Author: Sujanaranjani

కవిత్వం

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి రాసేవారు ఎక్కువ,చదివేవారు తక్కువ ఇదీ నేటి కవితల పరిస్థితి. రాశి ఎక్కువ,వాసి తక్కువ ఇదే ఇప్పటి కవిత్వపు దుస్థితి. పదం పక్కన పదం పేరిస్తే దానినే కవిత్వమనుకోవటం పైత్యం. పదం హృదయాని స్పందిస్తే అది కవిత్వమౌతుందనేది సత్యం. మదిలో అలజడి కలిగితే కవితకు తొలినుడి చుట్టబడుతుంది. భావావేశపు సుడిలో మునిగితే కవితకు గుడి కట్టబడుతుంది. నిశ్శబ్ధంతో నువ్వు చేసే యుద్ధంలో నిర్వేదంతో నిన్నునువ్వు చూసుకొనే నిబద్ధంలో కవిత్వం జాలువారుతుంది. నిగూఢంలో నీతో నీవు చేసే సాహచర్యంలో నిర్భేధ్యంగా నీపై నీవు జరిపే గూఢచర్యంలో కవిత్వం నిన్ను చేరుతుంది.   ***

రెండవ వైపు

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అట్టుకు రెండవ వైపు ఉంటుందని తెలుసుకోలేని అజ్ఞానులం మనం. మన ………మనదీపమై వెలుగుతోందని గర్విస్తామే తప్ప, అదే దీపం మనం చేసుకున్న పాపమై, భవిష్యత్తులో మననే కాలుస్తుందని తెలుసుకొనలేము. కన్నూమిన్నూ కానని ఆవేశంలో, మిడిసిపాటుతో కూడిన యవ్వనంలో, మనం ఆడిందే ఆట, పాడిందే పాట అవుతూ ఉంటే, అదే శాశ్వతం అనుకుంటూ గడుపుతాము నేడు ఇటుకాలిన అట్టు రేపు అటుకూడా అలానే కాలుతుందని, గుర్తించలేము,తెలుసుకోలేము నేటి మన దుష్ప్రవర్తనలే రేపటి యమ పాశాలై మనని దుఃఖానికి గురిచేస్తాయని ఊహించలేము తీరా తెలిశాక చేయటానికి ఏమీ మిగిలి ఉండదు అనుభవించటమే తప్ప ఆలోచనకు తావుండదు ఆక్రోశించటమే తప్ప ఆచరణకు అవకాశం ఉండదు   ***

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే ఈ కీర్తనలో అన్నమయ్య తన్ను తాను చెలికత్తెగా భావించుకొని తోడి చెలికత్తెలతో అంటున్నాడు. ఏమి చెప్పమందువే చెలీ! నాయికా నాయికలు ఇద్దరూ ఇద్దరే ఒకరి మరొకరు తీసిపోరు ఏవిషయంలోను. అహోబల నారసింహుడైనా, ఆ యమ్మ శ్రీమహాలక్ష్మి అయినా అంటూ అన్నమయ్య శృంగార వ్యవహారాలను ఏకరువు పెడుతున్నాడు. ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం. కీర్తన: పల్లవి: ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే బద్దుగా దాపెను మెచ్చెఁ బ్రహ్లాదవరదుఁడు ॥ ఇద్ద ॥ చ.1. చక్కని మొకముచూసి సారెసారె మాటలాడి చిక్కించెనాపె తొలుత చేరియాతని మిక్కిలి మేలుదియై మేను చెమరించఁగాను పక్కన నాపెను నవ్వేఁ బ్రహ్లాదవరదుఁడు ॥ఇద్ద॥ చ.2. పీఁటమీఁదఁ గూచుండి ప్రియములు చెప్పి చెప్పి దూఁటి చన్నులనొ త్తెను తొలుతాతని పాటించి యాతని మోవిపండు చూచి నోరూరఁగా బాటగానాపెను నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు ॥ఇద్ద॥ చ.3. కాఁగిలించుక యిందిర కన్న

అమెరికా ఉద్యోగ విజయాలు – 7

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న అమెరికా ఉద్యోగ విజయాలు – 7 రంగుటద్దాలు ఆ శనివారం ఉగాది. కృష్ణ ఇంట్లో పండగ భోజనం అయాక, వాతావరణం చాల బాగుంది కనుక, అర్జున్ బయటికి డ్రైవేలోకి వచ్చి నుంచున్నాడు. ఎదురింటి ఆయన, తల మీద తెల్లటి హాట్ పెట్టుకుని లాన్ మోవింగ్ చేస్తున్నాడు. అర్జున్ని చూసి ఒక చిరునవ్వు ఇచ్చి, చేయి వూపి మళ్ళీ తన పని తను చేసుకుంటున్నాడు. అతని వెనకనే వచ్చిన కృష్ణతో నెమ్మదిగా అన్నాడు అర్జున్, “ఏమిటి! మీ ఇంటి దగ్గర అందరూ అమెరికన్లు కాదా? నల్లవాళ్ళు కూడా వున్నారా?” అని. ఆ మాటలకు కృష్ణకు కొంచెం కోపం వచ్చినా, నెమ్మదిగా అన్నాడు, “ఆయన ఇక్కడే పుట్టి పెరిగిన అమెరికన్. కొన్ని తరాలుగా వాళ్ళు అమెరికన్సే! నేను ఇక్కడ నాలుగు దశాబ్దాలుగా వున్నా, ఆయన నాకన్నా ఎక్కువ అమెరికన్! అంతేకాదు, నీలాగా విదేశస్థుడు కాదు” అర్జున్ కొంచెం ఖంగుతిని, “అదికాదు బావా. మీరు వున్న కాలనీలో అన్నీ ఖరీదైన ఇళ్ళు కదా, మరి ఇక్కడ నల్లవా

e-Books

శ్రీ ప్లవ ఉగాది ప్రత్యేక సంచిక వికారి ఉగాది ప్రత్యేక సంచిక 18వ సంస్థాపక దినోత్సవ ప్రత్యేకసంచిక అన్నమయ్య జయంతి ప్రత్యేకసంచిక సప్తసప్తతి జ్ఞానోదయ మందరము (రామాయణం - మొదటి భాగం)  సప్తసప్తతి జ్ఞానోదయ మందరము (రామాయణం - రెండవ భాగం) సప్తసప్తతి జ్ఞానోదయ మందరము (రామాయణం - మూడవ భాగం)

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
యముడితో రావణుడి యుద్ధం ఇక అప్పుడు యముడు స్వయంగా రావణుడితో యుద్ధం చేశాడు. మృత్యుపాశం, కాలదండం ధరించి రావణుడిపైకి వచ్చాడు. ఇట్లా ఏడు రోజులు రాత్రింబవళ్ళు యముడికీ, రావణుడికీ జగద్భయంకరమైన యుద్ధం జరిగింది. ఎవరూ వెనక్కు తగ్గటం లేదు. అప్పుడు దేవతలు భయపడి బ్రహ్మదేవుడితో అక్కడకు చేరుకున్నారు. మృత్యుదేవత వీణ్ణి కబళిస్తానని ముందుకు రాగా, యముడు వారించి వీణ్ణి నా కాలదండంతో హతమారుస్తానన్నాడు. ఇంతలో బ్రహ్మ అక్కడకు వచ్చి యముడితో 'నా వరాలు వ్యర్థమైపోతాయి. వీణ్ణి ఇట్లా చంపవద్దు' అని జోక్యం చేసుకున్నాడు. అప్పుడు యముడు అసహనంతో అంతర్థానమైనాడు. ‘నేనే జయించాన'ని రావణుడు లోకం దద్దరిల్లే గర్జనలు చేస్తూ పుష్పకం ఎక్కి తన నివాసానికి వెళ్ళాడు. ఆ తరువాత రావణుడు పాతాళలోకం పైకి దండెత్తాడు. భోగవతి దాని రాజధాని. రావణుడు అక్కడకు చేరాడు. వాసుకిని వశపరచుకొన్నాడు. అక్కడ నుంచి నివాతకవచులనే క్రూరరాక్షసులు ఎవరికీ కనపడకుండా నివా

అష్టావక్రుడు

కథా భారతి
అర్చన ఆర్ట్స్‌ అకాడెమీ (హ్యూస్టన్‌), శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్‌ ఛారిటబుల్‌ సొసైటీ, సంయుక్త కథల పోటీ 2019 -యర్రమిల్లి విజయలక్ష్మి ద్వితీయ బహుమతి పొందిన కథ హాల్లో నా ఎదురుగా గోడమీద ఎత్తున ఇనుప తీగకు బిగించిన మా తాతగారి నిలువెత్తు తైల చిత్రం వ్రేలాడుతోంది. పక్కనే మా మామ్మది. ఇంకా ఎవరెవరో పూర్వీకులు, కుటుంబ సభ్యుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు తగిలించి ఉన్నాయి. వాటిని చూస్తుంటే నేను పరిష్కరించవలసిన ఇంటి సమస్య గుర్తుకొచ్చింది. దాదాపు వంద సంవత్సరాల క్రితం మా తాతగారు కట్టించిన ఇల్లది. మా తాతగారికి ఇద్దరు మగ సంతానం. మా నాన్న, గోవిందు నాన్న. చిన్నతనంలోనే తల్లినీ, తండ్రినీ పోగొట్టుకున్నాడు గోవిందు. మా తాతగారు అయన తరువాత మా అమ్మ, నాన్న వాడ్ని మాతోనే పెంచారు. చాలా తింగరి తింగరిగా ఉండేవాడు. చదువు వంటపట్టలేదు. ఎప్పుడూ ఊరిమీద తిరుగుతూ ఎవరికే సాయం కావాల్సినా చేస్తుండేవాడు. కన్నవాళ్ళు లేకపోవటం వల్ల అ

జరుగుతున్న కథ

కథా భారతి
-కట్టా రాంబాబు ప్రథమ బహుమతి పొందిన కథ ఆరోజే కాలేజి 'రివోపెనింగ్‌ డే'. అందుకే అక్కడి వాతావరణమంతా ఉత్సాహంగాను, ఆహ్లాదకరంగాను వుంది. రంగు రంగుల సీతాకోక చిలుకల్లా అలంకరించుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలాకాలం తర్వాత కలుసుకొన్నారేమో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడంతా ''హాయ్‌'', ''హల్లో'' లతో గందరగోళంగావుంది. సమయం తొమ్మిదిన్నరే అయింది. క్లాసెస్‌ కమెన్స్‌ కావడానికింకా అరగంట టైముంది. చాలామంది అబ్బాయిలుకాంటిన్‌ ముందు నిలబడి క్రొత్తగా జాయినవ్వడానికి అప్లికేషన్లు తీసుకెళుతున్న అమ్మాయిలకు పోజులిస్తున్నారు. కాలేజిముందున్న గార్డెన్‌లో ఓ చెట్టు క్రింద నీడలో పదిమంది వరకు అమ్మాయిలు కూర్చొని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా ఫస్టియర్‌ పూర్తిచేసి సెకండియర్‌ డిగ్రీలో ప్రవేశిస్తున్నారు. సమయం కావడంతో ప్రిన్సిపాల్‌గారు తమ 'హోండా సిటీలో' వచ్చి ఆఫీసులో కూర్చున్నారు, లెక్చరర్లు కూడ ఒక్క