Author: Sujanaranjani

ఓటు నీ సిఫార్సులేఖ

కవితా స్రవంతి
- శ్రీ గాదిరాజు మధుసూదన రాజు తెల్లారకముందేచీకట్లోలేచి ఇంట్లోంచి బయల్దేరి.. ఎక్కడుంటారో ఎప్పుడుంటారో ఎలావుంటారో కనుక్కుంటూ బతుకుబాగుచేసుకునేందుకు సాయాలూ సిఫార్సులేవో చేస్తారని ఆశిస్తూ కలలుగంటూ ఎమ్మెల్యే మంత్రీ సియం యంపీ పియమ్ముల కలవాలంటూ రేయింబగళ్ళూ పడిగాపులుకాచావునీవు! వాళ్ళంతా కట్టకట్టుకుని ఆ పదవులు అందుకునేందుకు నీ ఓటుసిఫార్సు కోసం నీ వద్దకు వస్తున్నారు ఆలోచించుకో గుర్తుకు తెచ్చుకో కనీసంనిన్ను ఓటరుగాగుర్తించిన వారెవరో ఒక్కవోటుతో నేనేంచేస్తా ననిధైర్యం వీడకు ఒక్కొక్కచుక్కకలిస్తేనే సముద్రం అయ్యిందికడకు ఓటు నీ సిఫార్సులేఖ ఎవరికిస్తావో నీ ఇష్టం నీ అనుభవాలను క్రోడీకరించు నీ తెలివినంతా చూపించు వోటేసి మంచిని గెలిపించు భవిష్యన్నిర్ణేతవై నీ సత్తాచూపించు నీకు నచ్చిన నేతలతో నీ పాలన సాగించు నిజమైన ప్రజా స్వామ్యాన్ని నీ వోటుతో స్థాపించు!!

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
అనుభూతి కవిత్వం ఒక వాదంగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో టి.యల్. కాంతారావుగారు ఎంతో ఆనందంగా ఈ వాదాన్ని గురించి చర్చించారు. వారి వారి భావాల్లో "భావ అభ్యుదయ కవితా ప్రక్రియల అనంతరం తిలక్ భావనా స్రవంతిలో వచ్చిన ఒకానొక విశిష్టపరిణామం అనుభూతి వాదం" అని చెప్పారు. ఇదే విషయాన్ని కొనసాగిస్తూ, “అనుభూతివాదం యొక్క పారమార్థిక లక్షణమేమిటంటే - కవి తన గుండెల్లో సుళ్ళు తిరుగుతున్న అనేకానేక స్వచ్ఛమైన భావతరంగాలకి ఏ ఆర్భాటం లేకుండా స్పష్టమైన ఆకృతినివ్వటం.” ఈ వ్యాఖ్య సమగ్రమైన వ్యాఖ్యగా గమనింపగలం. స్వచ్ఛమైన భావతరంగాలు అనటంలో కవి హృదయంలోంచి కెరటాల వలే ఉవ్వెత్తుగా లేచే భావపరంపరకు ఏ నిబద్ధతా, ఏ నియమాలూ లేవు అని చెప్పటం గమనింపవచ్చు. ఆ భావాలు ఏ ఆర్భాటం లేకుండా ఉంటాయి అంటే భావకవిత్వంలో ఉండే స్వాప్నిక డోలికావిహారం ఇందులో లేదు అనుకోవచ్చు. స్పష్టమైన ఆకృతి ఇవ్వటం అనటంలో సమకాలీనంగా సాగిస్తున్న అభ్యుదయ కవులమని చెప్పుకునేవారు ర

రావణుడి శివాపచారం

ధారావాహికలు
అప్పుడు రావణుడు కుబేరుడి దివ్యభవన సింహద్వారం దగ్గరకు చొచ్చుకొని పోయినాడు. అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న సూర్యభానుడు రావణుణ్ణి తీవ్రంగా ఎదిరించాడు. దాపులో ఉన్న ఒక స్తంభాన్ని పెకలించి దానితో దశకంఠుణ్ణి మోదాడు. అయతే బ్రహ్మ వర ప్రభావం వల్ల రావణుడు చావలేదు. కాని రక్తం కక్కాడు. దానితో ఒళ్ళు తెలియని కోపావేశంతో ఆ స్తంబాన్నే చేతపట్టి సూర్యభానుణ్ణి మోది వైరిని విగతజీవుణ్ణి చేశాడు. దీనితో యక్షుల బలం కకావికలమై పోయింది.కొందరు కుప్పకూలి పోయినారు. కొందరు గుహలలో దూరి ప్రాణాలు రక్షించుకున్నారు. కొందరు నిశ్చేష్ట్రులైనారు. వాళ్లకు కాలు చేతులాడలేదు. అప్పుడు కుబేరుడు, మణిభద్రుడనే యక్ష ప్రముఖున్ని చూసి 'పాపాత్ముడైన, క్రూరపరాక్రముడైన రావణుణ్ణి వధించి యక్షులను రక్షించే భారం నీదే'నని ఆనతిచ్చాడు. అప్పుడు మణిభద్రుడు నాలుగువేల మంది యక్షవీరులతో బయలుదేరి రణభూమికి వచ్చాడు. యక్షులకు, రాక్షసులకూ పోరు ఘోరంగా జరిగింది. రాక్షసుల

వీక్షణం- 79

వీక్షణం
-వరూధిని వీక్షణం 79 వ సమావేశం మిల్పిటాస్ లోని తాటిపామల మృత్యుంజయుడు గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ సుభాష్ పెద్దు అధ్యక్షత వహించారు. ముందుగా చలం గారి కథ "యముడితో చలం" కథను డా||కె.గీత, శ్రీమతి కె. శారద గార్లు చలం, యముని పాత్రలుగా కథను చదివి వినిపించి అందరినీ అలరించారు.కథా పథనం తర్వాత సభలో రసవత్తరమైన చర్చ జరిగింది. ఈ కథ 1958 లో చలం గారు పూర్వ జీవితానికీ, ఆశ్రమ జీవితానికీ మధ్య కాలంలో రాసినదని, కథలో తత్త్వ విచారం సరిగా జరలేదని, కొన్ని ప్రశ్నలకు అర్థం లేనిదని, తప్పు చేస్తేనే శిక్షా?, స్వరం, నరకం అంటే ఏవిటి? పాప పుణ్యాలకు అర్థాలు ఏవిటి? చదువరుల విశ్లేషణ ఎలా ఉంది? అసలు ప్రశ్నలు కథ ముగిసేక మొదలవుతాయి, యముణ్ణి విమర్శిస్తే ఎక్కడా ఎందుకు ప్రతి చర్చ ఉండదు? యముడు, చలం ఇద్దరూ చలమే. చలం గారి ఆత్మాన్వేషణే ఈ కథ..." అంటూ విభిన్న అభిప్రాయల్ని వెలిబుచ్చారు.ఆ తర్వాత కిరణ్ ప్రభ గారు "చలం జీవితం లో