగవాళ్ళు చూసే చూపులను వర్ణిస్తూ, వాటిని ఎదుర్కొంటే జయం స్త్రీలదే అని ఆవిడ తెలిపారు. అందుకని - " అప్పుడనుకుంటాను కళ్ళకే కాదు ఈ దేశంలోని ఆడదానికి వాళ్ళంతా ముళ్ళుండే రోజు ఎప్పుడొస్తుందా అని 33" ప్రతి

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
రావణాసుర సంహారం అప్పుడాయన తన తమ్ములతో ఈ ఉపద్రవం గూర్చి ప్రస్తావించి, 'లవణుణ్ణి వధించే బాధ్యత మీలో ఎవరు తీసుకుంటార'ని ప్రశ్నించగా లక్ష్మణుడు చిరకాలం అరణ్యవాసం చేసి సౌఖ్యధూరుడై ఉన్నాడని, భరతుడు పద్నాలుగేళ్ళు వ్రతోపవాస తపోదీక్షలో ఉన్నాడని అందువల్ల లవణుణ్ణి సంహరించే కర్తవ్యం తనదని శత్రుఘ్నుడు శ్రీరామచంద్రుడికి విన్నవించుకున్నాడు. దానికి శ్రీరాముడు ఆమోదించి శత్రుఘ్నుణ్ణి అభినందించాడు. 'అట్లా లవణుణ్ణి హతమారిస్తే, వాడి రాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను' అని వాత్సల్యం చూపాడు శత్రుఘ్నుడి మీద. అప్పుడే లాంఛనంగా తక్కిన తమ్ములను ఆనందిస్తూ ఉండగా శ్రీరాముడు మధురాజ్యానికి శతృఘ్నుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఈ సన్నివేశంలో లవణుడు పారాలోకగతుడైనట్లు అని అందరూ ఆనందించారు. అప్పుడు శ్రీ రాముడు తన తమ్ముడుకి ఒక దివ్యాస్త్రాన్ని బహుకరించాడు. అది శ్రీమన్నారాయణుడు సృష్త్యాదిని మధుకైటభులను సంహరించిన మహా

అన్నమయ్య శృంగార నీరాజనం

ధారావాహికలు
ఏవం దర్శయసి హితమతిరివ -టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇది ఒక సంస్కృత శృంగార సంకీర్తన. అన్నమయ్య, చెలులలో ఒకచెలికత్తెగా మారి శ్రీ మహావిష్ణువు ప్రియురాలైన తులసి మాతను ఆ తల్లి వైభవాన్ని కీర్తిస్తూ అన్నమయ్య చెప్పిన చక్కని కీర్తన. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: ఏవం దర్శయసి హితమతిరివ కేవలం తే ప్రియసఖీ వా తులసీ ॥పల్లవి॥ చ.1 ఘటిత మృగమద మృత్తికా స్థాసకం పటు శరీరే తే ప్రబలయతి కుటిలతద్ఘనభారకుచవిలగ్నంవా పిటర స్థలే మృత్ప్రీతా తుళసీ ॥ఏవం॥ చ.2 లలిత నవ ఘర్మలీలా విలసనో- జ్జ్వలనం తవ తనుం వంచయతి జల విమలకేలీవశా సతతం అలిక ఘర్మాంచిత విహరా తులసీ ॥ఏవం॥ చ.3 సరస నఖచంద్రలేశా స్తే సదా పరమం లావణ్యం పాలయతి తిరువేంకటేశ తత్కరుణా గుణా వా వరరూప నవచంద్రవదనా తులసీ ॥ఏవం॥ (రాగం: ధన్నాసి ; రేకు: 30-1, కీర్తన; 5-167) విశ్లేషణ: పల్లవి: ఏవం దర్శయసి హితమతిరివ కేవలం తే ప్రియసఖీ వా తులసీ స్వామీ! నాహితం కోరే వాడిలా క

ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం ఏప్రిల్ 2020

ధారావాహికలు
''మగవాళ్ళకి చాటుగానూ ఆడవాళ్ళకి పబ్లిగ్గాను రుచించని మాట చెప్పనా మగకీ ఆడకీ శీలాన్ని ఆస్తినీ సమంగా వర్తింపించండి కాగితాల మీదా వేదికల మీదా కాదు నిజంగా సమంగా వర్తింపించండి''. స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని మాటల్లోనూ, కాగితాల్ల్లోనూ కాకుండా ఆచరణలో చూపించమని రేవతీదేవిగారు సమాజాన్ని అర్థిస్తున్నారు. అంతేకాదు, కేవలం స్త్రీ పురుషుల మధ్య ఆస్తిలోనే కాక , శీలంలోనూ సమానత్వాని కావాలని ఆంకాంక్షించారు. సమాజానికి ఇద్దరూ భాగ స్వాములే కాబట్టి ఇద్దరికీ సమాన న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. సమాజంలో ఉన్న పురుషాధిక్యాని గుర్తించి, తన కవిత్వం ద్వారా సమాజానికి అందించటానికి ప్రయత్నించారు . సమానమైన న్యాయం లేనందున స్త్రీ మగవాడి చేతిలో ఆటబొమ్మగా మారవలసి వస్తోందని ఈవిడ ఆవేదన. ''పురుషుడికి అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి అందచందాలు ఉన్నాయి తెలివితేటలున్నాయి అవన్ని పురుషుడికి తల్లిగా ప్రేయసిగా స్త్రీ

రామాయణ సంగ్రహం ఏప్రిల్ 2020

ధారావాహికలు
యయాతి చరిత్ర నహుషుడి కొడుకు యయాతి. యయాతికి ఇద్దరు భార్యలు. వాళ్లు దేవయాని, శర్మిష్ఠలు. దేవయాని కుమారుడు యదువు. శర్మిష్ఠ కుమారుడు పూరుడు. తండ్రికి చాలా ఇష్టుడు. తండ్రి తనను సవతి తల్లి కొడుకు పూరిడిలాగా ఆదరించడం లేదని తన వైమనస్యం తన తల్లి వద్ద యదువు వెలిబుచ్చాడు. అప్పుడు దేవయాని కూడా బాధపడి తండ్రిని తలచుకొన్నది. శుక్రుడు (తండ్రి) వచ్చి యయాతిని నిరసించి తన కూతురును నిర్లక్ష్యం చేస్తున్నందుకు యయాతి వెంటనే జరాభారం వహించేటట్లు (ముసలివాడై పోయేట్లు) శపించాడు. యయాతి చాలా పరితాపం పొందాడు. ''నాకింక విషయసుఖాలను అనుభవించాలన్న కోరిక తీరలేదు. నేను ముసలితనాన్ని భరించలేదు.'' అని తన పెద్దకుమారుడైన యదువును కొంతకాలం తన ముసలితనాన్ని తీసుకొని అతడి యవ్వనాన్ని తన కిమ్మని అర్థించాడు. అసలే తండ్రి పట్ల అసంతృప్తితో ఉన్న యదువు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు యయాతి పూరుణ్ణి అడిగాడు. పూరుడు వెంటనే ఒప్పుకున్నాడు. యయాత