Author: Sujanaranjani

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి తిలక్ కవిత్వంలో భావ, అభ్యుదయ కవిత్వాలతో పాటుగా, రాబోయే అనుభూతివాద కవితా పరిణామం కన్పిస్తుందనీ, దానికి తిలక్ కవిత్వమే ఆరంభ సూచకమనీ టి.ఎల్. కాంతారావుగారు పేర్కొన్నారు. 1981లో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు ఆలోచన అనే గ్రంథంలో ప్రత్యేకంగా 'అనుభూతివాదం' అనే వ్యాసాన్ని రాశారు. ఈ వాదం 'ఏ ఇజానికీ కట్టుబడి ఉందనీ’. ‘ఆత్మాశ్రయ కవిత్వానికి ప్రాణప్రదమైనదనీ’, అంతేకాక ‘అనుభూతికి అగ్రప్రాదాన్యం ఇస్తుంద’నీ వీరు చెప్పి సాహిత్యంలో దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. కడియాల రామమోహనరాయ్ గారు 1982లో "తెలుగు కవితా వికాసం" అనే గ్రంథంలో 'అనుభూతివాదం', ‘అనుభూతి కవిత్వం' అని పేర్లు పెట్టి ప్రత్యేకంగా రాయటం జరగలేదు. కానీ నూతన కవితారీతులను పరిచయం చేసేటప్పుడు మాత్రం 'అనుభూతివాదం', ‘అనుభూతి కవిత్వం', అనుభూతి కవుల' గురించి వీరు పేర్కోవటం జరిగింది. వీరు అనుభూతివాదాన్ని 'భావ కవితా సంబంధి'గానే చూసినా, ఈ

రావణాసురిడి జననం

ధారావాహికలు
-అక్కిరాజు రామాపతి రావు ఆ తర్వాత ఆ అన్నదమ్ములు ముగ్గురూ తండ్రి ఉండే తపోవనానికి తరలి పోయినారు. ఎప్పుడైతే రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుడి వల్ల అచింత్యమైన, అమోఘమైన వరాలు పొందారని సుమాలి తెలుసుకొన్నాడో ఇక నిర్భయంగా ఉండవచ్చుననీ,పోయిన ఆధిపత్యం తిరిగి సంపాదించుకోవచ్చుననీ 'మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు' అనే మంత్రులతో పాతాళలోకం నుంచి నేరుగా దశకంఠుడి దగ్గరకు వచ్చి అతణ్ణి కౌగిలించుకొని అభినందించి 'నాయనా! నీ వల్ల మేము నిర్భయులమైనాము. మనం లంకలో ఉండక పోవటం చూసి మీ అన్న ధనదుడు అక్కడ విలాసంగా పరిపాలిస్తున్నాడు. నీవు సామ, దాన, భేదోపాయాలలో దేనితోనైనా వాణ్ణి అక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. మేమంతా నిన్ను అనుసరించుకొని ఉంటాము. నీవు మన రాక్షసజాతిని విపత్సముద్రం నుంచి రక్షించావు' అని ప్రశంసించాడు. దశాస్యుడు మొదట ఒప్పుకోలేదు. ‘నీవు నా మాతామహుడివి! నిజమే కాని, కుబేరుడు నాకు జ్యేష్ఠభ్రాతకదా! జ్యేష

హ్యాపీ హాలిడేస్

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు డిసెంబర్ నెలంటేనే ఒక సంవత్సరం ముగుస్తున్నట్టు. అలాగే పండుగల కాలం. స్కూల్లకు, కాలేజీలకు కూడా సెలవులు. క్రిస్మ్మస్, నూతన సంవత్సరాది పండగల హడావుడి. మన భారతీయులైతే దీపావళీ పండుగను కూడా జతచేస్తూ నవంబర్ నెలంతా వివిధ కార్యక్రమాలతో వినోదంగా గడుపుతారు. ఇంకా చెప్పుకోవాలంటే నవంబర్ నెల ఆఖరి గురువారం గొప్పగా జరుపుకునే ఉత్సవం 'థాంక్స్ గివింగ్ డే'. ఆ వారం మొత్తం అమెరికాలో చాలావరకు అందరు తమ శక్తిమేరకు ఎంతో కొంత విరాళాలు ఇస్తారు. ఆ సదవకాశాన్ని వినియోగించుకోటానికి స్వచ్చంద సేవా సంస్థలు విరాళాల సేకరణ కార్యక్రమాలు మొదలెడతారు. ఈ క్రమంలోనే దాతలు సిలికానాంధ్ర కూచిపూడీ గ్రామంలో స్థాపించిన సంజీవని వైద్యాలయానికి విరివిగా ధన సహాయం చేసారు. అందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు! ఈ సంవత్సరం మొత్తం వినూత్న రచనలతో విడుదలైన సుజనరంజని సంచికలను ప్రోత్సాహించిన పాఠకులకు, తమ రచనలను పంపించిన రచయిత(త్రు)

కోరికలు లేకుండా…

సారస్వతం
కోరికలు లేకుండా జీవించేవారే మోక్షానికి అర్హులు! -శారదాప్రసాద్ ​​పూర్వం రంతీదేవుడనే రాజు ఉండేవాడు. అతడు రాజు అయినప్పటికీ మహర్షివలె, మహాయోగి వలె ప్రాపంచిక సుఖాలకు లోనుకాక నిరంతరం హరి నామస్మరణతో కాలం గడిపేవాడు . లభించిన దానితోనే తృప్తిగా జీవించిన మహానుభావుడు ఆయన . ఆ రాజు గొప్ప దాన గుణం కలవాడు. దానాలు చేసీ చేసీ చివరికి కడు పేదవాడయ్యాడు. ఆయనతో పాటు కుటుంబం అంతా కష్టాల పాలయింది . 48 రోజులు అన్నము, నీళ్ళు లేకుండా గడపవలసి వచ్చినా గుండెనిబ్బరం చెడలేదు. ఒక రోజు ప్రాతః కాలమున అతనికి నెయ్యి పాయసము, నీళ్ళు లభించాయి. భోజన కాలం కాగానే రంతీదేవుడు సకుటుంబముగా భోజనం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. అందరూ ఆకలి బాధను, దప్పికను తీర్చుకుందాం అని అనుకుంటున్న సమయములో, ఓ పేద బ్రాహ్మణుడు అతిధిగా వచ్చాడు. రంతీదేవుడు అతనిని ఎంతో ప్రేమగా గౌరవించి హరి సమర్పణముగా ఆహారములో అర్ధ భాగాన్నిఅతడికిచ్చాడు. ఆ బ్రాహ్మణుడు తృప్తిగా భ

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
“ఏల చెప్పేవు నీ సుద్దులు” టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య తానే చెలికత్తె పాత్ర ధరించి " ఏల చెప్పేవు నీ సుద్దులు " అంటూ స్వామి వారికి అనేక ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఓ శ్రీనివాసా! నీ దివ్యగాధలు ఎన్నని చెప్పను? ఎలా వర్ణించను అంటున్నాడు అన్నమయ్య. “బ్రహ్మచారివైతివి” అంటున్నాడు. శ్రీమహావిష్ణువు బ్రహ్మచారి అవడం ఏమిటి? దానికొక గాధ ఉంది. పరీక్షిత్తు మృతశిశువుగా జన్మించాడు. ఎవరైనా అస్ఖలిత బ్రహ్మచారి ఆ శిశువును ఎత్తుకున్నట్లైతే తిరిగి జీవిస్తాడని వ్యాసమునీంద్రుల వారు చెప్తారు. చివరికి భీష్ములవారితో సహా తమకా అర్హత లేదని తప్పుకుంటారు. శ్రీకృష్ణుడు అలా ఎత్తుకోగానే బిడ్డ కేరుమని ఏడ్చి ప్రాణం పోసుకుంటుంది. పదహారు వేల గోపికలు, అష్ట భార్యలతో అలరారిన శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారా? విచిత్రము కాకపోతే చెప్పండి? ఆ విషయమేమిటో ఈ శృంగార కీర్తనలో చూద్దాం. ఈ కీర్తన భక్తి భావాలతో సాగినప్పటికీ అన్యాపదేశంగా నీవు బ్రహ్

బాషా ఖూనీ

కథా భారతి
-ఆర్. శర్మ డంతుర్తి ఉద్యోగంలో కొత్తగా చేరిన ఒరిస్సా కుర్రాడు బిభూతి పట్నాయిక్ గురించి రెండురోజుల్లో అందరికీ తెలిసిన విషయం కుర్రాడికున్న వ, బ అక్షరాలకి ఉన్న అభేధం, వాటిని ఈజీ గా, ఒక్కొక్కప్పుడు కావాలని కలిపేసి బాషని ఖూని చేయడమూను. మరో విషయం ఏవిటంటే కొన్ని పదాలని - అంటే వోల్టేజ్ స్టెబిలైజర్ అనే దానిని బోల్టేజీ స్టెబిలైజర్ గా – దీర్ఘాలతో పీకి, పీకి పలకడం. పలకడం అలా ఉంచితే కాయితం మీద వోల్టేజ్ అనేదాన్ని బి అక్షరంతో మొదలుపెట్టి బోల్టేజ్ అని రాయడం చూస్తే పక్కనే ఉన్న వినోద్ కి మతిపోయింది. కొన్ని వారాలు పోయాక వినోద్ మాట వరసలో ఓ సారి చెప్పాడు బిభూతి తో; “ఒరే నాయనా ఒరియాలో నీ ఇష్టం వచినట్టు మాట్లాడుకో కానీ కనీసం అందరితో మాట్లాడే ఇంగ్లీషు భాషని ఖూనీ చేయకు, అవతలవాళ్ళు మరోలా అర్ధం చేసుకోవచ్చు” అని. పుట్టుకతో వచ్చిన బుద్ధులు కాటిలో పుర్రెతో కానీ పోవని ఊరికే అనలేదు కదా? విభూతి అనే పదం భగవంతుడి విభూతి

రావణాసురిడి జననం

ధారావాహికలు
-అక్కిరాజు రామాపతి రావు అట్లా ఆమెకు మొదట దశగ్రీవుడు జన్మించాడు. ఆ తరువాత కుంభకర్ణుడు పుట్టాడు. వాళ్ళిద్దరూ చిన్నతనంలోనే పరమభయంకర క్రూరకృత్యాలు చేస్తూ మునివాటికలను వెరపు కలిగిస్తూ వచ్చారు. ఋషులను పీడించసాగారు. వీళ్ళిద్దరి తరువాత పుట్టిన విభీషణుడు మాత్రం సాధువర్తనుడై, ధర్మతత్పరుడై, వేదనిరతుడై, జితేంద్రియుడై పెరుగసాగాడు. ఇట్లా కాలం గడుస్తుండగా ఒక రోజున వైశ్రావణుడు (కుబేరుడు) పుష్పకవిమానం ఎక్కి తండ్రిని చూడడానికి వచ్చాడు. అప్పుడు కైకసి దశగ్రీవుడితో 'చూడు, నీ సోదరుడు, ఎంత మహావైభవంతో, దివ్యతేజస్సుతో విలసుల్లుతున్నాడో! నీవు కూడా అంతటి వాడివి కావాలి. అతన్ని మించిపోవాలి' అని ప్రేరణ చేసింది. అప్పుడు దశగ్రీవుడు 'అమ్మా చూడు! ఆ ధనదుడి కన్నా బలవంతుణ్ణి అవుతాను, ధనవంతుణ్ణి అవుతాను. లోకాలన్నిటినీ జయిస్తాను. వాడి లోకపాలకత్వం ఒక లెక్కా? బహులోకపాలకుణ్ణి అవుతాను' అని తల్లికి ప్రియం కలిగించాడు. రావణాసురుడూ,