ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం
-సునీత పావులూరి
“అయ్యయో! ఊర్వశీ విషాదార్ద్రమూర్తి
ఈ నిశీథాన నా హృదయాన నిండె!
పూర్ణిమా శుభ్రయామిని బొగ్గువోలె
ఈ యెడదవోలె కాలిపోయినది నేడు!”
దీనిలో 'నేను' అంటే నేను అనే అర్థం. కానీ "నా బాహువు పడుకుంటే, పొలాలు ,కార్ఖానాలు నిద్రిస్తాయి" అన్న ఆధునిక కవి రచన చదివితే, ఇందులో ఉన్న నేను 'నేను' కాదు. ఇక్కడ 'నేను' అంటే సమాజం అనే అర్థం. కాబట్టి ఆధునిక రచనలోని ఆత్మాశ్రయ కవిత్వం సామాజిక అనుభూతులకి సంబంధించిందే. కవి వైయక్తికంగా తాను పొందిన అనుభూతిని సామాజికంగా చెప్తున్నాడు. ఈ రచన సమాజంలోని ప్రజలందరి భావంగా మారి ప్రయోజనాలను ఉద్దేశించిందిగా కన్పిస్తుంది. కవి రచన అనుభూత్ని స్వాత్మీకరణం చేసుకున్నా, ఆ అనుభూతి సమాజం పొందేదే. శేషేంద్ర-
“నది పోలాలవైపు పరిగెత్తింది
అన్నార్తుల్ని రక్షిద్దామని
చెయ్యి రైఫిల్ వైపు పయనించింది
ప్రజాద్రోహుల్ని శిక్షిద్దామని"
అని అంటాడు. ఇక్కడ చెయ్యి అంటే తన చెయ్యి కాదు. ఏ ఒక్క