Month: June 2018

యద్దనపూడి సంస్మరణ

జగమంత కుటుంబం
లేఖి మహిళా చైతన్య సాంసృతిక సంస్థ, శ్రీ త్యాగరాయ గాన సభ, రాగసప్త స్వరం.... సంయుక్త అద్వర్యంలో కళా సుబ్బారావు కళా వేదిక పై ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచన రాణి సంస్మరణ సభ జరిగింది.  జంట నగరాల సాంస్కృతిక సంస్థలు, కవులు, రచయిత్రులు పాల్గొన్నారు.  

యద్దనపూడి జ్ఞాపకాలు

సారస్వతం
నవలారచనలో మకుటం లేని మహారాణి... యద్దనపూడి సులోచనారాణి జ్ఞాపకాలివి (ఈనాడు ఆదివారం అనుబంధంలో.. 2004 మే నెలలో ప్రచురితమైన, కథనం) (మిత్రుడు రవిప్రసాద్ ఆదిరాజు సౌజన్యంతో) పదో తరగతితోనే చదువు ఆగిపోయినా... చుట్టూ ఉన్న సమాజాన్నే ఆమె నిరంతరం అధ్యయనం చేశారు. ఆ నిశిత పరిశీలనలో ప్రాణం పోసుకున్న పాత్రలే ఆమె నవలల్లోకి నడిచి వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నవలారచనలో మకుటం లేని మహారాణిలా వెలుగొందిన ఆమె.. ఆంధ్రుల అభిమాన రచయిత్రి... యద్దనపూడి సులోచనారాణి. రచయిత్రిగా ఆదర్శాలు వల్లించడమే కాకుండా స్వయంగా సామాజిక సేవకూ నడుం బిగించిన సులోచనారాణి సాఫల్యాలతోపాటు వైఫల్యాలనూ చవి చూశారు. తన జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలకు ఆమె ఇచ్చిన అక్షరరూపమిదీ... చిన్నప్పటి నుంచి నాకు మే నెల అంటే చాలా ఇష్టం. సహజంగా ఆ నెల్లో మండే ఎండలకి అందరూ హుష్షూ-హుష్షూ అంటూ హైరానా పడిపోతూ ఎండలను తిట్టకుంటారు. నేను మాత్రం సంవత్సరం మొత్త

శృంగార వియోగ నాయిక

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య శృంగార తాపంతో బాధపడుతున్న నాయిక అలమేలు మంగను వర్ణిస్తున్నాడు. పరి పరివిధాల సపర్యలు చేసినా అవన్నీ ఏమీ ఎక్కడం లేదు. మన్మధ తాపంతో తన్మయావస్థలో ఉన్నది అమ్మ. ఈ కీర్తనలో అన్నమయ్య చెలికత్తెలతో ఏమి చెప్పిస్తున్నాడో చూద్దాం. కీర్తన: పల్లవి: ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును చ.1.చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా యెందును నిద్రలేదేమి సేతమే గందపుటోవరిలోనఁ గప్పరంపుటింటిలోన యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును || ఉయ్యాల|| చ.2.పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక మంచముపైఁ బవ్వళించి మాటలాడదు నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు|| ఉయ్యాల|| చ.3.వెన్నెలల వేంకటద్రివిభుని లేనవ్వులాన నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి మన్ననల యింత లోన మలసేని జెలియ|| ఉయ్యాల|| (రాగం: కాంబో

దృగ్దృశ్య వివేకం

సారస్వతం
​-శారదాప్రసాద్ ఈ ప్రపంచంలో ఉన్న సకల మానవాళిని మూడు విధాలుగా వర్గీకరించవచ్చు! మొదటి వర్గం -పరమాత్మను గురించి తెలియని వారు . వీరే అజ్ఞానులు.రెండవ వర్గం -పరమాత్మను గురించి తెలుసుకోవటానికి తపనపడేవారు. వీరిని జిజ్ఞాసువులు అంటారు.ఇక మూడవ వర్గం --పరమాత్మను గురించి తెలిసినవారు.వీరిని జ్ఞానులు అనొచ్చు! వీరందరూ కూడా ప్రపంచాన్ని వారి వారి దృష్టిలో చూస్తారు.దృగ్దృశ్య వివేకం అనే ఈ గ్రంధం మూడవ వర్గం వారి కోసం వ్రాయబడింది .నిత్యానిత్య వస్తు వివేకం వలన మాత్రమే వైరాగ్య భావం ఏర్పడుతుంది.ఇటువంటి విశ్లేషణం వలన మనసులో ద్వద్వములు లేకుండా పోతాయి.అలా వైరాగ్యం ఏర్పడుతుంది.దృగ్ -దృశ్యం అంటే ఏమిటని కదూ మీ సందేహం?సాధారణ భాషలో చెప్పాలంటే-- చూచేది చూడబడేది -వీటిని గురించి తెలుసుకోవటం. నాలుగు వివేకములను పూర్తి చేసిన సాధకుడు, దృక్ దృశ్య వివేక పరిధిలోకి వస్తాడు. 1) నిత్యానిత్యవస్తువివేకము. 2) ఆత్మానాత్మవివేకము 3)

చిటపట చినుకులతో

కవితా స్రవంతి
- భువనగిరి వేంకట సుబ్రహ్మణ్య ప్రసాద్ ఆ కురిసే వానలో తడవాలని నాకుంది ! వాన వాన వల్లప్పా పాడలని నాకుంది ! వాన నీటి గుంతలో గెంతాలని నాకుంది ! కాగితపు పడవల తొ అడాలని నాకుంది ! చిటపట చినుకులతో చిందులు వేయాలని నాకుంది ! విరిసిన హరివిల్లు ఎక్కాలని నాకుంది ! మెరిసే మెరుపులతో ఎగరాలని నాకుంది ! గొడుగులతో వానలో తిరగాలని నాకుంది ! ఉరుములతో గొంతు కలిపి అరవాలని నాకుంది ! ****

జీవన సాఫల్యం

కవితా స్రవంతి
- కోడం పవన్ కుమార్ శాపం కాదు వ్యాధి అంతకన్నా కాదు అది రెండో బాల్యం క్షణం గడుస్తుంటే వయస్సు పెరుగుతుంటుంది వయస్సు పెరిగేకొద్దీ ముసలితనంతో పాటు పెద్దరికం వస్తుంది భూమ్మీద ఉండటం శాశ్వతం కాదు పుట్టడమే దేహ నిష్క్రమణ కోసం బాల్య కౌమార యౌవ్వనదశలెంత సహజమో వార్ధక్యం అంతే సహజం వయస్సు పెరిగేకొద్దీ సామర్థ్యం తగ్గుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది అంతమాత్రాన కుంగిపోవటం వివేకం కాదు మనఃసామర్థ్యం పదిలపరచుకోవాలి శరీరాన్ని విల్లులా వంచడానికి యోగాసనాలను స్వాగతించాలి మనస్సు మలినపడకుండా ధ్యానం దరిజేర్చుకోవాలి శరీరథర్మంగా దేహం బలహీనపడినా జ్నానార్జన వెలుగుతూనే ఉంటుంది మనస్సు ఆరోగ్యంగా ఉంటే దేహారోగ్యం నిగనిగలాడుతుంటుంది వ్రుద్ధాప్యం మరణానికి దగ్గరి మెట్టు కాదు జీవిత గమనంలో ఓ దశ మాత్రమే గడిచే ప్రతిక్షణాన్ని అమ్రుతంలా పొందాలి జీవితాన్ని పండించుకుని జీవన సాఫల్యం పొందాలి ***

రాక్షసుల పుట్టుపూర్వోత్తరాలు – యుద్ధకాండ

ధారావాహికలు
రాక్షసుల పుట్టుపూర్వోత్తరాలు అగస్త్యులవారప్పుడు "సరే! అయితే విను. రావణుడి పుట్టుపూర్వోత్తరాలు ముందుగా చెప్పి, ఇంద్రజిత్తు ఆ రావణుణ్ణి ఎట్లా మించిపోయినాడో నీవే తెలుసుకొనేట్లు ఆ రాక్షసుల వృత్తాంతం చెపుతాను" అన్నారు. “కృతయుగం దగ్గరకు వద్దాం. బ్రహ్మదేవుడు ముందుగా పదిమంది ప్రజాపతులను (మానసపుత్రులను) సృష్టించాడు కదా! ఈ పదిమందిలో పులస్త్యుడు ఒకడు. ఆయన బ్రహ్మర్షి, వేదనిధి, తపస్వి, మహామహిమాన్వితుడు. ఆయన నిరంతర తపస్సు కోసం మేరుపర్వత పాదప్రదేశంలోని తృణబిందు మహర్షి ఆశ్రమం ఆవాసంగా చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతం రమ్యమైన ప్రకృతి సౌందర్య విరాజితమైన ప్రదేశం కాబట్టి సకల దేవగణ సుందర తరుణులు అక్కడ ఆటపాటలతో, వేడుకలతో, తమ యౌవన విలాసాలతో విహరిస్తుండే వారు. అది పులస్త్య మహర్షికి భరింపరానిదైంది. ఆయనకు చాలా కోపం వచ్చింది. “నా చూపుమేర ఇక్కడకు వచ్చినవాళ్ళు, నా తపస్సుకు అంతరాయం కలిగించిన వాళ్ళు తమ కన్యత్వం పోగొట్టుకొ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి నాటకాన్ని చూస్తున్నా, కవిత్వాన్ని పఠిస్తున్నా సహృదయుడు ఆనందాన్ని పొందుతాడు. ఈ అనుభవం కవికీ, పాఠకుడికీ ఇద్దరికీ ఉంటుంది. “నాయకస్య కవేః శ్రోతుః సమానో నుభావస్తతః" అంటే కవి అనుభూతిని పొంది రాస్తే, దాన్ని పాఠకుడు అనుభవిస్తున్నాడు. అలాగే రంగస్థలం మీద నాయకాదులు అనుభవించి ప్రదర్శిస్తున్న అనుభూతిని ప్రేక్షకుడు అనుభవిస్తున్నాడు. అంటే ఈ అనుభూతికి కారణం కవి పొందిన అనుభూతే. దాన్నే సహృదయుడూ పొందుతున్నాడన్న మాట. అంటే ఈ రెండు అనుభూతులు సమానాలైపోతున్నాయి. ఏ యుగంలోనో రాముడు పొందిన బాధను కవి వర్ణిస్తే, రామాది పాత్రధారులు నటిస్తుంటే, సహృదయుడు అదే అనుభూతిని పొందుతున్నాడన్నమాట. దీన్ని అలంకారశాస్త్రంలో సాధరణీకరణమంటారు. “భారతదేశ రణసిద్ధాంతం"లో సాధారణీకరణం ప్రసిద్ధం. ఈ మార్గం కథనాశ్రయించిన కావ్యాలకే ఎక్కువగా వర్తిస్తుంది. సామాజికానుభవ చైతన్యాన్ని గమనించిన కవి, సామాజికుల సహానుభూతి పొంద కలిగిన పాత్