Month: May 2018

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి సమాజానుభూతి దృష్టితో గమనిస్తే విశ్వనాథ రచనా పరమార్థం మరింత స్పష్టంగా గోచరిస్తుంది. పంచవిధ ప్రవృత్తుల ద్వారా సమాజం పొందగలిగే అనుభూతి విశేషాలను వివిధ ప్రక్రియల ద్వారా, వివిధ కవులు సాహితీ ప్రపంచంలో ప్రచలింపచేస్తున్న ప్రయోగాల ద్వారా పరిచ్చిన్నంగా పొందగలిగే వికీర్ణ స్థితిని విశ్వనాథ సమీకించి, వాటినన్నింటిని సమాజానికి సమాహార రూపంగా అందింపగలిగిన ఒక మహాకావ్యాన్ని రచించటానికి పూనుకొన్నాడు. రామాయణ కల్పవృక్షం పేరుకు తగ్గట్టు సమాజం ఆకాంక్షించే వాస్తవిక, కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మికానుభవాల సంపుటిని అందింపగలిగిన విశిష్ట రచన. ఆయన జీవుని వేదన సమగ్ర కళానుభూతి కోసం సమాజ జీవచైతన్యం అర్రులు సాచే ఆవేదన. పంచజిహ్వల సమాజ చేతనకు విశ్వనాథవారు అందించిన అమృతనైవేద్యమే, అనుభవకోశమే రామాయణ కల్పవృక్షం. ఆ కావ్యంలోని సన్నివేశాలు పాత్రస్వభావాలు సమాజంలో కానవచ్చే వాస్తవజీవిత ప్రతిబింబాలుగా ఉండటం

వెళ్ళిపోయిన సూర్యనారాయణుడు

సుజననీయం
-తాటిపాముల మృత్యుంజయుడు 'మాదీ స్వతంత్ర  దేశం, మాదీ స్వతంత్ర జాతి ', 'మేలుకో హరి సూర్యనారాయణా' పాటల పేర్లు చెప్పుకోగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బాలాంత్రపు రజనీకాంతరావు గారు. 1941 నుండి తన సంగీత, సాహిత్య, గాన మాధుర్యాలతో ఆకాశవాణిలో తెలుగుజాతిని ఓలలాడించిన ప్రముఖుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు 22 ఏప్రిల్ న మనలను వీడిపోయారు. సరిగ్గా తేదీ గుర్తులేదు కాని, నాకు ఆ సంఘటనలు మాత్రం బాగా గుర్తు. కొద్ది సంవత్సరాల క్రితం సిలికానాంధ్ర నిర్వహించిన ఉగాది ఉత్సవంలో రజనీ గారి పాటలు కొన్ని నేర్చుకొని కార్యక్రమం ఇవ్వదలిచాం. అప్పుడు నేను ఉత్సుకతతో వారి గురించి ఇంటర్నెట్లో వెదుకుతుంటే వారి గురించిన సమాచారం ఎంతగానో లభించింది. వారి చేసిన ఎనలేని సేవలను ఆ సమయంలో తెలుసుకొన్నాను. సిలికానాంధ్ర చైర్మన్, శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు రజనీకాంతరావు గారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అపూడు వారు మాతో పంచుకొన్న మాటలివి. "

వీక్షణం సాహితీ గవాక్షం- 68

శీర్షికలు
వీక్షణం 68 వ సమావేశం కాలిఫోర్నియాలోని ప్లెసంటన్ లో శ్రీ వేమూరి వెంకటేశ్వర్రావు గారింట్లో జరిగింది. శ్రీ సి.బి.రావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా కాళీ పట్నం రామారావు గారి "యజ్ఞం" కథ మీద సుదీర్ఘమైన చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో సభలోని వారంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఈ కథ గురించి సి. ఎస్. రావు గారు రాసిన ఈ- మాట లోని పరిశీలనా వ్యాసం లోని కొన్ని భాగాలను యథాతథంగా తెలియజేస్తూ  ఈ చర్చలో కథ ను, కథా సందర్భాన్ని  సూక్ష్మంగా డా||కె.గీత వివరించారు. "కథావేదిక సుందరపాలెం అనే గ్రామం.  కథావిషయం అప్పల్రాముడి కుటుంబం గోపన్నకి బాకీగా ఉన్న అప్పుకు సంబంధించి, దేవాలయం దగ్గరి ధర్మమండపం పంచాయితీ వేదికగా జరుగుతున్న సమావేశంలో పడే తర్జన భర్జనలు. మండపానికి చుట్టూరా, వీధికి ఆ చివరి నుండి ఈ చివరి దనుకా హాజరై కూర్చున్న జనంలో మనం కలిసి పోతాము. సంక్షిప్తంగా కథ: దశాబ్దాల క్రింద తాను మధ్యవయస

మరికొన్ని నివాళులు

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు (ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) జేజి మావయ్యా తిరిగి రావూ ? -వీర నరసింహ రాజు జేజి మావయ్యా … నేను దిబ్బ రొట్టి అబ్బాయిని. ప్రొద్దున్నే మీరు రేడియో లో ఆరంభించిన భక్తి రంజని వింటే బోలెడు భక్తి వస్తుందని మా జేజమ్మ చెప్పేది . అందులోనూ ఆదివారం వస్తే శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్యనారాయణా వింటుంటే భలే భలే ఈ రోజు ఆదివారం స్కూల్ కి సెలవు దినం అని గుర్తుకు వచ్చి ఎంచక్కా ఆడుకోవచ్చని అనిపించి సూర్యదేవుడికి మొక్కేసి మళ్ళీ జేజమ్మ వచ్చి అరిచే దాక ముసుగు కప్పేసేవాడిని తెలుసా. ఇంతలో "రారే రారే పిల్లలారా " అనే పాట వింటే ఉత్సాహం పొంగుకొచ్చెదనుకో . అమ్మ , జేజమ్మో మాకు తాయిలం పెడుతుంటే "తాయిలం పాట" గుర్తొస్తుంది .చిన్నపుడు జేజమ్మ వాళ్లకు కూడా తెలియని ధర్మ సందేహాలు తీర్చేట్ట

కె.ఎన్.మల్లీశ్వరి

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు (ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) శతపత్ర సుందరుడు (శతపత్ర సుందరునికి వీడ్కోలు, వదిలివెళ్ళిన సంగీత సాహిత్య సంపదలకి జేజేలు.'ధరణీతల చంద్రశిల తరళ మంటపమున నిలచి యుగములుగ పరిభ్రమింతుమిక' రజనీ, విభావరీ వీడ్కోలు. హేమచంద్ర గారూ, ప్రసూన గారూ శిశువు చిత్రనిద్రలోకి జారుకున్నాడు. ఆయన మలి బాల్యానికి మీరు తల్లిదండ్రులయ్యి కాలాన్ని మీ చేతిలోకి తీసుకుని, మృత్యువు అంచుల నుంచి వెనక్కి తెచ్చి,దశాబ్దంపైన ఆ పెన్నిధిని కాపాడారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు, ఇపుడిక ఈ వెల్తి, ఖాళీ పూడ్చలేనిది. మీతో మేమున్నాము.) దాదాపు పాతికేళ్ళ కిందట తెలుగు యూనివర్సిటీ లో సంప్రదాయ నవ్యసాహిత్యం పాఠాలు చెప్పిన బాలాంత్రపు రజని కాంతారావు గారు,ఎంతటి వారో కూపస్థ మండూకాల వంటి మాకేమి తెలుసు ! ఓ పెద్ద వయసు

శ్యామల

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) రజనిగంధం (నిన్న విశాఖసాహితి వారు బాలాంత్రపు రజనీకాంతరావుగారి సాహిత్య సంగీత సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో నా ప్రసంగ సారాంశం. ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన, ఆచార్య ప్రసన్న కుమార్ గారి ప్రధానోపాన్యాసంతో, ఆచార్య వేదుల సుబ్రమణ్యం గారు, ఎఐఆర్ నుంచి వచ్చిన వక్తలు ఆచార్య సూర్యారావు తదితర వక్తలు ప్రసంగించి సభని సుసంపన్నం చేశారు. మండపాక శారద గారి శిష్యులు, మరియు డా. కమల, శ్రీమతి రాజేశ్వరి సరస్వతి తదితరులు రజని పాటలు పాడి శ్రోతలనలరించారు.) ఏ దృక్పధంతో చూసినా రజనీకాంతరావు గారు ఒక సంస్థ. ఒక కళ కాదు ఒక సంగీతం కాదు ఒక కవిత్వంకాదు. ఏది తల్చుకున్నా ముందుండే పేరు రజని గారిది. అరు ఏఐఆర్ విజయవాడలో వుండి చేసిన సాహితీ సేవ,

సుధాకర్

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు (ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) సంగీత గంగోత్రి ఇరవయ్యేళ్ల క్రితం సంగతి...విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో 'సంగీత గంగోత్రి' అనే విలక్షణమైన సంగీత రూపకం,'సంగీత,సాహిత్య సవ్యసాచి' డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతారావు గారి నిర్వహణలో రూపుదిద్దుకుంటోంది... శివుని సద్యోజాతాది అయిదు ముఖాల నుండి సప్తస్వరాల ఆవిర్భావం ఎలా జరిగింది? డమరుక నాదం నుండి అచ్చులు,హల్లులు ఎలాపుట్టాయి? రాగ,తాళాలు,సంగీత రచనలు ఎలా ఆరంభమైనాయి? మొదలైన ఎన్నో అంశాలను సోదాహరణంగా వివరిస్తూ రజనీగారు వ్రాసిన రూపకం,రికార్డవుతోంది.నెమలి కూత,ఎద్దు రంకె,ఏనుగు ఘీకారం... వంటి ఏడు శబ్దాల నుండి సప్తస్వరాల స్థాయిలు నిర్ణయమైనాయని వ్యాఖ్యాతచే చెప్పించి, ఆ ధ్వనులను శ్రోతలకు వినిపించేందుకు ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు సిల్వెస్టర్

వంశీకృష్ణ

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు (ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) రజనీ గంధ సంగీత సాహిత్య సమలంకృతే అనే పద బంధం చాలా కొద్దిమందికే నప్పుతుంది . సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే అని కాళిదాసు సరస్వతీ దేవిని ప్రార్ధించాడు . ఈ రెండు సమపాళ్లలో ఒకరిలోనే ఉండి ఆ ఒక్కరూ నూరు శరత్తులు వీక్షించి తన చుట్టూ వున్నా ప్రపంచాన్ని రాగ భరితము ,పరిమళ భరితము చేస్తే ఆ పుంభావ సరస్వతిని మనం బాలాంత్రపు రజని అంటాము . ఆ రజని ఇక లేరు. టి వి అనే మాధ్యమం సకల సంస్కృతులను మాయం చేయక ముందు తెలుగు వాడికి సాంస్కృతిక దారి దీపం ఆకాశవాణి . రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఆకాశవాణి అని నామకరణం చేస్తే దాన్ని ఇంటింటి పేరు గా మలిచింది రజని . ప్రారంభ దశలో ఆకాశవాణికి జవం ,జీవం బాలాంత్రపు రజనీ కాంత రావు గారే. పాప్ , రాక్ సంగీతాల్లాంటి స

కార్మిక కష్టం

కవితా స్రవంతి
- అభిరామ్ ఆదోని తెల్లవారగానే చద్దికట్టుకుని చకచకా నడిచి శ్రమించే స్థలం చేరుకుని చొక్కా తీసి బనీయన్ వేసి బ్రతుకుకు ఆయుష్షుపోస్తూ మెతుకులిచ్చే పనిముట్లకు మొక్కి పార గంపలు పట్టి పుప్పొడిని తలదన్నే ఇసుకను కొలిసి రాసిగా పోసి సిమెంట్ బస్తాలను భుజానమోసి మిశ్రమాన్ని కలిపి గోడమీద గోడను నిలిపి నీటితో తడిపి మేడ నిర్మించి రంగులతోటీ హంగులద్ది ఇన్నాళ్లు స్వేచ్చగా తిరిగిన భవనంపై వైరాగ్యమొచ్చినట్లు పసిపాపలా నవ్వుతూ మరో ప్రాంతానికి కదిలిపోయే కార్మిక వందనాలు నీ శ్రమకు పాదాభివందనాలు