ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం
-సునీత పావులూరి
సమాజానుభూతి దృష్టితో గమనిస్తే విశ్వనాథ రచనా పరమార్థం మరింత స్పష్టంగా గోచరిస్తుంది. పంచవిధ ప్రవృత్తుల ద్వారా సమాజం పొందగలిగే అనుభూతి విశేషాలను వివిధ ప్రక్రియల ద్వారా, వివిధ కవులు సాహితీ ప్రపంచంలో ప్రచలింపచేస్తున్న ప్రయోగాల ద్వారా పరిచ్చిన్నంగా పొందగలిగే వికీర్ణ స్థితిని విశ్వనాథ సమీకించి, వాటినన్నింటిని సమాజానికి సమాహార రూపంగా అందింపగలిగిన ఒక మహాకావ్యాన్ని రచించటానికి పూనుకొన్నాడు. రామాయణ కల్పవృక్షం పేరుకు తగ్గట్టు సమాజం ఆకాంక్షించే వాస్తవిక, కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మికానుభవాల సంపుటిని అందింపగలిగిన విశిష్ట రచన. ఆయన జీవుని వేదన సమగ్ర కళానుభూతి కోసం సమాజ జీవచైతన్యం అర్రులు సాచే ఆవేదన. పంచజిహ్వల సమాజ చేతనకు విశ్వనాథవారు అందించిన అమృతనైవేద్యమే, అనుభవకోశమే రామాయణ కల్పవృక్షం. ఆ కావ్యంలోని సన్నివేశాలు పాత్రస్వభావాలు సమాజంలో కానవచ్చే వాస్తవజీవిత ప్రతిబింబాలుగా ఉండటం