కథా భారతి

అమెరికాలో యోగీశ్వరుడు-2

కథా భారతి
(రెండో భాగం) -ఆర్. శర్మ దంతుర్తి జరిగిన కధ – బతక నేర్చిన బడిపంతులు సుబ్బారావు గారు జాతక చక్రం వేయడం, పంచాంగం రాయడం నేర్చుకున్నాక, తననో పరమహంస గా భావించుకుంటూ, తన కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అమెరికాలో దిగేక తానూ అమెరికా వచ్చేడు విజిటర్ వీసా మీద. అక్కడ ఒక ఎన్నారై హిందూ గుడిలో ఏర్పాటు చేసిన ప్రసంగంలో పరమహంస గారు మాట్లాడ్డం అయ్యేసరికి సుబ్బారావు గురూజీకి కొంతమంది శిష్యుల్లా తయారయ్యేరు. మరోసారి అమెరికా వస్తాననీ, ఈ లోపున కొడుకు తనకి తయారు చేసిపెట్టిన వెబ్ సైటు ద్వారా దేశం నుంచే శిష్యులని ఉద్ధరిస్థాననీ ఆ వెబ్ సైటు రోజూ చూస్తూ ఉండమనీ చెప్పి తాను ఇండియా వెనక్కి వచ్చేసేడు. మరి కొంత కాలానికి రెండో సారి అమెరికా వచ్చేడు సుబ్బారావు. ఇంక చదవండి.) రెండో అమెరికా ట్రిప్పులో రోజులు అద్భుతంగా గడిచిపోతుండగా కాస్త చలి రోజుల్లో ఓ వీకెండు డిన్నర్ పార్టీలో ఒక శిష్యుడు ప్లేటులో ఫుడ్ తెచ్చుకోవడానికి హాల్లో ఇటు

అమెరికాలో యోగీశ్వరుడు

కథా భారతి
(మొదటి భాగం) -ఆర్. శర్మ దంతుర్తి సుబ్బారావు యోగీశ్వరుడిగా మారడానికీ, అమెరికా రావడానికీ అనేకానేక కారణాలు ఉన్నాయి. మునిసిపల్ స్కూల్లో తొమ్మిదో తరగతి పిల్లలకి పాఠాలు చెప్పుకునే ఉద్యోగం లో చేరిన రోజుల్లో మొదట్లో కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది పాఠాలు చెప్పడానికి. కానీ మూడు నాలుగు సంవత్సరాలు గడిచేసరికి చెప్పిన పాఠమే చెప్తూ రికార్డ్-ప్లేబేక్ అన్నట్టైపోయింది సుబ్బారావు పని. తెలుగులో పాఠ్య పుస్తకాలు అంత తొందరగా మారవు కనకా, మారినా పెద్దగా ప్రిపేర్ అయ్యేది ఏమీ ఉండదు కనకా సుబ్బారావు కి పాఠాలు చెప్పడానిక్కంటే గోళ్ళు గిల్లుకోవడానికీ, నవల్డానికీ ఎక్కువ టైం ఉండేది స్కూల్లోనూ ఇంట్లోనూ. అలాంటి రోజుల్లో సుబ్బారావు జాతకాలు చూడ్డం, చెప్పడం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అవును మొదట్లో సరదాకే. ఇరవైఏడు నక్షత్రాల పేర్లూ, నవగ్రహాలు ఎలా ముందుకీ, వెనక్కీ తిరుగుతాయో అవన్నీ నేర్చుకున్నాక దశా, మహా దశా, అర్ధాష్టమ శనీ,

సివంగి

కథా భారతి
హాస్యరసాన్ని నీళ్లల్లా చిలకరిస్తూ వ్యంగ్యం వేళాకోళం చమత్కారం సమపాళ్ళలో కలిపి ఒక రచన వండాలనిపించింది రాజేశ్వరికి. అనుకున్నదే తడవు అందుకుంది పాత్రలా పేపరుకాయితం. అడుగులో హంసపాదు అన్నట్టుగా ఆపాత్రకి గరిట కనపడలేదు అంటే అదే పెన్ను కనపడలేదు. తొలివిఘ్నం అనుకుంటూ పుత్రరత్నం పుస్తకాల దగ్గిర ఏదో ఓపెన్ను కనపడకపోదని వాడి అలమారలో చూసింది. అది ఉంది ఒక అడవిలా. దారీ తెన్నూ లేని ఆ అడవిని ఒక్క నిమిషంలో సరి చెయ్యడం కుదరదు ఎలాగో . అందుకే ఆ పని తలపెట్టకుండా తలదూర్చి పుస్తకాల కుప్పలో వెతికింది. ఆశనిరాశ కాలేదు. దొరికింది. అమ్మయ్య అనుకుంటూ సద్దుకుని కూచుంది. ట్రింగ్ ట్రింగ్ అంటూ టెలిఫోన్ మోగింది. మలివిఘ్నం పళ్ళుకొరుక్కుంటూ లేచింది . తప్పుతుందా. రిసీవర్ చెవి దగ్గిర పెట్టుకోగానే ఎవరో ఆయన హిందీలో ఏదో అడుగుతున్నాడు. అసలే హిందీలో పండితురాలు తను. ఆయన అడిగేదాన్లో వాక్యంచివర హై హై అంటూ హైరానా పడటం తప్ప ఇంకేమీ అర

సలలిత రాగ సుధారస సారం

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి లోపలకి వస్తున్న బాలమురళీని చూస్తూ ఇంద్రుడు ఆసనం మీద నుంచి లేచి "రండి, రండి" అంటూ అహ్వానించేడు. అక్కడే ఉన్న నారద తుంబురులూ, అప్సరసలూ కూడా నవ్వుతూ ఆసనం చూపించేక అందరికీ నమస్కారం పెట్టి చుట్టూ చూసేంతలో నారదుడి కంఠం వినిపించింది, "ఇంతకాలం అద్భుతంగా భూలోకంలో సంగీతాన్ని పంచిపెట్టిన మీకు స్వాగతం. ఇప్పుడెలా ఉంది సంగీత కళ భూలోకంలో? త్యాగరాజుల వారు మొదలుపెట్టిన సంగీత యజ్ఞం బాగా సాగుతోందా?" బాలమురళీకి ఏమనాలో తోచలేదు. వచ్చిన ఐదు నిముషాల్లో ఇక్కడంతా ఏమీ పూర్తిగా పరిచయం అవకుండానే నారదుల వారు తనని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారప్పుడే. బాలమురళీ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఈ సారి తుంబురుడు అడిగేడు, "త్యాగరాజ స్వామి ఆరాధనా, ఉత్సవాలు బాగా జరుగుతున్నాయని వింటున్నాం. ఆయన పంచిచ్చిన సంగీత సుధ, ఆ రాములవారి అనుగ్రహంతో అలా నిరాటంకంగా సాగుతోందా?” ఇంద్రుడికేసీ అక్కడ సభలో అందరికేసీ చూశాడు బాల

అనుకోని ఆనందం

కథా భారతి
రచయిత్రి : ఇందిరామూర్తి ఏమండీ, ఏం? ఏం ఆలోచిస్తున్నారింకా? లేవండి, లేచి బట్టలు మార్చుకొని మీ తమ్ముడింటి కెళ్ళండి. ఆయనో పెద్ద ఉద్యోగస్థుడుగా! ఆమాత్రం సాయం చేయడని, నేననుకోను. అదికాదు లలితా! నేను పెద్దవాణ్ణి. వాడి అవసరాలకు నేను నిలబడాలి గానీ వాడిముందు చేయిచాపడం న్యాయంకాదు. అబ్బా! అవన్నీ చింతకాయ సిద్ధాంతాలు. వాటిని పట్టుకు కూర్చుంటే జరిగేదేమీ వుండదు. న్యాయాలు, ధర్మాలు నడిచినన్నాళ్ళే. సోది ఆపి బయలుదేరండి. మీరిట్లా తెమల్చకపోతే అవతల పాడైపోయేది పిల్లాడి జీవితం. ఇదుగో ఒకటే చెప్తున్నా నా మనసంగీకరించడం లేదే. అమ్మానాన్న లేకున్నా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాం అందరం. ఇప్పుడీ అప్పు ప్రస్థాపన తెచ్చి, వాడిచ్చ్జ్హినా నాకు అవమానంగానే ఉంటుంది. చిన్నవాడి దగ్గర అడిగానేనని. లేదన్నాడా, అది మరీ బాధ, మనస్ఫర్థలకు బీజం పడినట్లవుతుందే కుటుంబాల మధ్య ఆలోచించు. ఆలోచించి చేసేది ఏమీలేదు. ఏమన్నా కానీ, నాకొడుకు అ

​ జొన్న గింజ

కథా భారతి
  ఆర్ శర్మ దంతుర్తి రాజు సభలో కూర్చొనుండగా సేవకుడొచ్చి చెప్పేడు, "ఓ పరదేశి మీకు ఏదో వింత వస్తువు చూపించడానికి వచ్చాడు. లోపలకి తీసుకురమ్మని శెలవా?"   రాజు మంత్రికేసి చూసి, ఆయన సరేనన్నాక చెప్పాడు, "సరే, రమ్మను చూద్దాం."   లోపలకి వచ్చిన పరదేశి, అక్కడే ఉన్న బల్లమీద తన చేతిలోది ఏదో వస్తువు ఉంచాడు. చూడబోతే కోడి గుడ్డు లా ఉంది. గుడ్డు కాదన్నట్టు పైన ఒక చార లాంటిదేదో ఉన్నట్టుంది కూడా. రాజు, మంత్రీ తర్జన భర్జనలు పడి మొత్తానికి అది కోడి గుడ్డు కానీ మరో పక్షి గుడ్డు కానీ కాదని నిర్ధారించుకున్నాక అడిగేరు పరదేశిని, "ఏమిటి విషయం?"   "ఇదేదో మీకు నచ్చుతుందేమో, కొనుక్కుంటారేమో అని అడగడానికి వచ్చాను."   "ఇదేమిటో తెలియకుండా ఎలా కొనడం?"   "ఇదేమిటో నాకూ తెలియదు, దారిలో దొరికితే తెచ్చాను. మీకు నచ్చితే ఏదో ఒక ధర ఇప్పించండి" తాను దారిలో చిన్నపిల్లలు అడ

నీ పద్యావళు లాలకించు చెవులున్ ని న్నాడు వాక్యంబులన్

కథా భారతి
- ఆర్. శర్మ దంతుర్తి కైలాసం లోపలకి వచ్చే నారదుణ్ణి నందీ, విఘ్నేశ్వరుడు సాదరంగా ఆహ్వానించారు. ఆది దంపతులకి నమస్కారం చేసి అడిగాడు నారదుడు, "ఈశ్వరా, పులస్త్య బ్రహ్మ కుమారుడైన వైశ్రవణుడు తెలుసు కదా? ఆయన కుమారుడైన కుబేరుడనేవాడు మీ కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. అతన్ని కరుణించేదెప్పుడో తెలుసుకుందామని ఇలా వచ్చాను." భవుడు చిరునవ్వు నవ్వేడు జగదంబ కేసి చూసి. అమ్మవారు చెప్పింది, "నారదా ఈ తపస్సు ఫలించి కుబేరుడికి కోరికలు తీరినా ఆయన అడిగినది ఎంతో కాలం నిలవదు." నారదుడు ఆశ్చర్యంగా చూసాడు అదేమిటన్నట్టు. పార్వతి వివరణ ఇస్తున్నట్టూ చెప్పింది, "నువ్వే చూద్దువు గాని కదా? కోరికలీడేరడం వల్ల సుఖం వస్తుందనేది ఎంత నిజమో." అంతకన్న చెప్పడానికేమీ లేదన్నట్టు అమ్మవారు ఆగేసరికి భవుడు సమాధిలోకి జారుకున్నాడు. జగజ్జనని కూడా కళ్ళు మూసుకోబోయేంతలో ద్వారం వరకూ వచ్చే నందీశ్వరుడితో త్రిలోకసంచారి నారదుడు “నారాయణ,

నాకు నచ్చిన కథ – ఒక్కనాటి అతిథి

కథా భారతి
కథారచన - ఆచంట శారదాదేవి శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి ఈ కథ నాకెందుకు నచ్చిందంటే శ్రీమతి ఆచంట శారదాదేవి ఆ తరం రచయిత్రులలో మంచి వాసిగల రచయిత్రి. ఆవిడ రాసిన కథ ల ఆణిముత్యాలు. భావుకతని, వర్ణనల్ని జోడించి ఎంత బాగా రాస్తారో కథలావిడ, వాటిలో కొన్ని హారమై 'ఒక్కనాటి అతిథి' కథల సంపుటి రూపంలో మెరిశాయి 1965లో సున్నితమైన మనసుని సుందరంగా లలిత లలితంగా చిత్రీకరించి కనుల ముందు నిలబెట్టిన కథ శారదగారి 'ఒక్కనాటి అతిథి' మనిషి శరీరంలో అతుకుపెట్టలేని భాగం మనసొక్కటే అని నా అభిప్రాయం ఎంత డబ్బు పోసినా కొనుక్కోలేనిది మనసు. ఆ మనసు లోతుల్లోకి తుంగిచూస్తే కథలంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే 'ఒక్కనాటి అతిథి' కథ ఎంతో ఇష్టం నాకు. ఈ కథలోని కేతకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అప్పుడే విరిసిన పువ్వల్లే అతి నాజూకుగానూ, భావనాలోకంలో విహరిస్తూనే భాధ్యత తెల్సిన భారపు రూపం గానూ కనిపిస్తూ ఉంటుంది నాకు. ప్రతి మనిషి మనసుకీ ఈ రెం

అనగనగా ఓ కథ – ఓ మహిళా దారి ఇదిగో…

కథా భారతి
- కొడవంటి కాశీపతిరావు మేస్టారి కోపం చూడ్డానికి పౌర్ణమినాటి వెన్నెల్లా తెల్లగా చల్లగా ఉన్నా అనుభవానికి వచ్చేసరికి నట్టనడి వేసవిలో మిట్టమధ్యాహ్నపు ఎండలా తీవ్రంగా ఉంటుంది. పైగా "అమ్మాయ్ హోంవర్కు చెయ్యలేదేం? ఓ గంట సేపు ఎండలో నిలబడు... ఊఁ "అంటే ఆ ఎండే వెన్నెల్లా వుంటుంది. అదే... "హోంవర్కు చెయ్యలేదూ... ఊఁ... సరే" అని పెదాలుబిగించి రెప్పెయ్యకుండా ఓసారి చూసి తలపంకించేరంటే అది మరి భరించలేను నేను. నేనే కాదు బహుశా ఎవరూను. అంతకుముందు క్లాసులో ఇంగ్లీషు ఏమేస్టారెలా చెప్పేవారో కూడా తెలియనంత మరపుకొచ్చిందిగాని, ఈ మేస్టారు మాత్రం పాఠంలోకి తిన్నగా వెళ్ళిపోయే వారు కాదు. ఒక్కో స్ట్రక్చరూ తీసుకుని తీగమీద డ్రిల్లు చేయించినట్టు చేయించి, ఒక్కో కంటెంటు వర్డూ తీసుకుని ఒక్కో పిప్పరమెంటు బిళ్ళ నోట్లోవేసి చప్పరించినట్టు చేయించేవారు. ఆపైన ఒక్కసారో, రెండుసార్లో మరి పాఠం చదివించి అరటిపండు వలిచి చెతిలో పెట్