ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం
-సునీత పావులూరి
కవిత ఎంత హృదయాన్ని కదిలించింది అన్నది కాదు ప్రధానం; సామాజికునికి మానసిక చైతన్యం కార్యరూపంగా ఎంత ప్రవహించింది అన్నదే ప్రమాణం. ఆచరణ వెనుక అనుభూతి లేదని చెప్పడం అసంబద్ధం. మానసికంగా ఉత్తేజం పొందనివాడు శారీరికంగా కార్యశీలి కాలేడు. కవి ఉత్తేజితుడై కలమాడితే చాలు. కాని మార్క్సిస్టు కవిత కలంతో సంతృప్తి పడేదికాదు. హలంగానో, గన్ గానో మారాలి. వాటిని పట్టినవాడే విప్లవ కవిత్వానుభూతిని కార్యరూపంగా సాధిస్తున్నవాడు. ఒకవిధంగా మార్క్సిస్టు సాహిత్యంలో కలానికున్న ఈ గౌణమైన గౌరవాన్ని బట్టి కవి ప్రచారకుడనీ, కవిత్వం నినాదమని, అనుభవం కవిత్వం వ్రాసే కవిది కాదు, దాన్ని కార్యరూపంలో పెట్టే సమాజానిదేనని సాధారణంగా భావింపబడుతోంది. అందువలన ఈ పద్ధతిలో- కవితా సామాగ్రికి కనీస గౌరవం - కార్యాచరణ సూత్రాలకు కనకాభిషేకం.”
“ఈ మాట అనుశీలన కోసం ఏర్పరచుకుంటున్నదే. అభ్యుదయ కవులు, విప్లవకవులు సమాజ వాస్తవికతను కవిత్వంలో ప