-ఆర్. శర్మ దంతుర్తి
మే నెలాఖర్న రోహిణీ కార్తి ఎండలు దంచుతుంటే, తన ఆశ్రమంలో ఏ.సి. గదిలో చుట్టూ శిష్యగణం కూర్చునుండగా మీరోజు న్యూస్ పేపర్ చదువుతున్న యోగీశ్వరుడు ఒకసారి అయిదో పేజీ తిరగేసి ఓ చిన్న న్యూస్ ఐటం చదివాక యధాలాపంగా చిరునవ్వుతో ఆ పేపర్ పక్కన పారేసి ధ్యాన ముద్ర వహించాడు. కిందన నేలమీద కూర్చున్న శిష్యులు వెంట వెంటనే తమలో తాము మాట్లాడుకోవడం ఆపి సర్దుకుని కూర్చున్నారు గురూగారితో పాటు ధ్యానానికి.
కంగారుగా గురువుగారి అంతర్గత శిష్యులు ఆయన పక్కన పారేసిన పేపరూ, అవీ తీసి బయటపారేసి చుట్టూ శుభ్రం చేసారు ధ్యానం చేసుకునే గదిలో. పావుగంట మౌనంగా గడిచేక ఇంకా అందరూ ధ్యానంలో ఉండగానే గురువుగారి గంభీరమైన కంఠం వినిపించింది, “వచ్చేనెల నాలుగో తారీఖునుంచి ఆరో తారీఖులోపు మన హైద్రాబాద్, చుట్టుపక్కల ఊళ్ళలో శామీల నభోగం రాబోతోంది. అది నా అంతర్గత శిష్యులకే కాక మొత్తం అందరిమీదా విస్తరించబోతోంది. అదృష్ఠవంతులైన వాళ్ళు